-డా. వానమామలై వరదాచార్యులు
పాఠ్యభాగ వివరాలు: ఈ పాఠం 'కావ్య' ప్రక్రియకు చెందినది. కావ్యము అనగా వర్ణనతో కూడినది అని అర్థం. మహాకవి పోతన జీవితం ఆధారంగా డా. వానమామలై వరదాచార్యులు రచించిన 'పోతన చరిత్ర' అనే మహాకావ్యం లోని ప్రథమ శ్వాసము నుండి తీసుకోబడింది.
కవి పరిచయం
కవి పేరు డాక్టర్ వానమామలై వరదాచార్యులు
జననం : 16 .8 .1912
మరణం : 30 .10. 1984.
కాలం : 20వ శతాబ్దం
జన్మస్థలం: వరంగల్ అర్బన్ జిల్లాలోని మణికొండ గ్రామం.
స్థిర నివాసం : మంచిర్యాల జిల్లా చెన్నూరు.
బిరుదులు: అభినవ పోతన, అభినవ కాళిదాసు, మధురకవి, కవి చక్రవర్తి.
రచనలు: పోతన చరిత్రము, మణిమాల, సూక్తి వైజయంతి, జయ ధ్వజము, వ్యాసమనణి, కూలిపోయే కొమ్మ, రైతుబిడ్డ (బుర్రకథల సంపుటి).
పురస్కారాలు : 1. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం.
2. వారణాసి వారి విద్యా వాచాస్పతి మొదలైన పురస్కారాలు అందుకున్నాడు
I
కం. తిప్పన సౌభ్రాత్రమ్మన న
ప్పురిఁ గల చిన్న పెద్ద లందరికిఁ గడున్ మెప్పనుజునకన్న యనన్
గొప్పగుఁ దమ్ముఁ డన నన్నకున్ బ్రాణంబౌ. . 1
1. తిప్పన, పోతనలు అన్నదమ్ములు. తిప్పనకు తమ్ముడంటే చాలా ప్రేమ, తిప్పన తన తమ్ముడైన పోతనమీద చూపే సోదరభావంతో ఊరిలో అందరికి ఆదర్శంగా నిలిచాడు. అన్న అంటే పోతనకూ గౌరవం. తమ్ముడంటే అన్నకు పంచప్రాణాలు. ఈ విధంగా ఒకరిపై ఒకరు ఎంతో ప్రేమను కలిగి ఉండేవారు.
సీ. తన కెవ్వ రేదేని తినుబండ మిడిరేని
యనుజుని కిడక తిప్పన తినండు
అనుజన్ము నెవ్వ రేమనిన తా నడ్డమ్ము
వచ్చు మై నీఁగను వ్రాలనీఁడు
గడియసేపింటఁ దమ్ముఁడు గానరాకున్న
వెదకుఁ గన్పడుదాఁక వెతసుజెందుఁ
తన ప్రాణమున కెంతయును గూర్చు వస్తువే
నవరజుం డడిగినయంత నొసఁగు.
తే. భోజన మొనర్చు తఱి నిద్రబోవు వేళ
లందును యవీయసుఁడు తన యండ నుండ
వలెను దగవులాటననేమొ తెలియ రనఘ
గుణులు సోదరుల్ రామలక్ష్మణులు మణులు. 2
భావం. 2. తనకెవరైనా తినడానికి ఏదైనా ఇస్తే తమ్మునికి ఇవ్వకుండ తిప్పన తినడు. తమ్ముణ్ణి ఎవరైనా ఏమన్నా అంటే తాను అడ్డం వస్తాడు. తమ్ముడి మీద ఈగను కూడ వాలనీయడు. కొంచెంసేపు తమ్ముడు కనబడకపోతే వెతకడం మొదలుపెడ్తాడు. కనిపించిందాకా ఆందోళన పడుతూనే ఉంటాడు. తనకు ప్రాణంతో సమానమైన వస్తువైనా తమ్ముడు అడిగితే వెంటనే ఇచ్చి వేస్తాడు. తినేటప్పుడు నిద్రపోయేటప్పుడు కూడా తమ్ముడు తన పక్కనే ఉండాలి. కొట్లాటలంటే ఏమిటో వాళ్ళకు తెలియదు. ఆ అన్నదమ్ములిద్దరూ గొప్ప గుణాలు కలవారు. వారు మణులు, రామలక్ష్మణుల వంటివారు.
*కం. తిప్పిన చదివెడు పద్యముఁ
జప్పున నొకసారి వినిన సరి పోతన తా
విప్పక పొత్తము నొప్పం
జెప్పును నద్దాని నేమి చెప్పుట తెలివిన్. 3
3. తిప్పన ఏదైనా పద్యాన్ని చదువుతుంటే, పోతన దానిని ఒక్కసారి వినగానే అర్ధంచేసుకొని దాంట్లోని సారాంశాన్ని వెంటనే చెప్పగలిగేవాడు. అంత గొప్ప తెలివిగలవాడు.
****************************
ఆలోచించండి- చెప్పండి.
'తమ్మునిమీద ఈగను వాలనీయడు' అంటే మీకేమర్థమయింది?
అన్న తన తినుబండారాలు తమ్మునికి ఇచ్చాడు. ఇట్లా తమ్ముని కోసం అన్న ఏమేమి చేయవచ్చు?
'తిప్పన పోతన' లకు తగువులాట అంటే ఏమిటో తెలియదట. మరి మీ ఇంట్లో మీరు అన్నదమ్ముళ్ళతోటి లేదా అక్కజెల్లెళ్ళతోటి ఎట్లా ఉంటారు?
************************
II
ఆ. దూఁకు లెగురు లందుఁ దొండు మెండుగఁబడి సరకుఁగొనఁడు లేచి యుఱుకు నపుడె
యరరె! భూమి ప్రక్కలయ్యె నండ్రా యుక్కు
బాలు పాటుగాంచి ప్రక్కవారు.
4. పోతన ఆటలాడుతూ, దుంకుతూ, ఎగురుతూ ఉన్నప్పుడు కిందపడితే పట్టించుకోకుండా వెంటనే లేచి మళ్ళీ పరుగెత్తుతాడు. పక్కన ఉండే పిల్లలు అది చూసి 'అరెరే... ఈ ఉక్కులాంటి పిల్లవాడు పడితే భూమియే ముక్కలయిందే!' అని అంటారు.
*
ఉ. ఆటల మేటి విద్దియల యందున వానికి వాఁడె సాటి కొ
ట్లాటను బాలు రంద దొకటైన దిర్చెడి ధాటి, తీయగా
బాటలు పాడుటందుఁ బికవాణికి వానికిఁ బోటి యెందు మో
మోటముఁ గొంకుజంకులను బొత్తుగ వీడి చరించు నాతఁడున్.
* 5. ఆటల్లో ఆరితేరినవాడు. చదువులో అతనికి అతడే సాటి. కొట్లాటలలో పిల్లలందరూ ఒక్కటైనా ఎదిరించి నిలబడగల శక్తిమంతుడు, తియ్యగా పాటలు పాడటంలో కోకిలకు పోతనకు పోటీ. మొగమాటం, భయం, వెనకడుగు వేయడమంటూ ఎరుగడు.
చ. గురినిడి కొట్టెనేని యొక గోలియుఁ దప్పదు కచ్చగట్టి బొం
గరమును వేయ వ్రేటు కొక కాయ పటుక్కను, బందెమూ తా
నుఱికిన లేడిపిల్లవలె నొక్కని యయ్యకుఁ జిక్కడద్దిరా!
చిఱుతఁ డసాధ్యుఁడంచు నెదఁ జే యిడి విస్మయమంద నందఱున్.6
6. గురిచూసి కొట్టాడంటే ఒక్క గోలీకూడా గురితప్పదు. పోటీపడి బొంగరాన్ని విసిరితే వేటువేటుకు ఇతరుల బొంగరాలు 'పటుక్కని' పగులవలసిందే. పందెం పెట్టుకొని పరుగెత్తాడంటే లేడిపిల్లవలె ఏ ఒక్కనికీ చిక్కడు. దాన్ని చూసి అదిరా! ఈ చిఱుతడు అసాధ్యుడు సుమా! అంటూ అందరు గుండెలమీద చేయి వేసుకొని ఆశ్చర్యపడుతుంటారు.
****************************
ఆలోచించండి- చెప్పండి.
పోతనను 'ఉక్కు బాలుడు' అని కవి ఎందుకు అనవలసివచ్చింది?
పాడటంలో పోతనను కోకిలతో పోల్చాడు కదా! ఇంకా వేటిని వేటితో పోల్చవచ్చు?
(ఉదా : నడకను, మాటను, కళ్ళను, మనస్సును, ముఖాన్ని, చేష్టలను)
'వీడు అసాధ్యుడు!' అని ఎవరినైనా, ఏయే సందర్భాల్లో అంటారు?
*****************************
III
ఆ॥వె॥ కోఁతివోలెఁ జెట్ల కొనఁగొమ్మ లెగబ్రాకుఁ
బక్షివోలెఁ గ్రిందఁబడఁగ దూఁకుఁ
గాలు భూమిపైన గడియైన నాఁగదు
పాదరసము గలదొ పాదయుగళి ! 7
7. కోతివలె చెట్ల కొనకొమ్మలు ఎగబాకుతాడు. పక్షివలె కిందికి దుంకుతాడు. భూమి మీద కాలు క్షణమైన నిలువదు. ఆ కాళ్ళలో పాదరసం ఉన్నదో ఏమో? (పాదరసం నిలకడగా ఉండదు.)
కం. గుడికిఁ జను జననిఁ గని వెం
బడిఁబడి చను జదువుకొనెడి బడి విడియైనన్
బడి పడి జేజే లిడు న
య్యెడ నెడమయుఁ గుడియు ననక నెంతయు భక్తిన్. 8
8. అమ్మ గుడికి పోతుంటె, పోతన బడికి పోకుండ అమ్మవెంట గుడికి పోతాడు. గుడిలో మళ్ళీ మళ్ళీ నమస్కారాలు చేస్తాడు. అట్లా నమస్కారాలు చేసేటప్పుడు కుడి ఎడమలు కూడా చూసుకోడు. (తన పరిసరాలను పట్టించు కోకుండా దేవునిపైనే దృష్టిపెడుతాడని భావం.)
*తే॥గీ॥ సాధుసజ్జన దర్శనోత్సాహ గతియు
హరికథాపురాణ శ్రవణాభిరతియు
శంభుపద సరోజార్చ నాసక్తమతియుఁ
బెరుగసాగె వేరొకప్రక్క బిడ్డ యెడద.9
9. మరోవైపు పోతన మనసులో సాధుసజ్జనులను దర్శించాలనే ఉత్సాహం పెరుగసాగింది. హరికథలను, పురాణాలను వినాలనే కోరిక మొదలయ్యింది. శివుని పాదపద్మాలను పూజించాలనే ఆసక్తి పెరుగసాగింది.
****************************
ఆలోచించండి-చెప్పందడి..
“దూకుతున్నాడ”న్నారు కదా! ఇవి కాక ఇంకా పిల్లలు ఏయే చేష్టలు చేస్తారో చెప్పండి?
'పెరుగసాగె వేరొక ప్రక్క బిడ్డ యెడద' అంటే మీకేమి అర్థమయింది?
***************************
ఇవి చేయండి.
ధారాళంగా చదవడం అర్థం చేసుకుని ప్రతిస్పందించడం కింది పద్యం చదవండి భావంలోని ఖాళీలు పూరించండి.
కందుకం వోలే సుజనుడు
క్రిందంబడి మగుడమీదికి న్నెగయు జుమీ
మందుండు ముత్పిండం వలె
క్రిందపడి యడగి యుండు గృపణత్వమునన్
ఖాళీలు
అ)కింద పడ్డ పైకి లేచేవాడు సుజనుడు.
ఆ) అపజయం పాలైన తిరిగి విజయం సాధిస్తాడు.
ఇ) మందుడు అంటే బుద్ధిహీనుడు.
ఈ) బంతితో పోల్చబడినవాడు సుజనుడు.
ఉ) మట్టి ముద్ద అనే పదానికి పద్యంలో వాడబడిన పదం - మృత్పిండము.
III. స్వీయ రచన
1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలు జవాబులు రాయండి.
అ) ఊళ్లోని పెద్దలందరూ అన్నదమ్ములు ఇద్దరిని మెచ్చుకునేవారు మీ చుట్టుపక్కల వారు మెచ్చుకునేటట్లుగా నువ్వేం చేస్తావు?
జవాబు: తిప్పన పోతనలు అన్నదమ్ములు తిప్పనకు తమ్ముడంటే చాలా ప్రేమ తిప్పన తన తమ్ముడైన పోతన మీద చూపి సోదరా భావంతో ఊరిలో అందరికీ ఆదర్శంగా నిలిచాడు. నేను మా తమ్ముడు మీద మా చెల్లెలు మీద తిప్పన కురిపించిన ప్రేమను కురిపిస్తాను. తిప్పన పోతనలు ఎలా ఉన్నారో నేను మా అన్నదమ్ములం అలాగే ఉంటాము.
ఆ) 'కాళ్లలో పాదరసం' అంటే మీకేం అర్థమైంది?
జవాబు: పాదరసం అనగా నిలకడగా ఉండని స్వభావం గలది. ఎప్పుడు కదులుతూనే ఉంటుంది. నిలకడగా ఉండదు. చంచలమైన మనస్తత్వం కలిగిన వారిని పాదరస స్వభావం గలవారు అని కూడా అంటారు.
ఇ) 'తిప్పన - పోతన' లను రామలక్ష్ములతో ఎందుకు పోల్చారు?
జవాబు: తిప్పల పోతనలిద్దరూ అన్నదమ్ములు. ఒక్కరిని విడిచి ఒకరు ఉండలేరు. తిప్పనకు తమ్ముడంటే చాలా ప్రేమ. పోతనకు అన్న అంటే అమితమైన ప్రేమ. ఒకరంటే ఒకరికి పంచప్రాణాలు. తమ్ముడు కనబడకపోతే అన్న వెతుకుతాడు. తినేటప్పుడు నిద్రపోయేటప్పుడు కూడా తమ్ముడు తన పక్కనే ఉండాలని అనుకుంటాడు. కొట్లాటలు అంటే ఏమిటో వాళ్లకు తెలియదు. ఆ అన్నదమ్ములిద్దరూ గొప్ప గుణాలు గలవారు. మంచి స్వభావం కలిగిన వారు. వారు మణులు రామలక్ష్మణుల వంటి గుణగణాలు కలిగిన వారు. కావున వారిని రామలక్ష్మణులతో తో పోల్చారు.
ఈ) ఈ పాఠం రాసిన కవి గురించి సొంతమాటల్లో రాయండి.
జవాబు: పోతన బాల్యం రాసిన కవి పేరు వానమామలై వరదాచార్యులు వీరు మంచిర్యాల జిల్లా చెన్నూరులో స్థిరవాసం ఏర్పరచుకున్నారు. వీరి బిరుదులు అభినవ పోతన, అభినవ కాళిదాసు, మధురకవి, కవి చక్రవర్తి అనునవి. వీరి రచనలు పోతన చరిత్రను మణిమాల, సూక్తి వైజయంతి, జయ ధ్వజము,ఢ వ్యాసవాణి, కూలిపోయే కొమ్మ, రైతు బిడ్డ(బుర్రకథలు) సంపుటి గ్రంథాలు రచించాడు.
2. ఈ క్రింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.
పోతన బాల్యాన్ని మీ సొంతమాటల్లో రాయండి.
జవాబు: పోతన బాల్యం.
పోతనకు తన అన్న తిప్పన అంటే ప్రాణం అమితమైన గౌరవం మర్యాద. తిప్పన తెలివిగలవాడు. ఏదైనా పద్యం తిప్పన చదువుతుంటే దాన్ని పోతన వినగానే అర్థం చేసుకునేవాడు. ఆ పద్యం యొక్క సారాంశాన్ని త్వరగా చెప్పగలిగేవాడు. పోతన విద్యలోనే కాదు వినయంలోనూ వివేకంలోనూ మంచి గుణాలు అలవర్చుకున్నాడు. ఆటపాటల్లో ఆరితేరిన వాడు. చదువులో తనకు తానే సాటి. ధైర్య సాహసాలలో శక్తివంతుడు. శ్రావ్యమైన పాటలు పాడేవాడు. మొగమాటము భయము వెనుకడుగు వేయడం అంటూ తెలియనివాడు. చెట్లు ఎక్కడంలో కోతులు మించిన నైపుణ్యం గలవాడు. పక్షుల కిందికి దూకేవాడు. ఉడతవలే పైకి ఎగబాకే వాడు. ఆయనకు భూమి మీద కాలు క్షణమైన నిలిచేది కాదంటే సందేహం లేదు. తన తల్లితో పోతన కూడా గుడికి వెళ్లేవాడు. దేవునికి నమస్కారాలు చేసేవాడు. సాధువులు సజ్జనులను దర్శించాలని ఉత్సాహం కలిగి వారితో సాంగత్యం చేసేవాడు. హరికథలను, పురాణాలను చిన్నప్పటి నుంచే వినడం మొదలైంది. శివ పూజ అంటే ఆసక్తి ఎక్కువ.
V. సృజనాత్మకత / ప్రశంస
పోతన తన బాల్యంలో ఆడుకునే ఆటలు తెలుసుకున్నారు కదా అట్లాగే మీరు ఆడుకునే ఆటలు ఏవి ఆటలు ఎందుకోసం ఆడాలో వాటి ప్రాముఖ్యత ఏమిటో వివరిస్తూ వ్యాసం రాయండి.
జవాబు: నేను ఆడుకునే ఆటలు కబడ్డీ వాలీబాల్, రింగ్ బాల్, షెటిల్ కాక్, బాల్ బ్యాడ్మింటన్, క్యారమ్స్, ఖో ఖో గోలిలాట మొదలైనవి.
ఆటలు ఎందుకోసం ఆడాలి. మనోవికాసానికి అవి ఉపయోగపడతాయి. వ్యాయామం జరుగుతుంది. రక్త ప్రసరణ పెరుగుతుంది. ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ఎలా ఆడాలో, ఎలా ఆడకూడదో సమయస్ఫూర్తి అలవడుతుంది.
లేదా
పోతన ఆడుకునేటప్పుడు చూసిన వాళ్ళు "ఈ బాలుడు అసాధ్యుడు" అని అనుకునేవారు కదా! మరి ఇప్పుడు ఆడుకునే పిల్లలు చూసి పెద్దవాళ్ళు ఏం మాట్లాడుకుంటారు ఊహించి సంభాషణలు రాయండి.
జవాబు:
రంగయ్య: రామయ్య నేటి పిల్లలు ఆటలు ఆడడమే లేదు. నిత్యం సెల్ ఫన్లు టీవీలు చూసుకుంటా ఊబకాయంతో బాధపడుతున్నారు చూసావా?
రామయ్య : నిజమే రంగయ్య అమ్మ మనుమడు మనుమరాలు ఇద్దరూ అంతే ఎప్పుడు ఆడాలని చూడరు ఎలా మరి వీరితో
రంగయ్య: ప్రమాదకరమైన ఆటలు ఆడతారు
రామయ్య: నిజమే ప్రమాదకరమైన ఆటలు ఆడకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులది
V. పదజాల వినియోగం
కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు అదే అర్థం వచ్చే పదాలు పాఠంలో వెతికి రాయండి.
ఉదా భారతీయులు సోదర భావం కలిగి ఉంటారు సౌబ్రాత్రము
అ) లక్ష్మీ పుస్తకాన్ని తెరిచి పాఠం చదివింది జవాబు : పొత్తం
ఆ)అర్జునుడు విలువిద్య యందు అధిపుడు జవాబు : గొప్పవాడు
ఇ) బలరాముని సోదరుడు శ్రీకృష్ణుడు జవాబు: అన్న లేదా తమ్ముడు
ఈ) ప్రతిరోజు స్నానం చేసి శరీరాన్ని శుభ్రం గా ఉంచుకోవాలి. జవాబు : దేహం
2. కింది ప్రకృతి వికృతి పదాలను జతపరచండి.
అ) భోజనం - భోనం
ఆ) నిదుర - నిద్ర
ఇ) పొత్తం - పుస్తకం
3. కింది పదాలతో సొంత వాక్యాలు రాయండి.
అ) అనుజుడు
జవాబు : మా అనుజుడు చిత్రలేఖనంలో, సంగీతంలో ప్రావీణ్యుడు.
ఆ) గొంకు జంకులు : గొంకు జుంకులు లేకుండా ప్రసంగిస్తేనే వక్తలవుతారు.
జవాబు : ఎలాంటి సమస్య వచ్చినా నేను గొంకు జంకు లేకుండా మాట్లాడగలుగుతాను.
ఇ) మేటి :
జ. చదువులో ఆటలలో పాటలలో నేనే మేటి
ఈ) ఆసక్తి
జవాబు: చదువు యందు నాకు ఆసక్తి ఎక్కువగా ఉన్నది.
ఉ) వెత
జవాబు: వెత చెప్పుకుంటే మనసు తేలిక అవుతుంది
ఊ) అసాధ్యుడు
జవాబు: కార్యదీక్షత కలిగిన వారు అసాధ్యులు.
4. క్రింది వాక్యాలను చదవండి ప్రతి వాక్యంలోనూ ఒక పదానికి అదే అర్థం వచ్చే మరికొన్ని పదాలునే వారిని కింద గీత గీయండి.
అ) పురము, పట్టణము, నగరం
ఆ) ధరణి, రైతు, అవని
ఇ) కోతి, కపి, వానరం
ఈ) గుడి, కోవెల, దేవాలయం.
VI. భాషను గురించి తెలుసుకుందాం
కింది పట్టిక లోని పదాలు చదివి పుంలింగ, స్త్రీ లింగ పదాలను ఏకవచన బహువచనాలను అవ్యయాలను గుర్తించండి.
1. కింది పట్టికలోని పదాలు చదువి పుంలింగ , స్త్రీ లింగ పదాలను, నపుంసక లింగ పదాలను, ఏక వచన - బహువచనాలను, అవ్యయాలను గుర్తించండి.
అ) పుంలింగ పదాలు : సుధాకర్ చంద్రుడు బలరాం అతడు
ఆ) స్త్రీ లింగ పదాలు : రచయిత్రి, నటి, సీత ఆమె
ఇ) నపుంసక లింగ పదాలు : పుట్ట పత్రిక
ఈ) ఏకవచనం : పత్రిక, డబ్బా, ఉంగరం, బల్ల
ఉ) బహువచనం : బాలురు, మహిళలు, ఆటలు, రచనలు
ఊ) అవ్యయం: ఆహా, శభాష్, అట్లని, అమ్మో
2. కింది వాటిని జతపరచండి
అ) నామవాచకం ( జ ) హైదరాబాద్
ఆ) సర్వనామం. ( గ ) ఆమె
ఇ) విశేషణం. ( ఘ) ఎర్రని
ఈ) క్రియా ( క ) చదివింది
ఉ) అవ్యయం ( ఖ ) కానీ
3. కింది ఖాళీలను పూరించండి
అ) నామవాచకానికి లేదా సర్వ నామానికి ఉన్న గుణాన్ని తెలిపేది విశేషణం
ఆ) నామవాచకానికి బదులుగా వాడేది సర్వనామం
ఇ) పనిని తెలిపే మాట క్రియా
ఈ) లింగ వచన విభక్తులు లేనిది అవ్యయము
ఈ) పేరు తెలిపే పదం నామవాచకం.
ప్రాజెక్టు పని : మీ గ్రామంలో లేదా మీకు తెలిసిన కుటుంబంలో మంచిగా కలిసి ఉన్న అన్నదమ్ముల గురించి రాయండి వారి గురించి ఏమనిపించిందో మీ అనుభవం రాయండి ప్రదర్శించండి.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి