కింది ప్రశ్నలకు ఐదు వాక్యాలలో రాయండి.
జ. ధర్మార్జునులనే శీర్షిక తగినది.ధర్మరాజు అర్జునుల స్వరూప, స్వభావాలను దాన, వీర, బల, పరాక్రమాలను, గుణ, తత్వాదులను విషాదపరుచుచున్నందున ఈ శీర్షిక సముచితంగా ఉంది. ఈ పాఠం లో మొత్తం పది పద్యాలు ఉన్నాయి. నాలుగు పద్యాలు ధర్మరాజు సుగుణాలను. అతని పరిపాలన విధానాన్ని వర్ణించారు. 5 6 7 పద్యాలలో పాండవుల గుణగణాలను వివరించారు. 8 9 10 పద్యాలలో అర్జునుని సుగుణాలను, సొగసును, దయా హృదయాన్ని, అతడి యుద్ధ పరాక్రమ విజయాలను వర్ణించారు. ధర్మరాజు గురించి అర్జునుడు గురించి ఎక్కువ భాగం విశేషంగా వివరించడం వలన ధర్మార్జునులనే పేరు పెట్టడం తగిన విధంగా ఉన్నదని భావిస్తున్నాను.
జ. పాండవులు ఉదార స్వభావులు:
ఉదార స్వభావం అనగా దాతృత్వము దయా గొప్పతనము గాంభీర్యము నేర్పరితనము మొదలైన అర్థాలు ఉన్నాయి. ధర్మరాజుకు శాంతి, దయ ఆభరణాలుగా ఉన్నాయి.సాధు జనులను ఆదరిస్తాడు. దాన విద్యలో విశేష ఆసక్తిగలవాడు. యాచకులకు అడిగినదానికంటే అధికంగానే ఇచ్చేవాడని కవి తెలిపాడు. ప్రజలకు ఉన్న సిరిసంపదలను చూసి అసూయపడేవాడు కాదు. తను ఇచ్చిన ఆజ్ఞను తాను కూడా కట్టుబడి ఉండే విధంగా తన న్యాయ ప్రవర్తనను కాపాడుకుంటున్న వాడు. అన్యాయము కూటిలము కుట్రలు ఈర్ష అసూయలు వారిలో లేవు. పండితులకు ధర్మరాజు కొంగు బంగారం. ప్రతి అవసరాలతో తీర్చేవాడై ఉన్నాడుఈ అర్థాలు పాండవులలో అత్యధికంగా ఉండడం వలన ఉదార స్వభావులు అని పిలవచ్చు. పాండవులను దేవతా వృక్షాలుగాను, పంచ ఆయుధాలుగాను కవి పేర్కొన్నాడు. కల్పవృక్షం దేవతా వృక్షం ఎంతోమంది కోరిన కోరికలను తీర్చుతుంది వీరు అలాగే తీర్చుతున్నారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి