సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

కొత్త పొస్ట్



🌐 * L. I. P. తెలుగు ప్రారంభ పరీక్ష - BASELINE TEST 2026-27     🌐 * 10వ తరగతి 🌐 * 10వ తరగతి తెలుగులో 99% స్కోర్ సాధించాలంటే... 🌐 * తెలుగు వెలుగులీనేల 🌐 | ధ్వని గుర్తింపు / అక్షర గుర్తింపు     🌐 * సరళ పదాలు     🌐 * ఐ సి టి ఉపయోగించడం ఎలా?     🌐 * * DIKSHA WEB         🌐 SCERT         🌐 NCERT         🌐 NBT         🌐 UGC_NET         🌐 CIIL         🌐 * * NDL INDIA         🌐 SAHITHYA ACADEMY         🌐 | సిద్దెంకి కథలు     🌐 | సిద్దెంకి పుస్తకాలు     🌐 | సిద్దెంకి కవిత్వం 🌐 *"నీలి నేల ఎతలు - తెలంగాణ దళిత కథ పరిణామం కాలమ్ - కోలిమి"     🌐 | తెలుగులో అత్యుత్తమ పుస్తకాలు     🌐* | వ్యాసాలు / Articles     🌐* | దాశరథి పాటలు     🌐* | తెలంగాణ రాష్ట్రంలో దళిత కథ (2014:-07-2025)     🌐 * "సంస్కృతంతో తెలుగు కాలరాయొద్దు"     🌐 * పగిడి తెలంగాణ కథ 2024 "     🌐 * "ఆలోచనవాదుల పుష్పక విమానం దాశరథి ‘కవితా పుష్పకం’"     🌐 * Articles on Dr. Siddenky    

25, ఫిబ్రవరి 2023, శనివారం

10వతరగతి తెలుగులో అధిక మార్కులు (100%) స్కోర్ సాధించాలంటే....

పదవ తరగతి తెలుగులో అధిక మార్కులు(99%)  సాధించాలంటే
తెలుగు.. మన మాతృభాష. 
 విద్యార్థులు సాధించడం చాలా సులువు అని భావిస్తున్నారు. కానీ 
అంత సులువైనది కాదని గమనించాలి.
 
ఇందులో ఫెయిల్ అయ్యే విద్యార్థుల సంఖ్య తక్కువే. కానీ.. తెలుగులో మంచి మార్కులు సాధించాలంటే మాత్రం ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిందే! 

పరీక్ష పత్రాన్ని పరిశీలిస్తే ....

I. అవగాహన - ప్రతిస్పందన 20 మార్కులు


1. పరిచిత గద్యం ఉపవాచకమైన రామాయణం నుండి ఇస్తారు.
(1-5 ఒకటి నుండి ఐదు ప్రశ్నలు ఇస్తారు. జవాబులు ఒకటి లేదా రెండు వాక్యాల్లో రాయాలి.
2. ఖాళీలు పూరించమని అడగవచ్చు.
3. తప్పొప్పులు గుర్తించమని ప్రశ్న ఇవ్వవచ్చు.
4. జతపరచమనవచ్చు.
5. సరియైన సమాధానానికి సరైన మార్కు పొందుకోవొచ్చు)

 ముఖ్య భావం గుర్తించాలి: ముందుగా పేరాగ్రాఫ్ మొత్తం చదివి ప్రధాన భావం, ఉపభావాలు గుర్తించాలి.

WH ప్రశ్నలు ఆలోచించాలి: ఎవరు, ఏమి, ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎలా అనే కోణాల్లో ప్రశ్నలు తయారు చేయాలి.

పాఠ్య ఆధారితంగా ఉండాలి: ప్రశ్నలకు జవాబులు పేరాగ్రాఫ్ నుంచే దొరికేలా స్పష్టంగా రూపకల్పన చేయాలి.

 వివిధ స్థాయిల ప్రశ్నలు ఇవ్వాలి: సరళ (గుర్తింపు), అర్థగ్రహణ, అభిప్రాయాత్మక ప్రశ్నలను కలిపి ఇవ్వాలి.

 స్పష్టమైన భాష ఉపయోగించాలి: చిన్న వాక్యాలు, క్లుప్తమైన పదజాలంతో విద్యార్థులకు అర్థమయ్యేలా రాయాలి.

 


ఆ) 6వ ప్రశ్నగా పాఠంలోని చుక్క పద్యాల మీద అవగాహనను పరీక్షిస్తారు.

ఆరో ప్రశ్న ఎన్ని రకాలుగా వస్తుందో చూడండి.
  • పద్యాన్ని పూరించి భావాన్ని రాయమనడం
  • ప్రతిపదార్థాన్ని రాయండి (అన్వయ క్రమంతో, భాషా దోషాలు లేకుండా రాస్తే ఐదు మార్కులు పరీక్షా హాల్లో పై సూచనలు ఇలా అన్వయించుకోవాలి:
    • మొదట పూర్తి పాఠ్యాన్ని చదవాలి: తొందరపడకుండా ఒకసారి శ్రద్ధగా చదివి ప్రధాన భావం గ్రహించాలి.

    • తెలిసిన పదాల నుంచి ప్రారంభించాలి: ముందుగా అర్థం తెలిసిన పదాలకు ప్రతిపదార్థం రాయాలి; తెలియనివి తరువాత ఆలోచించాలి.

    • సందర్భం ఆధారంగా అర్థం ఊహించాలి: తెలియని పదాలకు ముందు–వెనుక భావాన్ని చూసి సరళమైన అర్థం రాయాలి; ఖాళీ వదలకూడదు.

    • సమాసం–సంధి గుర్తించాలి: క్లిష్ట పదాన్ని విడదీసి విగ్రహం చేసుకుంటే అర్థం సులభమవుతుంది.

    • అన్వయ క్రమం రాస్తూ కర్త–కర్మ–క్రియ క్రమం పాటించాలి: పద్యాన్ని గద్యరూపంలో మార్చి పూర్తివాక్యంగా రాయాలి.

    • చివర సమీక్ష చేయాలి: రాసిన ప్రతిపదార్థం, అన్వయం, భావం సరైనదేనా అని ఒకసారి చదివి తప్పులు సరిచేయాలి.

    )

ఇ) అపరిచిత పద్యం లేదా అపరిచిత గద్యం నకు 10 మార్కులు 

        (7, 8, 9, 10, 11 ప్రశ్నలు ఒక్కో ప్రశ్నకు రెండు మార్కుల చొప్పున)
  • 10 పాయింట్ల సాధనలో ఈ భాగం చాలా కీలకం. 
  • అందరికీ తెలిసిన సుపరిచితమైన పద్యాన్ని అపరిచిత భాగం కింద ఇస్తారు.
  • అపరిచిత గద్యంలో భాగంగా పర్యావరణము, పరిశుభ్రత, విజ్ఞాన శాస్త్రాలు, సాహిత్యము, సంప్రదాయములు ఏదైనా ఒక అంశంపై పేరాగ్రాఫ్ ఇవ్వబడుతుంది.

 ఇందులో.....
    • ఐదు ప్రశ్నలు ఇస్తారు.
    • ఐదు ప్రశ్నలు తయారు చేయమంటారు.
    • తప్పు ఒప్పుల్ని గుర్తించమంటారు.
    • జతపరచమంటారు. 
    • ఖాళీలు పూరించమంటారు.
    • కీలక పదాలను వివరించమని కోరవచ్చు.
    • జవాబు ఒక వాక్యంలో రాయాలి (ఏకపద జవాబులకు మార్కులు స్కోర్ పొందలేరని గమనించాలి.
(సూచనలు:
అపరిచిత గద్యానికి జవాబు రాయడానికి పద్ధతి
1. ప్రశ్నను జాగ్రత్తగా చదవాలి
– ముందు ఇచ్చిన గద్యాన్ని పూర్తిగా చదవాలి.
– తర్వాత ఒక్కో ప్రశ్నను అర్థం చేసుకోవాలి.

2. సమాధానం ఎక్కడుందో గుర్తించాలి.
– గద్యంలోని వాక్యాలనే తీసుకోవాలి.
– ఎక్కువగా మీ మాటల్లో చిన్నగా మార్చి రాయాలి.

3. తప్పులు చేయకూడదు
– పాఠ్యానికి సంబంధం లేని మీ ఊహ రాయకూడదు.
– గద్యానికి కచ్చితమైన సమాధానం మాత్రమే రాయాలి.

4. వాక్యరచన సరళంగా ఉండాలి
– పొడవైన వాక్యాలు అవసరం లేదు.
– సరళమైన 2–3 వాక్యాల్లో రాయాలి.)


 
II స్వీయ రచన - సృజనాత్మకత 40 మార్కులు 

అ) నాలుగు ప్రశ్నలు ఇస్తారు. (12,13,14,15)
ఒక్కొక్క ప్రశ్నకు మూడు మార్కులు 12మార్కులు.
 5, 6 వాక్యాల్లో తప్పకుండా రాయాలి.
ఇందులో ఛాయిస్  లేదు.
పాఠ్యాంశంతో పాటు కవి, రచయిత గురించి లేదా శైలి గురించి ఖచ్చితంగా అడుగుతారు.

ఆ) భాగం: స్వీయరచన

      • పద్యభాగం నుండి(16,) రెండు ప్రశ్నలు 
      • గద్య భాగం నుండి (17)రెండు ప్రశ్నలు 
      • ఉపవాచకం నుండి (18)రెండు ప్రశ్నలు ఇస్తారు.
      • ఒక్కొక్క ప్రశ్నకు ఏడు మార్కుల చొప్పున మొత్తం 21 మార్కులు
      • ప్రతి భాగం నుండి  ఒక్క ప్రశ్నకు జవాబు రాయాలి.
      • ప్రతి జవాబు 10 నుంచి 12 వాక్యాలలో రాయాలి.
      • 120 పదాల కంటే ఎక్కువ పదాలతో జవాబు రాయాలి.
      • సూటిగా, స్పష్టంగా, సరళంగా ఉండాలి.
      • ప్రశ్నలు అనుసరించి జవాబు రాయాలి.
      • భాషా దోషాలు లేకుండా రాయాలి.
      • వాక్య క్రమం ఉండాలి.

ఇ) భాగం:19వ ప్రశ్న 
సృజనాత్మక అంశాలు రెండు ఇస్తారు.
 7 మార్కులు.  ఒక్క ప్రశ్నకు సమాధానం 
ఒక ప్రశ్నకు జవాబు తప్పకుండా రాయాలి. 

ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు ఉన్న 23 సృజనాత్మక అంశాలలో ఏవైనా ఇవ్వవచ్చు.

        • లేఖ
        • వచన కవిత 
        • సంభాషణ 
        • ఏకపాత్రాభినయం 
        • ప్రశంసా పత్రం 
        • అభినందన వ్యాసం 
        • వ్యాసం
        • కరపత్రం 
        • ఆహ్వాన పత్రం
        • కథ 
        • గేయం 
        • ప్రశ్నావళి
        • నినాదాలు - సూక్తులు
        • కథలు పొడిగించడం
        • .....
        • మొదలైన అంశాలపై సృజనాత్మకంగా రాయాలి

III భాషాంశాలు 20 మార్కులు 

(పదజాలం & వ్యాకరణాంశాలు)

    • సొంత వాక్యాలు 
    • అర్థాలు 
    • ప్రకృతి - వికృతులు 
    • సమానార్థకాలు లేదా పర్యాయపదాలు 
    • వ్యుత్పత్తి అర్థాలు
    • వ్యుత్పత్తి పదం
    • జాతీయాల వివరణ
    • కర్తరీ, కర్మణీ వాక్యాలు
    • ప్రత్యక్ష, పరోక్ష వాక్యాలు 
    • సామాన్య, సంయుక్త, సంశ్లిష్ట వాక్యాలు
    • గ్రాంథికం నుంచి వ్యవహార వాక్యం లోకి మార్చి రాయడం.....
    • సంధులు 
    • సమాసాలు 
    • అలంకారాలు 
    • గణవిభజన మొదలైన ఇస్తారు.
    • ఒక్కో ప్రశ్నకు ఒక్క మార్కు చొప్పున 20 మార్కులు ఉంటాయి.

**********

తెలుగులో అధిక మార్కులు (99%)రావాలంటే...

  1. పద్యభాగం, గద్యభాగంలోని అన్ని అంశాలను ఔపోసన పట్టాలి. 
  2. ప్రశ్న ఏ కోణం నుండి ఇస్తే ఆ కోణం నుంచి వివరించగలగాలి.
  3. విద్యార్థులకు సూచనలు: 
  4. ప్రశ్న పత్రాన్ని క్షున్నంగా చదవాలి.
  5. ప్రశ్నను అర్థం చేసుకోవాలి. 
  6. ప్రశ్నను అనుసరించి మాత్రమే జవాబు రాయాలి.
  7. ప్రతి జవాబుకు ప్రశ్న సంఖ్య మరవకూడదు.(తప్పకుండా శీర్షిక పెట్టవచ్చు. దానశీలం పాఠ్యభాగ సారాంశం రాయండి అనే ప్రశ్నకు దానశీలం పాఠ్య సారాంశం: అని రాయాలి. అలా రాయడం వలన దిద్దే ఎగ్జామినర్ కి సులువుగా అర్థమవుతుంది)
  8. ప్రతి వాక్యానికి 6,7 పదాలు రాయాలి. 
  9. వాక్యాలు సమదూర0 పాటించాలి.
  10. ప్రతి విషయంపై స్పష్టత కలిగి ఉండడం ముఖ్యం.
  11. పరీక్ష రోజు వరకూ వాటిని నిత్యం పునశ్చరణ / మననం చేసుకోవాలి. 
  12. పాఠాన్ని కేవలం చదవడంతో సరిపెట్టకుండా..సారాంశాన్ని, ఉద్దేశాన్ని తెలుసుకోవాలి. 
  13. మైండ్ మాపింగ్ (భావనా చిత్రాన్ని) ద్వారా గుర్తించుకోవాలి.
  14. ప్యాసేజ్ పేరిట ఉండే అపరిచిత గద్యం ఎంతో ముఖ్యమైనది. కాబట్టి సొంతంగా ఆలోచిస్తూ చదవాలి. 
  15. ఒక ప్రక్రియను మరొక ప్రక్రియలోకి మార్చి రాయడం అభ్యాసం చేయాలి.
  16. విరామ చిహ్నాలు పాటించాలి.
  17. భాషా దోషాలు లేకుండా రాయాలి.
  18. వాక్య క్రమం ఉండాలి.

1. ఆవశ్యకత అంటే అవసరం గురించి రాయాలి. 
 ఆవశ్యకత
ఏ అంశం ఎందుకు అవసరం అనేది చూపాలి.
సమాజం, వ్యక్తి, విద్య, సాహిత్యం లాంటి కోణాల్లో అది ఎందుకు ముఖ్యమో చెప్పాలి.

2. ఆంతర్యం లేదా ఉద్దేశం ఏమిటి అనే ప్రశ్నకు జవాబు 
ఆంతర్యం లేదా ఉద్దేశం
రచయిత చెప్పదలచుకున్న లోతైన భావం, సందేశం రాయాలి.
✦  "ఈ కథ/కవిత వెనుక ఉన్న ఉద్దేశం ప్రజలకు ఈ భావనను చేరవేయడమే."

3. సొంత మాటల్లో రాయండి అంటే పాఠం యొక్క సారాంశం విద్యార్థి సొంత మాటల్లో రాయాలి.
✦ సొంత మాటల్లో రాయండి

4. వివరించుము అంటే ఉన్నది ఉన్నట్టు రాయాలి.
  "పరిపూర్ణ వివరాలు, అన్ని కోణాలు చెప్పాలి."

5. సమర్థించుము అంటే 
ఏ పాత్ర లేదా? ఏ భావం అడుగుతున్నారో దానికి అనుగుణంగా సమర్థిస్తూ రాయాలి. 
'✦ ఆవాదన ఎందుకు సరియైనదో, కారణాలతో సమర్థించాలి."

6. విశ్లేషణాత్మకంగా రాయండి అంటే 
ఒక్క పాత్ర మనస్తత్వ విశ్లేషణ అడిగితే ఆ పాత్ర మనస్తత్వం మారడానికి గల పరిస్థితులు, అందుకు గల కారణాలు చెబుతూ మొదలైన అంశాలతో సమగ్రంగా రాయడమే విశ్లేషణాత్మకంగా రాయడం.

అంశాన్ని విడదీసి, ప్రతి కోణాన్ని పరిశీలించి రాయాలి.
✦ "భావం, శైలి, ఉపయోగం, ప్రభావం అన్నింటినీ విడివిడిగా చూపాలి."

7. సోదాహరణంగా రాయండి అంటే...
ఉదాహరణలు ఇస్తూ రాయాలి.
✦ "వాక్యం + సరైన ఉదాహరణ."

8. ఊహించి రాయండి అంటే.... ఇచ్చిన అంశానికి అనుగుణంగా ఏం జరుగుతుందో, జరుగబోతోందో ఊహించి రాయాలి.
మన కల్పనాశక్తిని ఉపయోగించి సమాధానం రాయాలి.
 "నేను ఆ కాలంలో ఉన్నాను అనుకుంటే... / ఇది జరిగితే ఇలా ఉండేది..."

9. కారణాలు రాయండి అంటే...
✦"ప్రధాన కారణాలు ఇవి..." అని పాయింట్లుగా ఇవ్వాలి.

10. విమర్శనాత్మకంగా రాయండి అంటే తప్పు ఒప్పుల నుంచి సకారాత్మక విమర్శ ఒప్పువైపు రాయాలి.
మంచి – చెడు రెండింటినీ సమంగా తూకం వేసి రాయాలి.
 "ఇందులో ఉన్న విశిష్టతలు, లోపాలు రెండూ చూపాలి."

11. విశిష్టత తెలపండి అన్నప్పుడు గొప్పతనం గురించి రాయాలి.
 "ఇది మిగతావాటితో పోలిస్తే ఎందుకు ప్రత్యేకమో వివరించాలి."

12. అభినందిస్తూ వ్యాసం రాయండి అంటే పొగడుతూ గొప్పతనాన్ని మాత్రమే వివరిస్తూ రాయాలి.
ప్రశంసలు రాయాలి.
✦ "ఈ రచన/వ్యక్తి గొప్పతనం ఇలా ఉంది..."

13. వృత్తాంతాన్ని రాయండి అనే ఉపవాచక ప్రశ్నకు జవాబుగా సంబంధిత కథ రాయాలి. 
 క్రమపూర్వకంగా రాయాలి (ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరిగిందో).
✦ "కాలక్రమం, సంఘటనలు వరుసగా ఉండాలి.

14. పాఠం ఆధారంగా రాయండి. అంటే కేవలం పాఠం లోనిది మాత్రమే రాయాలి. 


  • 1. పాఠ్యాధారిత ప్రశ్నల స్వభావం
  • గద్య పాఠం, పద్య పాఠం నుంచి ప్రశ్నలు వస్తాయ
  • కొన్ని “చిన్న సమాధానాలు” (2–3 వాక్యాలు) 
  • కొన్ని “విస్తృత సమాధానాలు” (6–8 వాక్యాలు).
  • పద్యాల్లో భావార్థం, సందర్భం, అలంకార విశ్లేషణ అడుగుతారు.
  • గద్యాల్లో పాత్ర విశ్లేషణ, సంఘటన వివరణ, సందేశం అడుగుతారు.

  • 2. రాయడానికి సాధారణ పద్ధతి
  •  ✓: ప్రశ్నను బాగా చదవాలి.
  • సమాధానం పాఠ్యం నుంచే రావాలి. (మనకిష్టమొచ్చిన ఊహలు కాకుండా పాఠంలో చెప్పినదాన్ని రాయాలి.)

  • ✓చిన్న సమాధానాలకు 2–3 వాక్యాలు, పెద్ద సమాధానాలకు 6–8 వాక్యాలు.
  • ✓సూటిగా, సులువైన భాషలో రాయాలి.
  • ✓పద్యం అయితే — ‘సందర్భం’, ‘భావార్థం’, ‘అలంకారము/ప్రాస/యతి’ విడిగా రాయాలి.

*********

( దానశీలం పాఠం పై ప్రశ్నలకు జవాబులు.....
1. ఆవశ్యకత
👉 మనిషి సమాజంలో జీవించాలంటే పరస్పర సహకారం అవసరం. దానం ద్వారా దరిద్రులకు సహాయం జరుగుతుంది. కాబట్టి దానశీలం ఆవశ్యకమైన గుణం.

2. ఆంతర్యం లేదా ఉద్దేశం
👉 "దానశీలం" పాఠం ఉద్దేశం మనుషులు సంపదను కేవలం తమకోసం కాకుండా పరుల ఉపకారార్థం వినియోగించాలి అని బోధించడం.

3. సొంత మాటల్లో రాయండి
👉ఈ పాఠం మనకు చెబుతున్నది ఏమిటంటే, ధనం శాశ్వతం కాదు. దానశీలుడు మాత్రమే సమాజంలో అమరుడవుతాడు.

4. వివరించుము
👉 దానశీలి తన ధనంతో ఇతరుల కష్టాలను తీర్చుతాడు. దానం చేసేవాడు సమాజంలో గౌరవం పొందుతాడు. కాబట్టి దానానికి ఉన్న ప్రాముఖ్యతను సవివరంగా వివరించారు.

5. సమర్థించుము
👉 దానం ఎందుకు గొప్పదో మనం ఆధారాలతో చెప్పాలి. "భోజనం ఇచ్చే వాడు ఆకలిని పోగొడతాడు. విద్యా దానం చేసేవాడు జీవితాన్నే వెలిగిస్తాడు." కాబట్టి దానం అత్యున్నత గుణం అని సమర్థించవచ్చు.

6. విశ్లేషణాత్మకంగా రాయండి
👉దానానికి అనేక రూపాలున్నాయి – అన్నదానం, విద్యాదానం, జ్ఞానదానం. అన్నదానం తాత్కాలిక ఉపశమనం ఇస్తుంది. కానీ విద్యాదానం శాశ్వత మార్పు తెస్తుంది. కాబట్టి దానశీలత అనేది అనేక కోణాల్లో విశ్లేషించదగిన గుణం.

7. సోదాహరణంగా రాయండి
👉 భారతదేశంలో అన్నదానానికి గొప్ప చరిత్ర ఉంది. అన్నమాచార్యులు, త్యాగరాజులు అన్నదానంలో కీర్తి పొందారు. అలానే, మన పెద్దలు "విద్యా దానం మహాదానం" అని చెప్పిన మాట కూడా దానశీలం మహత్వానికి ఉదాహరణ.

8. ఊహించి రాయండి
👉 నేను ఒక పెద్ద ధనవంతుడిని అనుకుంటే, పేద విద్యార్థులకు చదువు కోసం పుస్తకాలు, ఫీజులు చెల్లిస్తాను. గ్రామంలో ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేస్తాను.

9. కారణాలు రాయండి
👉 దానశీలం వల్ల లాభాలు:
సమాజంలో సమానత్వం పెరుగుతుంది.
పేదలకు ఆత్మవిశ్వాసం కలుగుతుంది.
ధనవంతుడు గౌరవం పొందుతాడు.
కాబట్టి దానశీలం అవసరం.

10. విమర్శనాత్మకంగా రాయండి
👉దానం ఒక మహత్తర గుణం. కానీ కొందరు ప్రచారార్థం దానం చేస్తారు. అలాంటి దానం నిజమైనది కాదు. ప్రయోజన రహితమైన నిస్వార్థ దానం మాత్రమే నిజమైన దానశీలం.

11. విశిష్టత తెలపండి
👉ఈ పాఠం విశిష్టత ఏమిటంటే, ధనం నశ్వరమని, దానమే శాశ్వతమని చక్కగా వివరించడం. ఇది ఇతర పాఠాల కంటే ప్రత్యేకంగా దానం మహిమను ప్రతిపాదిస్తుంది.

12. అభినందిస్తూ వ్యాసం రాయండి
👉 దానశీలం పాఠం మానవ విలువలను మేల్కొలిపే గొప్ప రచన. రచయిత దానాన్ని ఎంత అందంగా వివరించారో చూస్తే మనకు గర్వంగా ఉంటుంది. ఆయనను అభినందించక మానలేం.

13. వృత్తాంతాన్ని రాయండి
👉 ఈ పాఠంలో ముందుగా దానం అవసరాన్ని చెప్పారు. తర్వాత దాన రకాలను వివరించారు. చివరగా దానం చేయడం వల్ల కలిగే మేలు చెప్పారు. ఈ విధంగా పాఠం క్రమపూర్వకంగా సాగింది.)

ఉప వాచకానికి సంబంధించి ఇతివృత్తం, ప్రాముఖ్యత, పాత్రలు, వాటి ప్రాధాన్యత, వ్యక్తుల ప్రవర్తన, శైలి, సందర్భము, స్థలం మొదలైన అంశాల సందేశాన్ని తెలుసుకోవాలి.


వ్యాకరణం.
సంస్కృత
తెలుగు సంధులు 
సమాసాలు
అలంకారాలు
చందస్సు
మొదలైన అంశాలపై బాగా పట్టు సాధించాలి

ఆల్ ది బెస్ట్.
కృషి ఉంటే విజయం నీ బానిస.
మరిన్ని అంశాల కోసం.....


Dixa app, Tsat టి‌వి, తెలుగు దళం .... 
siddenky.blogspot.com ని ఫాలో కాగలరు.


Telugu Siri Dr Siddenky yt channel
Subscribe చేసి ఫాలో కండి.

డా. సిద్దెంకి యాదగిరి 
తెలుగు భాషోపాధ్యాయులు
 సిద్దిపేట జిల్లా. DRG సభ్యులు 
9441244773. 



23, ఫిబ్రవరి 2023, గురువారం

net / setతెలుగు ప్రాక్టీస్‌ బిట్స్‌

నెట్‌ తెలుగు ప్రాక్టీస్‌ బిట్స్‌ 


1. ఖండ కావ్య ప్రక్రియకు ఆద్యుడు ఎవరు?
1) కందుకూరి 2) గురజాడ 3) రాయప్రోలు 4) చిలకమర్తి

2. ‘హిత సూచిని’ ఏ ప్రక్రియకు సంబంధించింది?
 1) ప్రహసనం 2) వ్యాసం 3) ఏకాంకిక 4) కథ

3. తుది వర్ణానికి ముందున్న వర్ణం?
1) ఉత్తమం 2) ఉపోత్తమం 3) ఉపధ 4) సంహిత

4. ‘నింద్య గ్రామ్యం’కు ఉదాహరణ?
1) ప్రాణగొప్పము 2) మృతకప్ప 3) కపిల కన్నులు 4) జీవగర్ర

5. ‘ఆధారం’ ఎన్ని రకాలు?
1) 2 2) 3 3) 4 4) 5

6. ప్రత్యాయాలను గురించి వివరించే పరిచ్ఛేదం?
1) తద్ధిత 2) ఆచ్ఛిక 3) క్రియ 4) కృదం

7. ‘టమోటా’ ఏ భాషా పదం?
1) ఆంగ్లం 2) పోర్చుగీసు  3) తమిళం 4) కన్నడం

8. తెలుగుభాషకు మూల లిపి?
1) ఖరష్ఠీ 2) చిత్ర 3) దక్షిణబ్రహ్మీ 4) పైవన్నీ

9. మధ్య ద్రావిడ భాషలెన్ని?
1) 3 2) 8 3) 12 4) 10

10. సాంఘిక విమర్శలకు ఆద్యుడు?
1) టైనీ 2) అరిస్టాటిల్‌ 3) ఇలియాట్‌ 4) కాలరిడ్జ్‌

11. ‘రఘువంశం’ కర్త?
1) భారవి 2) కాళిదాసు 3) భానుడు 4) మాఘడు

12. ‘నా కథలు’ పేరుతో పద్యాలలో స్వీయ చరిత్ర రాసుకున్నదెవరు?
1) త్రిపురనేని 2) తుమ్మల 3) బోయి భీమన్న 4) బుచ్చిబాబు

13. ‘తెలుగు భారతి’ పురస్కారాన్ని 2010 ఏప్రిల్‌ 1న పొందింది ఎవరు?
1) భద్రిరాజు కృష్ణమూర్తి 2) చేకూరి రామారావు 3) ఇనాక్‌ 4) రవ్వా శ్రీహరి

14. తెలుగు భాషా దినోత్సవం?
1) ఆగస్టు 29 2) ఫిబ్రవరి 21   3) మే 28  4) ఆగస్టు 8

15. ‘కవిత్వాన్ని జీవిస్తాను -జీవితాన్ని కవిత్వీకరి స్తాను’ అన్న కవి?
1) సినారె 2) తిలక్‌ 3) పాపినేని శివశంకర్‌ 4) శివరామకృష్ణ

16. ‘తాళి కట్టిన మృగం’అని కళ్ళెర్రజేసిన స్త్రీవాద కవయిత్రి?
1) మందర, హైమావతి 2) ఓల్గా 3) తుర్లపాటి రాజేశ్వరి 4) హైమావతి

17. ‘కవిత్వానికి జీవితానిచ్చి ఆయుధం చేయాలన్న’ కవి?
1) శ్రీమన్నారాయణ 2) అఫ్సర్‌ 3) త్రిపురనేని శ్రీనివాస్‌ 4) శ్రీనివాసాచార్య

18. ‘ స్త్రీవాద కథలు’ ప్రధాన సంపాదకుడు?
1) కె.లక్షీనారాయణ 2) ఆర్‌.చంద్రశేఖర రెడ్డి 3) జయధీర్‌ తిరుమలరావు 4) వేదగిరి రాంబాబు

19. ఆంధ్ర వాజ్మయంలో ప్రత్యేకమైన ప్రక్రియ?
1) పురాణం 2) ఇతిహాసం 3) కథ 4) ఉదాహరణం

20. ‘యక్షగానం’ ఏ కవితా శాఖకు చెందింది?
1) ఆశు 2) మధుర 3) చిత్ర 4) విస్తర

21. ‘విష్ణురూపాయ నమశ్శివాయ’ అని పలికిన కవి?
1) నన్నయ 2) తిక్కన 3) ఎర్రన 4) శ్రీనాథుడు

22. శ్రీనాథుని రచన అంకితం పొందిన బంధువు?
1) వీరభద్రారెడ్డి 2) ముమ్మడి శాంతయ్య
3) బెండపూడి అన్నయామాత్యుడు 4) మామిడి సింగన

23. ‘సీమ కథ’లెవరివి?
1) నగ్నముని 2) భానుమతి రామకృష్ణ
3) సింగమనేని నారాయణ 4) వాసిరెడ్డి సీతాదేవి

24.‘పురాణ వైర గ్రంధమాల’ పేరుతో భారతీయ చరిత్రకు కొత్తరూపు కల్పించడానికి, కొన్ని చారిత్రక 
సత్యాలు వెలికి తీసే ప్రయత్నంగా నవలలు రాసి సంచలనం కలిగించిందెవరు?
1)చలం 2) విశ్వనాథ సత్యనారాయణ 3) బుచ్చిబాబు 4) గోపీచంద్‌

25.చలం మొదటి నవల?
1) జీవిత ధర్మం 2) అమీనా
3) శశిరేఖ 4) మైదానం

26.భరతుడు పేర్కొన్న అలంకారాల సంఖ్య?
1) 4 2) 80 3) 100 4) 108

27. కావ్య హేతువులుగా ప్రధానంగా పరిగణించిన వెన్ని?
1) 3 2) 4 3) 5 4) 6

28. ఒకొక్క పద్యానికి ఒకొక్క నక్షత్రం పేరు వచ్చే టట్లుగా ఇరవై ఏడు పద్యాలు రాసినట్లయితే దానిని 
ఏ పేరుతో పిలవవచ్చు?
 1) భాస్కరమాలిక 2) వారణమాల
3) తారావళి 4) శశికళ

29. ‘సాహిత్య దర్పణం’ కర్త?
1) అచ్యుతరాయలు 2) భరతుడు
3) విశ్వనాథుడు 4) భామహుడు

30. స్తోత్ర రూపకమైన కావ్యం?
1) కోశం 2) వాక్‌వాక్యం 3) గాథ 4) దండకం

31. శృంగార నాయికలు ఎందరు?
1)4 2) 8 3) 10 4) 12

32. వేమనపై సి.పి.బ్రౌన్‌ పుస్తకం ఎపుడు వెలువడింది?
1) 1809 2) 1819 3) 1829 4) 1839

33. ‘కలకంఠి కంట కన్నీరొలికిన సిరియింట నుండనొల్లదు’ అనే పద్యం ఏ శతకంలోనిది?
1) వేమన 2) సుమతీ 3) దాశరథీ 4) భాస్కర

34. అవధాన విద్యలో ఆరితేరిన కవులు ఎవరు?
1) తిరుపతి వేంకట కవులు 2) కొప్పర
3) వేంకటరామకృష్ణ 4) పైవారు అందరూ

35. ‘పండరీ భాగవతం’ ద్విపద గ్రంథకర్త?
1) ఉప్పలస్వామి 2) పుట్టపర్తి
3) తుమ్మల 4) త్రిపురనేని

36. ‘అంతా మిథ్య’ అని తలంచి వైరాగ్యం ప్రదర్శించిన కవి ఎవరు?
1) ధూర్జటి 2) సంకుసాల నృసింహ
3) వేమన 4) బద్దెన

37. ‘హృదయోల్లాస’ వ్యాఖ్య ఎవరిది?
1) వేదం వెంకటరామశాస్త్రీ                   2) తాపీ ధర్మారావు
3) వెంపరాల సూర్యనారాయణశాసి్త్ర 4) ములపాక బుచ్చయ్యశాసి్త్ర

38. విజయరాఘవ నాయకుడు రాసిన యక్షగానం?
1) విప్రనారాయణ చరిత్ర 2) రఘునాథాభ్యుదయం 3) కాళీయ దర్శనం 4) పైవన్నీ

39. ‘కుమార భారతి’ బిరుదాంకితుడు?
1) పెద్దన 2) తిమ్మన
3) తెనాలి రామకృష్ణ 4) సూరన

40. కవి చౌడప్పను ఎవరి ఆస్థాన కవిగా పేర్కొంటారు?
1) విజయరాఘవ నాయకుడు 2) రఘునాథ నాయకుడు 3) శహాజీ 4) కృష్ణాజీ

41. వెన్నెలకంటి సిద్ధయమంత్రికి అంకితమిచ్చిన గ్రంథం?
1) కేయూర మహా చరిత్ర 2) విక్రమార్క చరిత్ర 3) భోజరాజీయం 4) పైవన్నీ

42. పాలవేకరి కదిరీపతి ఏ శతాబ్దానికి చెందిన కవి?
1) 16 2) 17 3) 18 4) 19

43. జక్కన ఎవరి సమకాలిక కవి?
1) నన్నయ 2) తిక్కన 3) ఎర్రన 4) శ్రీనాథుడు

44. ‘రాధికా సాంత్వనం’ ఎవరికి అంకితం ఇచ్చారు?
1) రాధ 2) రాముడు 3) బాలకృష్ణుడు 4) శివుడు

45. ‘రసాభరణం’ ఏ ప్రక్రియకు చెందింది?
1) ఛందస్సు 2) అలంకార శాస్త్రం
3) కథా కావ్యం 4) చారిత్రక కావ్యం

46. ‘శశాంక విజయం’ కర్త?
1) శేషం వెంకటపతి 2) జక్కన
3) మంచన 4) గౌరన

47. 1955లో వెలువడిన మధునాపంతులు సత్య నారాయణ శాస్త్రి ‘ఆంధ్రమహాపురాణం’ ఎన్ని
 పర్వాలుగా రచించారు?
1) 7 2) 9 3) 11 4) 18

48. ‘తెలుగు కవితా వికాసం’ కర్త?
1) వేల్చేరు నారాయణరావు 2) కడియాల రామ్మోహన్‌రాయ్‌
3) అద్దేపల్లి రామ్మోహన్‌రావు 4) పైవారు ఎవరు కాదు

49. ‘సాహితీ సమితి’ సభాపతి?
1) శివశంకరశాస్త్రి 2) వేదుల
3) శ్రీశ్రీ 4) పైవేవీ కావు

50. శివశంకరశాసి్త్ర రచన?
1) కావ్యావళి 2) హృదయేశ్వరి
3) వకుళమాల 4) పైవన్నీ?

51. ఆంధ్రప్రభ వార పత్రికలో ‘మాణిక్యవీణ’ ద్వారా పాఠకుల్ని చైతన్యపరిచింది ఎవరు?
1) బసవరాజు 2) అడవి బాపిరాజు 3) విద్వాన్‌విశ్వం 4) శ్రీశ్రీ

52. ‘కోయిలా కోయిలా కూయబోకే.. గుండెలు బద్దలు చేయబోకే’ అన్నదెవరు?
1) బసవరాజు 2) నండూరి
3) ఆరుద్ర 4) కొనకళ్ల వెంకటరత్నం

53. ‘ఆడదాని జూడ నర్థంబు జూడగ బ్రహ్మకైన బుట్టు రిమ్మతెగులు’ అన్నదెవరు?
1) బద్దెన 2) వేమన 3) దాశరథి 4) ఏనుగు లక్ష్మణకవి

54. సుదీర్ఘ ఉత్పలమాలికలతో కవిత్వం ఎలా ఉండాలో చెప్పిందెవరు?
1) నంది తిమ్మన 2) పెద్దన 3) సూరన 4) భట్టుమూర్తి

55. ‘పారిజాతాపహరణం’ ఎన్ని ఆశ్వాసాల కావ్యం?
1) 5 2) 7 3) 8 4) 9

56. ‘శ్రీకాళహస్తి మహాత్యం’ ఎన్ని గద్యపద్యాలు గల మధుర ప్రబంధం?
1) 455 2) 555 3) 655 4) 755

57. ఆరు రకాల శ్లేషలు ఉపయోగించిన ప్రబంధకవి?
1) పెద్దన 2) సూరన 3) తిమ్మన 4) మల్లన

58. ‘మానవుడే నా సందేశం.. మానవుడే నా సంగీతం’ అన్న కవి?
1) సినారె 2) తిలక్‌ 3) శ్రీశ్రీ 4) ఆరుద్ర

59. ‘ఆడమంగళం’ ఎవరి రచన?
1) కందుకూరి 2) గురజాడ
3) చిలకమర్తి 4) పానుగంటి

60. ‘గురజాడ వట్టి ఫొటోగ్రఫీ కాదు ఎక్సరే ఫొటోగ్రఫీ ’ అన్నదెవరు?
1) కె.వి. రమణారెడ్డి 2) శ్రీశ్రీ
3) కృష్ణశాసి్త్ర 4) దాశరథి

61. సంవిధాన చక్రవర్తి?
1) నన్నెచోడుడు 2) కేతన
3) నాచన సోమన 4) పాల్కురికి సోమన

62. గరుడపురాణం’ కర్తగా చెప్పే కవి?
1) పింగళి సూరన 2) తెనాలి రామకృష్ణ
3) భట్టుమూర్తి 4) మాదయగారి మల్లన

63. తెలుగు జ్ఞాన్‌పీఠ్‌ పురస్కార గ్రహీతలు ఎందరు?
1) ఇద్దరు 2) ముగ్గురు 3) నలుగురు 4) ఆరుగురు

64. వేంకట పార్వతీశ్వర కవుల రచన?
1) ఏకాంతసేవ 2) భావ సంకీర్తనం
3) కావ్య కుసుమావళి 4) పైవన్నీ

65. 1908 నాటి కన్యాశుల్కం తొలి నవలలోని అంకాల సంఖ్య?
1) 5 2) 7 3) 8 4) 9

66. ముత్యాలసరాలకు మూలం?
1) కర్ణాటక భాషలోని ఒక షట్పది
2) పారసీ భాషలోని ఒక గజల్‌
3) వృషభగతిరగడ 4) పైవన్నీ

67. 1909లో జరిగిన కన్యాశుల్కం పునర్ముద్రలోని అంకాల సంఖ్య?
1) 4 2) 6 3) 7 4) 9

68. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖ తొలి అధ్యక్షుడు?
1) ఎన్‌.గోపి 2) రాయప్రోలు
3) సినారె 4) కసిరెడ్డి వెంకటరెడ్డి

69. కోకిలస్వామి బిరుదాంకితుడు?
1) సినారె 2) పానుగంటి
3) చిలకమర్తి 4) రాయప్రోల్