సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

కొత్త పొస్ట్



🌐 * L. I. P. తెలుగు ప్రారంభ పరీక్ష - BASELINE TEST 2026-27     🌐 * 10వ తరగతి 🌐 * 10వ తరగతి తెలుగులో 99% స్కోర్ సాధించాలంటే... 🌐 * తెలుగు వెలుగులీనేల 🌐 | ధ్వని గుర్తింపు / అక్షర గుర్తింపు     🌐 * సరళ పదాలు     🌐 * ఐ సి టి ఉపయోగించడం ఎలా?     🌐 * * DIKSHA WEB         🌐 SCERT         🌐 NCERT         🌐 NBT         🌐 UGC_NET         🌐 CIIL         🌐 * * NDL INDIA         🌐 SAHITHYA ACADEMY         🌐 | సిద్దెంకి కథలు     🌐 | సిద్దెంకి పుస్తకాలు     🌐 | సిద్దెంకి కవిత్వం 🌐 *"నీలి నేల ఎతలు - తెలంగాణ దళిత కథ పరిణామం కాలమ్ - కోలిమి"     🌐 | తెలుగులో అత్యుత్తమ పుస్తకాలు     🌐* | వ్యాసాలు / Articles     🌐* | దాశరథి పాటలు     🌐* | తెలంగాణ రాష్ట్రంలో దళిత కథ (2014:-07-2025)     🌐 * "సంస్కృతంతో తెలుగు కాలరాయొద్దు"     🌐 * పగిడి తెలంగాణ కథ 2024 "     🌐 * "ఆలోచనవాదుల పుష్పక విమానం దాశరథి ‘కవితా పుష్పకం’"     🌐 * Articles on Dr. Siddenky    

23, అక్టోబర్ 2025, గురువారం

vii. ఉ. 1 అద్భుతమైన సెలవులు

ఉపవాచకం

ఆజానుబాహుడు... అరివీరభయంకరుడు... రణరంగంలో ఎదురులేని ధీరుడు... దుర్గనిర్మాణదురంధరుడు... కళాపోషణలో సాటిలేని రసజ్ఞుడు... అతడొక చారిత్రక పురుషుడు...

໑໖໖...

1. సోమనాద్రి

(చారిత్రక వీరగాథ)

అనేక శతాబ్దాలకు పూర్వం రెడ్డి, వెలమ వీరులు తమ భుజబలంతో రాజ్యాలు సంపాదించుకున్నారు. ఆ స్వతంత్రరాజ్యాలు కొంత కాలానికి ఓరుగల్లు, విజయనగర సామ్రాజ్యాలకు వశమైపోయాయి. ఆ రాజుల పతనం తరువాత అవి నిజాం నవాబుకు సామంత సంస్థానాలుగా మారిపోయాయి. అటువంటి సంస్థానాల్లో ప్రసిద్ధి కెక్కింది గద్వాల సంస్థానం.

గద్వాల కోట ప్రవేశ ద్వారం (ప్రస్తుతం)

శతాబ్దాల చరిత్ర గల ఈ సంస్థానపు రాజులలో మొదటివాడు, ప్రసిద్ధి వహించినవాడు సోమనాద్రి. సోమనాద్రికి సోమభూపాలుడు' అనే ప్రసిద్ధ నామం కూడ ఉన్నది. ఇతడు క్రీ.శ. 1750 ప్రాంతంవాడు. బక్కమ్మ పెద్దారెడ్డిలు మన తల్లిదండ్రులు. భార్య లింగమ్మ. గద్వాల కోటను నిర్మించింది ఇతడే. అనేక యుద్ధాలలో విజయాలను దినవాడు. దైవసహాయంచేత ఈయనకు గొప్ప నిధి దొరికింది. ఆ ధనంతో నగరాన్ని, దేవాలయాలను వృద్ధి చేసి, కంచి, శ్రీరంగం, తిరుపతి వంటి చోట్లనుంచి వచ్చిన అనేకమంది కళాకారులకు బహుమానాలను శ్రీ కళాభిమాని, గద్వాల సంస్థానంలోని కాణాదం పెద్దన మొదలైన కవులు రామాయణాది గ్రంథాలు రచించారు. సరంగా గద్వాలసంస్థానం తెలుగు సాహిత్యాభివృద్ధికి చేయూతనిచ్చింది. సోమనాద్రి ఆరడుగుల ఎత్తుగల వర విగ్రహం, దృఢమైన నల్లనిశరీరం, సాముచేత కండలు తిరిగిన పొడవైన చేతులు కలిగినవాడు. మిత్రులకు సంగ, శత్రువులకు ప్రళయకాల రుద్రునివలె కనిపించేవాడు. అతడు తెల్లని గొప్ప జాతిగుర్రంమీద స్వారిచేస్తూ, రంగంలో కలయతిరుగుతూ అజేయుడై ఉండేవాడు.

131
సోమనాద్రి 'పూడూరు' ను రాజధానిగ చేసుకొని ఆ ప్రాంతాన్ని కొంతకాలం పాలించాడు. నేడు గద్వాల పట్టణంగ ప్రసిద్దికెక్కిన ప్రదేశమంతా ఆ రోజుల్లో దట్టమైన అరణ్యప్రాంతంగ ఉండేది. ఒకసారి వేటాడడానికి వెళ్ళిన సోమనాద్రి ఆ ప్రాంతాన్ని చూసి, అది తన రాజధానికి అన్ని విధాలా అనుకూలమైనదిగా ఉంటుందని భావించాడు. వెంటనే అక్కడ కోట నిర్మాణం చేపట్టాడు. అయితే ఆ ప్రదేశానికి సమీపంలోనే ఉన్న 'ఉప్పేడు'' కోటను సయ్యద్ దావూద్ మియా పాలిస్తున్నాడు. అతడు గోల్కొండ కోట పాలకుడు, నిజాం నవాబూ అయిన నాసిరుదౌలాకు ఆప్తుడు. దావూద్ మియా, సోమనాద్రి కోట నిర్మిస్తున్న స్థలం తన ఏలుబడిలో ఉన్నదని అందువల్ల కోట కట్టడానికి వీలులేదని అడ్డు చెప్పాడు.

సోమనాద్రి బాగా ఆలోచించాడు. కార్యసాధకుడైన సోమనాద్రి కోట నిర్మాణం అడ్డుకోవద్దని, నిర్మాణం పూర్తికాగానే తగినంత కప్పం చెల్లిస్తానని చెప్పి, సయ్యద్ మియాను అంగీకరింపజేశాడు. వేగంగా కోట నిర్మాణం పూర్తి చేశాడు. అనుకున్నట్లుగా సోమనాద్రి కప్పం చెల్లించలేదు. పైగా గొప్ప సైన్యాన్ని సిద్ధపరచుకొని, దావూద్ మీదికి దండయాత్రకు సిద్ధపడ్డాడు. విషయం తెలుసుకొన్న దావూడ్మియా మండిపడ్డాడు. ముందువెనకలు ఆలోచించకుండ సోమనాద్రి మీద యుద్ధం ప్రకటించాడు. రాయచూరు నవాబయిన బసరు జంగు, ప్రాగటూరు కోటకు అధిపతి అయిన ఇదురుసాబు తమ తమ సేనలతో వచ్చి యుద్ధరంగంలో సయ్యద్కు బాసటగా నిలిచారు. ఇరుపక్షాల సైన్యాలు గద్వాలకు, రాయచూరుకు మధ్య ప్రాంతమైన 'ఆరగిద్ద' దగ్గర మోహరించాయి. సంకుల సమరం జరిగింది. కొంత సైన్యాన్ని వెంటపెట్టుకొని, సోమనాద్రి స్వయంగా రాయచూరు నవాబును ఢీకొన్నాడు. సోమనాద్రి ధాటికి తట్టుకోలేని బసరుజంగు యుద్ధంనుంచి తప్పుకొని, తన సైన్యంతో ఇంటిముఖం పట్టాడు. సోమనాద్రి పరాక్రమాన్ని గమనించిన ప్రాగటూరు నవాబు కూడ బుద్దితెచ్చుకొని మెల్లగ జారుకున్నాడు. ఉప్పేడు నవాబు సయ్యద్ దావూద్ మియా మాత్రం మిగిలి, ఏకాకి అయిపోయాడు. ఇక చేసేదిలేక, తాను కూడ ఉప్పేడు దారిపట్టి ఏనుగుపై పారిపోతున్నాడు. సోమనాద్రి తన గుర్రాన్ని ఏనుగుమీదికి ఉసికొల్పాడు. దావూద్ మియా భయపడి ప్రాణాలు దక్కించుకోవడం తప్ప వేరే మార్గం లేదని భావించాడు. వెంటనే తన అపజయాన్ని అంగీకరిస్తూ సోమనాద్రిని శరణు కోరుకున్నాడు. ఇక ముందెన్నడు సోమనాద్రి జోలికి రానని మాట ఇచ్చాడు. యుద్ధ పరిహారంగా తన యుద్ధచిహ్నాలైన నగారా, పచ్చజెండా, ఏనుగులను, సోమనాద్రికి సమర్పించుకొని, తలదించుకొని ఉప్పేడు చేరుకున్నాడు.

ఎట్లానో ఆరాత్రి గడిపాడు సయ్యద్ దావూద్్మయా. మర్నాడు ఉదయాన్నే తన కోటమీదకి ఎక్కి, గద్వాల కోటకేసి చూశాడు. గద్వాల కోట పై ఏ రెపరెపలాడుతున్న తన పచ్చజెండా కనిపించేసరికి కడుపులో మండింది. ఎట్లాగైన

132
తాను కోల్పోయిన వాటిని వెనక్కి తెచ్చుకోవాలనుకున్నాడు. వెంటనే పల్లకిలో హైదరాబాద్ పోయి గోల్కొండ నవాబుతో తన దీనస్థితిని చెప్పుకున్నాడు. సోమనాద్రిని దండించి తనకు మనశ్శాంతిని చేరూర్చుమని కోరాడు. నిజాం నవాబు నాసిరుదౌలా, సోమనాద్రి మీదకు దండయాత్ర మంచిది కాదని, ఆ ఆలోచన మానుకోమని రకరకాలుగా నచ్చజెప్పాడు. కాని సయ్యద్ మియా తాను పట్టిన పట్టు విడవలేదు. చేసేది లేక, నిజాం నవాబు గొప్ప సైన్యంతో సోమనాద్రిమీద యుద్ధానికి బయలుదేరాడు.

5 పూర్వం సోమనాద్రి చేతిలో ఓడిపోయి, పరాభవంతో కుంగిపోతున్న రాయచూరు, ప్రాగటూరు నవాబులు తమ కక్ష తీర్చుకోవాలనే కోరికతో నిజాం సైన్యంలోకి వచ్చి చేరారు. ఈలోగా గుత్తి దుర్గాధిపతి టీకు సుల్తాను, కర్నూలు నవాబు దావూద్ ఖాన్, బళ్ళారి నవాబు తమ పరాక్రమాన్ని ప్రదర్శించ దీనికి మంచి ఉత్సాహంతో వచ్చి కొత్తగా నిజాం సైన్యంలో చేరారు.

0.

తుంగభద్రానదికి దక్షిణాన ఉన్న 'నిడుదూరుకు చేరుకున్నది నిజాం సైన్యం. తుంగభద్రకు ఉత్తర తీరంలో పిన్న్ 'కలుగోట్ల' గ్రామంలో సోమనాద్రి సైన్యం విడిది చేసింది. ఈ రెండు గ్రామాల్లో ఇప్పటికీ ఆ నాటి యుద్ధపు నవాళ్ళుగా తాత్కాలిక బురుజులు, మిట్టలు దర్శనమిస్తాయి. ఆలస్యం చేయడం ఇష్టంలేని సోమనాద్రే మొదట ం సైన్యంతో తుంగభద్రానదిని దాటి తెల్లవారకముందే నిజాం సైన్యాన్ని ముట్టడించాడు. సాయంకాలం వరకు మంకరంగా యుద్ధంచేస్తూ నిజాంసైన్యాన్ని చీల్చి చెండాడాడు. చీకటి పడడంతో తన సైన్యాన్ని మరల్చి, నదిని దీ 'కలుగోట్ల' ను చేరి విశ్రమించాడు.

3. న సోమనాద్రి పరాక్రమాన్ని చూసిన నిజాం నవాబు కలవరపడ్డాడు. వెంటనే దర్బారు చేసి సోమనాద్రిని _. ంగదీసుకొనే ఉపాయం చెప్పుమన్నాడు. అప్పుడొక సర్దారు, "సోమనాద్రి శక్తి అంతా అతని గుర్రంలోనే మన్నది, దాన్ని వశం చేసుకొంటేగాని అతడు వశం కాడు' అని వివరించాడు. వెంటనే నిజాం ఎట్లాగైనా సోమనాద్రి -నినాన్ని దొంగిలించి, అతణ్ణి వంచాలని ఆలోచించాడు. "తెల్లారేసరికి సోమనాద్రి గుర్రాన్ని తెచ్చేవారికి జాగీరు "న్నిను" అని ప్రకటించాడు. చూస్తూ చూస్తూ మృత్యుముఖంలోకి ఎవరు ప్రవేశిస్తారు? చివరకు ఒక సైసు ఐ. మయ్యాడు. ప్రాణాలకు తెగించి నడుముకు కళ్ళెం బిగించి, ఒంటరిగా కలుగోట్లకు ప్రయాణమయ్యాడు. ద్ద గో కష్టపడి సైసు మెల్లగా చప్పుడు కాకుండా గుర్రాన్ని సమీపించాడు. కళ్ళెం తగిలించి పాగానుంచి తప్పించాడు. యంమీదికి ఎక్కి వేగంగా తిరుగుముఖం పట్టాడు. గుర్రాన్ని చూడగనే నిజాము ఆనందానికి అంతులేకుండ యింది. వెంటనే ఆ సైసుకు జాగీరుతో పాటు ఒక బంగారు కడియాన్ని కూడ బహుమానంగా ఇచ్చాడు.

తెల్లవారింది. గుర్రంలేకపోవడాన్ని గమనించిన సోమనాద్రి సైన్యంలో కలకలం బయలుదేరింది. తన పై వీచెయ్యి పడిపోయిందని భావించాడు సోమనాద్రి. అయినా ధైర్యాన్ని విడువలేదు. నిజాం సైన్యంతో తలపడ్డాడు.

133
ఆరోజు ఎట్లాగో యుద్ధం సాగించాడు. సాయంకాలం ఉభయ సైన్యాలూ యుద్ధాన్ని విరమించాయి. కలుగోట్ల చేరుకున్న సోమనాద్రి ఆ రాత్రి తనవారితో సమాలోచన చేశాడు. "తెలారేసరికి నా గుర్రాన్ని ఎవరు తెసారో వారికి నా గుర్రం ఒక రోజంత ఎంత భూమిలో తిరుగుతుందో అంత భూమిని ఇనాముగ ఇస్తాను" అని ప్రకటించాడు.

గద్వాలకు పదిమైళ్ళ దూరంలో 'జొచ్చెంగన్నపల్లి' అనే గ్రామం ఉన్నది. అక్కడినుంచి వచ్చిన బోయసర్దారు హనుమప్పనాయుడు. ఈ విషయం తెలుసుకొన్నాడు. వెంటనే గుర్రాన్ని తేవడానికి సిద్ధపడ్డాడు. అతడు జొన్నచొప్పను ఒక మోపుగా కట్టి నెత్తిన పెట్టుకొని నిజాం డేరాలను సమీపించాడు. ఆ మోపును అయిదు రూపాయలు ఇస్తేకానీ ఇవ్వను అంటూ బేరం కుదరనివ్వకుండా సోమనాద్రి గుర్రంకోసం ముందు డేరాలకు పోతున్నాడు హనుమప్ప. ఒక ప్రత్యేక స్థలంలో గుర్రం కనపడింది. గుర్రంకూడా హనుమప్పను చూసి సకిలించింది. గుర్రం కళ్ళల్లో కాంతి, నిక్కించిన చెవులు, తల ఆడించడం వంటి చేష్టలను చూసిన సిపాయిలు హనుమప్పనాయుడిని అనుమానంగా చూశారు. అయినా గుర్రం దంటుపుల్లలకోసం ఇట్లా చేసిందనుకొని సమాధానపడ్డారు.

గుర్రాన్ని చూసిన హనుమప్పనాయుడు చొప్పను అతి తక్కువ ధరకు విక్రయించాడు. కొంత సేపటికి ఒకడు వచ్చి క్రయధనం ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇదే తగిన సమయమని భావించిన హనుమప్ప వెంటనే గుర్రపు పాగా (అశ్వశాల)లో ఉన్న గడ్డికుప్ప కిందికి దూరాడు. వెల్లకిలా పడుకున్నాడు. గుర్రం కూడా హనుమప్ప కనిపించకపోవడంతో తన్నుకుంటూ కాళ్ళకు కట్టిన గూటాన్ని ఊడబెరికింది. వెంటనే ఒక సిపాయి వచ్చి గూటాన్ని గడ్డిపై మోపి భూమిలోకి పాతాడు. హనుమప్పనాయుడి అరచేతిని చీల్చుకుని ఆ గూటం భూమిలోకి పాతుకు పోయింది.

నొప్పితో ప్రాణాలు పోయే స్థితి వచ్చినా, స్వామి కార్యం తలుచుకుంటూ, కదలక మెదలక ఆ బాధను ఓర్చుకున్నాడు హనుమప్ప. అర్ధరాత్రి అయింది. సైనికులు అంతా నిద్రిస్తున్నారు. హనుమప్ప తనమీద ఉన్న గడ్డిని పక్కకు నెట్టి కూర్చున్నాడు. కుడి చేయి కదలడం లేదు. గూటం కూడా కదలడం లేదు. ఆలస్యం చేయకుండా ఎడమచేత్తో తన నడుముకు ఉన్న కత్తిని లాగాడు. కుడిచేతిని నరుక్కున్నాడు. రక్తపు మడుగులో ఉన్న మొండి చేతిని తలపాగలో చుట్టి గుర్రాన్ని తీసుకొని డేరాలు దాటాడు.

134

అర్ధగంటలో, ఆనందంతో సోమనాద్రి ఎదుట గుర్రంతో నిలబడ్డాడు హనుమప్ప. ఎడమచేత్తో సలాం డు. రాజు కోపంతో కన్నెర్ర చేశాడు. హనుమప్ప తన మొండిచేతిని చూపించి, జరిగిందంత వివరించాడు. -జు ఆశ్చర్యపోయాడు. నాయుణ్ణి కౌగిలించుకొని సన్మానించాడు. అన్న మాట ప్రకారం అప్పటికప్పుడే ఒక దానశాసనాన్ని రాయించి ఇచ్చాడు. గుర్రాన్ని చూడగానే సోమనాద్రి ఉత్సాహం ఉరకలు వేసింది. ఉదయాన్నే తన మాన్యాన్ని వెంటపెట్టుకొని నిజాం సైన్యంమీద విరుచుకుపడ్డాడు. సోమనాద్రి జయభేరి ధ్వనులు నిజాం సైన్యం - పండెల్ని బద్దలుచేశాయి. సోమనాద్రిసైన్యం నిజాంసైన్యాన్ని దావానలంలా చుట్టుముట్టింది. భయంకరంగ యుద్ధం గింది. ఆనాటి యుద్ధంలో ప్రాగటూరు, బళ్ళారి నవాబులు హతులయ్యారు. సాయంకాలానికి నిజాం సైన్యాన్ని -ర్నూలు కోట వరకు తరమడం జరిగింది. సోమనాద్రి కూడా కొద్దిమంది సైన్యంతో నిజాం సైన్యాన్ని తరుముకుంటూ ర్నూలు కోటలోకి ప్రవేశించాడు. అంతలో అకస్మాత్తుగా కోట తలుపులు మూతపడ్డాయి. కొద్దిమందితో సోమనాద్రి లోపల ఉన్నాడు; మిగిలిన సైన్యం కోట బయట ఉండిపోయింది.

గద్వాల సర్దారులకు భయం ఎక్కువయింది. దిక్కు తోచడం లేదు. కోట తలుపులను చీల్చడానికి ముమ్మరంగా యత్నించారు. కాని ఫలితం లేకుండ పోయింది. కోట లోపల ఏం జరుగుతున్నదో, బయట ఉన్న గద్వాల 2 ద్యానికి తెలియలేదు. కొద్ది మందితోనే కోట లోపల ఉన్న తమ నాయకుడు మరణించి ఉంటాడని భావించారు. ఆం ర్వాలలో ఉన్న లింగమ్మరాణికి పరిస్థితిని తెలియజేస్తు, తాము తిరిగి వస్తామని కబురు పంపారు. ఆ వీరనారి మాధానంగా కొన్ని గాజులు, చీరలు, పసుపు, కుంకుమ పంపింది. గద్వాల సర్దారులకు సిగ్గు, క్రోధం కలిగాయి. టనే రెట్టింపు పట్టుదలతో, ధైర్యంతో రంగంలోకి దిగారు. ఎట్టకేలకు కోట తలుపులను పగలగొట్టి లోపలికి దేశించారు.

కోటలోపల కొద్దిమంది సైన్యంతోనే ఉన్నా సోమనాద్రి వీరోచితంగ పోరాడుతున్నాడు. తన సైన్యం చాలవరకు పృతమైంది. ఈలోగా బయట ఉన్న తన సైన్యం లోపలికి ప్రవేశించి తనకు బాసటగ నిలిచింది. నిజాం సైన్యంలో న్నంజడి హెచ్చింది. పిడికెడుమందితోనే సోమనాద్రి కోటలోపల అల్లకల్లోలం సృష్టించాడు. ఇప్పుడు తెల్లవారితే కేం చేస్తాడో అని భయపడ్డారు. చావగా మిగిలిన గుత్తి, రాయచూరు నవాబులు యుద్ధవిముఖులయ్యారు. స్థితిలో సోమనాద్రితో సంధి చేసుకోవడమే అన్ని విధాల మంచిదని మంత్రులు నిజాం నవాబుకు ముక్తకంఠంతో జెప్పారు. ఈ యుద్ధానికి అసలు కారకుడయిన సయ్యద్ దావూద్ మియా ఏం చేయాలో తెలియక ఊరుకున్నాడు. সু

నిజాం నవాబు మరునాడు ఉదయమే సంధి కోరుతూ సోమనాద్రి దగ్గరకు ఒక రాయబారిని పంపాడు. చేయస్ఫూర్తి గల సోమనాద్రి కూడ సంధికి అంగీకరించాడు. యుద్ధపరిహారంగా కర్నూలులోని కొండారెడ్డి - రుజులో ఉన్న 'ఎల్లమ్మ' ఫిరంగిని, రాయచూరు నవాబు అధీనంలో ఉన్న 'రామ, లక్ష్మణ' అనే పేర్లుగల రెండు సంగులను సోమనాద్రి స్వీకరించాడు. కర్నూలు ఏలుబడిలోని కొంతభాగాన్ని సోమనాద్రికి ఇచ్చారు. ఈ ప్రకారం + మభూపాలుడు సంధి చేసుకొని, యుద్ధపరిహారం పొంది, విజయోత్సాహంతో గద్వాల కోటకు చేరుకున్నాడు.

యుద్ధం ముగిసిన తరువాత సోమనాద్రి తాను అన్నమాట ప్రకారం గుర్రం ఒక దినం తిరిగినంత మిని హనుమప్పనాయుడికి ఇనాముగ ఇచ్చాడు. ఈ నాటికీ బొచ్చెంగన్నపల్లిలో హనుమప్ప సంతతివారు ఆ హములను అనుభవిస్తు, తమకు ఆ భూమి ఎక్కువ కావటంవల్ల అందులో కొంత భూమిని ఇతరులకు ముగ ఇచ్చి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు.

(సురవరం ప్రతాపరెడ్డిగారి 'హైందవ ధర్మవీరులు' అనే గ్రంథం ఈ కథకు ఆధారం)

135

VI.ఉ 2. మన జాతర జన జాతర (సమ్మక్క సారలమ్మ జాతర)

ఉపవాచకం

పచ్చని అడవిలో ఇసుకవేస్తే రాలనంత జనం కంకవనం తోడుగా కుంకుమ బరిణెలో గద్దెలకు పయనం కోయపూజారులతో కొలువైన చిలుకలగుట్ట దేవగణం తడిబట్టల తానాలతో పూనకాల ప్రభంజనం నిలువెత్తు బెల్లాలు తల్లులకు మొక్కులుగా సమర్పణం సంప్రదాయ వేషధారణల నృత్యాల సమ్మేళనం రెండేళ్ళకొకసారి అంబరమంటే సంబురం - మన మేదారం కోరిన కోరికలు తీర్చే తెలంగాణ రాష్ట్ర కొంగు బంగారం.

2. మన జాతర - జన జాతర

(సమ్మక్క- సారక్కల మేడారం జాతర)

జాతర అంటే జనం ఒక్కచోట గుమిగూడడం, కష్టం సుఖం చెప్పుకోవడం. జాతర పదం సంస్కృతపదం 'యాత్ర' కు వికృతిరూపం. ఇప్పుడు ఉత్తరాలు, సెల్ఫోన్లు, రవాణసౌకర్యాలు ఉన్నాయి కాని ఇవేవీ లేని కాలంలో సకలజనం కలుసుకుని మాట్లాడుకునేది జాతరలోనె. పుట్టినా, చనిపోయినా, ఈ వార్తలన్నీ తెలిసిపోయేది 5-జాతరలోనె. ఊరికి దూరంగా వాగుపక్కనో. అడవిమధ్యనో జాతరలు రెండు మూడు రోజులు జరిగేవి. జనం బండ్లు కట్టుకొని వంటసామాగ్రి తీసుకుని పోయి రెండు మూడు రోజులు ఆత్మీయులతో కలిసి కడుపునిండా మాట్లాడుకొని వచ్చేవారు. మనుషులు కలుసుకోవడం, ఒక ఊరిలో జరిగిన మార్పులు, వింతలు విశేషాలు మరో ఊరికి తెలియడం ఈ జాతరల వెనుక ఉన్న అసలు ఉద్దేశం. ప్రస్తుతం భారతదేశంలోనే అతిపెద్ద జాతరగా పేరుపొందిన 'మేడారం' గిరిజన జాతర గురించి తెలుసుకుందాం.

జాతర జరిగే స్థలం : జయశంకర్ జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామం దగ్గర అడవిమధ్యలో 'చిలకల గుట్ట' ఉన్నది. చుట్టు దట్టమైన అడవి. ఇక్కడ రెండేండ్లకొకసారి మూడు

136
రోజులపాటు జాతర జరుగుతుంది. మాఘ శుద్ధ పౌర్ణమి (ఫిబ్రవరినెలలో) మొదలుకొని మూడురోజులపాటు జరిగే ఈ జాతరనే సమ్మక్క - సారక్క జాతర అంటారు. ఇది పూర్తిగా గిరిజన సంప్రదాయరీతిలో జరిగే జాతర. కేవలం మన రాష్ట్రంనుంచేకాక పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, దత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుండి కూడా లక్షలమంది భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకుంటారు.

ఎవరీ సమ్మక్క- సారక్క : గిరిజనులు దేవతామూర్తులుగా కొలిచి ఆరాధించే నమ్మక్క సారక్కలు ఇద్దరు తల్లీకూతుళ్లు, - గిరిజన హక్కులకోసం ఎదురుతిరిగి పోరాడిన వీరవనితలు.

12వ శతాబ్దంలో పూర్వపు కరీంనగర్ జిల్లా 'పొలవాస' ప్రాంతాన్ని గిరిజనదొర మేడరాజు పాలిస్తుండేవాడు. అతడికి సంతానం లేదు. ఒకనాడు వేటకు వెళ్లి అడవిలో పులుల మధ్య ఆడుకుంటున్న -దం న్నపిల్లను చూశాడు. దేవుడిచ్చిన వరంగా భావించి ఆ పాపను ఇంటికి తెచ్చి సాదుకున్నాడు. సమ్మక్క అని లేని రుపెట్టుకున్నాడు. చిన్నప్పటినుంచే సమ్మక్క చెట్లవైద్యం చేస్తూ తోటి గిరిజనులను రక్షించేది. ఆమెకు మహిమలు యేది న్నాయని, దేవతామూర్తి అనీ గిరిజనులు భావించేవారు. సమ్మక్క గిరిజన గూడానికి తలలో నాలుకయింది.

జనం మరో

ఆమెకు పెండ్లి వయసు వచ్చింది. మేడరాజు మేనల్లుడు పగిడిద్దరాజు. ఇతడు కాకతీయులకు సామంతరాజుగా ండి మేడారంను పాలిస్తుండేవాడు. పగిడిద్దరాజుకు సమ్మక్కనిచ్చి పెళ్లి చేశారు. సమ్మక్క మేడారం రాజ్యంలోకి డుగుపెట్టింది. వీరికి నాగులమ్మ, సారలమ్మ అనే ఇద్దరు బిడ్డలు, జంపన్న అనే కొడుకు పుట్టారు. సమ్మక్క ప్రజల ం వహించి పరిపాలనలో మార్పులు చేసింది. గిరిజనులకోసం ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టింది. ప్రజల గోగులు స్వయంగా తెలుసుకున్నది. మహారాణులంటే మేడల్లోనే ఉంటారు. ప్రజలకు కనిపించరు. కాని విదారం మహారాణి సమ్మక్క మాత్రం ఎప్పుడు ప్రజలమధ్యనే ఉండేది.

యుద్ధం అనివార్యం అప్పుడు కాకతీయ సామ్రాజ్యాన్ని ప్రతాపరుద్రుడు పాలిస్తుండేవాడు. రాజ్యవిస్తరణలో గంగా పొలవాసపై దండెత్తాడు. కాకతీయ సైన్యాన్ని ఎదిరించలేక మేడరాజు పారిపోయి అల్లుడు పగిడిద్దరాజు ద్ద అజ్ఞాతంగా కాలం గడుపుతున్నాడు. తన సామంతరాజు పగిడిద్దరాజు మేడరాజుకు ఆశ్రయమిచ్చినట్టు తాపరుద్రునికి తెలిసి కోపంగా ఉన్నాడు.

137

అప్పుడే కరువు కాటకాలొచ్చాయి. వానలు పడక పంటలు పండలేదు. ప్రజలనుంచి నిర్బంధంగా పన్నులు వసూలు చేయడం సమ్మక్కకు ఇష్టంలేదు. ఆదాయంలేక కాకతీయులకు కట్టాల్సిన కప్పం కట్టలేదు. ఇట్లా రెండు మూడేండ్లు గడిచాయి. కప్పం కోసం కాకతీయులు ఒత్తిడి చేశారు. పగిడిద్దరాజు ప్రజలను పీడించి పన్నులు కట్టలేనన్నాడు. అంతేగాక తన రాజ్యాన్ని స్వతంత్ర రాజ్యంగా ప్రకటించు కున్నాడు.

.

అసలే పగిడిద్దరాజుమీద కోపంతో ఉన్నాడు ప్రతాపరుద్రుడు. ఈ పనితో వెంటనే యుద్ధం ప్రకటించాడు. అతని మంత్రి యౌగంధరాయణుని నాయకత్వంలో సైన్యం లక్కవరం దగ్గర స్థావరం ఏర్పరుచుకున్నది.

సమ్మక్క వీరోచిత పోరాటం : యుద్ధవార్త విన్న సమ్మక్క భయపడలేదు. భర్తకు ధైర్యాన్ని నూరి పోసింది. తమ ప్రజలకోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమన్నది. యుద్ధం మొదలయింది. సంప్రదాయ ఆయుధాలు ధరించి సమ్మక్క కూడా యుద్ధరంగంలోకి దిగింది. వీరితోపాటు కొండాయి, గోవిందరాజు, కూతుర్లు నాగులమ్మ, సారలమ్మ, కొడుకు జంపన్న వీరోచితంగా పోరాడారు.

అతిపెద్ద సామ్రాజ్యమైన కాకతీయరాజు సైన్యం ముందు పగిడిద్దరాజు సైన్యం నిలబడలేకపోయింది. ఒక్కొక్కరుగా అందరు వీరమరణం పొందుతున్నారు. వీరోచితంగా పోరాడుతు గాయపడిన జంపన్న పక్కనే ఉన్న సంపెంగ వాగులోకి దూకి వీరమరణం పొందాడు. పగిడిద్దరాజు కూడ శత్రువుల చేతిలో హతం అయ్యాడు. చివరకు ఒక సమ్మక్క మాత్రమే మిగిలింది. కత్తి పట్టి వీరోచితంగా పోరాడుతూ శత్రుసైన్యాలను ఎదుర్కొన్నది.

యుద్ధంలో ముందుండి పోరాడుతారు తప్ప వెనకనుంచి వచ్చి దెబ్బకొట్టరు. ఇది యుద్ధనీతి. సమ్మక్క పోరాటాన్ని చూసి కాకతీయ సైన్యం ఆందోళన చెందింది. ఒక సైనికుడు దొంగచాటుగా వెనుకనుంచి వెళ్లి బల్లెంతో వీపులో పొడిచాడు. గాయపడిన సమ్మక్క గుర్రంమీద ఈశాన్యదిక్కున ఉన్న చిలకల గుట్టమీదికి పోయింది. ఎంత వెతికినా మళ్లీ ఎవరికీ కనిపించలేదు. ఆమెకోసం వెదుకుతున్న గిరిజనులకు ఓ నెమలినార చెట్టు, దానికింద ఓ పుట్ట. పుట్టమీద ఓ కుంకుమ బరిణ కనిపించింది.

సమ్మక్క గద్దె

138
ఆ బరిణలో పసుపు, కుంకుమ, చెట్లమూలికలు కనిపించాయి. సమ్మక్క తల్లి దేవతారూపం పొందిందని గిరిజనులు నమ్మారు.

రాజు కల : మేడారం కాకతీయుల వశమయింది. విజయగర్వంతో ఉన్న ప్రతాపరుద్రుని కలలో కులదైవం 'ఏకవీరాదేవి' కనిపించి సమ్మక్క మానవ రూపంలో వచ్చిన దేవత అని ఆమెకు జాతర జరిపించాలని చెప్పిందట. వెంటనే రాజు తన పురోహితుడిని మేడారం పంపి జాతర ఏర్పాట్లకు ఆదేశించాడట.

జాతర జరిగే విధం జాతరకు ప్రత్యేకంగా గిరిజన పురోహితులు ఉంటారు. వారు నియమనిష్టలతో జాతర కార్యక్రమం చేస్తారు. చిలకలగుట్టను గిరిజనులు పవిత్రమైనదిగా భావిస్తారు. ఆ గుట్టపైకి ఎవరూ పోరు.

జాతరకు ముందర ఒక కోయ యువకుడు చిలకలగుట్ట మీదికి పోయి పసుపు కుంకుమ ఉన్న బరిణను, చెదురుగడను తెచ్చి గద్దెలపై నిలపడంతో జాతర మొదలవుతుంది. అతడు పూనకంతో ఉంటాడు. సమ్మక్క 2. గాయపడ్డ చోటును తల్లిగద్దె అని, సారలమ్మ వీరమరణం పొందిన చోటును పిల్లగద్దె అని అంటారు. ఈ తతంగాన్ని 'దేవతలను ఆహ్వానించడం' అంటారు. తర్వాత భక్తులు గద్దెలను దర్శించుకోవడం మొదలవుతుంది. మూడవనాడు. య దేవతల వనప్రవేశంతో జాతర ముగుస్తుంది.

139
అమ్మవారి మొక్కులు : భక్తులు వివిధ రకాలుగా మొక్కులు చెల్లించుకుంటారు. ఈ జాతరలో బెల్లాన్ని 'బంగారం' అంటారు. భక్తులు నిలువెత్తు బంగారాన్ని అమ్మవారికి చెల్లించుకుంటారు. అంటే తమ బరువుకు సరిపోయిన బంగారాన్ని కొని అక్కడ పంచిపెడుతారు. అంతేకాకుండ ఒడి బియ్యం, తలవెంట్రుకలు ఇయ్యడం, వెదురుతొట్టె కట్టడం, కోడెలను కట్టేయడం ద్వారా తమ మొక్కులు చెల్లించుకుంటారు.

వందల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ జాతర 1940 నుండి ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చింది. 1996 సంవత్సరం నుండి ప్రభుత్వం ఈ పండుగను అధికారికంగా నిర్వహిస్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ పండుగకు మరింత ప్రాచుర్యం ఏర్పడింది.

పర్యావరణాన్ని రక్షించండి : మానవ మనుగడకు, అభివృద్ధికి ప్రకృతి ఎంతో ముఖ్యం. చెట్లు, గుట్టలు, వాగులు,

వంకలు, పేర్లు వీటిని కాపాడుకోవలసిన బాధ్యత మనమీద ఉన్నది. ఇవి లేకుంటే వర్షాలుండవు. వనరులు ఉండవు. కరువులు వచ్చి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇప్పుడు ప్లాస్టిక్ వాడకం ఎక్కువయింది. ఏ జాతరకు వెళ్లినా ప్లాస్టిక్ చెత్త కుప్పలు కుప్పలుగా తయారవుతున్నది. ప్లాస్టిక్ వాడకంతో పర్యావరణం దెబ్బతింటున్నది. జాతరల పేరిట ప్లాస్టిక్ చెత్తను తయారుచేయడం, అడవులను నరకడం వంటి వాటిని నివారించాలి.

జాతరలతో సుఖసంతోషాలు పొందాలే కాని పర్యావరణాన్ని పాడుచేసుకోకూడదు. మీరు ఎప్పుడు ఏ జాతరకు వెళ్లినా పర్యావరణానికి హాని కలిగించే పనులు చేయకూడదు.

140

Vi. ఉ. 1. సోమనాద్రి

ఉపవాచకం

ఆజానుబాహుడు... అరివీరభయంకరుడు... రణరంగంలో ఎదురులేని ధీరుడు... దుర్గనిర్మాణదురంధరుడు... కళాపోషణలో సాటిలేని రసజ్ఞుడు... అతడొక చారిత్రక పురుషుడు...

໑໖໖...

1. సోమనాద్రి

(చారిత్రక వీరగాథ)

అనేక శతాబ్దాలకు పూర్వం రెడ్డి, వెలమ వీరులు తమ భుజబలంతో రాజ్యాలు సంపాదించుకున్నారు. ఆ స్వతంత్రరాజ్యాలు కొంత కాలానికి ఓరుగల్లు, విజయనగర సామ్రాజ్యాలకు వశమైపోయాయి. ఆ రాజుల పతనం తరువాత అవి నిజాం నవాబుకు సామంత సంస్థానాలుగా మారిపోయాయి. అటువంటి సంస్థానాల్లో ప్రసిద్ధి కెక్కింది గద్వాల సంస్థానం.

గద్వాల కోట ప్రవేశ ద్వారం (ప్రస్తుతం)

శతాబ్దాల చరిత్ర గల ఈ సంస్థానపు రాజులలో మొదటివాడు, ప్రసిద్ధి వహించినవాడు సోమనాద్రి. సోమనాద్రికి సోమభూపాలుడు' అనే ప్రసిద్ధ నామం కూడ ఉన్నది. ఇతడు క్రీ.శ. 1750 ప్రాంతంవాడు. బక్కమ్మ పెద్దారెడ్డిలు మన తల్లిదండ్రులు. భార్య లింగమ్మ. గద్వాల కోటను నిర్మించింది ఇతడే. అనేక యుద్ధాలలో విజయాలను దినవాడు. దైవసహాయంచేత ఈయనకు గొప్ప నిధి దొరికింది. ఆ ధనంతో నగరాన్ని, దేవాలయాలను వృద్ధి చేసి, కంచి, శ్రీరంగం, తిరుపతి వంటి చోట్లనుంచి వచ్చిన అనేకమంది కళాకారులకు బహుమానాలను శ్రీ కళాభిమాని, గద్వాల సంస్థానంలోని కాణాదం పెద్దన మొదలైన కవులు రామాయణాది గ్రంథాలు రచించారు. సరంగా గద్వాలసంస్థానం తెలుగు సాహిత్యాభివృద్ధికి చేయూతనిచ్చింది. సోమనాద్రి ఆరడుగుల ఎత్తుగల వర విగ్రహం, దృఢమైన నల్లనిశరీరం, సాముచేత కండలు తిరిగిన పొడవైన చేతులు కలిగినవాడు. మిత్రులకు సంగ, శత్రువులకు ప్రళయకాల రుద్రునివలె కనిపించేవాడు. అతడు తెల్లని గొప్ప జాతిగుర్రంమీద స్వారిచేస్తూ, రంగంలో కలయతిరుగుతూ అజేయుడై ఉండేవాడు.

131
సోమనాద్రి 'పూడూరు' ను రాజధానిగ చేసుకొని ఆ ప్రాంతాన్ని కొంతకాలం పాలించాడు. నేడు గద్వాల పట్టణంగ ప్రసిద్దికెక్కిన ప్రదేశమంతా ఆ రోజుల్లో దట్టమైన అరణ్యప్రాంతంగ ఉండేది. ఒకసారి వేటాడడానికి వెళ్ళిన సోమనాద్రి ఆ ప్రాంతాన్ని చూసి, అది తన రాజధానికి అన్ని విధాలా అనుకూలమైనదిగా ఉంటుందని భావించాడు. వెంటనే అక్కడ కోట నిర్మాణం చేపట్టాడు. అయితే ఆ ప్రదేశానికి సమీపంలోనే ఉన్న 'ఉప్పేడు'' కోటను సయ్యద్ దావూద్ మియా పాలిస్తున్నాడు. అతడు గోల్కొండ కోట పాలకుడు, నిజాం నవాబూ అయిన నాసిరుదౌలాకు ఆప్తుడు. దావూద్ మియా, సోమనాద్రి కోట నిర్మిస్తున్న స్థలం తన ఏలుబడిలో ఉన్నదని అందువల్ల కోట కట్టడానికి వీలులేదని అడ్డు చెప్పాడు.

సోమనాద్రి బాగా ఆలోచించాడు. కార్యసాధకుడైన సోమనాద్రి కోట నిర్మాణం అడ్డుకోవద్దని, నిర్మాణం పూర్తికాగానే తగినంత కప్పం చెల్లిస్తానని చెప్పి, సయ్యద్ మియాను అంగీకరింపజేశాడు. వేగంగా కోట నిర్మాణం పూర్తి చేశాడు. అనుకున్నట్లుగా సోమనాద్రి కప్పం చెల్లించలేదు. పైగా గొప్ప సైన్యాన్ని సిద్ధపరచుకొని, దావూద్ మీదికి దండయాత్రకు సిద్ధపడ్డాడు. విషయం తెలుసుకొన్న దావూడ్మియా మండిపడ్డాడు. ముందువెనకలు ఆలోచించకుండ సోమనాద్రి మీద యుద్ధం ప్రకటించాడు. రాయచూరు నవాబయిన బసరు జంగు, ప్రాగటూరు కోటకు అధిపతి అయిన ఇదురుసాబు తమ తమ సేనలతో వచ్చి యుద్ధరంగంలో సయ్యద్కు బాసటగా నిలిచారు. ఇరుపక్షాల సైన్యాలు గద్వాలకు, రాయచూరుకు మధ్య ప్రాంతమైన 'ఆరగిద్ద' దగ్గర మోహరించాయి. సంకుల సమరం జరిగింది. కొంత సైన్యాన్ని వెంటపెట్టుకొని, సోమనాద్రి స్వయంగా రాయచూరు నవాబును ఢీకొన్నాడు. సోమనాద్రి ధాటికి తట్టుకోలేని బసరుజంగు యుద్ధంనుంచి తప్పుకొని, తన సైన్యంతో ఇంటిముఖం పట్టాడు. సోమనాద్రి పరాక్రమాన్ని గమనించిన ప్రాగటూరు నవాబు కూడ బుద్దితెచ్చుకొని మెల్లగ జారుకున్నాడు. ఉప్పేడు నవాబు సయ్యద్ దావూద్ మియా మాత్రం మిగిలి, ఏకాకి అయిపోయాడు. ఇక చేసేదిలేక, తాను కూడ ఉప్పేడు దారిపట్టి ఏనుగుపై పారిపోతున్నాడు. సోమనాద్రి తన గుర్రాన్ని ఏనుగుమీదికి ఉసికొల్పాడు. దావూద్ మియా భయపడి ప్రాణాలు దక్కించుకోవడం తప్ప వేరే మార్గం లేదని భావించాడు. వెంటనే తన అపజయాన్ని అంగీకరిస్తూ సోమనాద్రిని శరణు కోరుకున్నాడు. ఇక ముందెన్నడు సోమనాద్రి జోలికి రానని మాట ఇచ్చాడు. యుద్ధ పరిహారంగా తన యుద్ధచిహ్నాలైన నగారా, పచ్చజెండా, ఏనుగులను, సోమనాద్రికి సమర్పించుకొని, తలదించుకొని ఉప్పేడు చేరుకున్నాడు.

ఎట్లానో ఆరాత్రి గడిపాడు సయ్యద్ దావూద్్మయా. మర్నాడు ఉదయాన్నే తన కోటమీదకి ఎక్కి, గద్వాల కోటకేసి చూశాడు. గద్వాల కోట పై ఏ రెపరెపలాడుతున్న తన పచ్చజెండా కనిపించేసరికి కడుపులో మండింది. ఎట్లాగైన

132
తాను కోల్పోయిన వాటిని వెనక్కి తెచ్చుకోవాలనుకున్నాడు. వెంటనే పల్లకిలో హైదరాబాద్ పోయి గోల్కొండ నవాబుతో తన దీనస్థితిని చెప్పుకున్నాడు. సోమనాద్రిని దండించి తనకు మనశ్శాంతిని చేరూర్చుమని కోరాడు. నిజాం నవాబు నాసిరుదౌలా, సోమనాద్రి మీదకు దండయాత్ర మంచిది కాదని, ఆ ఆలోచన మానుకోమని రకరకాలుగా నచ్చజెప్పాడు. కాని సయ్యద్ మియా తాను పట్టిన పట్టు విడవలేదు. చేసేది లేక, నిజాం నవాబు గొప్ప సైన్యంతో సోమనాద్రిమీద యుద్ధానికి బయలుదేరాడు.

5 పూర్వం సోమనాద్రి చేతిలో ఓడిపోయి, పరాభవంతో కుంగిపోతున్న రాయచూరు, ప్రాగటూరు నవాబులు తమ కక్ష తీర్చుకోవాలనే కోరికతో నిజాం సైన్యంలోకి వచ్చి చేరారు. ఈలోగా గుత్తి దుర్గాధిపతి టీకు సుల్తాను, కర్నూలు నవాబు దావూద్ ఖాన్, బళ్ళారి నవాబు తమ పరాక్రమాన్ని ప్రదర్శించ దీనికి మంచి ఉత్సాహంతో వచ్చి కొత్తగా నిజాం సైన్యంలో చేరారు.

0.

తుంగభద్రానదికి దక్షిణాన ఉన్న 'నిడుదూరుకు చేరుకున్నది నిజాం సైన్యం. తుంగభద్రకు ఉత్తర తీరంలో పిన్న్ 'కలుగోట్ల' గ్రామంలో సోమనాద్రి సైన్యం విడిది చేసింది. ఈ రెండు గ్రామాల్లో ఇప్పటికీ ఆ నాటి యుద్ధపు నవాళ్ళుగా తాత్కాలిక బురుజులు, మిట్టలు దర్శనమిస్తాయి. ఆలస్యం చేయడం ఇష్టంలేని సోమనాద్రే మొదట ం సైన్యంతో తుంగభద్రానదిని దాటి తెల్లవారకముందే నిజాం సైన్యాన్ని ముట్టడించాడు. సాయంకాలం వరకు మంకరంగా యుద్ధంచేస్తూ నిజాంసైన్యాన్ని చీల్చి చెండాడాడు. చీకటి పడడంతో తన సైన్యాన్ని మరల్చి, నదిని దీ 'కలుగోట్ల' ను చేరి విశ్రమించాడు.

3. న సోమనాద్రి పరాక్రమాన్ని చూసిన నిజాం నవాబు కలవరపడ్డాడు. వెంటనే దర్బారు చేసి సోమనాద్రిని _. ంగదీసుకొనే ఉపాయం చెప్పుమన్నాడు. అప్పుడొక సర్దారు, "సోమనాద్రి శక్తి అంతా అతని గుర్రంలోనే మన్నది, దాన్ని వశం చేసుకొంటేగాని అతడు వశం కాడు' అని వివరించాడు. వెంటనే నిజాం ఎట్లాగైనా సోమనాద్రి -నినాన్ని దొంగిలించి, అతణ్ణి వంచాలని ఆలోచించాడు. "తెల్లారేసరికి సోమనాద్రి గుర్రాన్ని తెచ్చేవారికి జాగీరు "న్నిను" అని ప్రకటించాడు. చూస్తూ చూస్తూ మృత్యుముఖంలోకి ఎవరు ప్రవేశిస్తారు? చివరకు ఒక సైసు ఐ. మయ్యాడు. ప్రాణాలకు తెగించి నడుముకు కళ్ళెం బిగించి, ఒంటరిగా కలుగోట్లకు ప్రయాణమయ్యాడు. ద్ద గో కష్టపడి సైసు మెల్లగా చప్పుడు కాకుండా గుర్రాన్ని సమీపించాడు. కళ్ళెం తగిలించి పాగానుంచి తప్పించాడు. యంమీదికి ఎక్కి వేగంగా తిరుగుముఖం పట్టాడు. గుర్రాన్ని చూడగనే నిజాము ఆనందానికి అంతులేకుండ యింది. వెంటనే ఆ సైసుకు జాగీరుతో పాటు ఒక బంగారు కడియాన్ని కూడ బహుమానంగా ఇచ్చాడు.

తెల్లవారింది. గుర్రంలేకపోవడాన్ని గమనించిన సోమనాద్రి సైన్యంలో కలకలం బయలుదేరింది. తన పై వీచెయ్యి పడిపోయిందని భావించాడు సోమనాద్రి. అయినా ధైర్యాన్ని విడువలేదు. నిజాం సైన్యంతో తలపడ్డాడు.

133
ఆరోజు ఎట్లాగో యుద్ధం సాగించాడు. సాయంకాలం ఉభయ సైన్యాలూ యుద్ధాన్ని విరమించాయి. కలుగోట్ల చేరుకున్న సోమనాద్రి ఆ రాత్రి తనవారితో సమాలోచన చేశాడు. "తెలారేసరికి నా గుర్రాన్ని ఎవరు తెసారో వారికి నా గుర్రం ఒక రోజంత ఎంత భూమిలో తిరుగుతుందో అంత భూమిని ఇనాముగ ఇస్తాను" అని ప్రకటించాడు.

గద్వాలకు పదిమైళ్ళ దూరంలో 'జొచ్చెంగన్నపల్లి' అనే గ్రామం ఉన్నది. అక్కడినుంచి వచ్చిన బోయసర్దారు హనుమప్పనాయుడు. ఈ విషయం తెలుసుకొన్నాడు. వెంటనే గుర్రాన్ని తేవడానికి సిద్ధపడ్డాడు. అతడు జొన్నచొప్పను ఒక మోపుగా కట్టి నెత్తిన పెట్టుకొని నిజాం డేరాలను సమీపించాడు. ఆ మోపును అయిదు రూపాయలు ఇస్తేకానీ ఇవ్వను అంటూ బేరం కుదరనివ్వకుండా సోమనాద్రి గుర్రంకోసం ముందు డేరాలకు పోతున్నాడు హనుమప్ప. ఒక ప్రత్యేక స్థలంలో గుర్రం కనపడింది. గుర్రంకూడా హనుమప్పను చూసి సకిలించింది. గుర్రం కళ్ళల్లో కాంతి, నిక్కించిన చెవులు, తల ఆడించడం వంటి చేష్టలను చూసిన సిపాయిలు హనుమప్పనాయుడిని అనుమానంగా చూశారు. అయినా గుర్రం దంటుపుల్లలకోసం ఇట్లా చేసిందనుకొని సమాధానపడ్డారు.

గుర్రాన్ని చూసిన హనుమప్పనాయుడు చొప్పను అతి తక్కువ ధరకు విక్రయించాడు. కొంత సేపటికి ఒకడు వచ్చి క్రయధనం ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇదే తగిన సమయమని భావించిన హనుమప్ప వెంటనే గుర్రపు పాగా (అశ్వశాల)లో ఉన్న గడ్డికుప్ప కిందికి దూరాడు. వెల్లకిలా పడుకున్నాడు. గుర్రం కూడా హనుమప్ప కనిపించకపోవడంతో తన్నుకుంటూ కాళ్ళకు కట్టిన గూటాన్ని ఊడబెరికింది. వెంటనే ఒక సిపాయి వచ్చి గూటాన్ని గడ్డిపై మోపి భూమిలోకి పాతాడు. హనుమప్పనాయుడి అరచేతిని చీల్చుకుని ఆ గూటం భూమిలోకి పాతుకు పోయింది.

నొప్పితో ప్రాణాలు పోయే స్థితి వచ్చినా, స్వామి కార్యం తలుచుకుంటూ, కదలక మెదలక ఆ బాధను ఓర్చుకున్నాడు హనుమప్ప. అర్ధరాత్రి అయింది. సైనికులు అంతా నిద్రిస్తున్నారు. హనుమప్ప తనమీద ఉన్న గడ్డిని పక్కకు నెట్టి కూర్చున్నాడు. కుడి చేయి కదలడం లేదు. గూటం కూడా కదలడం లేదు. ఆలస్యం చేయకుండా ఎడమచేత్తో తన నడుముకు ఉన్న కత్తిని లాగాడు. కుడిచేతిని నరుక్కున్నాడు. రక్తపు మడుగులో ఉన్న మొండి చేతిని తలపాగలో చుట్టి గుర్రాన్ని తీసుకొని డేరాలు దాటాడు.

134

అర్ధగంటలో, ఆనందంతో సోమనాద్రి ఎదుట గుర్రంతో నిలబడ్డాడు హనుమప్ప. ఎడమచేత్తో సలాం డు. రాజు కోపంతో కన్నెర్ర చేశాడు. హనుమప్ప తన మొండిచేతిని చూపించి, జరిగిందంత వివరించాడు. -జు ఆశ్చర్యపోయాడు. నాయుణ్ణి కౌగిలించుకొని సన్మానించాడు. అన్న మాట ప్రకారం అప్పటికప్పుడే ఒక దానశాసనాన్ని రాయించి ఇచ్చాడు. గుర్రాన్ని చూడగానే సోమనాద్రి ఉత్సాహం ఉరకలు వేసింది. ఉదయాన్నే తన మాన్యాన్ని వెంటపెట్టుకొని నిజాం సైన్యంమీద విరుచుకుపడ్డాడు. సోమనాద్రి జయభేరి ధ్వనులు నిజాం సైన్యం - పండెల్ని బద్దలుచేశాయి. సోమనాద్రిసైన్యం నిజాంసైన్యాన్ని దావానలంలా చుట్టుముట్టింది. భయంకరంగ యుద్ధం గింది. ఆనాటి యుద్ధంలో ప్రాగటూరు, బళ్ళారి నవాబులు హతులయ్యారు. సాయంకాలానికి నిజాం సైన్యాన్ని -ర్నూలు కోట వరకు తరమడం జరిగింది. సోమనాద్రి కూడా కొద్దిమంది సైన్యంతో నిజాం సైన్యాన్ని తరుముకుంటూ ర్నూలు కోటలోకి ప్రవేశించాడు. అంతలో అకస్మాత్తుగా కోట తలుపులు మూతపడ్డాయి. కొద్దిమందితో సోమనాద్రి లోపల ఉన్నాడు; మిగిలిన సైన్యం కోట బయట ఉండిపోయింది.

గద్వాల సర్దారులకు భయం ఎక్కువయింది. దిక్కు తోచడం లేదు. కోట తలుపులను చీల్చడానికి ముమ్మరంగా యత్నించారు. కాని ఫలితం లేకుండ పోయింది. కోట లోపల ఏం జరుగుతున్నదో, బయట ఉన్న గద్వాల 2 ద్యానికి తెలియలేదు. కొద్ది మందితోనే కోట లోపల ఉన్న తమ నాయకుడు మరణించి ఉంటాడని భావించారు. ఆం ర్వాలలో ఉన్న లింగమ్మరాణికి పరిస్థితిని తెలియజేస్తు, తాము తిరిగి వస్తామని కబురు పంపారు. ఆ వీరనారి మాధానంగా కొన్ని గాజులు, చీరలు, పసుపు, కుంకుమ పంపింది. గద్వాల సర్దారులకు సిగ్గు, క్రోధం కలిగాయి. టనే రెట్టింపు పట్టుదలతో, ధైర్యంతో రంగంలోకి దిగారు. ఎట్టకేలకు కోట తలుపులను పగలగొట్టి లోపలికి దేశించారు.

కోటలోపల కొద్దిమంది సైన్యంతోనే ఉన్నా సోమనాద్రి వీరోచితంగ పోరాడుతున్నాడు. తన సైన్యం చాలవరకు పృతమైంది. ఈలోగా బయట ఉన్న తన సైన్యం లోపలికి ప్రవేశించి తనకు బాసటగ నిలిచింది. నిజాం సైన్యంలో న్నంజడి హెచ్చింది. పిడికెడుమందితోనే సోమనాద్రి కోటలోపల అల్లకల్లోలం సృష్టించాడు. ఇప్పుడు తెల్లవారితే కేం చేస్తాడో అని భయపడ్డారు. చావగా మిగిలిన గుత్తి, రాయచూరు నవాబులు యుద్ధవిముఖులయ్యారు. స్థితిలో సోమనాద్రితో సంధి చేసుకోవడమే అన్ని విధాల మంచిదని మంత్రులు నిజాం నవాబుకు ముక్తకంఠంతో జెప్పారు. ఈ యుద్ధానికి అసలు కారకుడయిన సయ్యద్ దావూద్ మియా ఏం చేయాలో తెలియక ఊరుకున్నాడు. সু

నిజాం నవాబు మరునాడు ఉదయమే సంధి కోరుతూ సోమనాద్రి దగ్గరకు ఒక రాయబారిని పంపాడు. చేయస్ఫూర్తి గల సోమనాద్రి కూడ సంధికి అంగీకరించాడు. యుద్ధపరిహారంగా కర్నూలులోని కొండారెడ్డి - రుజులో ఉన్న 'ఎల్లమ్మ' ఫిరంగిని, రాయచూరు నవాబు అధీనంలో ఉన్న 'రామ, లక్ష్మణ' అనే పేర్లుగల రెండు సంగులను సోమనాద్రి స్వీకరించాడు. కర్నూలు ఏలుబడిలోని కొంతభాగాన్ని సోమనాద్రికి ఇచ్చారు. ఈ ప్రకారం + మభూపాలుడు సంధి చేసుకొని, యుద్ధపరిహారం పొంది, విజయోత్సాహంతో గద్వాల కోటకు చేరుకున్నాడు.

యుద్ధం ముగిసిన తరువాత సోమనాద్రి తాను అన్నమాట ప్రకారం గుర్రం ఒక దినం తిరిగినంత మిని హనుమప్పనాయుడికి ఇనాముగ ఇచ్చాడు. ఈ నాటికీ బొచ్చెంగన్నపల్లిలో హనుమప్ప సంతతివారు ఆ హములను అనుభవిస్తు, తమకు ఆ భూమి ఎక్కువ కావటంవల్ల అందులో కొంత భూమిని ఇతరులకు ముగ ఇచ్చి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు.

(సురవరం ప్రతాపరెడ్డిగారి 'హైందవ ధర్మవీరులు' అనే గ్రంథం ఈ కథకు ఆధారం)

135

21, అక్టోబర్ 2025, మంగళవారం

భళారే... తెలుగు!

భళారే... తెలుగు!

ఒకప్పుడు ప్రముఖ పాత్రికేయులు శ్రీ భండారు శ్రీనివాసరావుగారు ఫేస్‌బుక్‌లో ఆసక్తికరమైన ఈ క్రింది ఆంగ్ల వాక్యాన్ని పోస్ట్ చేశారు: 

An Amazing Sentence in English

Remarkable indeed! The person who made this sentence must be a GENIUS in English vocabulary.

"I do not know where family doctors acquired illegibly perplexing handwriting; nevertheless, extraordinary pharmaceutical intellectuality, counterbalancing indecipherability transcendentalizes intercommunication's incomprehensibleness.''

ఈ వాక్యంలో ఇరవై పదాలున్నాయి. ఒకటవ పదంలో ఒక అక్షరం, రెండవ పదంలో రెండు అక్షరాలు, మూడవ పదంలో మూడు అక్షరాలు, ఈ విధంగా అక్షరవృద్ధిక్రమంలో ఇరవయ్యవ పదంలో ఇరవై అక్షరాలు ఉన్నాయి. 

ఇదొక అపురూపమైన చిత్ర రచన. దీనికి ప్రతిగా తెలుగు భాషకు గల శక్తిని వెల్లడిస్తూ ఏల్చూరి మురళీధరరావు గారు ఈ క్రింది వాక్యాన్ని ప్రకటించారు:   

“ఏ మంచి కవైనా విశ్వనాథ గ్రంథావళిని చదవకపోతే కవిత్వరచనలో పద్యనిర్మాణశక్తికి, సద్గుణాలంకారవ్యక్తికి,
రసోచితశబ్దార్థయుక్తికి, సుమకోమలభావభావనకు, నవ్యసంప్రదాయపదగుంఫనకు, భవ్యరసాస్వాదరసాయనవాణికి, పురుషార్థోచితచిత్తవృత్తిచిత్రణకు, భారతీయతామరందాస్వాదలోలుపతకు, అతిలోకచమత్కృతిమత్కృతిమత్ప్రతీతికి, విషయచింతానిరోధనిశ్చలసమాధ్యవస్థకు, విపంచీస్వరసౌభాగ్యబంధురశయ్యావైయాత్యానికి, ఉత్కృష్టలోకసిద్ధార్థమహాపురుషగుణకీర్తనకు, రమణీయార్థనిర్మితశ్రవణమనోహరకావ్యలక్ష్మికి, నానార్థస్ఫోటవాచకత్వసంయోగాదినియమితవ్యంజనకు, అభిధావివక్షితాన్యపరవాచ్యసంలక్ష్యక్రమభావధ్వనికి, శృంగారవీరకరుణహాస్యరౌద్రాద్భుతశాంతాదిరసప్రతీతికి, గిరిశిఖరపతన్నిరర్గళస్రవంతీనిరుపమానధారాశుద్ధికి, ధర్మజ్ఞానభక్తిప్రేమసత్యాద్యుత్తమాదర్శప్రతిపాద్యవస్తుస్వీకృతికి, సహృదయహృదయవాసనాపరీపాకభావనాప్రపంచశోభాదూరవర్తే!

పై వాక్యంలో 26  అక్షరవృద్ధి దళాలున్నాయి. మొదటి దళం ఒక అక్షరం, రెండవ దళం రెండక్షరాలు, మూడవ దళం మూడక్షరాలు.... ఇలా ఇరవై ఆరవ దళం ఇరవై ఆరు అక్షరాలతో అక్షరవృద్ధిక్రమంలో కూర్పబడి ఉన్నాయి. 

1. ఏ
2. మంచి
3. కవైనా
4. విశ్వనాథ
5. గ్రంథావళిని
6. చదవకపోతే
7. కవిత్వరచనలో
8. పద్యనిర్మాణశక్తికి,
9. సద్గుణాలంకారవ్యక్తికి,
10. రసోచితశబ్దార్థయుక్తికి,
11. సుమకోమలభావభావనకు,
12. నవ్యసంప్రదాయపదగుంఫనకు,
13. భవ్యరసాస్వాదరసాయనవాణికి,
14. పురుషార్థోచితచిత్తవృత్తిచిత్రణకు,
15. భారతీయతామరందాస్వాదలోలుపతకు,
16. అతిలోకచమత్కృతిమత్కృతిమత్ప్రతీతికి,
17. విషయచింతానిరోధనిశ్చలసమాధ్యవస్థకు,
18. విపంచీస్వరసౌభాగ్యబంధురశయ్యావైయాత్యానికి,
19. ఉత్కృష్టలోకసిద్ధార్థమహాపురుషగుణకీర్తనకు,
20. రమణీయార్థనిర్మితశ్రవణమనోహరకావ్యలక్ష్మికి,
21. నానార్థస్ఫోటవాచకత్వసంయోగాదినియమితవ్యంజనకు,
22. అభిధావివక్షితాన్యపరవాచ్యసంలక్ష్యక్రమభావధ్వనికి,
23. శృంగారవీరకరుణహాస్యరౌద్రాద్భుతశాంతాదిరసప్రతీతికి,
24. గిరిశిఖరపతన్నిరర్గళస్రవంతీనిరుపమానధారాశుద్ధికి,
25. ధర్మజ్ఞానభక్తిప్రేమసత్యాద్యుత్తమాదర్శప్రతిపాద్యవస్తుస్వీకృతికి,
26. సహృదయహృదయవాసనాపరీపాకభావనాప్రపంచశోభాదూరవర్తే!  

తెలుగు భాషాభిమానుల ఆసక్తి కారణంగా ఈ వాక్యం అచిరకాలంలోనే ఫేస్ బుక్ లోనూ, అంతర్జాలంలోనూ, వాట్సాప్ మాధ్యమం ద్వారానూ, వివిధ పత్రికలలోనూ పాతికవేలకు పైగా పర్యాయాలు సంచరిస్తుండటం విశేషం!

భళారే ... తెలుగు!👍

-సేకరణ 

వర్ణమాలతో పెళ్లి

*వర్ణమాలతో పెళ్లి ఆహ్వానం... తెలుగు అక్షరాలన్నింటితో పెళ్లి ఆహ్వానం ఎలా ఉందో మీరే చూడండి...🌹🥰*

*అ -* అరుదైన అమ్మాయి
*ఆ -* ఆకతాయి అబ్బాయి
*ఇ -* ఇద్దరికి
*ఈ -* ఈడు జోడి కుదిరి
*ఉ -* ఉంగరాలను తొడిగి
*ఊ -* ఊరంతా ఊరేగించారు
*ఋ -* ఋణాల కోసం
*ఎ -* ఎవరెవరినో అడుగుతూ ఉంటే
*ఏ -* ఏనుగు లాంటి కుభేరుడితో అడిగి
*ఐ -* ఐశ్వర్యం అనే కట్నం ఇచ్చి
*ఒ -* ఒకరికి ఒకరు వియ్యంకులవారు
*ఓ -* ఓర్పుతో ఒప్పందం చేసుకొని
*ఔ -* ఔదార్యాని ఇరు కుటుంబాలకు
*అం -* అందించాలని కోరుకుంటూ
*అ -* అంటూ
*క -* కలపతో తయారయిన పత్రికలపై
కలంతో రాసిచ్చి
*ఖ -* ఖడ్గలతో నరికిన పందిరి ఆకులను
*గ -* గడప ముందుకు తీసుకొచ్చి
*ఘ -* ఘనమైన ఏర్పాట్లు చేయించి
*చ -* చాపుల (బట్టలు)నింటిని కొని
*ఛ -* ఛత్రం (గొడుగు) పట్టి గండదీపాని
*జ -* జరిపిస్తూ
*ఝ -* ఝాము రాత్రి దాక
*ట -* టపకాయలను కాలుస్తూ
*ఠ -* ఠీవిగా (వైభవంగా)
*డ -* డప్పులతో
*ఢ -* ఢం ఢం అని శబ్దాలతో సాగుతుంది
*ణ -* కంకణాలు చేతికి కట్టుకొని
*త -* తట్టలో తమలపాకులు పట్టుకొని
*థ -* థమన్(మ్యూజిక్ డైరెక్టర్) డప్పులతో
*ద -* దగ్గరి బంధువులను పిలిచి
*ధ -* ధనవంతులను కూడా పిలిచి
*న -* న అనే నలుగురిని పిలిచి
*ప -* పది మందిని పలకరిస్తూ
*ఫ -* ఫంక్షన్ కి రావాలని చెప్తూ
*బ -* బలగాలతో బంగార దుకాణాలకు వెళ్లి
*భ -* భటువులని (ఆభరణాలు) కొని
*మ -* మంగళ స్నానాలు చేయించి, రాజసూయ
*య -* యాగం లాంటి పెళ్లికి
*ర -* రారండోయ్ వేడుక చూద్దాం అని చెప్పి
*ల -* లక్షణమైన
*వ -* వధూవరులను మీరు
*శ -* శతమానం భవతి అని
*ష -* షరతులు లేకుండా ఆశీర్వదించడానికి
*స -* సప్తపది (పెళ్లి) వేడుకలో
*హ -* హంగు ఆర్భాటాలతో రెడీ అయిన మండపంలో
*ళ -* క ళ త్రం (భార్య) కాబోతున్న ఆమె ప్రక్కన వరుడు కూర్చొని
*క్ష -* క్షత్రియ చెంత ఉండే బ్రాహ్మణుల సాక్షిగా జరిగే ఈ పెళ్లికి
*ఱ -* ఱరండి

*వర్ణమాల పెళ్లి...🌹🥰*

- సేకరణ

10, అక్టోబర్ 2025, శుక్రవారం

దాశరధి శతక పద్యాలు


శ్రీ రఘురామ చారు తులసీదళ దామ శమక్షమాది శృం
గార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ దు
ర్వార కబంధరాక్షస విరామ జగజ్జన కల్మషార్ణవో
త్తారకనామ భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ


భావం: రఘువంశమున బుట్టినవాడవు, సొంపైన తులసీదండలు గలవాడవు, శాంతి, ఓరిమి మొదలు గుణములచే నొప్పువాడవు, ముల్లోకముల బొగడదగిన పరాక్రమలక్ష్మికి ఆభరణమైనవాడా! వారింపనలవికాని కబంధుడను రాక్షసుని సంహరించినవాడా, జనుల పాపములను సముద్రమును దాటించు నామము గలవాడా! దయకు సముద్రమువంటివాడా! భద్రాచలమందుండు శ్రీరామా!


రామవిశాల విక్రమ పరాజిత భార్గవరామ సద్గుణ
స్తోమ పరాంగనావిముఖ సువ్రత కామ వినీల నీరద
శ్యామ కకుత్ధ్సవంశ కలశాంభుధిసోమ సురారిదోర్భలో
ద్ధామ విరామ భద్రగిరి - దాశరథీ కరుణాపయోనిధీ!


భావం: జనులను సంతోషింపజేయువాడవు, పరశురాముని జయించినవాడవు, పరస్రీలయందాసక్తి లేనివాడవు, నల్లని మేఘమువంటి శరీర కాంతిగలవాడవు, కాకుత్ స్థ వంశమును సముద్రమునకు చంద్రునివంటి వాడవు, రాక్షసుల సంహరించిన వాడవునైన భద్రాచల రామా!

అగణిత సత్యభాష, శరణాగతపోష, దయాలసజ్ఘరీ
విగత సమస్తదోష, పృథివీసురతోష, త్రిలోక పూత కృ
ద్గగన ధునీ మరంద పదకంజ విశేష మణిప్రభా ధగ
ద్ధగిత విభూష భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ.

భావం: సత్యము మాట్లాడువాఁడవు, శరణన్న వారిని రక్ష్మించువాడవు, దయచేతఁ బాపములఁ బోగొట్టువాడవు, బ్రాహ్మణుల సంతోషింపజేయువాడవు, గంగానది పుట్టిన పాదపద్మములు గలవాడవు, మణులచే నిగ నిగ మెఱయు సొమ్ములు గలవాడవు, భద్రాచల రామా!


రంగదరాతిభంగ, ఖగ రాజతురంగ, విపత్పరంపరో
త్తుంగ తమఃపతంగ, పరి తోషితరంగ, దయాంతరంగ స
త్సంగ ధరాత్మజా హృదయ సారసభృంగ నిశాచరాబ్జమా
తంగ, శుభాంగ, భద్రగిరి దాశరథీ కరుణాపయోనిథీ.

భావం: శత్రువుల సంహరించినవాడవు, గరుత్మంతుడు వాహనముగ గలవాడవు, ఆపదల బోగొట్టువాడవు, రంగనాధునిచే సేవింపబడిన వాడవు, దయతో నొప్పు మనస్సుగలవాడవు, సత్సంగుడవు, సీతాహృదయమును పద్మమునకు తుమ్మెదవంటివాడవు, రాక్షసులకు బీభత్స కరుడవు, శుభాంగుడవునైన భద్రాచల రామా!


శ్రీద సనందనాది మునిసేవిత పాద దిగంతకీర్తిసం
పాద సమస్తభూత పరిపాల వినోద విషాద వల్లి కా
చ్ఛేద ధరాధినాథకుల సింధుసుధామయపాద నృత్తగీ
తాది వినోద భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ.


భావం: సంపదల నిచ్చువాడవు, మునులచే బూజింపబడినవాడవు, కీర్తిమంతుడవు, అన్ని భూతములను పాలించువాడవు, దుఖఃముల బోగొట్టువాడవు, క్షత్రియ కులమును సముద్రమునకు జంద్రుడవు, నృత్యము, గానము వేడుకగా గలవాడవు, భద్ర - నిధీ!


ఆర్యుల కెల్ల మ్రొక్కివిన తాంగుడనై రఘునాధ భట్టరా
రార్యుల కంజలెత్తి కవి సత్తములన్ వినుతించి కార్య సౌ
కర్య మెలర్పనొక్క శతకంబొన గూర్చి రచింతునేడుతా
త్పర్యమునన్ గ్రహింపుమిది దాశరథీ కరుణాపయోనిధీ.

భావం: పెద్దల కందఱికి మ్రొక్కి, వంచిన శరీరము గలవాడనై గురువైన రఘునాధభట్టునకు నమస్కరించి, కవిశ్రేష్ఠులను పొగడి, కార్య లాభమునకై యొక శతకంబును వ్రాసెదను. దీని నిష్టముతో గైకొనుము దాశ - నిధీ


మసకొని రేంగుబండ్లుకును మౌక్తికముల్ వెలవోసినట్లు దు
ర్వ్యసనముజెంది కావ్యము దురాత్ములకిచ్చితి మోసమయ్యె నా
రసనకుఁ బూతవృత్తి సుకరంబుగ జేకురునట్లు వాక్సుధా
రసములుచిల్క బద్యముఖ రంగమునందునటింప వయ్య సం
తసమును జెంది భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ.


భావం: రేగుపండ్లను ముత్తెములుపోసి కొనినట్లు దురాశతో మోసపోయి నా కావ్యములను దుర్మార్గుల కిచ్చితిని; నా నాల్కకు పవిత్రత సులభముగ గల్గునట్లును, పలుకుదేనియలు చిల్కునట్లు నా పద్యము ముఖమును నాట్యరంగమునందు సంతోషముతో నీవు నటింపుము. భద్ర - నిధీ!


శ్రీరమణీయహార యతసీ కుసుమాభ శరీర, భక్త మం
దార, వికారదూర, పరతత్త్వవిహార త్రిలోక చేతనో
ద్ధార, దురంత పాతక వితాన విదూర, ఖరాది దైత్యకాం
తార కుఠార భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ.

భావం: హారములు గలవాడవు, అవిసెపూవువంటి శరీరకాంతి గలవాడవు, భక్తులకు కల్పవృక్షమవు, వికారములు లేనివాడవు, దేవతాతత్త్వమందు విహరించువాడవు, మూడులోకముల గల ప్రాణులను బోషించువాడవు, పాపముల బోగొట్టువాడవు, ఖరాది రాక్షసారణ్యమునకు గొడ్డలివంటి వాడవు, భద్ర - నిధీ!


దురితలతాలవిత్ర, ఖర దూషణ కానన వీతిహోత్ర, భూ
భరణకళావిచిత్ర, భవ బంధ విమోచన సూత్ర, చారువి
స్ఫురదరవింద నేత్ర, ఘన పుణ్యచరిత్ర, వినీలభూరికం
ధరసమగాత్ర, భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ.


భావం: పాపమను తీగలకు కొడవలివంటివాడవు, ఖరదూషణాదుల నెడి యడవికి యగ్నివంటివాడవు, భూమిని రక్షించుటయందు విచిత్రుడవు, పుట్టుకయను ముడిని విడదీయుటయే విధిగాగలవాడవు, ప్రకాశించు పద్మములవంటి నేత్రములు గలవాడవు, పుణ్యచరిత్రుడవు, మేఘకాంతి వంటి శరీరకాంతి గలవాడవు.


కనకవిశాలచేల భవకానన శాతకుఠారధార స
జ్జనపరిపాలశీల! దివిజస్తుత సద్గుణ కాండ! కాండ సం
జనిత పరాక్రమ! క్రమ విశారద! శారద కందకుంద చం
దన ఘనసార! సారయశ దాశరథీ కరుణాపయోనిధీ.


భావం: బంగారు మయమైన వస్త్రములు గలవాడవు, సంసారమను నడవికి గొడ్డలి మొనవంటివాడవు, సజ్జనుల పరిపాలించెడివాడవు, దేవతలచే బొగడబడినవాడవు, మంచి గుణములు గలవాడవు, బాణవిద్యలో బండితుండవు, శరత్కాలపు మేఘము, మొల్లలు, గంధము పచ్చ కర్పూరము వంటి నిగ్గైన కీర్తిగలవాడవు.


శ్రీ రఘువంశ తోయధికి శీతమయూఖుడవైన నీ పవి
త్రోరుపదాబ్జముల్ వికసితోత్పల చంపక వృత్తమాధురీ
పూరితవాక్ప్రసూనముల బూజలొనర్చెద జిత్తగింపుమీ
తారకనామ భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ


భావం: రఘువంశమునకు జంద్రునివంటివాడవు, అట్టి నీ చరణముల నుత్పలము, చంపకము మొదలగు పద్యవృత్తములను పూలచే బూజించును. నా పూజలను గైకొనుము.


గురుతరమైన కావ్యరస గుంభనకబ్బుర మందిముష్కరుల్
సరసులమాడ్కి సంతసిల జాల రదెట్లు శశాంక చంద్రికాం
కురముల కిందు కాంతమణి కోటిస్రవించిన భంగివింధ్యభూ
ధరమున జాఱునే శిలలు దాశరథీ కరుణాపయోనిధీ.


భావం: మూఢులు గ్రంధములలోని రసముయొక్క కూర్పునకు రసికుల వలె సంతోషింపజాలరు. ఎట్లన చంద్రుని వెన్నెలకు చంద్రకాంత శిలలు కఱగి జాఱునట్లు వింధ్యపర్వతమున నుండు ఱాళ్ళు జాఱవు.


తరణికులేశ నానుడుల దప్పులు గల్గిన నీదునామ స
ద్విరచితమైన కావ్యము పవిత్రముగాదె వియన్నదీజలం
బరగుచువంకయైన మలినాకృతి బాఱిన దన్మహత్వముం
దరమె గణింప నెవ్వరికి దాశరథీ కరుణాపయోనిధీ.


భావం: నా మాటలలో దప్పులున్నను నీ పేరుతో వ్రాయబడు కావ్యము పవిత్రమైనదే, ఎట్లన గంగానది నీరు వంకరగ బాఱినను, ముఱికిగ మాఱినను దాని గొప్పతన మెక్కడ పోవును?


దారుణపాత కాబ్ధికి సదా బడబాగ్ని భవాకులార్తివి
స్తారదవానలార్చికి సుధారసవృష్టి దురంత దుర్మతా
చారభయంక రాటవికి జండకఠోరకుఠారధార నీ
తారకనామ మెన్నుకొన దాశరథీ కరుణాపయోనిధీ.


భావం: నీ పేరు పాపమను సముద్రమునకు బడబాగ్ని వంటిది, సంసారమను కార్చిచ్చునకు నమృతపు వాన, దుర్మతాచారములకు గొడ్డలి మొన వంటిది.


హరునకు నవ్విభీషణునక ద్రిజకుం దిరుమంత్ర రాజమై
కరికి నహల్యకుం ద్రుపదకన్యకు నార్తిహరించుచుట్టమై
పరగినయట్టి నీపతిత పావననామము జిహ్వపై నిరం
తరము నటింపజేయుమిక దాశరథీ కరుణాపయోనిధీ.


భావం: నీ నామ మీశ్వరునకు, విభీషణునకు, పార్వతికిని శ్రేష్ఠమగు మంత్రమైనది. అట్టి పరమ పవిత్రమైన నీ నామము నా నాల్కయం దెప్పుడు నాడునట్లు చేయుము.


ముప్పున గాలకింకరులు ముంగిటవచ్చిన వేళ, రోగముల్
గొప్పరమైనచో గఫము కుత్తుక నిండినవేళ, బాంధవుల్
గప్పినవేళ, మీస్మరణ గల్గునొ గల్గదొ నాటి కిప్పుడే
తప్పకచేతు మీభజన దాశరథీ కరుణాపయోనిధీ.


భావం: ముసలితనమున యమభటులు వాకిట ముందునకు వచ్చి యుండగా, రోగ మెక్కువై కఫము గొంతులో నిండినప్పుడు, బంధువులు చుట్టుకొన్నప్పుడు మిమ్ము తలతునో తలపలేనో, భజింతునో భజింపలేనో కాబట్టి యిప్పుడే యా పని నెరవేర్చెదను.




పరమదయానిధే పతితపావననామ హరే యటంచు సు
స్ధిరమతులై సదాభజన సేయు మహాత్ముల పాదధూళి నా
శిరమునదాల్తుమీరటకు జేరకుడంచు యముండు కింకరో
త్కరముల కాన బెట్టునట దాశరథీ కరుణాపయోనిధీ.

భావం: దయకు సముద్రమువంటివాడవు, పాపులనుద్ధరించు పేరుగలవాడవు. హరీ యని నిలుకడగల బుధ్ధితో గొలుచు మహాత్ముల కాళ్ళ దుమ్ము నా నెత్తిపై దాల్తును. అప్పుడు యముడు తన భటులను నా జోలికి పోవద్దని యాజ్ఞాపించును.


అజునకు తండ్రివయ్యు సనకాదులకున్ బరతత్త్వమయ్యుస
ద్ద్విజమునికోటికెల్లబర దేతవయ్యు దినేశవంశ భూ
భుజులకు మేటివయ్యుబరి పూర్ణుడవై వెలిగొందుపక్షిరా
డ్ధ్వజమిము బ్రస్తుతించెదను దాశరథీ కరుణాపయోనిధీ.


భావం: బ్రహ్మకు దండ్రివి, సనకాదులకున్ బరతత్త్వమవు, బ్రాహ్మణులకు, ఋషులకు ముఖ్య దేవుడవు, సూర్యవంశపు రాజులలో నధికుడవు, అట్టి నిన్ను పొగడెదను.


పండిత రక్షకుం డఖిల పాపవిమొచను డబ్జసంభవా
ఖండల పూజితుండు దశకంఠ విలుంఠన చండకాండకో
దండకళా ప్రవీణుడవు తావక కీర్తి వధూటి కిత్తుపూ
దండలు గాగ నా కవిత దాశరథీ కరుణాపయోనిధీ!


భావం: పండిత రక్షకుఁడు, పాపములఁ బోఁగొట్టువాఁడు, బ్రహ్మేంద్రాదులచే బూజింపఁబడినవాఁడు, రావణాసురిని సంహరించినవాడను నీ కీర్తి కన్యకు నా కవిత్వమును బూదండవలెనిత్తును.


శ్రీరమ సీతగాగ నిజసేవక బృందము వీరవైష్ణవా
చార జవంబుగాగ విరజానది గౌతమిగా వికుంఠ ము
న్నారయభద్ర శైలశిఖరాగ్రముగాగ వసించు చేతనో
ద్ధారకుడైన విష్ణుడవు దాశరథీ కరుణాపయోనిధీ.


భావం: లక్ష్మీదేవి సీత, సేవకులు వైష్ణవజనులు, విరజానది, గోదావరి, వైకుంఠము, భద్రాచలము కాగా ప్రాణుల నుధ్ధరించునట్టి విష్ణువుడ నీవు దా - నిధీ!


కంటి నదీతటంబుబొడగంటిని భద్రనగాధివాసమున్
గంటి నిలాతనూజనురు కార్ముక మార్గణశంఖచక్రముల్
గంటిని మిమ్ము లక్ష్మణుని గంటి కృతార్ధుడ నైతి నో జగ
త్కంటక దైత్యనిర్దళన దాశరథీ కరుణాపయోనిధీ!


భావం: ఏటిదరిని భద్రాచలమునం దుండుట జూచితిని, సీతను జూచితిని, గొప్పవైన ధనువును, బాణములను, శంఖచక్రముల జూచితిని, మిమ్ము, లక్ష్మణుని జూచి కృతార్ధుడనైతి.


హలికునకున్ హలాగ్రమున నర్థము చేకురుభంగి దప్పిచే
నలమట జెందువానికి సురాపగలో జలమబ్బినట్లు దు
ర్మలిన మనోవికారినగు మర్త్యుని నన్నొడగూర్చి నీపయిన్
దలవు ఘటింపజేసితివి దాశరథీ కరుణాపయోనిధీ!


భావం: రైతునకు నాగేటి చివర ధనమిచ్చినట్లును, దప్పితో బాధ పడువానికి గంగానదీజల మబ్బినట్లును, చెడు మనస్సు గల నాకు నీపై భక్తి కలుగునట్లు చేసితివి.


కొంజకతర్క వాదమను గుద్దలిచే బరతత్త్వ భూస్ధలిన్
రంజిల ద్రవ్వి కన్గొనని రామ నిధానము నేడు భక్తి సి
ద్ధాంజనమందు హస్తగత మయ్యె భళీ యనగా మదీయహృ
త్కంజమునన్ వసింపుమిక దాశరథీ కరుణాపయోనిధీ.


భావం: తర్కవాదముచేనైన గన్గొనరాని రాముడను నిధి, భక్తియను బైరాగుల కాటుకతో నందఱు భళా అనగా జేజిక్కిన దయ్యెను. ఇంక నా మనస్సునందు స్థావరముగా నిలువుము.


రాముఁడు ఘోరపాతక విరాముడు సద్గుణకల్పవల్లికా
రాముడు షడ్వికార జయరాముడు సాధుజనావన వ్రతో
ద్దాముఁడు రాముడే పరమదైవము మాకని మీ యడుంగు గెం
దామరలే భజించెదను దాశరథీ కరుణాపయోనిధీ.


భావం: పాపములను పోగొట్టువాడు, మంచిగుణములను కల్పవృక్షపు తీగెలకు దోటవంటివాడు, వికారములను జయించినవాడు, మంచివారిని రక్షించువాడు నైన రాముడే ముఖ్య దేవుడుగా నీ యడుగు లను పద్మముల గొలుతును.


చక్కెరమాని వేము దినజాలినకైవడి మానవాధముల్
పెక్కురు బక్కదైవముల వేమఱుగొల్చెదరట్లు కాదయా
మ్రొక్కిన నీకు మ్రొక్కవలె మోక్షమొసంగిన నీవ యీవలెం
దక్కిన మాటలేమిటికి దాశరథీ కరుణాపయోనిధీ.


భావం: హీనులనేకులు నిన్ను విడిచి ఇంకొకరిని గొలిచెదరు. అనగా తియ్యని చక్కెరను తినలేక వేప వస్తువగు చేదును తినుటకు నేర్చినట్లున్నది.మ్రొక్క దగినవాడవు నీవే , మోక్షదాయకుడవు నీవే !


'రా' కలుషంబులెల్ల బయలంబడద్రోచిన 'మా'క వాటమై
డీకొనిప్రోవుచునిక్క మనిధీయుతులెన్నఁదదీయ వర్ణముల్
గైకొని భక్తి చే నుడువఁగానరు గాక విపత్పరంపరల్
దాకొనునే జగజ్జనుల దాశరథీ కరుణాపయోనిధీ.


భావం: 'రా' యను నక్షరము పాపముల బారద్రోలగా, 'మా' యను నక్షరము వాకిలియై పాపముల జొరనీయకుండును అని పెద్దలైనవారు పై 'రామ' యను నక్షరముల బుద్ధిమంతులు భక్తితో బలుకకుందురే గాని, పలికినట్లైన యాపదలు ప్రపంచ జనుల గ్రమ్ముకొనవు.


రామహరే కకుత్ధ్సకుల రామహరే రఘురామరామశ్రీ
రామహరేయటంచు మది రంజిల భేకగళంబులీల నీ
నామము సంస్మరించిన జనంబు భవంబెడబాసి తత్పరం
ధామ నివాసులౌదురట దాశరథీ కరుణాపయోనిధీ.


భావం: రామ హరే యని నీ పేరును గప్ప గొంతుకవలె దలఁచిన జనులు జన్మరహితులై మోక్షము జెందుదురట.


చక్కెరలప్పకున్ మిగుల జవ్వని కెంజిగురాకు మోవికిం
జొక్కపు జుంటితేనియకు జొకిలుచుం గనలేరు గాక నే
డక్కట! రామనామమధురామృతమానుటకంటె సౌఖ్యామా
తక్కిన మాధురీ మహిమ దాశరథీ కరుణాపయోనిధీ.


భావం: అయ్యో! ఈ కాలమువారు చక్కెరరాశికిని, యువతి యొక్క పెదవికిని, తేనెటీగలు పెట్టిన తేనెకు నాసపడుచున్నారు. రాముని పేరులో గల తీపిని నెఱుంగలేరు. రాముని పేరులో గల తీయదనము కంటే వానిలో గల తీయదన మంత సుఖమా!


అండజవాహ నిన్ను హృదయంబున నమ్మినవారి పాపముల్
కొండలవంటివైన వెసగూలి నశింపకయున్నె సంతతా
ఖండలవైభవోన్నతులు గల్గకమానునె మోక్షలక్ష్మి కై
దండయొసంగకున్నె తుద దాశరథీ కరుణాపయోనిధీ.


భావం: నిన్ను నమ్మి కొలిచినవారి పాపములు కొండలంతటివైనను నశించిపోవును. ఇంద్రవైభవములు కల్గును. మోక్షలక్ష్మి చేయూతనొసంగును.


వేమన శతక పద్యాలు భావాలు



వాన రాకడయును బ్రాణాంబు పోకడ
కానబడ దదెంత ఘనునికైన
కానపడిన మీద కలియెట్లు నడచురా
విశ్వదాభిరామ! వినుర వేమ!

భావం: ఈ కలియుగములో వానరాకడ , ప్రాణము పోకడ ముందుగా యెవరునూ తెలుసుకొనలేరు. ఇది కలియుగ ధర్మము.

చిప్పబడ్డ స్వాతిచినుకు ముత్యంబాయె
నీటిబడ్డ చినుకు నీటఁగలిసె
బ్రాప్తిగల్గుచోట ఫలమేల తప్పురా
విశ్వదాభిరామ! వినురవేమ! 

భావం: స్వాతికార్తిలో ముత్యపు చిప్పలో పదినచినుకు ముత్యమగును నీటబదినది నీటిలో కలిసిపోవును. ప్రాప్తించుచోట ఫలము తప్పదు.



అనువుగాని చోట అధికుల మనరాదు ,
కొంచెముండుటెల్ల కొదువ కాదు
కొండ అద్దమందు కొంచమై యుండదా ?
విశ్వదాభిరామ! వినుర వేమ!

భావం: విలుగానిచోట అధికుదనని సంచరించరాదు. సామాన్యముగనుండుట నీచముగాదు. అద్దములో కొంత చిన్నదిగ కంపించిననూ అసలు చిన్నది కాదుగకా.

ఇమ్ము దప్పువేళ నెమ్మెలన్ని యుమాని
కాలమొక్కరీతి గదపవలయు
విజయ డిమ్ము దప్పి విరటుని గొల్వడా
విశ్వదాభిరామ! వినురవేమ!

భావం: చెడ్డకాలము వచ్చినపుదు భోగములన్నియు వదులుకొని సామాన్యముగ కాలము గడుపవలయును. అర్జునుడు రాజ్యము పోగొట్టుకొని విరాటరాజు కొలువులో చేరెనుగదా.

చిక్కియున్ననేళ సింహబునైనను
బక్కకుక్క కరచి బాధచేయు
కలిమిలేనివేళఁ బంతంబు చెల్లదు
విశ్వదాభిరామ! వినురవేమ!

భావం: బలము బలము లేనప్పుదు సింహమునైనను బక్కకుక్క కరచి బాధపెట్టును. సక్తిలేనప్పుడుపంతంములకుపోకతలవంచుకొని తిరుగుటమంచిది.


చిత్త శుద్ధి కలిగి చేసిన పుణ్యంబు
కొంచమైన నదియు గొదవుగాదు
విత్తనంబు మఱ్ఱి వృక్షంబునకు నెంత
విశ్వదాభిరామ! వినురవేమ!

భావం: మంచి మనసుతొ చేసిన చిన్న పనియైన మంచి ఫలితాన్నిస్తుంది. పెద్ద మర్రిచెట్టుకి కూడ విత్తనము చిన్నదేకదా!

ఆత్మశుద్ధి లేని యాచారమది యేల
భాండశుద్ధి లేని పాకమేల?
చిత్తశుద్దిలేని శివపూజలేలరా?
విశ్వదాభిరామ! వినుర వేమ!

భావం: మనసు నిర్మలముగా లేనట్లయితే ఆచారములు పాతించతంవల్ల ప్రయోజనం లేదు. పాత్రలు శుభ్రముగాలేని వంట, మనసు స్థిరముగా లేని శివ పూజ వ్యర్థములే అవుతాయి. ఏమీ ప్రయోజనముండదు.



గంగిగోవుపాలు గరిటెడైనను చాలు
కడివెడైన నేమి ఖరము పాలు
భక్తిగలుగు కూడు పట్టెడైనను చాలు
విశ్వదాభిరామ! వినుర వేమ!

భావం: కడివెడు గాడిదపాలకంటె గరిటెడు ఆవుపాలు మేలును కలిగించును. భక్తితో పెట్టిన కూడు పట్టెడు అయినప్పటికి తృప్తిని కలిగిస్తుంది.

నిక్క మైన మంచినీల మొక్కటి చాల
తళుకు బెళుకు రాళ్ళు తట్టెడేల?
చాటుపద్యములను చాలదా ఒక్కటి
విశ్వదాభిరామ! వినుర వేమ!

భావం: తట్టెడు గులకరాళ్ళ కంటె ఒకమంచి నీలము శ్రేష్ఠము. అదే విధముగ వ్యర్ధమైన పద్యముల వంటె ఒక చక్కని చాటు పద్యము శ్రేష్ఠమవుతుంది.

మిరపగింజచూడ మీద నల్లగనుండు
కొరికిచూడు లోనచురుకు మనును
సజ్జను లగునారి సారమిట్లుండురా
విశ్వదాభిరామ! వినురవేమ!

భావం: మిరియపుగింజ మీద నల్లగానుప్పటికి దానిని కొరికిన వెంటనే చురుక్కుమంటుంది. మంచి వారు పైకి ఏవిధముగా కనిపించినప్పటికీ అతనిని జాగ్రత్తగా గమనించినచో అసలు విషయము బయటపడుతుంది.

మేడిపండు చూడ మేలిమై యుండు
పొట్టవిప్పి చూడ పురుగులుండు
బిరికి వాని మదిని బింకమీలాగురా
విశ్వ దాభిరామ! వినుర వేమ!

భావం: అత్తిపండు పైకందముగా కనపడుతుంది. దానిలొపల పురుగులుంటాయి. అదే విధముగ పిరికి వాని ధేర్యము కూడ పైన పటారము లొన లొటారముగ ఉంటుంది.

అల్పుడెపుడు పల్కు నాడంబరము గాను
సజ్జనుండు బల్కు చల్లగాను
కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగునా
విశ్వ దాభిరామ! వినుర వేమ!

భావం: ప్రపంచములొ ఉన్న జనులకు ప్రియమైన పలుకులతో ఆనందము కలిగించు వేమనా! అల్పుడు శాంతముతో మాట్లాడతాడు. కంఛు ధ్వని చేసినట్లుగా బంగాము ధ్వని చేయదుకదా! అల్పుడు కంచుతోనూ, సజ్జనుడు బంగారముతోనూ సమానము.

పూజకన్న నెంచ బుద్ధి నిదానంబు
మాటకన్న నెంచ మనసు దృఢము
కులముకన్న మిగుల గుణము ప్రధానంబు
విశ్వదాభిరామ! వినుర వేమ!

భావం: పూజపునస్కారముల కంటె బుద్ధి ప్రధానము. మాటకంటె మనసు ప్రధానము. కులముకంటె గుణము ప్రధానము.

ఎద్దుకైనఁగాని యేడాది తెల్పిన
మాట దెలసి నడచు మర్మ మెఱిఁగి
మొప్పె తెలియలేడు ముప్పదేండ్లకునైన
విశ్వదాభిరామ! వినురవేమ!

భావం: ఒక సంవత్సరముపాటు బోధించినట్లెతే ఎద్దుకూడ మర్మములను తెలిసికొని నడుచుకుంటుంది. కాని ముప్ప్తె సంవత్సరాల నేర్పినప్పటికీ మూర్ఖుడు తెలిసికొనలేడు.

ఎలుకతోలుఁదెచ్చి యేడాది యుతికిన
నలుపు నలుపేగాని తెలుపురాదు
కొయ్యబొమ్మను దెచ్చి కొట్టినఁ బలుకునా
విశ్వదాభిరామ! వినురవేమ!

భావం: ఎలుక తోలు ఎంతసేపు ఉతికినప్పటికీ అది తెలుపుగా మారదు. కర్ర్తో చేసిన బొమ్మ ఎంత కొట్టినప్పటికీ మాట్లడదు.

కోపమునను ఘనత కొంచమైపోవును
కోపమును మిగులఁగోడు గలుగుఁ
గోపమడచెనేని గోర్కెలునీడేరు
విశ్వదాభిరామ! వినురవేమ!

భావం: కోపము వలన గొప్పతనము నశించటమే గాక దుఃఖము కలుగుతుంది. కోపమును తగ్గించుకొన్న యెడల అన్ని కోరికలు ఫలిస్తాయి.

సుమతీ శతకం

భావం: కవికానట్టివాడు వ్రాసిన రచనయును, తొమ్మిది రసముల యొక్క స్థితులు తెలియని స్త్రీలయొక్క ప్రేమయును, ముందు పోయెడి పందిని వెంబడించి కొట్టలేనివాని యొక్క ఆయుధవిద్యయందలి నేర్పరితనము వ్యర్ధము.

035
మార్చు
కాదు సుమీ దుస్సంగతి,
పోదుసుమీ "కీర్తి" కాంత పొందిన పిదపన్‌,
వాదు సుమీ యప్పిచ్చుట,
లేదు సుమీ సతుల వలపు లేశము సుమతీ
భావం: చెడ్డవారితోడ స్నేహము మంచిదికాదు. కీర్తి వచ్చిన పిదప నశించదు. అప్పొసంగుట తగవులకు మూలము. స్త్రీలకడ ప్రేమ శూన్యము.

036
మార్చు
కాముకుడు దనిసి విడిచిన
కోమలి బరవిటుడు గవయ గోరుట యెల్లన్‌
బ్రేమమున జెఱకు పిప్పికి
చీమలు వెస మూగినట్లు సిద్ధము సుమతీ
భావం: ఒక విటుడు తృప్తియగునట్లుగా భోగించి విడచిన కాంతను మఱియొక జాఱుడు అనుభవింపగోరుట చెఱకునందలి రసమును సంపూర్ణముగా తీసివేసిన తరువాత ఆ పిప్పికై చీమలు ముసుకొన్నట్లుండును.

037
మార్చు
కారణము లేని నగవును,
బేరణము లేని లేమ, పృథివీ స్థలిలో
బూరణము లేని బూరెయు,
వీరణము లేని పెండ్లి వృధరా సుమతీ
భావం: కారణములేని నవ్వును, పేరణము(రవిక) లేని స్త్రీయును, పూరణములేని బూరెయును, వీరణములేని పెండ్లియును వ్యర్ధములు.

038
మార్చు
కులకాంత తోడ నెప్పుడు
గలహింపకు, వట్టి తప్పు ఘటియింపకుమీ,
కలకంఠి కంట కన్నీ
రొలికిన సిరి యింట నుండ నొల్లదు సుమతీ
భావం: భార్యతోడ నెప్పుడును జగడములాడవలదు. లేని నేరములు ఆరోపింపవలదు. ఉత్తమ ఇల్లాలియొక్క కంటనీరు క్రిందపడిన నాయింట లక్ష్మి నిలవదు.

039
మార్చు
కూరిమి గల దినములలో
నేరము లెన్నడును గలుగ నేరవు మఱి యా
కూరిమి విరసంబైనను
నేరములే తోచు చుండు నిక్కము సుమతీ
భావం: పరస్పరము స్నేహమున్న రోజులలో నేరములెప్పుడును కనుపించబోవు. ఆ స్నేహము చెడగానే అన్నియును తప్పులుగా కనపడుచుండును. ఇది నిజము.

040
మార్చు
కొంచెపు నరు సంగతిచే
నంచితముగ గీడు వచ్చు నది యెట్లన్నన్‌
గించిత్తు నల్లి కుట్టిన
మంచమునకు జేటు వచ్చు మహిలో సుమతీ
భావం: చిన్న నల్లి కుట్టిన ఆ నల్లి యున్న మంచమును ఎండలో వేయుట కర్రతో కొట్టుట, మరుగునీళ్ళు పోయుట మొదలగు ఆపదలు కలుగును. ఆ విధముగనే అల్పుడైనవానితోడి స్నేహము ఎట్టివారికైనను ఆపదను తెచ్చిపెట్టును.

041
మార్చు
కొక్కోకమెల్ల జదివిన,
చక్కనివాడైన, రాజ చంద్రుండైనన్‌,
మిక్కిలి రొక్కము లియ్యక,
చిక్కదురా వారకాంత సిద్ధము సుమతీ
భావం: వెలయాలు పుష్కలముగా ధనమీయకున్న ఎంతగా రతిశాస్త్రమును చదివినవాడైనను, అందగాడైనను, గొప్ప రాజశ్రేష్టుడైనను, ప్రేమించి దగ్గరకు చేరదు.

042
మార్చు
కొఱ గాని కొడుకు బుట్టిన
కొఱ గామియె కాదు, తండ్రి గుణముల జెఱచున్‌
చెఱకు తుద వెన్ను బుట్టిన
జెఱకున తీపెల్ల జెఱచు సిద్ధము సుమతీ
భావం: చెఱకుగడ చివర వెన్ను పుట్టినచో ఆ చెఱకునందలి తీయదనము నంతయు నేవిధముగ పాడుచేయునో ఆ విధముగనే అప్రయోజకుడైన కుమారుడు కలిగిన కుటుంబమునకుపయోగకారి కాకపోవుట యటుండగా తండ్రి మంచిగుణమును కూడా పాడుచేయును.

043
మార్చు
కోమలి విశ్వాసంబును,
బాములతో జెలిమి, యన్య భామల వలపున్‌,
వేముల తియ్యదనంబును,
భూమీశుల నమ్మికలును బొంకుర సుమతీ
భావం: స్త్రీలయందు విశ్వాసమును, పాములయందు స్నేహమును, పరస్త్రీలయందు ప్రేమయును, వేపచెట్లయందు తీయదనమును, రాజులయందు నమ్మకము వట్టి అసత్యములు.

044
మార్చు
గడన గల మగని జూచిన
నడుగడుగున మడుగు లిడుదు రతివలు దమలో;
గడ నుడుగు మగని జూచిన
నడ పీనుగు వచ్చె నంచు నగుదురు సుమతీ
భావం: స్త్రీలు సంపాదన కలిగిన భర్తను చూచిన అడుగులకు మడుగులొత్తుచు పూజింతురు. సంపాదనలేని మగనిని చూచినచో నడుచునట్టి శవము వచ్చెనని హీనముగా జూతురు.

045
మార్చు
చింతింపకు కడచిన పని,
కింతులు వలతురని నమ్మ కెంతయు మదిలో,
నంతఃపుర కాంతలతో
మంతనముల మాను మిదియె మతముర సుమతీ
భావం: జరిగిపోయిన దానిని గురించి ఆలోచించుటయు, స్త్రీలు తన్ను ప్రేమింతురని విశ్వసించుటయును, రాణీవాసపు స్త్రీలతో రహస్యములను విడిచిపెట్టుము. ఇదియే అనుసరించవలసిన మంచితనము.

046
మార్చు
చీమలు పెట్టిన పుట్టలు
పాముల కిరవైనయట్లు పామరుడు దగన్‌
హేమంబు గూడ బెట్టిన
భూమీశుల పాల జేరు భువిలో సుమతీ
భావం: చీమలు పెట్టినటువంటి పుట్టలు పాములకు నివాసమైనంట్లు, అజ్ఞానుడు కూడబెట్టిన బంగారమంతయు రాజుల వశమైపోవును.

047
మార్చు
చుట్టములు గాని వారలు
చుట్టములము నీకటంచు సొంపు దలిర్పన్‌
నెట్టుకొని యాశ్రయింతురు
గట్టిగ ద్రవ్యంబు గలుగ గదరా సుమతీ
భావం: ధనము కలిగిన యెడల ఏ సంబంధంలేని వారు కూడ, ఆ ధనము మీది ఆశతో, లేని సంబంధము కలుపుకొని మన కూడా ఉంటారు.

048
మార్చు
చేతులకు దొడవు దానము,
భూతలనాథులకు దొడవు బొంకమి ధరలో,
నీతియె తొడవెవ్వారికి,
నాతికి మానంబు తొడవు నయముగ సుమతీ
భావం: చేతులకు దానమును, పాలకులకు అసత్యమును పలుకకుండుటయును, అందరికినీ న్యాయమును, స్త్రీకి అభిమానమును అలంకారములు.

049
మార్చు
తడ వోర్వక, యొడ లోర్వక,
కడు వేగం బడిచి పడిన గార్యం బగునే;
తడ వోర్చిన, నొడ లోర్చిన,
జెడిపోయిన కార్యమెల్ల జేకుఱు సుమతీ
భావం: ఆలస్యమునకు, శరీర శ్రమకును సహింపక తొందరపడిన నేకార్యమును కానేరదు. ఆలస్యమునకును శరీర శ్రమకును ఓర్చుకొన్నప్పుడే చెడిపోయిన కార్యమంతయు నెఱవేరుచుండును.

050
తన కోపమె తన శత్రువు,
తన శాంతమె తనకు రక్ష, దయ చుట్టంబౌ
తన సంతోషమె స్వర్గము,
తన దుఃఖమె నరక మండ్రు తథ్యము సుమతీ
భావం: తన కోపమే తనను శత్రువులువలె బాధించును. తన శాంతమే తనను రక్షించును. తన దయయే తనకు చుట్టమువలె సహాయపడును. తన ఆనందమే తనకు ఇంద్రలోక సౌఖ్యము. తన దుఖమే తనకు నరకమగును. ఇది నిజము.