సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

కొత్త పొస్ట్



🌐 * L. I. P.     🌐 * 10వ తరగతి 🌐 * 10వ తరగతి తెలుగులో 99% స్కోర్ సాధించాలంటే... 🌐 * తెలుగు వెలుగులీనేల 🌐 | ధ్వని గుర్తింపు / అక్షర గుర్తింపు     🌐 * సరళ పదాలు     🌐 * ఐ సి టి ఉపయోగించడం ఎలా?     🌐 * * DIKSHA WEB         🌐 SCERT         🌐 NCERT         🌐 NBT         🌐 UGC_NET         🌐 CIIL         🌐 * * NDL INDIA         🌐 SAHITHYA ACADEMY         🌐 | సిద్దెంకి కథలు     🌐 | సిద్దెంకి పుస్తకాలు     🌐 | సిద్దెంకి కవిత్వం 🌐 | తెలుగులో అత్యుత్తమ పుస్తకాలు     🌐* | వ్యాసాలు / Articles     🌐* | దాశరథి పాటలు     🌐* | తెలంగాణ రాష్ట్రంలో దళిత కథ (2014:-07-2025)     🌐 * "సంస్కృతంతో తెలుగు కాలరాయొద్దు"     🌐 * పగిడి తెలంగాణ కథ 2024 "     🌐 * "ఆలోచనవాదుల పుష్పక విమానం దాశరథి ‘కవితా పుష్పకం’"     🌐 * Articles on Dr. Siddenky    

తెలుగు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
తెలుగు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

16, జులై 2025, బుధవారం

VI. 1. అభినందన

అభినందన

అభినందన 


పాఠం ఉద్దేశం

ఈ దేశం బాగోగులు కోరుతూ, అందుకోసం నిరంతరం శ్రమించే కర్మవీరులు ఎంతోమంది ఉన్నారు. అట్లాంటి వారిలో ముందుండేది రైతులు, సైనికులు. వారిని స్మరించుకుంటూ వారి శ్రమను, గొప్పతనాన్ని తెలియజెప్పడమే ఈ పాఠం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు

ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందినది. గేయం పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ గేయం శేషం లక్ష్మీనారాయణాచార్య రచించిన 'స్వరభారతి' అనే గేయసంకలనం నుండి తీసుకోబడింది.

కవి పరిచయం



(15-04-1947) (17-05-1998)

శేషం లక్ష్మీనారాయణాచార్య సొంత ఊరు కరీంనగర్ జిల్లాలోని నగునూర్, కనకమ్మ, నరహరిస్వామి దంపతులకు జన్మించిన ఈయన చాలాకాలం రంగారెడ్డి జిల్లాలో తెలుగు భాషోపాధ్యాయునిగా పనిచేశాడు. ఈయన అనేక పద్య, వచన, గేయ కవితలను రచించాడు. అవి వివిధ పత్రికల్లో ప్రచురింపబడ్డాయి. టీవీ, రేడియోల్లో ప్రసారమయ్యాయి. అనేకమంది శ్రోతలను ఆకట్టుకున్నాయి. ఈయన రాసిన విమర్శనావ్యాసాలు దక్షిణభారతహిందీప్రచారసభవారి 'స్రవంతి' పత్రికలో ప్రచురించబడ్డాయి.

లలితమనోహరమైన దైవభక్తి, దేశభక్తి గేయాలను రాయడంలో ఈయనది అందెవేసినచేయి.

-------------------------------------------------------------------------------------------------------------
విద్యార్థులకు సూచనలు:

పాఠంలోని బొమ్మను చూడండి. పాఠం ముందున్న ప్రవేశిక చదువండి. పాఠంలోని విషయాన్ని ఊహించండి.

పాఠాన్ని చదువండి. అర్ధంకాని పదాలకింద గీతలు గీయండి.

అర్థంకాని పదాలను, వాక్యాలను గురించి మీ మిత్రులతో చర్చించండి.

పాఠ్యపుస్తకం చివరన ఉన్న 'పదాలు అర్థాలను తెలుసుకొండి. అర్ధాలు' పట్టిక చూసి, తెలియని పదాలకు
------------------------------------------------------------------------------------------------------------------

ప్రవేశిక:

దేశానికి వెన్నెముక రైతు. దేశాన్ని కంటికిరెప్పలా కాపాడేవాడు సైనికుడు. వారిద్దరూ లేకపోతే దేశప్రజలకు తిండి, దేశానికి రక్షణా ఉండదు. దేశంకోసం వాళ్ళిద్దరూ పడే శ్రమను వర్ణించడానికి ఎన్నిమాటలైనా సరిపోవు. అందుకే లాల్బహదూర్ శాస్త్రి "జై జవాన్ జై కిసాన్" అన్నాడు. అదే భావనను ప్రతిబింబింపజేస్తూ రచయిత సరళమైన పదాలతో వారిని ఎట్లా అభినందించాడో ఈ పాఠం చదివి తెలుసుకొండి.

I

పల్లవి :

వందనాలు వందనాలు 
అభినందన చందనాలివే 
మా అభినందన చందనాలివే. ॥ వంద ॥

శ్రమదాచని హాలికులకు 
తలవంచని సైనికులకు 
భరతమాత పురోగతికి 
ప్రాతిపదికలగు ఘనులకు || వందన||

పుడమితల్లి పులకింపగ 
రుధిరం స్వేదమ్ము కాగ 
పసిడిని పండించునట్టి 
ప్రగతి మార్గదర్శకులకు ॥ వంద ॥

(అర్థాలు: హాలికులు = రైతులు 
; పురోగతి = అభివృద్ధి:  ప్రాతిపదికలగు =  ఆధారమగు; పుడమి = భూమి; పులకింపగ = సంతోషించగా ;
రుధిరం = రక్తం; స్వేదము = చెమట
ప్రగతి = అభివృద్ధి.)
-----------------------------------------------------------------------------------------------------------------
ఆలోచించండి-చెప్పండి.

రైతులను "శ్రమ దాచని హాలికులని" ఎందుకన్నారు?

"భరతమాత పురోగతికి ప్రాతిపదికలగు ఘనులు" అనే వాక్యం ద్వారా మీకేమర్థమయింది?

"రుధిరం స్వేదమ్ము కాగ పసిడిని పండించునట్టి" అంటే మీకేమర్థమయింది?
-----------------------------------------------------------------------------------------------------------------

2

కంటికి కనురెప్పలాగ 
చేను చుట్టు కంచెలాగ
జన్మభూమి కవచమైన
ఘనవీరులు జవానులకు ॥ వంద ॥

ప్రలోభాల మాయలోన 
పడివోవని నిర్మలురకు 
నిమిషమేని విధి మరువని
నీతి కర్మ శీలురకు.  ॥ వంద ॥

అవిశ్రాంత సేద్యంతో 
ఆకలిమంటలను ఆర్పి 
దేశభక్తి ఖడ్గంగా, శత్రుమూకలను దున్మి
దేశకీర్తి బావుటాను ఎగరేసిన ఘనజనులకు ॥ వంద ॥

(అర్థాలు: కవచము = రక్షణ, ఘన వీరులు = గొప్పవారు, జవానులు = సైనికులు, ప్రలోభం =ఆశ / ఎర, మాయ = మోసం,  పడివోవని = పడిపోని, నిమిషమేని = నిమిషం కూడా వృధా చేయకుండా, విధి = పని, అవిశ్రాంత = ఎల్లప్పుడు, సేద్యం = వ్యవసాయం, ఖడ్గం = కత్తి భావుట = జెండా,  ఘనజనులు = గొప్ప ప్రజలు)
-----------------------------------------------------------------------------------------------------------------
ఆలోచించండి-చెప్పండి.

కంటికి కనురెప్ప, చేనుకు కంచె. ఇట్లా దేనికి ఎవరు రక్ష? ఇటువంటివే మరికొన్ని చెప్పండి.

"జన్మభూమి కవచమైన ఘనవీరులు జవానులు” అని కవి ఎందుకన్నాడు?

'నీతి కర్మశీలురు' అని ఎవరిని అంటారు?
-----------------------------------------------------------------------------------------------------------------

బొమ్మను చూడండి  మాట్లాడండి

ఇవి చేయండి

I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం

1. గేయాన్ని పాడుతూ అభినయించండి.
జవాబు.
విద్యార్థుల పని.

2. ప్రగతి మార్గదర్శకులని ఎవరినంటారు ? ఇట్లాంటివారి పేర్లు కొన్ని చెప్పండి. సమాజానికి వీరి అవసరం ఏమిటి?
జవాబు.
ప్రగతి మార్గదర్శకులంటే ప్రజలను అభివృద్ధి బాటలో నడిపించేవారు. మంచి విషయాలు నేర్పి మంచి మార్గంలో నడిపి అభివృద్ధిలోకి తెచ్చేవారు. మహాత్మగాంధీ, బాలగంగాధరతిలక్ వంటి దేశ నాయకులు ప్రజలలో దేశభక్తి రేకెత్తించి స్వరాజ్య ఉద్యమం వైపు నడిపించారు. రాజారామమోహన్రాయ్, కందుకూరి వీరేశలింగం వంటివారు సాంఘిక దురాచారాలను రూపుమాపి ప్రజలను అభివృద్ధిమార్గంలో నడిపించారు. అలా ప్రజలను చైతన్యవంతులను చేయడానికి వీరి అవసరం ఎప్పుడూ ఉంటుంది.

II. ధారాళంగా చదువడం – అర్థం చేసుకొని, ప్రతిస్పందించడం

1. పాఠాన్ని చదవండి. రైతుల, సైనికుల గొప్పదనాన్ని తెలిపే ముఖ్యమైన పదాలను గుర్తించి రాయండి.

జవాబు. రైతులు : శ్రమదాచనివారు. పసిడిని పండించువారు. ప్రగతి మార్గదర్శకులు. అవిశ్రాంత సేద్యంతో ఆకలి మంటలను ఆర్పుతారు.
సైనికులు: తలవంచనివారు. భరతమాత పురోగతికి ప్రాతిపదికలు. ఘనవీరులు. నిర్మలురు. నీతికర్మ శీలురు. ఘనజనులు.

2. కింది గేయాన్ని చదవండి. ఖాళీలను పూరించండి.

జవాబు. పల్లెలు మనపాలిటి కల్పతరువులూ – నవభారత గృహసీమకు మణిదీపాలూ
మానవతకు మందిరాలు మమతలకవి పుట్టినిళ్ళు – మన సంపద నిలయాలు భరతమాత నయనాలు
ప్రగతికి సోపానాలూ సుగతికి తార్కాణాలు – మనిషి మనిషిగా బ్రతికే మనుగడ మణిదీపాలు

అ) భరతమాతకు నయనాలు ___జవాబు.పల్లెలు

ఆ) పల్లెలు నవభారత గృహసీమకు ___జవాబు.మణిదీపాలు

ఇ) “ప్రగతికి సోపానాలు”లో సోపానాలు అంటే _____జవాబు.మెట్లు

ఈ) నివాసం అనే అర్థం వచ్చే పదాలు ___________జవాబు.మందిరాలు, నిలయాలు, ఇళ్ళు

III. స్వీయరచన

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ. “దేశపురోగతి” అంటే ఏమిటి ? దేశపురోగతికి తోడ్పడిన వారిలో మీకు తెలిసినవారి పేర్లు రాయండి.
జవాబు. దేశపురోగతి అంటే దేశం అభివృద్ధి చెందటం, పంచవర్ష ప్రణాళిక రచించిన పండిట్నెహ్రూ, ఆయన ఆశయ సాధనకు కృషిచేసి ప్రాజెక్టులు నిర్మించిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య, కె.ఎల్.రావు వంటి ఇంజనీర్లు, వ్యవసాయంలో విప్లవం తెచ్చిన స్వామినాథన్, పాల ఉత్పత్తిలో విప్లవం తెచ్చిన కురియన్ మొదలైన వారంతా దేశ పురోగతికి తోడ్పడినవారే.

. దేశానికి నీతి కర్మశీలుర ఆవశ్యకత ఏమిటి ?
జవాబు.నీతిశీలురు అంటే న్యాయమార్గంలో నడిచేవారు. మోసపు మార్గంలో నడవనివారు. న్యాయంగా ప్రవర్తిస్తే మన జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ఎదుటివారు కూడా సంతృప్తిగా ఉంటారు. అవినీతి వల్ల ఎవ్వరికీ సుఖశాంతులుండవు. అందువల్ల ప్రతివారు నీతిమంతులై ఉండాలి. కర్మశీలురు అంటే తమ విధులను సక్రమంగా నెరవేర్చేవారు. ఎవరి పనులు వారు సకాలంలో చక్కగా నిర్వర్తిస్తే అన్నీ చక్కగా నెరవేరుతాయి. అలా ఎవరి పనులను వారు పద్ధతి ప్రకారం నెరవేరిస్తే దేశంతప్పకుండా ప్రగతి సాధిస్తుంది.

ఇ. అవిశ్రాంత సేద్యంతో ఆకలి మంటలు ఆర్పటం అంటే ఏమిటి ?
జవాబు.అవిశ్రాంత సేద్యం అంటే కొంచెం కూడా విశ్రాంతి తీసుకోకుండా పొలంలో పనిచేసి పంటలు పండించటం. రైతు ఏ మాత్రం విరామం లేకుండా పంటలు పండిస్తూ ఉంటే కూడా సమయం చాలటం లేదు. ప్రజల అవసరానికి తగినంత పంట పండించి ఎవరూ ఆకలితో బాధపడకుండా చూస్తాడు రైతు. ఇదే ఆకలి మంటలు ఆర్పటం అంటే.

ఈ. ఈ గేయ రచయిత గురించి సొంతమాటల్లో రాయండి.
జవాబు. 
శేషం లక్ష్మీనారాయణాచార్య (జననం: 15-04-1947) - (మరణం: 17-05-1998) సొంత ఊరు కరీంనగర్ జిల్లాలోని నగునూర్, కనకమ్మ, నరహరిస్వామి దంపతులకు జన్మించిన ఈయన చాలాకాలం రంగారెడ్డి జిల్లాలో తెలుగు భాషోపాధ్యాయునిగా పనిచేశాడు. ఈయన అనేక పద్య, వచన, గేయ కవితలను రచించాడు. అవి వివిధ పత్రికల్లో ప్రచురింపబడ్డాయి. టీవీ, రేడియోల్లో ప్రసారమయ్యాయి. అనేకమంది శ్రోతలను ఆకట్టుకున్నాయి. ఈయన రాసిన విమర్శనావ్యాసాలు దక్షిణ భారత హిందీప్రచారసభవారి 'స్రవంతి' పత్రికలో ప్రచురించబడ్డాయి.

లలితమనోహరమైన దైవభక్తి, దేశభక్తి గేయాలను రాయడంలో ఈయనది అందెవేసినచేయి.

2. కింది ప్రశ్నకు 10 వాక్యాల్లో జవాబు రాయండి.

1. ‘అభినందన’ గేయ సారాంశాన్ని మీ సొంతమాటల్లో రాయండి.
(లేదా)
రైతులు, సైనికులు దేశానికి ఎలా సేవ చేస్తున్నారో తెలుపండి ?
(లేదా)
జన్మభూమికి ఎవరెవరు ఎట్లా సేవ చేస్తున్నారో వివరించండి.

జవాబు.  రైతులకు, సైనికులకు వందనాలు. మెచ్చుకోవడం అనే చల్లని చందనాలను వాళ్ళకు సమర్పిస్తున్నాం. కష్టాన్ని దాచుకోని రైతులకు, ఎవరికీ తలవంచని సైనికులకు దేశాభివృద్ధికి మూలాలైన ఈ గొప్పవారికి వందనాలు. అభినందనలు. నేలతల్లి సంతోషపడేటట్లుగా, నెత్తురు చెమటగా మారుతుండగా, బంగారాన్ని పండిస్తూ, అభివృద్ధికి బాటలు చూపే రైతులకు వందనాలు. కంటికి రెప్పవలె, చేనుచుట్టూ కంచెవలె, ఈ జన్మభూమికి కవచంవలె ఉండి కాపాడుతున్న గొప్ప వీరులైన జవానులకు వందనాలు.

దురాశ అనే మాయకు లోబడకుండా మంచి మనసుగలవారై నిమిషం కూడా తమ విధిని మరువకుండా నీతితో ప్రవర్తించే జవానులకు వందనాలు. విరామం లేకుండా పంటలను పండిస్తూ, ఇతరుల ఆకలి మంటలను చల్లారుస్తూ కష్టించి పనిచేసే రైతులకు వందనాలు. దేశభక్తినే ఖడ్గంగా ధరించి, శత్రుసైన్యాలను చంపి, దేశ కీర్తి పతాకాన్ని ఎగరేసిన గొప్ప వీరులగు జవానులకు అభినందనలు.

5, అక్టోబర్ 2023, గురువారం

ఉన్నతి ప్రగతి నమోదు రిజిస్టర్ 2023


ఉన్నతి ప్రగతి నమోదు కోసం తెలుగు భాషోపాధ్యాయులు ప్రగతి నమోదు చేయవలసిన విధానం కింది పట్టికలో నమోదు చేసిన విధంగా నమోదు చేయాలి.
 మాసాన్ని బేస్ లైన్ టెస్ట్ కోసం ఉపయోగించాలి.



25, ఫిబ్రవరి 2023, శనివారం

10వతరగతి తెలుగులో అధిక మార్కులు (100%) స్కోర్ సాధించాలంటే....

పదవ తరగతి తెలుగులో అధిక మార్కులు(99%)  సాధించాలంటే
తెలుగు.. మన మాతృభాష. 
 విద్యార్థులు సాధించడం చాలా సులువు అని భావిస్తున్నారు. కానీ 
అంత సులువైనది కాదని గమనించాలి.
 
ఇందులో ఫెయిల్ అయ్యే విద్యార్థుల సంఖ్య తక్కువే. కానీ.. తెలుగులో మంచి మార్కులు సాధించాలంటే మాత్రం ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిందే! 

పరీక్ష పత్రాన్ని పరిశీలిస్తే ....

I. అవగాహన - ప్రతిస్పందన 20 మార్కులు


1. పరిచిత గద్యం ఉపవాచకమైన రామాయణం నుండి ఇస్తారు.
(1-5 ఒకటి నుండి ఐదు ప్రశ్నలు ఇస్తారు. జవాబులు ఒకటి లేదా రెండు వాక్యాల్లో రాయాలి.
2. ఖాళీలు పూరించమని అడగవచ్చు.
3. తప్పొప్పులు గుర్తించమని ప్రశ్న ఇవ్వవచ్చు.
4. జతపరచమనవచ్చు.
5. సరియైన సమాధానానికి సరైన మార్కు పొందుకోవొచ్చు)

ఆ) 6వ ప్రశ్నగా పాఠంలోని చుక్క పద్యాల మీద అవగాహనను పరీక్షిస్తారు.

ఆరో ప్రశ్న ఎన్ని రకాలుగా వస్తుందో చూడండి.
  • పద్యాన్ని పూరించి భావాన్ని రాయమనడం
  • ప్రతిపదార్థాన్ని రాయండి (అన్వయ క్రమంతో, భాషా దోషాలు లేకుండా రాస్తే ఐదు మార్కులు)

ఇ) అపరిచిత పద్యం లేదా అపరిచిత గద్యం నకు 10 మార్కులు 

        (7, 8, 9, 10, 11 ప్రశ్నలు ఒక్కో ప్రశ్నకు రెండు మార్కుల చొప్పున)
  • 10 పాయింట్ల సాధనలో ఈ భాగం చాలా కీలకం. 
  • అందరికీ తెలిసిన సుపరిచితమైన పద్యాన్ని అపరిచిత భాగం కింద ఇస్తారు.
  • అపరిచిత గద్యంలో భాగంగా పర్యావరణము, పరిశుభ్రత, విజ్ఞాన శాస్త్రాలు, సాహిత్యము, సంప్రదాయములు ఏదైనా ఒక అంశంపై పేరాగ్రాఫ్ ఇవ్వబడుతుంది.

 ఇందులో.....
    • ఐదు ప్రశ్నలు ఇస్తారు.
    • ఐదు ప్రశ్నలు తయారు చేయమంటారు.
    • తప్పు ఒప్పుల్ని గుర్తించమంటారు.
    • జతపరచమంటారు. 
    • ఖాళీలు పూరించమంటారు.
    • కీలక పదాలను వివరించమని కోరవచ్చు.
    • జవాబు ఒక వాక్యంలో రాయాలి (ఏకపద జవాబులకు మార్కులు స్కోర్ పొందలేరని గమనించాలి.
(సూచనలు:
అపరిచిత గద్యానికి జవాబు రాయడానికి పద్ధతి
1. ప్రశ్నను జాగ్రత్తగా చదవాలి
– ముందు ఇచ్చిన గద్యాన్ని పూర్తిగా చదవాలి.
– తర్వాత ఒక్కో ప్రశ్నను అర్థం చేసుకోవాలి.

2. సమాధానం ఎక్కడుందో గుర్తించాలి.
– గద్యంలోని వాక్యాలనే తీసుకోవాలి.
– ఎక్కువగా మీ మాటల్లో చిన్నగా మార్చి రాయాలి.

3. తప్పులు చేయకూడదు
– పాఠ్యానికి సంబంధం లేని మీ ఊహ రాయకూడదు.
– గద్యానికి కచ్చితమైన సమాధానం మాత్రమే రాయాలి.

4. వాక్యరచన సరళంగా ఉండాలి
– పొడవైన వాక్యాలు అవసరం లేదు.
– సరళమైన 2–3 వాక్యాల్లో రాయాలి.)


 
II స్వీయ రచన - సృజనాత్మకత 40 మార్కులు 

అ) నాలుగు ప్రశ్నలు ఇస్తారు. (12,13,14,15)
ఒక్కొక్క ప్రశ్నకు మూడు మార్కులు 12మార్కులు.
 5, 6 వాక్యాల్లో తప్పకుండా రాయాలి.
ఇందులో ఛాయిస్  లేదు.
పాఠ్యాంశంతో పాటు కవి, రచయిత గురించి లేదా శైలి గురించి ఖచ్చితంగా అడుగుతారు.

ఆ) భాగం: స్వీయరచన

      • పద్యభాగం నుండి(16,) రెండు ప్రశ్నలు 
      • గద్య భాగం నుండి (17)రెండు ప్రశ్నలు 
      • ఉపవాచకం నుండి (18)రెండు ప్రశ్నలు ఇస్తారు.
      • ఒక్కొక్క ప్రశ్నకు ఏడు మార్కుల చొప్పున మొత్తం 21 మార్కులు
      • ప్రతి భాగం నుండి  ఒక్క ప్రశ్నకు జవాబు రాయాలి.
      • ప్రతి జవాబు 10 నుంచి 12 వాక్యాలలో రాయాలి.
      • 120 పదాల కంటే ఎక్కువ పదాలతో జవాబు రాయాలి.
      • సూటిగా, స్పష్టంగా, సరళంగా ఉండాలి.
      • ప్రశ్నలు అనుసరించి జవాబు రాయాలి.
      • భాషా దోషాలు లేకుండా రాయాలి.
      • వాక్య క్రమం ఉండాలి.

ఇ) భాగం:19వ ప్రశ్న 
సృజనాత్మక అంశాలు రెండు ఇస్తారు.
 7 మార్కులు.  ఒక్క ప్రశ్నకు సమాధానం 
ఒక ప్రశ్నకు జవాబు తప్పకుండా రాయాలి. 

ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు ఉన్న 23 సృజనాత్మక అంశాలలో ఏవైనా ఇవ్వవచ్చు.

        • లేఖ
        • వచన కవిత 
        • సంభాషణ 
        • ఏకపాత్రాభినయం 
        • ప్రశంసా పత్రం 
        • అభినందన వ్యాసం 
        • వ్యాసం
        • కరపత్రం 
        • ఆహ్వాన పత్రం
        • కథ 
        • గేయం 
        • ప్రశ్నావళి
        • నినాదాలు - సూక్తులు
        • కథలు పొడిగించడం
        • .....
        • మొదలైన అంశాలపై సృజనాత్మకంగా రాయాలి

III భాషాంశాలు 20 మార్కులు 

(పదజాలం & వ్యాకరణాంశాలు)

    • సొంత వాక్యాలు 
    • అర్థాలు 
    • ప్రకృతి - వికృతులు 
    • సమానార్థకాలు లేదా పర్యాయపదాలు 
    • వ్యుత్పత్తి అర్థాలు
    • వ్యుత్పత్తి పదం
    • జాతీయాల వివరణ
    • కర్తరీ, కర్మణీ వాక్యాలు
    • ప్రత్యక్ష, పరోక్ష వాక్యాలు 
    • సామాన్య, సంయుక్త, సంశ్లిష్ట వాక్యాలు
    • గ్రాంథికం నుంచి వ్యవహార వాక్యం లోకి మార్చి రాయడం.....
    • సంధులు 
    • సమాసాలు 
    • అలంకారాలు 
    • గణవిభజన మొదలైన ఇస్తారు.
    • ఒక్కో ప్రశ్నకు ఒక్క మార్కు చొప్పున 20 మార్కులు ఉంటాయి.

**********

తెలుగులో అధిక మార్కులు (99%)రావాలంటే...

  1. పద్యభాగం, గద్యభాగంలోని అన్ని అంశాలను ఔపోసన పట్టాలి. 
  2. ప్రశ్న ఏ కోణం నుండి ఇస్తే ఆ కోణం నుంచి వివరించగలగాలి.
  3. విద్యార్థులకు సూచనలు: 
  4. ప్రశ్న పత్రాన్ని క్షున్నంగా చదవాలి.
  5. ప్రశ్నను అర్థం చేసుకోవాలి. 
  6. ప్రశ్నను అనుసరించి మాత్రమే జవాబు రాయాలి.
  7. ప్రతి జవాబుకు ప్రశ్న సంఖ్య మరవకూడదు.(తప్పకుండా శీర్షిక పెట్టవచ్చు. దానశీలం పాఠ్యభాగ సారాంశం రాయండి అనే ప్రశ్నకు దానశీలం పాఠ్య సారాంశం: అని రాయాలి. అలా రాయడం వలన దిద్దే ఎగ్జామినర్ కి సులువుగా అర్థమవుతుంది)
  8. ప్రతి వాక్యానికి 6,7 పదాలు రాయాలి. 
  9. వాక్యాలు సమదూర0 పాటించాలి.
  10. ప్రతి విషయంపై స్పష్టత కలిగి ఉండడం ముఖ్యం.
  11. పరీక్ష రోజు వరకూ వాటిని నిత్యం పునశ్చరణ / మననం చేసుకోవాలి. 
  12. పాఠాన్ని కేవలం చదవడంతో సరిపెట్టకుండా..సారాంశాన్ని, ఉద్దేశాన్ని తెలుసుకోవాలి. 
  13. మైండ్ మాపింగ్ (భావనా చిత్రాన్ని) ద్వారా గుర్తించుకోవాలి.
  14. ప్యాసేజ్ పేరిట ఉండే అపరిచిత గద్యం ఎంతో ముఖ్యమైనది. కాబట్టి సొంతంగా ఆలోచిస్తూ చదవాలి. 
  15. ఒక ప్రక్రియను మరొక ప్రక్రియలోకి మార్చి రాయడం అభ్యాసం చేయాలి.
  16. విరామ చిహ్నాలు పాటించాలి.
  17. భాషా దోషాలు లేకుండా రాయాలి.
  18. వాక్య క్రమం ఉండాలి.

1. ఆవశ్యకత అంటే అవసరం గురించి రాయాలి. 
 ఆవశ్యకత
ఏ అంశం ఎందుకు అవసరం అనేది చూపాలి.
సమాజం, వ్యక్తి, విద్య, సాహిత్యం లాంటి కోణాల్లో అది ఎందుకు ముఖ్యమో చెప్పాలి.

2. ఆంతర్యం లేదా ఉద్దేశం ఏమిటి అనే ప్రశ్నకు జవాబు 
ఆంతర్యం లేదా ఉద్దేశం
రచయిత చెప్పదలచుకున్న లోతైన భావం, సందేశం రాయాలి.
✦  "ఈ కథ/కవిత వెనుక ఉన్న ఉద్దేశం ప్రజలకు ఈ భావనను చేరవేయడమే."

3. సొంత మాటల్లో రాయండి అంటే పాఠం యొక్క సారాంశం విద్యార్థి సొంత మాటల్లో రాయాలి.
✦ సొంత మాటల్లో రాయండి

4. వివరించుము అంటే ఉన్నది ఉన్నట్టు రాయాలి.
  "పరిపూర్ణ వివరాలు, అన్ని కోణాలు చెప్పాలి."

5. సమర్థించుము అంటే 
ఏ పాత్ర లేదా? ఏ భావం అడుగుతున్నారో దానికి అనుగుణంగా సమర్థిస్తూ రాయాలి. 
'✦ ఆవాదన ఎందుకు సరియైనదో, కారణాలతో సమర్థించాలి."

6. విశ్లేషణాత్మకంగా రాయండి అంటే 
ఒక్క పాత్ర మనస్తత్వ విశ్లేషణ అడిగితే ఆ పాత్ర మనస్తత్వం మారడానికి గల పరిస్థితులు, అందుకు గల కారణాలు చెబుతూ మొదలైన అంశాలతో సమగ్రంగా రాయడమే విశ్లేషణాత్మకంగా రాయడం.

అంశాన్ని విడదీసి, ప్రతి కోణాన్ని పరిశీలించి రాయాలి.
✦ "భావం, శైలి, ఉపయోగం, ప్రభావం అన్నింటినీ విడివిడిగా చూపాలి."

7. సోదాహరణంగా రాయండి అంటే...
ఉదాహరణలు ఇస్తూ రాయాలి.
✦ "వాక్యం + సరైన ఉదాహరణ."

8. ఊహించి రాయండి అంటే.... ఇచ్చిన అంశానికి అనుగుణంగా ఏం జరుగుతుందో, జరుగబోతోందో ఊహించి రాయాలి.
మన కల్పనాశక్తిని ఉపయోగించి సమాధానం రాయాలి.
 "నేను ఆ కాలంలో ఉన్నాను అనుకుంటే... / ఇది జరిగితే ఇలా ఉండేది..."

9. కారణాలు రాయండి అంటే...
✦"ప్రధాన కారణాలు ఇవి..." అని పాయింట్లుగా ఇవ్వాలి.

10. విమర్శనాత్మకంగా రాయండి అంటే తప్పు ఒప్పుల నుంచి సకారాత్మక విమర్శ ఒప్పువైపు రాయాలి.
మంచి – చెడు రెండింటినీ సమంగా తూకం వేసి రాయాలి.
 "ఇందులో ఉన్న విశిష్టతలు, లోపాలు రెండూ చూపాలి."

11. విశిష్టత తెలపండి అన్నప్పుడు గొప్పతనం గురించి రాయాలి.
 "ఇది మిగతావాటితో పోలిస్తే ఎందుకు ప్రత్యేకమో వివరించాలి."

12. అభినందిస్తూ వ్యాసం రాయండి అంటే పొగడుతూ గొప్పతనాన్ని మాత్రమే వివరిస్తూ రాయాలి.
ప్రశంసలు రాయాలి.
✦ "ఈ రచన/వ్యక్తి గొప్పతనం ఇలా ఉంది..."

13. వృత్తాంతాన్ని రాయండి అనే ఉపవాచక ప్రశ్నకు జవాబుగా సంబంధిత కథ రాయాలి. 
 క్రమపూర్వకంగా రాయాలి (ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరిగిందో).
✦ "కాలక్రమం, సంఘటనలు వరుసగా ఉండాలి.

14. పాఠం ఆధారంగా రాయండి. అంటే కేవలం పాఠం లోనిది మాత్రమే రాయాలి. 


  • 1. పాఠ్యాధారిత ప్రశ్నల స్వభావం
  • గద్య పాఠం, పద్య పాఠం నుంచి ప్రశ్నలు వస్తాయి.

  • కొన్ని “చిన్న సమాధానాలు” (2–3 వాక్యాలు),

 

  • కొన్ని “విస్తృత సమాధానాలు” (6–8 వాక్యాలు).

  • పద్యాల్లో భావార్థం, సందర్భం, అలంకార విశ్లేషణ అడుగుతారు.
  • గద్యాల్లో పాత్ర విశ్లేషణ, సంఘటన వివరణ, సందేశం అడుగుతారు.

  • 2. రాయడానికి సాధారణ పద్ధతి
  •  ✓: ప్రశ్నను బాగా చదవాలి.
  • సమాధానం పాఠ్యం నుంచే రావాలి. (మనకిష్టమొచ్చిన ఊహలు కాకుండా పాఠంలో చెప్పినదాన్ని రాయాలి.)

  • ✓చిన్న సమాధానాలకు 2–3 వాక్యాలు, పెద్ద సమాధానాలకు 6–8 వాక్యాలు.
  • ✓సూటిగా, సులువైన భాషలో రాయాలి.
  • ✓పద్యం అయితే — ‘సందర్భం’, ‘భావార్థం’, ‘అలంకారము/ప్రాస/యతి’ విడిగా రాయాలి.

*********

( దానశీలం పాఠం పై ప్రశ్నలకు జవాబులు.....
1. ఆవశ్యకత
👉 మనిషి సమాజంలో జీవించాలంటే పరస్పర సహకారం అవసరం. దానం ద్వారా దరిద్రులకు సహాయం జరుగుతుంది. కాబట్టి దానశీలం ఆవశ్యకమైన గుణం.

2. ఆంతర్యం లేదా ఉద్దేశం
👉 "దానశీలం" పాఠం ఉద్దేశం మనుషులు సంపదను కేవలం తమకోసం కాకుండా పరుల ఉపకారార్థం వినియోగించాలి అని బోధించడం.

3. సొంత మాటల్లో రాయండి
👉ఈ పాఠం మనకు చెబుతున్నది ఏమిటంటే, ధనం శాశ్వతం కాదు. దానశీలుడు మాత్రమే సమాజంలో అమరుడవుతాడు.

4. వివరించుము
👉 దానశీలి తన ధనంతో ఇతరుల కష్టాలను తీర్చుతాడు. దానం చేసేవాడు సమాజంలో గౌరవం పొందుతాడు. కాబట్టి దానానికి ఉన్న ప్రాముఖ్యతను సవివరంగా వివరించారు.

5. సమర్థించుము
👉 దానం ఎందుకు గొప్పదో మనం ఆధారాలతో చెప్పాలి. "భోజనం ఇచ్చే వాడు ఆకలిని పోగొడతాడు. విద్యా దానం చేసేవాడు జీవితాన్నే వెలిగిస్తాడు." కాబట్టి దానం అత్యున్నత గుణం అని సమర్థించవచ్చు.

6. విశ్లేషణాత్మకంగా రాయండి
👉దానానికి అనేక రూపాలున్నాయి – అన్నదానం, విద్యాదానం, జ్ఞానదానం. అన్నదానం తాత్కాలిక ఉపశమనం ఇస్తుంది. కానీ విద్యాదానం శాశ్వత మార్పు తెస్తుంది. కాబట్టి దానశీలత అనేది అనేక కోణాల్లో విశ్లేషించదగిన గుణం.

7. సోదాహరణంగా రాయండి
👉 భారతదేశంలో అన్నదానానికి గొప్ప చరిత్ర ఉంది. అన్నమాచార్యులు, త్యాగరాజులు అన్నదానంలో కీర్తి పొందారు. అలానే, మన పెద్దలు "విద్యా దానం మహాదానం" అని చెప్పిన మాట కూడా దానశీలం మహత్వానికి ఉదాహరణ.

8. ఊహించి రాయండి
👉 నేను ఒక పెద్ద ధనవంతుడిని అనుకుంటే, పేద విద్యార్థులకు చదువు కోసం పుస్తకాలు, ఫీజులు చెల్లిస్తాను. గ్రామంలో ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేస్తాను.

9. కారణాలు రాయండి
👉 దానశీలం వల్ల లాభాలు:
సమాజంలో సమానత్వం పెరుగుతుంది.
పేదలకు ఆత్మవిశ్వాసం కలుగుతుంది.
ధనవంతుడు గౌరవం పొందుతాడు.
కాబట్టి దానశీలం అవసరం.

10. విమర్శనాత్మకంగా రాయండి
👉దానం ఒక మహత్తర గుణం. కానీ కొందరు ప్రచారార్థం దానం చేస్తారు. అలాంటి దానం నిజమైనది కాదు. ప్రయోజన రహితమైన నిస్వార్థ దానం మాత్రమే నిజమైన దానశీలం.

11. విశిష్టత తెలపండి
👉ఈ పాఠం విశిష్టత ఏమిటంటే, ధనం నశ్వరమని, దానమే శాశ్వతమని చక్కగా వివరించడం. ఇది ఇతర పాఠాల కంటే ప్రత్యేకంగా దానం మహిమను ప్రతిపాదిస్తుంది.

12. అభినందిస్తూ వ్యాసం రాయండి
👉 దానశీలం పాఠం మానవ విలువలను మేల్కొలిపే గొప్ప రచన. రచయిత దానాన్ని ఎంత అందంగా వివరించారో చూస్తే మనకు గర్వంగా ఉంటుంది. ఆయనను అభినందించక మానలేం.

13. వృత్తాంతాన్ని రాయండి
👉 ఈ పాఠంలో ముందుగా దానం అవసరాన్ని చెప్పారు. తర్వాత దాన రకాలను వివరించారు. చివరగా దానం చేయడం వల్ల కలిగే మేలు చెప్పారు. ఈ విధంగా పాఠం క్రమపూర్వకంగా సాగింది.)

ఉప వాచకానికి సంబంధించి ఇతివృత్తం, ప్రాముఖ్యత, పాత్రలు, వాటి ప్రాధాన్యత, వ్యక్తుల ప్రవర్తన, శైలి, సందర్భము, స్థలం మొదలైన అంశాల సందేశాన్ని తెలుసుకోవాలి.


వ్యాకరణం.
సంస్కృత
తెలుగు సంధులు 
సమాసాలు
అలంకారాలు
చందస్సు
మొదలైన అంశాలపై బాగా పట్టు సాధించాలి

ఆల్ ది బెస్ట్.
కృషి ఉంటే విజయం నీ బానిస.
మరిన్ని అంశాల కోసం.....


Dixa app, Tsat టి‌వి, తెలుగు దళం .... 
siddenky.blogspot.com ని ఫాలో కాగలరు.


Telugu Siri Dr Siddenky yt channel
Subscribe చేసి ఫాలో కండి.

డా. సిద్దెంకి యాదగిరి 
తెలుగు భాషోపాధ్యాయులు
 సిద్దిపేట జిల్లా. DRG సభ్యులు 
9441244773.