ప్రశ్న1.
పై బొమ్మలో ఎవరెవరున్నారు? ఏమి చేస్తున్నారు?
జవాబు.
పై బొమ్మలో గురువు, విద్యార్థులు ఉన్నారు. గురువు బోధిస్తున్నారు. విద్యార్థులు వింటున్నారు.ప్రశ్న 2.
శిష్యులు ఏమి అడిగి ఉండవచ్చు?
జవాబు.
శిష్యులు తమకు తెలియని విషయాలపై ప్రశ్నలు అడిగి ఉండవచ్చు.
ప్రశ్న 3.
గురువుగారు ఏం చెప్తుండవచ్చు?
జవాబు.
గురువుగారు విద్యార్థులకు అర్థం అయ్యేలా సందేహాలు తీర్చుచూ ఉండవచ్చు.
ప్రశ్న 4.
మీకు తెలిసిన కొన్ని నీతివాక్యాలు చెప్పండి.
జవాబు.
- కలసి ఉంటే కలదు సుఖం.
- నిజాన్ని మాట్లాడండి.
పాఠం ఉద్దేశం
శతకాలు నైతికవిలువలను పెంపొందింప జేస్తాయి. సమాజ నడవడికను, లోకం పోకడలను తెల్పుతాయి. రేపటి సమాజానికి మానవతా విలువలను అందిస్తాయి. మంచి చెడుల విచక్షణను నేర్పుతాయి. భావిజీవితాన్ని తీర్చిదిద్దుతాయి. శతక పద్యాలలోని నైతిక విలువలను తెలుపుతూ, విద్యార్థు లను మంచి పౌరులుగా తీర్చిదిద్దడమే ఈ పాఠం ఉద్దేశం.
పేజీ 20
పాఠ్యభాగ వివరాలు
ఈ పాఠం శతక ప్రక్రియకు చెందినది. శతకం నూరు/నూటికి పైగా పద్యాలతో ఉంటుంది. సాధారణంగా శతకపద్యాలలో పద్యానికి 'మకుటం' ఉంటుంది. ఇవి 'ముక్తకాలు'. అంటే ఏ పద్యానికదే స్వతంత్ర భావంతో ఉంటుంది.
ప్రస్తుత పాఠంలో సుమతి, దాశరథి, నరసింహ, నృకేసరి, వేమన, నగ్నసత్యాలు, శ్రీ శ్రీనివాస బొమ్మల, యాదగిరి లక్ష్మీనరసింహ శతకాలలోని పద్యాలున్నాయి.
కవి పరిచయం
1. సుమతి శతకం - బద్దెన. లౌకికనీతులను అతిసులువుగా
కందపద్యాల్లో ఇమిడ్చి సుమతి శతకాన్ని రాసిన కవి బద్దెన. (వేములవాడ చాళుక్యరాజు భద్రభూపాలుడే బద్దెన అని చరిత్రకారుల అభిప్రాయం) ఈయన 'సుమతి' శతకంతోపాటు 'నీతిశాస్త్ర ముక్తావళి' అనే గ్రంథాన్ని రాశాడు.
(13వ శతాబ్దం)
2 . దాశరథి శతకం - కంచెర్ల గోపన్న. రామదాసుగా పేరుపొందిన
కంచెర్ల గోపన్న 'దాశరథీ కరుణాపయోనిధీ' అన్న మకుటంతో శతకాన్ని రాసి, భద్రాచల శ్రీరామచంద్రునికి అంకితమిచ్చాడు. ఖమ్మంజిల్లా నేలకొండపల్లికి చెందిన ఈయన కీర్తనలు ఇప్పటికీ తెలుగువారి నాల్కలపై నాట్యమాడుతూనే ఉన్నాయి.
17వ శతాబ్దం
18వ శతాబ్దం
3&4. నరసింహ శతకం మరియు నృకేసరి శతకం కాకుత్సం శేషప్పకవి, జగిత్యాల జిల్లా ధర్మపురి నారసింహునికి తన జీవితాన్ని అంకితం ఇచ్చిన సత్కవి. నరహరి శతకం, ధర్మపురి రామాయణం, ఈయన రచనలు. జనవ్యవహార నుడికారాలు, పదబంధాలు, లోకోక్తులను పద్యరూపంలో వ్యక్తీకరించిన నరసింహశతకం ఈయనకు అమిత కీర్తిని తెచ్చిపెట్టింది.
పేజి 21
5. వేమన శతకం - వేమన. వేమన పద్యం రాని తెలుగువాళ్ళు ఉండరు. సహజకవిగా ప్రసిద్ధిపొందాడు. కడపజిల్లాకు చెందిన ఈయన పద్యాలలో - నీతి, లోకజ్ఞానం, మానవతా విలువలు ఉంటాయి. జన వ్యవహారశైలిలో, తేలికైన ఉపమానాలతో పద్యాలు రచించడం వేమన ప్రత్యేకత.
17వ శతాబ్దం
6. నగ్నసత్యాలు శతకం- రావికంటి రామయ్యగుప్త. 'కవిరత్న' ఈయన బిరుదు. ఈయన పెద్దపల్లి జిల్లాలోని మంథనికి చెందినవాడు. గౌతమేశ్వర శతకం, గీతామృతం, వరద గోదావరి ఈయన రచనలు, వరకవిగా, మంత్రకూట వేమనగా సుప్రసిద్ధుడు.
17.6.1936
30.3.2009
7. శ్రీశ్రీనివాస బొమ్మల శతకం డా|| ఆడెపు చంద్రమౌళి. హనుమకొండ జిల్లా రంగశాయిపేట గ్రామానికి చెందిన ఈయన బిరుదు 'కవిశశాంక'. వేములవాడ రాజరాజేశ్వర శతకం, రామాయణ రమణీయం (పద్యకావ్యం) రచించాడు. సరళమైన భాషలో, అందరికీ అర్థమయ్యే శైలిలో పద్యాలు రాయడం వీరి ప్రత్యేకత.
7.4.1939
28.9.2009
8. శ్రీ యాదగిరి లక్ష్మీనృసింహ శతకం - శ్రీ ధూపాటి సంపత్కుమారాచార్య. ఖమ్మం జిల్లాకు చెందిన ఈయన 'యాదగిరివాస! నృసింహ! రమావిభో! ప్రభో!' అనే మకుటంతో చక్కని పద్యాలు రాశాడు. ఇవన్నీ భక్తితోపాటు నైతిక విలువలను పెంపొందింపజేస్తాయి.
20వ శతాబ్దం
విద్యార్థులకు సూచనలు
* పాఠంలోని బొమ్మలు చూడండి. పాఠం ముందున్న ప్రవేశిక చదువండి. పాఠంలోని విషయాన్ని ఊహించండి.
* పాఠాన్ని చదువండి. అర్ధంకాని పదాలకింద గీతలు గీయండి.
* అర్థంకాని పదాలను, వాక్యాలను గురించి మీ మిత్రులతో చర్చించండి.
* పాఠ్యపుస్తకం చివరన ఉన్న 'పదాలు - అర్థాలు' పట్టిక చూసి, తెలియని పదాలకు అర్థాలను తెలుసుకొండి.
పేజి 22
ప్రవేశిక
పద్యం రసానుభూతిని కలిగిస్తుంది. పద్యంలోని రాగయుక్త ఆలాపన (లయ) మానసిక ఆనందాన్నిస్తుంది. నైతికవిలువలను పద్యాల ద్వారా నేర్చుకొని జీవితాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుకోవచ్చు. పద్యాలను ధారణ చేయడం ద్వారా నిరంతరం ఆ నీతులను మననం చేసుకోవచ్చు. మరింకెందుకు ఆలస్యం? శతక పద్యాల తోటలోకి వెళ్లాం! నైతిక పరిమళాల్ని ఆస్వాదిద్దాం!
I
ఆఁ కొన్న కూడె యమృతము తాఁ గొంకక నిచ్చువాఁడె దాత ధరిత్రిన్ సోఁ కోర్చువాఁడె మనుజుఁడు తేఁకువ గలవాఁడె వంశతిలకుఁదు సుమతీ!
- సుమతి శతకం, బద్దెన.
తాత్పర్యాలు
1. ఓ మంచి బుద్ధి గలవాడా! బాగా ఆకలివేసినపుడు తిన్న అన్నమే అమృతంవలె చాలా రుచిగా అనిపిస్తుంది. వెనుదీయకుండా దానం చేసేవాడే ఈ భూమి మీద నిజమైన దాత. కష్టాన్ని ఓర్చుకొనగలవాడే మనిషి, ధైర్యమున్నవాడే తన వంశానికి వన్నె తెస్తాడు.
*2. చం
వనకరి చిక్కె మైనసకు, వాచవికిం జెడిపోయె మీను, తా
వినికికిఁ జిక్కెఁ జిల్వ గనువేదురు ఁజెందెను లేళ్ళు, తావినో
మనికి నశించెఁ దేటి, తరమా యిరు మూటిని గెల్వ, నైదు సా
ధనముల నీవె గావదగు దాశరథీ! కరుణాపయోనిధీ!
- దాశరథీ శతకం, కంచెర్ల గోపన్న.
భావం. కరుణాసముద్రుడా! దశరథపుత్రుడా! శ్రీరామా! తనమేని దురదను పోగొట్టుకోవడానికి ఏనుగు, నోటికి రుచి ఆశించి చేప, రాగానికి లొంగి పాము, దృష్టిభ్రమకులోనై జింక, పూలవాసనకు మైమరచి తుమ్మెదలు బందీలవుతున్నాయి. ఇట్లా ఒక్కొక్క ప్రాణి ఒక్కొక్క ఇంద్రియ చపలత్వం వల్ల నశిస్తుంది. ఈ పంచేంద్రియ చాపల్యం గల నేను వాటి నుండి ఎలా బయటపడగలను? నీవే నా చాంచల్యాన్ని దూరంచేసి స్థిరమైన బుద్ధిని ప్రసాదించుము.
* 3.
సీ॥ లోకమందెవడైన లోభిమానవుడున్న
భిక్షమర్థికిఁ చేతఁ బెట్టలేడు.
తాను బెట్టకయున్న తగవు పుట్టదుకాని
యొరులు పెట్టగఁ జూచి యోర్వలేడు.
దాత దగ్గర జేరి తన ముల్లె వొయినట్లు
జిహ్వతోఁ జాడీలు చెప్పుచుండు
ఫలము విఘ్నంబైన బలుసంతసమునందు
మేలుకల్గినఁజాల మిడుకుచుండు
తే.గీ॥ శ్రీరమానాథ! యిటువంటి కౄరునకును
భిక్షుకుల శత్రువని పేరుబెట్టవచ్చు
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!
దుష్టసంహార నరసింహ దురితదూర!
- నరసింహశతకం, కాకుత్థ్సం శేషప్పకవి.
భావం: 3. ఆభరణాలచే ప్రకాశించేవాడా! శ్రీ ధర్మపురంలో నివసించేవాడా! దుష్టులను సంహరించేవాడా! పాపాలను దూరం చేసేవాడా! ఓ నరసింహా! పిసినారి యాచకులకు తన చేతితో భిక్షం పెట్టడు. పెట్టకపోతే ఏ గొడవ లేదు. కాని ఇతరులు పెట్టినపుడు చూసి తాను ఓర్వలేడు. దానం చేసే దాత దగ్గరకు పోయి తనముల్లె (సొమ్ము) పోయినట్లుగా నోటి దురుసుతో చాడీలు చెబుతాడు. లోభి తాను అనుకున్నట్టుదానం చేయడం విఫలమైతే చాలా సంతోషిస్తాడు. ఇతరులకు మేలు కలిగితే బాధపడుతాడు. ఓ శ్రీరమానాథా! ఇటువంటి వారిని భిక్షుకుల శత్రువుగా చెప్పవచ్చుకదా!
--------------------------------------------------------------
అలోచించండి- చెప్పండి.
వంశానికి కీర్తి తేవడమంటే మీకేమర్ధమైంది?
చెడు అలవాట్లకు లొంగిపోతే ఏం జరుగుతుంది?
* 'భిక్షుకులకు శత్రువు లోభి' అన్న
కవి అభిప్రాయాన్ని మీరు
ఏకీభవిస్తున్నారా? ఎందుకు?
చాడీలుచెప్పడం మంచి అలవాటు కాదు. ఎందుకో చెప్పండి?
------------------------------------------------------------
పేజీ 23.
*4.
ఏనుగు బోవఁజూచి ధ్వనులెత్తుచుఁగుక్కలు గూయసాగుచో
దాని మనస్సు కోపపడి దందడి వానిని వెంబడించునే
మానవులందు సజ్జనుడు, మత్తులు కొందరు గేలి చేయు చో
ఆ నరుడల్గి వాండ్ర బదులాడునె ధర్మపురీ నృకేసరీ!
-నృకేసరి శతకం, కాకుత్థ్సం శేషప్పకవి.
భావం:4.
ధర్మపురి నరసింహా! ఏనుగు పోతుంటే చూసిన కుక్కలు ఎంత మొరిగినా ఆ ఏనుగు వాటిపై కోపంతో వెనుదిరిగి తరుమదు. అట్లాగే ఒక సజ్జనుడిని కొందరు మూర్ఖులు గేలిచేసినా, అతడు కోపించి వారితో వాదులాడబోడు. ఇది సజ్జనుని స్వభావం.
★5.
తన మదిఁ గపటము గలిగిన
తన వలెనే కపటముండుఁ దగ జీవులకున్
తన మది కపటము విడిచిన
తనకెవ్వడు కపటిలేడు ధరలో వేమా!
-వేమన శతకం, వేమన.
భావం
5. ఓ వేమా! తన మనసులో మోసపు ఆలోచనలు ఉంటే ఇతరుల్లో కూడా మోసమే ఉన్నట్లు కనిపిస్తుంది. తన మనస్సునుండి అట్లాంటి మోసపూరిత భావాలను తొలగించుకుంటే ఈ లోకంలో తనకు మోసగాడే. కనిపించడు కదా!
* 6. ఆ.వె||
ధనమదమ్ము చేత దానవుండై పోయి
పేదవాడు పడెడు బాధ గనక
కష్టపెట్టువారు కలకాల ముందురా
కల్లగాదు రావికంటిమాట!
-నగ్నసత్యాలు శతకం, రావికంటి రామయ్యగుప్త.
భావం:
6. ధన బలంతో రాక్షసులుగా మారి, పేదవారు బాధపడుతున్నా లెక్కచేయక, వారిని కష్టాల పాలు చేసే మానవులు కలకాలం నిలువరు కదా! ఇది నిజం అని కవి భావన.
------------------------------------------------------------
ఆలోచించండి- చెప్పండి.
* ఏయే గుణాలు అలవరుచుకుంటే మనలోని కపటం తొలగిపోతుంది?
* సజ్జనుని లక్షణాలు ఏమిటి?
* గేలి చేయడమంటే మీకేమర్థమైంది?
* ధనమదమ్ము వంటి ఏయే గుణాలు కలిగిఉంటే దానవులౌతారు?
------------------------------------------------------------
పేజి 24.
III
* 7. ఆ.వె|| సత్పురుషుల మైత్రి సలుపగా మనసిమ్ము
కమలనయన నిన్ను గాంచనిమ్ము విశ్వశాంతికోరు విజ్ఞానమే యిమ్ము
చిద్విలాస భాస! శ్రీనివాస!
- శ్రీ శ్రీనివాస బొమ్మలశతకం, డా|| ఆడెపు చంద్రమౌళి.
భావం:
7. ఓ శ్రీనివాసా! జ్ఞాన విలాసం చేత ప్రకాశించేవాడా! మంచివారితో స్నేహం చేసే మనసును ఇవ్వు కమలాల వంటి కన్నులు కలవాడా! నిన్ను కనులారా చూడనివ్వు. ప్రపంచశాంతిని కోరే విజ్ఞానాన్ని ఇవ్వు.
* 8. చం॥ జననియు జన్మభూమియును స్వర్గముకన్న ఘనమ్ములన్న సూ
క్తిని వెలయింప సత్యమని దివ్యపురావిభవైక నవ్య దీ
ప్తిని గలిగింప మాతృపదపీఠి శిరంబు త్యజించు తెంపు నీ
వనిశము గూర్పు యాదగిరివాస! నృసింహ! రమావిభో! ప్రభో!
- శ్రీ యాదగిరి లక్ష్మీనృసింహ శతకం, ధూపాటి సంపత్కుమారాచార్య.
భావం. 8. యాదగిరివాసా! నరసింహా! లక్ష్మీదేవికి భర్త అయినవాడా! ప్రభో! జన్మనిచ్చిన తల్లి. జన్మభూమి స్వర్గం: కంటె మిన్న. ఈ సూక్తిని నిజమని చెప్పటానికి, దివ్యమైన ప్రాచీన వైభవాన్ని నూతన కాంతులతో నిరంతరం వెలిగించడానికి తల్లి పాదపీఠం మీద తల ఉంచి ప్రాణాలు విడిచే తెగువను నాకు ప్రసాదించు.
------------------------------------------------------------
ఆలోచించండి-చెప్పండి.
* 'విజ్ఞానము విశ్వశాంతికొరకు' దీనిపై మీ అభిప్రాయాలు చెప్పండి?
* 'జనని, జన్మభూమి స్వర్గం కన్న మిన్న' అని కవి ఎందుకన్నాడు?
------------------------------------------------------------
III. స్వీయరచన
1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో జవాబులు రాయండి.
(అ) ‘సత్పురుషుల స్నేహం అవసరం’. ఎందుకు?
జవాబు.
- మంచి వారితో స్నేహం ఎప్పుడూ మంచినే కల్గిస్తుంది.
- గంధం చెట్టు అడవిని గంధపు వాసనతో వ్యాప్తి చేసినట్లు మంచివారు తన మంచితనాన్ని వ్యాప్తి చేస్తారు.
- మంచివారితో స్నేహం వలన ధైర్యము కలుగుతుంది.
- చక్కగా మాట్లాడే నైపుణ్యం వస్తుంది.
- మనలోని బుద్ధిమాంద్యం తొలగుతుంది.
- అన్యాయం, అధర్మం, అసత్యములకు దూరంగా ఉంచుతుంది.
- మనకు మంచి కీర్తి లభిస్తుంది.
- మంచివారి స్నేహం వలన లోకంలో సాధించలేనిది లేదు.
(ఆ) ఉన్న ఊరు, కన్నతల్లి స్వర్గం వంటివి. ఎందుకు?
జవాబు.
- జననీ, జన్మభూమి స్వర్గం కంటే విలువైనవి.
- తల్లి తన పొట్టలో 9 నెలలు తన శరీరం నుండి అన్ని అవయవాలను తయారుచేసి, మోసి చాలా జాగ్రత్తగా పెంచుతుంది. ఆమె చూపే సహనం, ఓపిక, ప్రేమ ఎవరూ చూపలేరు.
- అందరికంటే తన బిడ్డ అందమైనదిగా భావించి జీవితం చివరి వరకు ప్రేమను ఇచ్చేది తల్లి కాబట్టి చాలా విలువైనది తల్లి.
- పుట్టిన నేల స్వర్గం కంటే చాలా గొప్పది.
- ఎక్కడికెళ్ళినా తన జన్మస్థానంలో ఉన్నన్ని విశేషాలనే ఎప్పుడూ గొప్పగా చెప్పాలి! అందుకే స్వర్గంతో సమానం.
(ఇ) ధనం బాగా ఉంటే ఏమేం మంచిపనులు చేయవచ్చు?
జవాబు.
- ధనం బాగా ఉంటే చాలా మంచిపనులు చేయవచ్చు.
- పేదవారికి ప్రతినిత్యము అన్నదానము చేయవచ్చు.
- పేదవారికి ఇళ్ళు వాకిళ్ళు నిర్మించి ఇవ్వవచ్చు.
- సమాజంలో పరిశ్రమలు స్థాపించి ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు.
- పాఠశాలలను నెలకొల్పి అందరికి చదువు చెప్పించవచ్చు.
- సమాజంలో ఎక్కువ మందికి ఉపయోగపడే అనేక మంచి కార్యాలు చేయవచ్చు.
- నీటివసతి, రవాణా వసతులను కల్పించవచ్చు.
- వైద్యం చేయించుకోలేని వారికి వైద్యశాలలు నెలకొల్పవచ్చు.
- మనసుంటే ఎన్ని పనులైనా చేయవచ్చును.
(ఈ) ‘లోభి ఎప్పుడూ సంతోషంగా ఉండడు’. ఎందుకు?
జవాబు.
- లోభి (పిసినారి) తాను సంపాదించిన దానిని తాను అనుభవించడు, ఎవరినీ అనుభవించనివ్వడు. అందుకనే సంతోషంగా ఉండలేడు.
- లోభికి ఎప్పుడూ దానగుణము లేకపోవడం వలన ఆ దాచిన ధనము తేనెటీగ తాను పెట్టిన తేనె వలె చివరకు ఇతరుల పాలగును.
- దాత దానము చేసినా తన సొమ్ము పోయినట్లుగా బాధపడతాడే కాని సంతోష పడడు.
- లోభి ఇతరులకు మేలు జరిగితే దుఃఖ పడతాడు.
- లోభికి ఎప్పుడూ విచారమే ఎందుకనగా ఎవరూ అతని పిసినారితనాన్ని ఇష్టపడరు.
- లోభి ఎంతకూడబెట్టినా సంతృప్తి లేకపోవడం వలన, ఇంకా కూడబెట్టాలనే కోరికతో ఎప్పుడూ దిగులుపడుతూ విచారంగా ఉంటాడు.
2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.
1. పాఠంలోని శతకపద్యాల ఆధారంగా మన ప్రవర్తన, నడవడిక ఎట్లా ఉండాలో వివరించండి?
జవాబు.
(అ) నిజమైన వ్యక్తి :
1. మనము దానగుణము కలిగి ఉండాలి.
2. కష్టాలను ఓర్చుకొనే గుణాన్ని అలవరచుకోవాలి.
3. ధైర్యంతో ముందుకు వెళితేనే దేనినైనా సాధించగలం.
(ఆ) స్థిరమైన బుద్ధి :
1. ఏనుగు, చేప, పాము, జింక, తుమ్మెదలు తమ బలహీనత వలన ఇతరులకు దొరికి పోతున్నాయి.
2.మానవుడు తనలోని ఆరు శత్రువులను (కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యాల) జయించినపుడే దేవతగా గౌరవించబడతాడు.
(ఇ) దాత :
1. లోభి తాను తన సొమ్ము దానం చేయడు.
2. దాత తన సొమ్ము దానం చేస్తున్నా చెయ్యనివ్వడు.
3. అట్టి పిసినారిని మనం దూరంగా ఉంచాలి.
(ఈ) సజ్జన స్వభావం :
1. మంచి స్వభావాన్ని కలిగి ఉండాలి.
2. మంచి పవర్తన అందాన్నిస్తుంది.
3. గౌరవాన్ని కలిగిస్తుంది.
4. కీర్తి పెంపొందింపచేస్తుంది.
(ఉ) స్నేహశీలత :
1. మంచివారి స్నేహం చెయ్యాలి.
2. మంచి స్నేహం మానవతను పెంచుతుంది.
3. అనేక మంచి గుణాలను కలిగిస్తుంది.
IV. సృజనాత్మకత/ప్రశంస
1 పద్యాల ఆధారంగా నీతిని తెలిపే సూక్తులను తయారుచేయండి. రాయండి. ప్రదర్శించండి.
జవాబు.
- ఆకలి రుచి ఎరుగదు.
- విసుగు లేకుండా ఇచ్చేవాడే దాత.
- కష్టాలను ఓర్చుకొన్నవాడే మనిషి.
- ధైర్యసాహసాలు కలవాడే వీరుడు.
- మనస్సును అదుపు చేయగలిగేవాడే గొప్పవాడు.
- కష్టపెట్టువాడు కలకాలం ఉండడు.
- మంచి వారితో స్నేహం చేయాలి
2. కింది వాక్యాలను చదవండి. ఇచ్చిన పదాలకు అదే అర్థం వచ్చే పదాలను గుర్తించండి.
(అ) ధరిత్రి : భూమిపై కాలుష్యం పెరిగింది. నేల కోతవల్ల పంటలు పండటం లేదు. అవనిని తల్లిగా పూజిస్తాం. జవాబు. భూమి, నేల, అవని
(ఆ) తావి : పువ్వుకు తావి వల్ల కీర్తి వస్తుంది. పరిమళం ఆఘ్రాణించాలని ఎవరికుండదు? సువాసనలు సంతోషాన్నిస్తాయి.
జవాబు.
తావి, పరిమళం, సువాసన
3. కింది వాక్యాలలో నానార్థాలను గుర్తించండి.
(అ) శ్రీ : సాలెపురుగు తన గూడును అద్భుతంగా కడుతుంది. పాము కోరల్లో విషం ఉంటుంది. సంపద శాశ్వతం కాదు. బుద్ధిబలం అవసరం.
జవాబు.
శ్రీ : సాలెపురుగు, సంపద
(ఆ) ధనము : గోపాలుడు విత్తము తీసికొని అంగడికి వెళ్ళాడు. పాడిసంపదను పెంచడానికి ఆవుల మందను కొన్నాడు.
జవాబు.
ధనము : విత్తము, సంపద
4. కింది పేరాను చదవండి. ఖాళీలలో తగిన పదాలను రాయండి.
(నిజం, ఓర్పు, బాధ, చాడీలు, నీతి)
సిరి, శాంతిది ఒకే తరగతి. సిర రోజూ బడిలో చెప్పిన పాఠాలను ఎప్పటికప్పుడు రాసుకోవడం, చదువుకోవడం చేసేది. శాంతి బడికి సరిగ్గా వచ్చేది కాదు. అందరినీ తన అల్లరితో బాధ పెట్టేది. చాడీలు చెప్పేది. ఒకరోజు శాంతి, సిరి నోట్బుక్ను దాచింది. ఈ విషయం తెలిసినా శాంతిని ఏమీ అనలేదు. ఉపాధ్యాయిని నోట్బుక్లను పరిశీలించడానికి తీసుకుంది. సిరి నోట్బుక్ లేదు.
ఉపాధ్యాయిని సిరిని అడిగింది. సిరి మౌనంగా ఉండిపోయింది. ఉపాధ్యాయిని నిజం తెలుసుకుంది. ఆ తర్వాత పిల్లలకు నీతి కథలను ఉదహరిస్తూ శతక పద్యాల్లో ఉండే మానవతా విలువలను గురించి చెప్పి, నిజజీవితంలో ఎట్లా ఆచరించాలో తరగతిలో చర్చించారు. శాంతిలో పరివర్తన వచ్చింది. సిరికి, శాంతి క్షమాపణలు చెప్పింది. అందరూ సిరి ఓర్పు ను ప్రశంసించారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి