సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

కొత్త పొస్ట్



🌐 * L. I. P. తెలుగు ప్రారంభ పరీక్ష - BASELINE TEST 2026-27     🌐 * 10వ తరగతి 🌐 * 10వ తరగతి తెలుగులో 99% స్కోర్ సాధించాలంటే... 🌐 * తెలుగు వెలుగులీనేల 🌐 | ధ్వని గుర్తింపు / అక్షర గుర్తింపు     🌐 * సరళ పదాలు     🌐 * ఐ సి టి ఉపయోగించడం ఎలా?     🌐 * * DIKSHA WEB         🌐 SCERT         🌐 NCERT         🌐 NBT         🌐 UGC_NET         🌐 CIIL         🌐 * * NDL INDIA         🌐 SAHITHYA ACADEMY         🌐 | సిద్దెంకి కథలు     🌐 | సిద్దెంకి పుస్తకాలు     🌐 | సిద్దెంకి కవిత్వం 🌐 *"నీలి నేల ఎతలు - తెలంగాణ దళిత కథ పరిణామం కాలమ్ - కోలిమి"     🌐 | తెలుగులో అత్యుత్తమ పుస్తకాలు     🌐* | వ్యాసాలు / Articles     🌐* | దాశరథి పాటలు     🌐* | తెలంగాణ రాష్ట్రంలో దళిత కథ (2014:-07-2025)     🌐 * "సంస్కృతంతో తెలుగు కాలరాయొద్దు"     🌐 * పగిడి తెలంగాణ కథ 2024 "     🌐 * "ఆలోచనవాదుల పుష్పక విమానం దాశరథి ‘కవితా పుష్పకం’"     🌐 * Articles on Dr. Siddenky    

9, ఆగస్టు 2023, బుధవారం

VIII. 3. బండారి బసవన్న

చదవండి. ఆలోచించి చెప్పండి.

గోల్కొండ పాలకుడు అబుల్ హసన్ తానాషా. ఇతని పాలనా కాలంలో భద్రాచలం తహశీల్దారుగా కంచర్ల గోపన్న ఉండేవాడు. ఆయన శ్రీరామభక్తుడు. ప్రజల నుండి వసూలు చేసిన సుమారు ఆరు లక్షల రూపాయల పన్నుతో భద్రాచలంలో రామాలయాన్ని నిర్మించాడు. సీతారాములకు విలువైన నగలు చేయించాడు. ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేశాడనే నెపంతో గోపన్నను కారాగారంలో బంధించారు. గోపన్న తన కీర్తనలతో శ్రీరాముడిని వేడుకొన్నాడు. శ్రీరాముడే తానాషాకు ఆ సొమ్ము చెల్లించి బంధవిముక్తిడిని చేశాడు.
ప్రశ్నలు:1.కంచర్ల గోపన్న ఎవరు ?
జవాబు.గోల్కొండ పాలకుడైన అబుల్ హసన్ తానాషా కాలంలో భద్రాచలం తహశీల్దారుగా ఉన్న వ్యక్తే కంచర్ల గోపన్న.
2. అతనిపై మోపిన అభియోగమేమిటి ?
జ.ప్రజల నుండి వసూలు చేసిన సుమారు ఆరు లక్షల రూపాయల పన్నుతో భద్రాచలంలో రామాలయాన్ని నిర్మించాడని, సీతారాములకు విలువైన నగలు చేయించాడని, ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేశాడనే అభియోగం ఉంది. 
3. గోపన్న ఎట్లా బంధవిముక్తుడయ్యాడు ?జ.శ్రీరాముడే స్వయంగా మారువేషంలో తానాషా వద్దకు వచ్చి, గోపన్న చెల్లించాల్సిన డబ్బును చెల్లించాడు. దాంతో గోపన్నకు బంధవిముక్తి కలిగింది.
4.గోపన్న వంటి భక్తులను గురించి మీకు తెలుసా ?జ. గోపన్న వంటి భక్తులు ఎందరో ఉన్నారు. వారిలో ముఖ్యంగా అన్నమయ్య, త్యాగయ్య, క్షేత్రయ్య, తుకారాం వంటి వారి గురించి తెలుసు. వారంతా భగవంతుని సేవలో తరించారు.
పాఠం నేపథ్యం, ఉద్దేశం
బిజ్జలుడి కొలువులో బండారి బసవన్న దండనాయకుడుగా ఉన్నాడు. ఇతడు గొప్ప శివభక్తుడు. ఒకరోజు ఒక జంగమయ్య బసవన్న దగ్గరకు వచ్చి "నాకు ఈ క్షణంలో ఇంత ధనం కావాలి. లేకపోతే మీ సపర్యలు స్వీకరించను" అన్నాడు. అప్పుడు బసవన్న కోశాగారంలోని పేటికల్లో ఉన్న మాడలను (బంగారు నాణేలు) జంగమయ్యకు సమర్పించాడు. అది చూసిన ఇతర మంత్రులు బిజ్జలుడి దగ్గరకు పోయి బసవన్న రాజద్రోహం చేశాడని చెప్పారు.బసవన్న ఔదార్య బుద్ధి, భక్తితత్త్వం తెలియజేయటం ఈ పాఠం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు
ఈ పాఠం ద్విపద. ఇది దేశికవితా ప్రక్రియ. ఇది రెండేసి పాదాల చొప్పున మాత్రాగణాలతో సాగేరచన. మొత్తం కావ్యాన్ని ద్విపద ఛందస్సులో రాస్తే దాన్ని 'ద్విపద కావ్యం' అంటారు.ఈ పాఠం పాల్కురికి సోమనాథుడు రాసిన 'బసవపురాణం' తృతీయాశ్వాసం లోనిది.

కవి పరిచయం(ఊహాచిత్రం) 12వ శతాబ్దం 
దేశి సంప్రదాయంలో రచనలు చేసిన మొట్టమొదటి కవి పాల్కురికి సోమనాథుడు. తెలుగులో స్వతంత్ర కావ్యాన్ని రాసిన తొలికవి. బసవేశ్వరుని చరిత్రను పురాణంగా నిర్మించి ద్విపదకు కావ్య గౌరవం కలిగించిన శైవకవి. జనగామ జిల్లా పాలకుర్తి (పాలకురికి / పాల్కురికి) సోమన జన్మస్థలం.బనవపురాణము, అనుభవసారము, బనవోదాహరణము, వృషాధిపశతకము, చతుర్వేదసారము, చెన్నమల్లు సీసములు, పండితారాధ్య చరిత్రము మొదలయినవి సోమన కృతులు. రగడ, గద్య, పంచకం, అష్టకం, ద్విపద, శతకం, ఉదాహరణం మొదలయిన సాహితీ ప్రక్రియలకు ఈయన ఆద్యుడు. సంస్కృత, తమిళ, కన్నడ, మరాఠీభాషా పదాలను యథేచ్ఛగా తన రచనలో ఉపయోగించిన బహుభాషా కోవిదుడు. తెలుగులో 'మణి ప్రవాళ శైలి'ని వాడిన తొలికవి.

విద్యార్థులకు సూచనలు* 
పాఠం ప్రారంభంలోని ప్రవేశిక చదువండి. 
పాఠంలోని విషయాన్ని ఊహించండి.
* పాఠం చదువండి. అర్ధంకాని పదాల కింద గీత గీయండి.పై వాటి అర్థాలను పుస్తకం చివర ఉన్న 'పదవిజ్ఞానం' పట్టికలో చూసి లేదా నిఘంటువులో చూసి తెలుసుకొండి.

సదుద్దేశంతో చేసే పనులు ఎప్పుడూ మనిషిని సచ్ఛీలుడుగనే నిలబెడుతాయి. భగవంతుడు కూడా ఇటువంటి పనులను చేసే వారిని మెచ్చుకుంటాడు. దీనికి ఉదాహరణలు పురాణేతిహాసాలలో అనేకం కనిపిస్తాయి. ఆ కోవలోని వాడే బండారి బసవన్న. అతని జీవితంలో జరిగిన ఒక మహత్తర ఘట్టం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

I

బండారి బసవన దండనాయకుని 
రప్పించి “మాయర్థ మొప్పించి పొమ్ము 
దప్పేమి? సాలుఁ బ్రధాని తనంబు 
'దండింప రా'దను తలఁపున నిట్లు 
బండార మంతయుఁ బాడు సేసితివి 
పరధనం బపహరింపని బాస యండ్రు 
పరధనం బెక్ బసవ! కైకొంటి 
వేయు మాటలు నేల వెఱతుము నీకు 
మాయర్థ మొప్పించి నీయంత నుండు' 
మనవుడుఁ గించి త్ప్రహసితాస్యుఁడగు 
జననాథునకు బసవన మంత్రి యనియె
"బరమేశు భక్తియన్ సురతరువుండ 
హరుభక్తియన్ కనకాచలంబుండ 
గామారి భక్తి చింతామణి యుండ 
సోమార్ధ ధరు భక్తి సురధేనువుండ 
బగుతుఁడాసించునే పరధనంబునకు 
మృగపతి యెద్దెస మేయునే పుల్లు?


ఆలోచించండి- చెప్పండి.
ఆలోచించండి – చెప్పండి: 
1.‘సురతరువు, కనకాచలం, సురధేనువు, భక్తి చింతామణి’ అనే పదాలను వాడడంలో కవి ఉద్దేశం ఏమిటి ?
జ. .కల్పవృక్షం, మేరుపర్వతం, కామధేనువు, చింతామణి వంటివి దగ్గర ఉంటే తరగని సంపదలను అనుగ్రహిస్తాయి. అవి దగ్గరుండగా పరులధనముతో పని ఏమి ? పరమేశ్వరుని యందు భక్తి ఉంటే సకల సంపదలు కలుగుతాయని కవి ఆశయం.

2. ‘బగుతుడాసించునే పరధనమునకు’ దీనిపై మీ అభిప్రాయమేమిటి ?
జ. భక్తుడు తాను నమ్మిన దైవమునందే నిశ్చలమైన భక్తి కలిగి ఉంటాడు. భగవంతుడే భక్తునికి సకల సంపదలను అనుగ్రహిస్తాడు. ఆ భగవంతుడే అండగా ఉండగా ఇతరుల ధనాన్ని ఎట్లా ఆశిస్తాడు ? ఎన్నటికి ఆశింపడని భావం.

II
క్షీరాబ్ధి లోపలఁ గ్రీడించు హంస 
గోరునే పడియల నీరు ద్రావంగఁ?
జూత ఫలంబులు సుంబించు చిలుక 
బ్రాతి బూరుగు మ్రాని పండ్లు గల్గొనునె?
రాకామల జ్యోత్స్నఁ ద్రావ చకోర 
మాకాంక్ష సేయునే చీకటిఁ ద్రావ 
విరిదమ్మి వాసన విహరించుతేఁటి 
పరిగొని సుడియునే బబ్బిలి విరుల? 
నెఱుఁగునే యల దిగ్గజేంద్రంబు కొదమ 
యెఱపంది చను సీక? నెఱుఁగవు గాక 
యరుదగు లింగ సదర్థుల యిండ్ల 
వరవుడ నా కొక సరకెయర్థంబు 
పుడమీశ! మీధనంబునకుఁ జేసాఁప 
నొడయల కిచ్చితి 
నొడయల ధనం
పాదిగదఱిఁగిన భక్తుండఁగాను
గాదేని ముడుపు లెక్కలు సూడు” మనుచు 
దట్టుఁడు బసవన దండనాయఁకుఁడు 
పెట్టెలు ముందటఁ బెట్టి తాళములు 
పుచ్చుడు మాడ లుప్పొంగుచుఁ జూడ 
నచ్చెరువై లెక్క కగ్గలంబున్న

ఆలోచించండి- చెప్పండి: 
1.శివ భక్తులను హంస, చిలుక, చకోరం, తుమ్మెదలతో కవి ఎందుకు పోల్చి ఉంటాడు ?జ. లోకంలో చిలుక, హంస, చకోరం, తుమ్మెద మొదలైనవి శ్రేష్ఠమైన వాటినే ఆశ్రయిస్తాయిగాని అల్పములైన వాటిని ఆశ్రయింపవు. అట్లే శివభక్తులు కూడా ఉన్నతంగా ఉంటారేగాని అల్పములైన వాటిని కోరరు. అందుకే కవి శివభక్తులను పైవాటితో పోల్చాడు.
ప్రశ్న 2.“ఒడయల కిచ్చితి నొడయల ధనము” అనడంలో అర్థం ఏమై ఉంటుంది ?జ. ప్రజలు పన్నుల ద్వారా ధనం చెల్లిస్తేనే రాజు దగ్గర ధనం ఉంటుంది. అది రాజు సంపాదించింది కాదు. అది పరుల ధనమే. అందుకే భక్తుడు ఆ ధనాన్ని పరులకే ఇస్తున్నానని చెప్పాడు.

సారాంశం 
బిజ్జలుడు దండనాయకుడైన బండారి బసవన్నను పిలిపించాడు. "మా ధనాన్ని అప్పగించి పోవటంలో తప్పేమీ లేదు. ఇక చాలు మీ ప్రధాని పదవి. నన్నెవరు దండించలేరనే ధీమాతో ఖజానా అంతా ఖాళీ చేశావు. ఇతరుల ధనాన్ని ఆశించనని ప్రతిజ్ఞ చేశావు కదా! మరి ఎట్లా దొంగిలించావు? ఎక్కువ మాటలు ఎందుకు గానీ నిన్ను ఏమయిన అనడానికి నాకు భయం కలుగుతున్నది. మా సొమ్ము మాకిచ్చి మీరిక దయచేయవచ్చు" అన్నాడు. అప్పుడు మంత్రి బసవన చిరునవ్వుతో "పరమశివుని పట్ల భక్తి అనే కల్పవృక్షం మాకు అండగా ఉండగా, శంకరునిపై భక్తి అనే బంగారు పర్వతం (మేరు పర్వతం) నా అధీనంలో ఉండగా, పరమేశ్వరుని భక్తి అనే చింతామణి నా చెంత ఉండగా, శంభుని భక్తి అనే కామధేనువు నన్ను కనిపెట్టి ఉండగా నా వంటి భక్తుడు ఇతరుల ధనాన్ని ఆశిస్తాడా? సింహం ఎక్కడైన గడ్డి మేస్తుందా?2పాల సముద్రంలో క్రీడించే హంస మడుగులలో నీరు తాగుతుందా? మామిడి పండ్లను తినే చిలుక బూరుగు చెట్టు పండ్లను కన్నెత్తి ఐనా చూస్తుందా? నిండు పున్నమి నాటి వెన్నెలను తాగే చకోరపక్షి చీకటిని ఆస్వాదిస్తుందా? తామరపూల సుగంధంలో విహరించే తుమ్మెద ఉమ్మెత్త పూలకోసం పరుగులు తీస్తుందా? ఏనుగు పిల్ల పంది పాలు తాగడానికి తహతహలాడుతుందా? నీకు విచక్షణ లేకపోతే నేనేం చేయాలి? శివభక్తుల ఇండ్ల సంప్రదాయం నీకేం తెలుసు? స్వామి సొమ్ము స్వామికే ఇచ్చాను. ఇతరుల ధనంతో నాకేం పని? మీ ధనం కోసం నేను చేయి చాపను. నేను న్యాయం తప్పను. నీకు నా మీద నమ్మకం లేకపోతే నీ సొమ్ము లెక్క చూసుకో" అని పలికాడు. ధనాగారంలోని పెట్టెలన్నీ తెప్పించి తాళాలు తీసి బిజ్జలుడి ముందే వాటి మూతలు తీయించారు. అప్పుడు బిజ్జలుడు చూసుకుంటే పెట్టెల నిండ మాడలు (బంగారు నాణేలు) తళతళలాడుతున్నాయి. లెక్కపెట్టి చూడగా ఉండవలసిన వాటికన్న ఎక్కువనే ఉన్నాయి.ఇవి చేయండి.

ఇవి చేయండి:
I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం:
1.“అచంచల భక్తి పారవశ్యం కల్గిన వాళ్ళు ధనాశకు లోనుకారు” – దీని గురించి మీ అభిప్రాయం చెప్పండి.
జ. భక్తులు భగవంతునియందే అచంచలమైన భక్తిని కల్గియుంటారు. భక్తులకు భగవంతుని సేవే ధనం. పేదవానిలో కూడా భక్తులు భగవంతుడిని దర్శిస్తారు. వారికి ఏనాడు ధనాశ ఉండదు. తనకున్న సంపదనంతా దైవానికి అర్పిస్తారు. మనసా, వాచా, కర్మణా దైవసాన్నిధ్యాన్నే కోరుతారు.రఘుమహారాజు లాంటి మహారాజులు విశ్వజిత యాగాన్ని చేసి సంపదనంతా త్యాగం చేశారు. పోతన వంటి భగవత్ భక్తులు ఏనాడు ధనాశకు లోనుకాలేదు. జీవితాంతం భగవంతుడినే సేవించారు. ఈ రకంగా భగవత్ భక్తులు ఎన్నడునూ ధనాశకు లోను కారని తెలుస్తున్నది.
2.ద్విపదను రాగయుక్తంగా పాడండి
జ..బండారి బసవన్న
జ.ద్విపదకు రెండే పాదాలు ఉంటాయి. 
పద్యాలవలె నాలుగు పాదాలు ఉండవు. పాడుటకు వీలుగా ఉంటాయి. -ఉపాధ్యాయుని శిక్షణలో చక్కని రాగంతో పాడేలా ప్రయత్నించండి

II. ధారాళంగా చదువడం అర్ధం చేసుకొని ప్రతిస్పందించడం
1. పాఠంలో కింది భావాలున్న పాదాలను గుర్తించండి. వీటిని ఎవరు ఎవరితో అన్నారో చెప్పండి.
అ) మా ధనాన్ని అప్పగించి వెళ్ళు.
ఆ) తామర పూల వాసనలో విహరించే తుమ్మెద ఉమ్మెత్త పూలను ఎట్లా ఆస్వాదిస్తుంది?
ఇ) సింహం ఎక్కడైనా గడ్డిమేస్తుందా?

2. కింది పద్యం చదువండి. 
గంగిగోవు పాలు గరిటెడైనను చాలు
 కడివెడైన నేమి ఖరము పాలు 
భక్తిగలుగు కూడు పట్టెడైనను చాలు 
విశ్వదాభిరామ వినురవేమ!
అ) ఖరము అంటే .....గాడిద..... 
ఆ) కూడు అంటే .......తిండి.....
ఇ) గంగిగోవు పాలను .....భక్తి/ఢరిటె....తో పోల్చాడు.
ఈ) ఈ పద్యాన్ని ......వేమన....రాశాడు.
ఉ) ఈ పద్యం...... వేమన ......శతకంలోనిది..

II. ధారాళంగా చదువడం – అర్థం చేసుకొని ప్రతిస్పందించడం:
1. పాఠంలో కింది భావాలున్న పాదాలను గుర్తించండి. వీటిని ఎవరు ఎవరితో అన్నారో చెప్పండి.
అ) మా ధనాన్ని అప్పగించి వెళ్ళు.
జ.బిజ్జలుడు బసవన్నను పిలిపించి ఖజానా ఖాళీ చేస్తున్నందుకు మందలించాడు. తన ధనాన్ని తనకు అప్పగించి వెళ్ళమని బిజ్జలుడు బసవన్నను హెచ్చరించుచున్న సందర్భంలోని వాక్యమిది.
ఆ) తామర పూల వాసనలో విహరించే తుమ్మెద ఉమ్మెత్త పూలను ఎట్లా ఆస్వాదిస్తుంది ?
జవాబు.ఈ వాక్యం బసవన్న రాజుతో పలుకుచున్న సందర్భంలోనిది. తాను పరుల ధనాన్ని ఎన్నడునూ ఆశింపనని, ఉన్నతంగా జీవిస్తానని, తామరపూల సువాసనలో విహరించే తుమ్మెద ఉమ్మెత్త పూలను కోరదు కదా ! అని చెప్పాడు.
ఇ) సింహం ఎక్కడైనా గడ్డి మేస్తుందా ?
జ.ఈ వాక్యాన్ని బసవన్న రాజుతో పలికిన సందర్భంలోనిది. తాను పరుల ధనాన్ని కోరనని, ఆ అవసరం కూడా లేదని, సింహం ఎక్కడ గడ్డి మేయదని ఉదాహరణగా చెప్పిన సందర్భంలోనిది. 


III. స్వీయరచన:
1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
అ) బంధారి బసవన్న స్వభావాన్ని రాయండి.
జ.   బండారి బసవన్న గొప్ప శివభక్తుడు. అతనికి శివుణ్ణి మించిన దైవం లేదు. లోకంలో శివభక్తే శాశ్వతమైందని నమ్మేవాడు. శివునియందు భక్తి ప్రపత్తులను కల్గియుంటే సకల సంపదలను అనుగ్రహిస్తాడనే విశ్వాసం కలవాడు. ఇతరుల ధనమును ఆశింపనివాడు. తన నిజాయితీని నిరూపించుకోవడానికి వెనుకాడని భక్తశిఖామణి. ఈ లోకంలో భక్తి మాత్రమే శాశ్వతమైందని నమ్మిన గొప్ప శివభక్తుడు. దేనికీ, ఎవరికీ చలింపని ధీరగుణసంపన్నుడు.
ఆ) బండారి బసవన్న రాజుతో నిర్భయంగా మాట్లాడాడు కదా ! ఇట్లా ఎప్పుడు నిర్భయంగా మాట్లాడగలుగుతారు ?జ.  మాట్లాడడం అనేది ఒక గొప్ప కళ. అందులోను నిజాయితీగాను, నిర్భయంగాను మాట్లాడడం అందరికీ సాధ్యం కాదు. నిర్భయంగా మాట్లాడే వానికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. తాను జీవితంలో తప్పుచేయకపోవడం, ఇతరుల ధనాన్ని ఆశించకపోవడం లేదా దొంగిలించకపోవడం, ఆడిన మాటకు కట్టుబడి ఉండడం, భగవంతుని పట్ల అచంచలమైన భక్తిని కల్గి ఉండడం. ఇటువంటి లక్షణాలు కలిగినవాడు ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎవరితోనైనా నిర్భయంగా మాట్లాడగలుగుతాడు.

ఇ) భక్తుడు పరధనాన్ని ఆశించడు. ఎందుకు ?
జ.  భక్తుడు ఎప్పుడు భగవంతుని సేవలోనే ఉంటాడు. భగవంతుని మీద తనకు గల భక్తినే సంపదగా గుర్తిస్తాడు. భక్తినే కల్పవృక్షంగాను, కామధేనువుగాను, చింతామణిగాను భావిస్తాడు. ఇతరుల ధనాన్ని ఎన్నటికీ ఆశింపడు. పరుల సంపదను పాములాగా చూస్తాడు. భక్తినే తగిన ధనంగా తలచుకొని జీవిస్తాడు. అందరికి ఆదర్శంగా జీవిస్తాడు.
ఈ) “క్షీరాబ్ధి లోపలఁ గ్రీడించు హంస గోరునే పడియల నీరు ద్రావంగ” అని బసవన్న అనడంలో గల ఉద్దేశం ఏమిటి ?జ. పాలసముద్రంలో క్రీడించే హంస మడుగుల్లోని నీరు త్రాగడానికి ఇష్టపడదు. నిశ్చలమైన భక్తి గల భక్తునికి భక్తి మాత్రమే ధనం.  దేవుడుంటే సర్వస్వం ఉంటాయాని నమ్మకం. భగవంతునిపట్ల భక్తిని కల్పవృక్షంగాను, చింతామణిగాను, కామధేనువుగాను భావిస్తారు.అట్లే భక్తుడు కూడా ఉన్నతమైన భక్తిని ఆశ్రయిస్తాడుగాని అల్పమైన పరుల ధనాన్ని ఆశించడు. హంస చెడును వదిలి మంచిని స్వీకరించినట్లు నమ్మకం గల భక్తుడు హంస లాంటివాడు. జీవితంలో ఉన్నతంగానే జీవిస్తాడు. అందరికి ఆదర్శంగా నిలుస్తాడు. పరుల ధనవ్యామోహం ఉండదని అర్థం. 

2.కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.
అ) బసవని గురించి తెలుసుకున్నారు కదా ! భక్తుడికి ఉండవలసిన లక్షణాలు ఏమిటో  రాయండి.
జ.  భగవంతునిపైగల నిశ్చలమైన ప్రేమకే ‘భక్తి’ అని పేరు. ఇది నిష్కల్మషంగా ఉంటుంది. తోటివారికి ఆదర్శంగా ఉంటుంది. భక్తుడు భగవంతుని సేవ చేస్తాడు. భగవంతుని సేవలో తారతమ్యాలు ఉండవు. సంపదలు, చదువు, వైభవము మొదలైనవి భక్తి మార్గంలో కనిపించవు. నిజమైన భక్తునికి కొన్ని మహోన్నతమైన లక్షణాలు ఉంటాయి. వాటిలో కొన్ని –అన్ని ప్రాణులయందు దయ కలిగి ఉండడం.ఎవ్వరినీ, ఏదీ, ఎప్పుడూ యాచింపకుండడం.నాది, నావాళ్ళు అనే మమకారం వీడి, మనది అనే విశాల భావనను కల్గి ఉండడం.మానవసేవే మాధవసేవగా భావించి పేదలయందు భగవంతుడిని దర్శించి, వారిని సేవించడం.ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండడం. మహిళలను గౌరవభావంతో చూడగలగడం.దానధర్మాన్ని తాను ఆచరించడం. తన సమాజానికి అంకితభావంతో సేవ చేయడం.పరిపూర్ణమైన భక్తిని, జ్ఞానమును పొందగలగడం.ఎవ్వరినీ ద్వేషింపకుండడం; చేసే ప్రతి పనిని భగవంతునికే అర్పిస్తూ చేయండి.

IV. సృజనాత్మకత / ప్రశంస:
1. కింది ప్రశ్నకు జవాబును సృజనాత్మకంగా రాయండి.
అ) ద్విపద రూపంలోనున్న ఈ పాఠ్యాంశ విషయాన్ని సంభాషణ రూపంలో రాయండి.
జ.బసవన్న : మహారాజా ! మీకు ఇవే నా నమస్కారాలు. మీకు అన్నింట జయం కలుగుగాక.
రాజు : బసవన్నా ! నీకు ఇది తగునా ! ఇంతటి అధర్మానికి పాల్పడతావా !
బసవన్న : రాజా ! నేనేమి చేశాను. నాకు తెలిసి ఏ పాపం చేయదు.
రాజు : బసవన్నా ! నీవు బుకాయించకు. మా ధనాన్ని నాకు అప్పగించి వెళ్ళు.. ఇక నీ ప్రధాని పదవిచాలు. నన్ను ఎవరు దండించలేరనే ధీమాతో ఖజానా అంతా ఖాళీ చేశావు. పరుల ధనాన్ని అపహరింపదలచావు. ఇది నీకు తగునా ? ఇతరుల ధనాన్ని తీసుకోనని ప్రతిజ్ఞ చేశావు. ఇది నీకు తెలియదా ? ఇక ఇన్ని మాటలు ఎందుకు ? మా ధనాన్ని మాకు అప్పగించి వెళ్ళు.
బసవన్న : రాజా ! మీ ఆరోపణల్లో నిజం లేదు. నేను మీ ధనాన్ని అపహరించలేదు. పరమేశ్వరునిపై భక్తి అనే కల్పవృక్షం, కామధేనువు, చింతామణి వంటివి నా దగ్గర ఉన్నాయి. అలాంటి నాకు మీ సంపదలతో ఏమవసరం ? పాలసముద్రంలో విహరించే రాజహంస మురికిగుంటలోని నీటిలో విహరించడానికి ఇష్టపడుతుందా ! భగవంతుని ధనాన్ని భగవంతునికే అర్పించాను. నేను అపహరించలేదు. నీవు కాదనుకుంటే ధనాన్ని లెక్కించుకోండి.రాజు : భటులారా ! బంగారు నాణాలతో కూడిన ఆ పెట్టెలను తీసుకొనిరండి.
భటులు : చిత్తం మహారాజా ! (కొద్దిసేపటి తర్వాత) మహారాజా ! ఇవిగో ఆ పెట్టెలు
రాజు : ఈ పెట్టెకున్న తాళాలు తీయండి. 
ధనాన్ని లెక్కించండి. (తెరచిచూస్తారు)భ
టులు : మహారాజా ! అద్భుతం ! మహాద్భుతం ! ధనం మొత్తం ఉంది. ఇంకా ఎక్కువగానే ఉంది.రాజు : బసవన్నా ! నీవు ధన్యుడివి. నీ భక్తికి తిరుగులేదు, నన్ను క్షమించండి.
V. పదజాల వినియోగం: 
1.గీత గీసిన పదానికి అర్థాన్ని రాయండి.
అ) క్షీరాబ్ధిని మథించినప్పుడు అమృతం పుట్టింది.జవాబు.పాలసముద్రం
ఆ) కొండ గుహలలో నివసించే మృగపతి అడవికి రాజు.
జవాబు.సింహం
ఇ) పుడమీశులు ప్రజలను చక్కగా పరిపాలించారు.జవాబు.రాజులు
2.కింది ప్రకృతి – వికృతి పదాలను జతపరచండి.
అ) ఆశ్చర్యం ఎ) బత్తి
ఆ) భక్తి         బి) దెస
ఇ) దిశ        సి) పుడమి
ఈ) పృథ్వి    డి) అచ్చెరువు
అ) డి  ఆ) ఎ    ఇ)బి     ఈ)  సి

 VI. భాషను గురించి తెలుసుకుందాం. 
1.కింది పట్టికను పూరించండి.
జవాబు.సంధి పదం-విడదీసి రాయండి.-సంధి పేరు
ఉదా : క్షీరాబ్ధి = క్షీర + అబ్ది – సవర్ణదీర్ఘ సంధి
1. కనకాచలం = కనక + అచలం – సవర్ణదీర్ఘ సంధి
2. క్షీరాబ్ధి = క్షీర + అబ్ది – సవర్ణదీర్ఘ సంధి
3. నాకొక = నాకు + ఒక – ఉత్వసంధి
4. కాదేని = కాదు + ఏని = ఉత్వసంధి
5. అతనికిచ్చెను = అతనికి + ఇచ్చెను – ఇకారసంధి
6. పుట్టినిల్లు = పుట్టిన + ಇಲ್ಲು – అత్వసంధి
7. ఏమిటిది = ఏమిటి + ఇది – ఇత్వ సంధి
8. నాయనమ్మ = నాయన + అమ్మ – అత్వసంధిగుణసంధి:

2. కింది పదాలను విడదీయండి.
ఉదా : రాజేంద్రుడు = రాజ + ఇంద్రుడు (అ + ఇ = ఏ)
అ) గజేంద్రుడు = గజ + ఇంద్రుడు (అ + ఇ = ఏ)
ఉదా : పరమేశ్వరుడు = పరమ + ఈశ్వరుడు (అ + ఈ = ఏ)
ఆ) సర్వేశ్వరుడు = సర్వ + ఈశ్వరుడు (అ + ఈ = ఏ)
ఉదా : వసంతోత్సవం = వసంత + ఉత్సవం (అ + ఉ = ఓ)
ఇ) గంగోదకం = గంగ + ఉదకం (అ + ఉ = ఓ)
ఉదా : దేవర్షి = దేవ + ఋషి(అ + ఋ = అర్)
ఈ) మహర్షి = మహా + ఋషి(అ + ఋ = అర్)పై పదాలను గమనించండి. వాటిని మూడు రకాలుగా విడదీయటం జరిగింది. మూడు సందర్భాల్లోను పూర్వస్వరం ‘అకారం’ ఉన్నది. పరస్వరం స్థానంలో ఇ, ఈ, ఉ, ఋ లు ఉన్నాయి.”‘అ’ కారానికి ‘ఇ/ఈ’ – పరమైనప్పుడు ‘ఏ’ అకారము అంటే ‘అ’ లేదా ‘ఆ’.”అ’ కారానికి ‘ఉ’ – పరమైనప్పుడు ‘ఓ’ (ో)‘అ’ కారానికి ‘ఋ’ – పరమైనప్పుడు ‘అర్’ఏ, ఓ, అర్ లను గుణాలు అంటారు.‘అ’ కారం స్థానంలో ఏ, ఓ, అర్ లు ఆదేశంగా వచ్చాయి. ఇట్లా ఏర్పడిన సంధిని గుణసంధి అంటారు.‘అ’ కారానికి ఇ, ఉ, ఋ లు పరమైనప్పుడు క్రమంగా ఏ, ఓ, అర్ లు ఆదేశంగా వస్తాయి.'అ' కారానికి 'ఇ/ఈ' - పరమైనప్పుడు 'ఏ' (*)ఆకారము అంటే 'అ' లేదా 'అ' కారానికి 'ఉ' - పరమైనప్పుడు 'ఓ' (*).'అ' కారానికి 'ఋ' - పరమైనప్పుడు 'అర్'అ' కారం స్థానంలో ఏ, ఓ, అర్ లు ఆదేశంగా వచ్చాయి. ఇట్లా ఏర్పడిన సంధిని గుణసంధి అంటారు'అ' కారానికి ఇ, ఉ, ఋ లు పరమైనప్పుడు క్రమంగా ఏ, ఓ, ఆర్ లు ఆదేశంగా వస్తాయి.3. కింది పదాలను కలిపి సంధి ఏర్పడిన విధానాన్ని తెలుపండి.
ఉదా: మహా + ఇంద్రుడు మహేంద్రుడు
అ) దేవ + ఇంద్రుడు దేవేంద్రుడు. అ + ఇ  
(ఆ) గణ + ఈశుడు అన +ఈ = ఏ  
ఇ) నర + ఉత్తముడు = నరోతముడు అ + ఉ = ఓ
ఈ) నవ + ఉదయం =  నవోదయం . అ + ఉ = ఓ
ఉ) బ్రహ్మ + ఋషి =బ్రహ్మర్షి అ +బుు = అర్

బాషా కార్యాకలాపాలు / ప్రాజెక్టు పని
బసవని వంటి పరమ భక్తులలో ఒకరి కథను సేకరించి, మీ సొంతమాటల్లో రాసి దాన్ని తరగతిలో చెప్పండి.నేనివి చేయగలనా?
1. భక్తులకు ధనాశ ఉండదనే అంశంపై అభిప్రాయం చెప్పగలను. అవును /కాదు2. 
అపరిచిత పద్యం చదివి ఖాళీలను పూరించగలను.అవును /కాదు
3. భక్తుడి లక్షణాలను సొంతమాటల్లో రాయగలను.అవును /కాదు
4. పాఠం ఆధారంగా సంభాషణలు రాయగలను.అవును /కాదు.సూర్తి“పవిత్రులు, మంచివారైన వ్యక్తుల దగ్గరకు... దుఃఖం ఎన్నటికీ చేరదు"29స్వామి వివేకానంద

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి