సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

కొత్త పొస్ట్



🌐 * L. I. P.     🌐 * 10వ తరగతి 🌐 * 10వ తరగతి తెలుగులో 99% స్కోర్ సాధించాలంటే... 🌐 * తెలుగు వెలుగులీనేల 🌐 | ధ్వని గుర్తింపు / అక్షర గుర్తింపు     🌐 * సరళ పదాలు     🌐 * ఐ సి టి ఉపయోగించడం ఎలా?     🌐 * * DIKSHA WEB         🌐 SCERT         🌐 NCERT         🌐 NBT         🌐 UGC_NET         🌐 CIIL         🌐 * * NDL INDIA         🌐 SAHITHYA ACADEMY         🌐 | సిద్దెంకి కథలు     🌐 | సిద్దెంకి పుస్తకాలు     🌐 | సిద్దెంకి కవిత్వం 🌐 | తెలుగులో అత్యుత్తమ పుస్తకాలు     🌐* | వ్యాసాలు / Articles     🌐* | దాశరథి పాటలు     🌐* | తెలంగాణ రాష్ట్రంలో దళిత కథ (2014:-07-2025)     🌐 * "సంస్కృతంతో తెలుగు కాలరాయొద్దు"     🌐 * పగిడి తెలంగాణ కథ 2024 "     🌐 * "ఆలోచనవాదుల పుష్పక విమానం దాశరథి ‘కవితా పుష్పకం’"     🌐 * Articles on Dr. Siddenky    

16, నవంబర్ 2023, గురువారం

VIII.6. తెలుగు జానపద గేయాలు

Viii.6. తెలుగు జానపద గేయాలు 
-ఆచార్య బిరుదు రాజు రామరాజు 

పాఠ్యభాగ వివరాలు:
 ఈ పాఠం వ్యాస ప్రక్రియకు చెందినది. ఈ పాఠ్యాంశం ఆచార్య బిరుదు రాజు రామరాజు రాసిన వ్యాసం.

రచయిత పరిచయం
పేరు : ఆచార్య బిరుదురాజు రామరాజు పాఠం పేరు : తెలుగు జానపద గేయాలు జననం : 16 - 4 - 1925 
మరణం : 8 - 2 - 2010 
జన్మస్థలం : వరంగల్ అర్బన్ జిల్లా దేవునూరు గ్రామం.
 వృత్తి : కవి, పరిశోధకుడు, అనువాద రచయిత, సంపాదకుడు.
 ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షుడిగా డీన్ గా పనిచేశారు.

 ఇతర రచనలు : "తెలుగు జానపద గేయ సాహిత్యం" ఈయన పరిశోధన గ్రంథం. చరిత్ర చరితార్థులు. ఆంధ్ర యోగులు, మరుగున పడిన మాణిక్యాలు, ఉర్దూ - తెలుగు నిఘంటువు, తెలుగు జానపద రామాయణం, తెలంగాణ పల్లె పాటలు, తెలంగాణ పిల్లల పాటలు మొదలైనవి ఈయన ఇతర రచనలు.
--------
చదువండి - ఆలోచించి చెప్పండి.

చిక్కుడుపూసే చిక్కుడు కాసే తీగో నాగో ఉయ్యాలో చిక్కుడు తెంపా ఎవ్వారు లేరూ తీగో నాగో ఉయ్యాలో చిక్కుడు తెంపాసీరాములు లేరా తీగో నాగో ఉయ్యాలో కొంగూలుపట్టా ఎవ్వారు లేరూ తీగో నాగో ఉయ్యాలో కొంగూలు పట్టా సీతమ్మ లేదా తీగో నాగో ఉయ్యాలో బీరలు పూసే బీరలు కాసే తీగో నాగో ఉయ్యాలో బీరలు తెంపా శివయ్య లేడా తీగో నాగో ఉయ్యాలో కొంగూలు పట్టా ఎవ్వారు లేరూ తీగో నాగో ఉయ్యాలో కొంగూలు పట్టా పార్తమ్మ లేదా తీగో నాగో ఉయ్యాలో

ప్రశ్నలు

1. ఈ గేయం దేన్ని గురించి చెప్తుంది?

2. ఈ గేయాన్ని ఏమంటారో తెలుసా?

3. ఇట్లాంటి మరికొన్ని గేయాలు పాడండి.

4. ఇట్లాంటి గేయాల గొప్పతనం ఏమిటి?

పాఠం ఉద్దేశం

తెలుగువారి ఆచార సంప్రదాయాలను, తాత్త్వికతను, చరిత్రను తెలిపే తెలుగు జానప

గొప్పతనం, వైవిధ్యాన్ని తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు

ఈ పాఠం వ్యాసప్రక్రియకు చెందినది. ఈ పాఠ్యాంశం ఆచార్య బిరుదురాజు రామరాజు రాసిన వ్యాసం.
................
విద్యార్థులకు సూచనలు
* పాఠం ప్రారంభంలోని ప్రవేశిక చదువండి. పాఠంలోని విషయాన్ని ఊహించండి.
పాఠం చదువండి. అర్ధంకాని పదాల కింద గీత గీయండి.
* వాటి అర్థాలను పుస్తకం చివర ఉన్న 'పదవిజ్ఞానం' పట్టికలో చూసి లేదా నిఘంటువులో చూసి తెలుసుకొండి,
****************************
ప్రవేశిక

జానపద సాహిత్యమనగానే గుర్తుకువచ్చేది గేయమే. పదాలను, పాటలను జానపదులు పిలుచుకునే లయాత్మక రచనలు జానపదగేయాలు. ఈ గేయాలలో ఆయా ప్రాంతప్రజల భావోద్వేగం, దైనందిన జీవితం, చరిత్ర, సంస్కృతి, భాష మొదలైనవి కనిపిస్తాయి. సామూహిక ప్రచారం, సరళభావం, జనప్రియత్వం వీటి లక్షణాలు. సాంస్కృతిక వారసత్వంగా వచ్చే ఈ జానపదగేయాల్లోని ఔన్నత్యాన్ని తెలుసుకుందాం..
****************************

I
ఇతర భాషలలోని జానపదగేయాలలాగే తెలుగు జానపదగేయాలు కూడా విలక్షణమైన సాహిత్య సాంస్క నీ లువ సంతరించుకున్నాయి. ప్రజల నోటినుండి ఆప్రయత్నంగా వెలువడిన ఈ గేయాలలో చక్కటి శిల్పం కానవ సీ ఈ గేయ సంపదను భద్రపరచి విశ్లేషించి, పరిశీలించడం ఎంతైనా అవసరం. తెలుగు భాషాసంస్కృతుల చరిత్ర ఎం ప్రాచీనమైనదో తెలుగు జానపదగేయ చరిత్ర కూడా అంత ప్రాచీనమైనట్టిది.

ఈ జాతీయ కవిత ప్రజలకు అత్యంత సన్నిహితం కావడం చేత తెలుగులోని శిష్ట సాహిత్యంకంటే జానపదగేయ తెలుగువారి సంస్కృతికి ఉత్తమ దర్పణంగా ఉన్నాయి.

వాస్తవానికి జానపదగేయాలు శక్తిని, చైతన్యస్పూర్తిని తెనుగు ప్రజల జీవనస్రవంతి నుంచే పరిగ్రహించాయి. అందు, తపరమైన ఉద్యమాలు, వీరకృత్యాలు, మహాపురుషుల గాథలు, ఆచార వ్యవహారాలు సంప్రదాయాలు, విశ్వాసాన ఆనోద సాధనాలు, సౌందర్యం, సంపద, విషాదవృత్తాంతాలు. ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగు ప్రజల జీవిత, మావత్తూ జానపద గేయాలలో మధుర మంజుల శ్రుతిలో ప్రతిధ్వనిస్తుంది. తెలుగువారి దైనందిన జీవితంలో కవితా సౌరభం గుభాళిస్తుంది. మనోల్లాసానికి, ఆనందానికి మాత్రమే కాక ఈ గేయాలను పడవనడిపేవారు, కుప్పనూర్చేవారు. లందున్నేవారు, బరువులు మోసేవారు, కాయకష్టంచేసే ఇతర ప్రజలు శ్రమను పోగొట్టుకునే నిమిత్తం పాడుకుంటారు.. ఇటిలో సరళమైన భావాలు, ఇతివృత్తం ఉంటాయి. ఇందలి కవితను ఆస్వాదించేందుకు కేవలం మేధస్సుకంటే మృధు =హృదయం అవసరం. తెలుగు జానపద కవిత ఎంత సంపన్నమైనదో ఎంత వైవిధ్యం కలదో ఈ వ్యాసంలో చూపేందుకు ప్రయత్నించడం జరిగింది.

పౌరాణిక గేయాలు
శిష్టసాహిత్యంలో మాదిరే జానపదగేయాలకు కూడా పురాణేతిహాసాల నుంచి కథావస్తువు స్వీకరించారు. రామాయణాదులలో అనువాదాలలో మూలంలో లేని గాథలు ఎన్నో కానవస్తున్నాయి. జానపదగేయాలలో దాదాపు ప్రసిద్ధ పౌరాణిక గాథలన్నీ ఉన్నాయి. పౌరాణిక గాథలపైన మన గ్రామీణులు గొప్పభక్తి, ప్రేమాభిమానాలు చూపుతారు. పురాణాలలోని అమూల్యమైన ఉపదేశాలను విద్యావంతులు వాటిని చదువుకుని అర్ధం చేసుకుంటారు. కాగా పామరులు వాటిని జానపదగేయాల ద్వారా గ్రహిస్తారు. పామరులు ఈ ఉపదేశాలను అర్ధంచేసుకునే విధంగా జానపద గేయాలలో పొందుపరచారు. రామాయణ, మహాభారత, భాగవతాది పురాణాలు వారి వారి అభీష్టానుగుణంగా యాపుధరించాయి. శిష్ట సాహిత్యంలో మాదిరే ఇతర గాథల కంటే రామాయణ సంబంధమైన జానపదగేయాలే అధికంగా ఉన్నాయి.

శాంతాకల్యాణం, పుత్రకామేష్టి, శ్రీరాముల ఉగ్గుపాట, రాఘవకల్యాణం, రాములవారి అలుక, సుగ్రీవవిజయం, అంగదరాయబారం, లక్ష్మణమూర్ఛ, లంకాయాగం, శ్రీరామపట్టాభిషేకం, ఊర్మిళాదేవినిద్ర తదితరములు రామాయణంలోని కొన్ని ఘట్టాలను వివరిస్తున్నాయి. తెలుగు వారికి ముఖ్యంగా స్త్రీలకు సీతమ్మ ఆరాధ్యదైవం. సీత పుట్టుక, సీతాకళ్యాణం, సీతనత్తవారింటికంపుట, తసమర్త, సీతశుభగోష్టి, సీతగడియ, సీతవామనగుంటలు, సీతమ్మవారి అలుక, సీత అగ్నిప్రవేశం, సీతచెర, మాయలేడిపాట మున్నగునవి సీతాదేవిని గురించిన పాటలు. రామాయణం తర్వాత భారత సంబంధమైన పాటలు అధికసంఖ్యలో ఉన్నాయి.
****************************
ఆలోచించండి -చెప్పండి.
సీత అగ్నిప్రవేశం, సీతచెర, మాయలేడిపాట మున్నగునవి సీతాదేవిని గురించిన పాటలు. రామాయణం తర్వాత భారత సంబంధమైన పాటలు అధికసంఖ్యలో ఉన్నాయి.
*********************
II
-చారిత్రక గేయాలు

జానపదగేయ వాఙ్మయంలో చారిత్రక గేయాలకు విశిష్ట స్థానం ఉంది. ఇతివృత్తం, శైలి, కథా కథన విధానాలలో తక్కినవానికంటే ఇవి భిన్నంగా ఉంటాయి. వీటిలో వీరరసం ప్రధానంగా ఉంటుంది. అందుచేత ఈ గేయాలను వీరగీతాలని వ్యవహరిస్తారు. వీరరస ప్రధానమైన సంఘటన జరిగిన వెంటనే చారిత్రక లేదా వీరగీతం ఉద్భవిస్తుంది. అటువంటి సన్నివేశాన్ని కన్నులారా చూసినప్పుడు చెవులారా విన్నప్పుడు జానపదుడు ఉద్వేగంతో దానిని గానం చేసి వినిపిస్తాడు. 3 అపాట క్రమక్రమంగా పాకిపోతుంది. ఈ విధంగా విస్తరించడంలో పాటలోని వస్తువు కాలక్రమంలో మార్పు చెందుతుంది. = ఇట్టి గీతాలు ప్రతి భాషలోనూ ఉన్నాయి.

వీరగీతాల ధ్యేయం వేరు. ఇతర జానపద గేయాల ధ్యేయం వేరు. వీరగీతాలు కేవలం వినోదానికి, ఉల్లాసానికి - మాత్రమే కాదు. అవి వీరత్వాన్ని దేశభక్తిని ఉద్బోధించి ఉద్దీపింప చేస్తాయి. తెలుగునాడు తొలినుండి వీరసీమగా వాసికెక్కింది. ఈ సీమలో ఎందరో వీరాధివీరులు జన్మించారు. ఇచ్చట పుట్టిన చిగురు కొమ్మైనా చేవ గలదే.

మియాసాబ్ కథ, సోమనాద్రి కథ, రామేశ్వరరావు కథ, రాణిశంకరమ్మ కథ, సలై వెంకటరెడ్డి కథ, సదాశివరెడ్డి కథ, పర్వతాలమల్లారెడ్డి కథ, సర్వాయి పాపని కథ, బిల్లూరి కొండల్రాయుని కథ, కుమార రాముని కథ, తెలంగాణలో బహుళ ప్రచారం పొందిన వీర గీతాలు, వల్నాటి వీరులకథలు, కాటమరాజుకథ, దేశింగురాజుకథ, బొబ్బిలికథ, పెద్దాపురం కోడిపందేల కథ, అల్లూరి సీతారామరాజుకథ మొదలైనవి ఆంధ్రప్రాంతమంతటా ప్రచారం పొందినాయి. మహాభారత కాలం నుంచి సమరనీతి ప్రకారం ద్వంద్వయుద్ధం జరిగినప్పుడు ఒకవీరునితో శత్రుదళం నుంచి ఒక్కడు మాత్రమే తలపడాలి. అలాకాక ఒక వీరునిపై పెక్కుమంది తలపడి అతనిని పరిమార్చినట్లయితే ప్రజల దృష్టిలో అది వీరమరణం అవుతుంది. కాలక్రమంలో అతనిని జానపదులు దైవసమానుడుగా భావిస్తారు. అంతటితో వీరపూజ ప్రారంభమవుతుంది. హైదరాబాదు విమోచనోద్యమంలో అసువులు బాసిన వీరుల గాథలు ఆంధ్రదేశమంతటా ప్రచారంలోకి వస్తున్నాయి.

పారమార్థిక గేయాలు

భక్తి, కర్మ, జ్ఞానమార్గాలు మూడు మోక్షసాధనాలని భారతీయుల విశ్వాసం, ఈ మూడింటిలో భక్తి మార్గం అత్యంత సులభమైనట్టిది. తెలుగునాట శైవవైష్ణవాది కీర్తనలు వేలసంఖ్యలో ప్రజాబాహుళ్యంలో అధిక ప్రచారం పొందాయి. అదృష్టవశాత్తూ అతి ప్రాచీనమైన భక్తిగీతాలు కొన్ని మనకు లభ్యమవుతున్నాయి. ఈ భక్తి గీతాలు పాడుకుంటూ జంగంవారు. హరిదాసులు తమజీవనాన్ని సాగించుకుంటున్నారు. అదే వారి జీవనోపాధి. భద్రాచలరామదాసు కీర్తనలు, తూము నరసింహదాస కిర్తనలు, పరాంకుశదాసు, ప్రకాశదాసు, వెంకటదాసు కీర్తనలు, తెలుగుసీమ అంతటా వినవస్తాయి. పదములు, దరుపులు, మేలుకొలుపులు, భూపాళములు, లాలిపాటలు, జోలపాటలు, మంగళహారతులు స్త్రోత్రములు తారావళులు, నామావళుల కూడ కీర్తనల కిందికే వస్తాయి. 

భారతదేశం తత్వవేత్తలకు పుట్టినిల్లు. పండితులే కాం పామరులు సైతం వేదాంత సత్యాలను పాడుకుంటారు. వా గురించి చర్చించుకుంటారు. వీటిని 'తత్త్వాలు' అని అంటాం సంఘవ్యవస్థలోని కులబేధాలను ఎక్కువ తక్కువలను ఈ గీతాలలో ఖండించారు. వరలక్ష్మిపాట, శ్రావణశుక్రవారపు పాల్గొ ■ తులసిపాట, లక్షవత్తులపాట, కామేశ్వరీపాట మొదలైన్య నోములపాటలు, బొడ్డెమ్మ పాట, బతుకమ్మపాట తెలంగాణలో బహుళ ప్రచారం పొందినట్టివి.

స్త్రీల పాటలు

గృహజీవనంలో స్త్రీకి పురుషునకంటే ఎక్కువ ప్రాధాన్యత ఉన్నది. కాబట్టి సంసార విషయాలకు సంబంధించిన కవిత్వం ఆలంబనం స్త్రీలే. వీటిని స్త్రీల పాటలు అనవచ్చు. వీటిలో వాస్తవికతపాలు ఎక్కువ. శిశుజననం పురస్కరించుకొని అన్వే రకాల పాటలు పాడతారు. లాలిపాటలు, జోలపాటలు పాడి నిద్రపుచ్చుతారు. తల్లి తన కుమారుణ్ణి, రాముడిగానో, కృష్ణుడుగానో, తన కుమార్తెను సీతగానో, రుక్మిణిగానో గౌరిగానో తలచుకొని, ఈ పాటలు పాడుతూ ఆనంద తన్మయత్వం చెందుతుంది.

స్త్రీ జీవితంలో వివాహం అతి ముఖ్యమై ఘట్టం. పెండ్లికి సంబంధించిన వివిధ ఆచార వ్యవహారాలు సంప్రదాయాలు లాంఛనాలు, పరిహాసాలు వర్ణిస్తూ, పెక్కు జానపదగేయాలు ఉద్భవించాయి. ఇవి పెండ్లిపాటలు, ఇవి కట్నములతో ప్రారంభమై అప్పగింతలతో ముగుస్తాయి. కట్నముల పాటలు, నలుగుపాటలు, అలుకపాటలు, తలుపుదగ్గర పాటలు, బంతుల పాటలు, కట్నాలపాటలు, అవిరేణిపాటలు, వియ్యాలవారి పాటలు, అప్పగింత పాటలు వంటివన్నీ పెండ్లిపాటలే. ఈ పాటలన్నిటిలో తెలుగువారి సాంఘిక, సాంస్కృతిక జీవనం పూర్తిగా ఆవిష్కృతమవుతుంది. సీతసమర్త, సీతగడియ, సీతమ్మవారి వసంతం, సీతవామనగుంటలు, సుభద్రసారె. రుక్మిణిదేవి సీమంతం, కౌసల్య బారసాల మొదలైనవి అతి రమణీయములు.
అతి ప్రాచీనమైన భక్తిగీతాలు కొన్ని మనకు లభ్యమవుతున్నాయి. ఈ భక్తి గీతాలు పాడుకుంటూ జంగంవారు. హరిదాసులు తమజీవనాన్ని సాగించుకుంటున్నారు. అదే వారి జీవనోపాధి. భద్రాచలరామదాసు కీర్తనలు, తూము నరసింహదాస కిర్తనలు, పరాంకుశదాసు, ప్రకాశదాసు, వెంకటదాసు కీర్తనలు, తెలుగుసీమ అంతటా వినవస్తాయి. పదములు, దరుపులు, మేలుకొలుపులు, భూపాళములు, లాలిపాటలు, జోలపాటలు, మంగళహారతులు స్త్రోత్రములు తారావళులు, నామావళుల కూడ కీర్తనల కిందికే వస్తాయి. 

శ్రామిక గేయాలు
కవిత్వం కేవలం ఉల్లాసం కలిగించేందుకే కాక కష్టనివారణ కోసం కూడా ఉదయిస్తుంది. స్త్రీ పురుషులు కాయకష్టం చేస్తున్నప్పుడు శ్రమ కనపడకుండా ఉండేందుకు అలసట చెందకుండా ఉండేందుకు అప్రయత్నంగా వారి నోట నుండి కూనిరాగాలు వెలువడుతాయి. సామూహిక కర్తృత్వంలో ఇటువంటి రాగాలు జానపద గేయాలుగా పరిణమించి క్రమంగా వ్యాప్తి చెందుతాయి. పిండి విసురుతున్నప్పుడు, ఇల్లు అలుకుతున్నప్పుడు, ధాన్యం దంచుతున్నప్పుడు, నాగలితో దున్నుతున్నప్పుడు, నాట్లు వేస్తున్నప్పుడు పొలానికి నీరు పెడుతున్నపుడు.

విత్తనాలు జల్లుతున్నప్పుడు, వంట నూర్చుతున్నప్పుడు, పడవలాగుతున్నప్పుడు, రాళ్లు కొడుతున్నప్పుడు, బరువులు మోస్తున్నప్పుడు, రోడ్డు రోలరు లాగుతున్నప్పుడు, ఇంటికప్పులు వేస్తున్నప్పుడు, పల్లకి మోస్తున్నప్పుడు రకరకాల పాటలు పాడతారు. ఈ పాటలు పాడుతూ వనిచేయడం వల్ల హృదయంలోనూ, మనస్సులోనూ ఉండే బాధ తొలగిపోవడమే కాక, శారీరకశ్రమ కూడా తెలియదు. శ్రామిక గీతాలకు వస్తువేదైనా ఉండవచ్చు. వృత్తికి సంబంధించిన పాటలు, శ్రామికులు పాడుకుంటారు. శ్రామిక గేయాలన్నీ సాధారణంగా వారి పనిపాట్లకు అనుగుణమై ఉంటాయి. శ్రామికుల శరీరభాగాల కదలికలో ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో ఈ గీతాలకు తాళలయలు సమకూరుతాయి

'ఇచ్చట పుట్టిన చిగురు కొమ్మైనా చేవగలదే' - దీనిని ఏ సందర్భంలో వాడారు. దీనిని మీరెట్లా అర్ధం చేసుకున్నారు?
******************
ఆలోచించండి- చెప్పండి.
* 'వీరగీతాల ధ్యేయం వేరు. ఇతర జానపదగేయాల ధ్యేయం వేరు.' దీనిని వివరించండి.
* 'భక్తిగీతాలు కొందరికి జీవనోపాధి.' ఎట్లాగో చెప్పండి.
**************
III
పిల్లల పాటలు
జానపదగేయాలందు పిల్లల పాటల దొక ప్రత్యేక శాఖ. పసిపిల్లల లేతహృదయం ఎంత నిష్కపటమో, నిర్మలమో, స్వచ్ఛమో, మార్దవమో వారి పాటలు కూడా అంత నిష్కపటంగాను, నిర్మలంగాను, స్వచ్ఛంగాను, మార్దవంగాను ఉంటాయి. ఈ గేయాలు రెండు విధాలు. పిల్లల కోసం పెద్దలు రచించి తరతరాల నుండి వస్తున్నవి ఒక రకం. పిల్లలు రాసి ఒక తరం నుండి మరోతరానికి అందినవి రెండవరకం. పెద్దలు రాసిన వాటిల్లో పిల్లలను లాలించేందుకు వ్రాసినవి లాలిపాటలు, నిద్రపుచ్చేందుకు వ్రాసినవి జోల పాటు నిద్రపుచ్చుతాయి, పెద్దలు వ్రాసిన పాటలు, పిల్లలు మెట్లవలె క్రమక్రమంగా పెరిగి పిల్లలు తాము తల్లిదండ్రుల వల్లనో ఇతర్వ ఈ లాలిపాటలు, జోలపాటలలోని భావాలు పిల్లలకు అర్థం కావు, వాటిలోని సంగీతం. లయ పిల్లలను లాలిస్తాల వల్లనో విన్న పాటలు స్వయంగా పాడేటంత వరకు సాగి ఆగిపోతాయి. ఈ పాటలు పిల్లలకు మొదట నాదామృతం గ్రోలకు వేర్చుతాయి, తర్వాత అనుకరించి చేతులు తిప్పటం చివరకు లయానుగుణంగా చేతులు చరచటం నేర్చుతాయి, మొకు దశలో ఆకర్షణ, రెండవ దశలో ఉత్సాహం, మూడవ దశలో అభ్యాసం కనిపిస్తాయి.

పిల్లలు పాడే పాటలలో కొన్ని తమ సొంత రచనలు, మరికొన్ని పెద్దల రచనలకు తమ కవిత్వం కలిపి కూర్చినదిన ఉంటాయి. అనుకరణలో పిల్లలు పెద్దల రచనలలోని ధ్వనులను, మాటలని గ్రహిస్తారు. వాటిలో అర్థం ఉండదు. వాటి 'అర్ధం లేని పాటలు'గా వ్యవహరిస్తారు. బాలబాలికలు ఆటలలో పాడేపాటలు ఇట్టి కోవకు చెందినట్టివి. చెమ్మచెక్క బిన్ని కోతికొమ్మచ్చి, గుడుగుడుగుంచం, బుజబుజ రేకులు, గొబ్బిళ్లు, చిట్టిచిట్టి చిర్ర ఇందుకు కొన్ని ఉదాహరణలు.

కరుణరస గేయాలు
నిత్యం జీవితంలో సుఖం కంటే దుఃఖమే ఎక్కువగా తారసిల్లుతుంది. అందుచేత కరుణరస ప్రధానమైన సన్నివేశాలను చిత్రించే జానపద గేయాలు బహుళంగా ఉన్నాయి. ఎరుకల నాంచారమ్మ కథ, రాములమ్మ పాట, సరోజనమ్మ పాట, మూసీ పొంగే పాట మున్నగునవి తెలంగాణాలో ప్రచారంలో ఉన్న కరుణరస గేయాలు.

తెలుగు జానపద గేయాలలో అధిక ప్రచారం పొందినవాటి సంగ్రహచరిత్ర ఇది. అముద్రితమైన ఈ గేయాలు అసంఖ్యాకంగా ఉన్నాయి. వాటిని భద్రపరచేందుకు తగుశ్రద్ధ వహించక పోయినట్లయితే నాగరికత పల్లెసీమలకు విస్తరించిన కొలది ఇవి క్రమంగా అంతరించిపోతాయి. వాటికి సాహితీ పరమైన విలువ మాత్రమే కాక సాంఘిక, సాంస్కృతిక, భాషా విషయక ప్రాధాన్యత కూడ ఉన్నది. నిఘంటువులో లేని ఎన్నో అందమైన నుడికారాలు, పదాలు, ప్రయోగాలు వాటిలో కనిపిస్తాయి. రమణీయమైన స్థానికగాథలు వాటిలో అభినర్పితాలయ్యాయి. ప్రతిభ గల కవులు వాటిని చక్కటి కావ్యాల్లోను. మలచవచ్చును. వివిధ ప్రణాళికల ద్వారాను, బహుళార్ధ సాధకమైన ప్రాజెక్టుల ద్వారాను భారత దేశానికి కొత్త రూపురేఖలు. తీర్చిదిద్దేందుకు బృహత్తర కృషి జరుగుతున్నది. ఇటువంటి తరుణంలో జానపద గేయాలు నిరక్షరాస్యులైన ప్రజలలో ప్రచారానికి అత్యుత్తమ సాధనం కాగలవు. ఈ దిశలో వంగీయులు, హిందీవారు ఎక్కువ పురోగతి సాధించారు. భద్రవరచుకున్నారు. వాటిని ఉత్తమంగా వారు తమ జానపద గేయాలను జాగ్రత్తగా అనుసరించ గలరని నా విశ్వాసం. వినియోగించుకుంటున్నారు. తెలుగువారు కూడ వారిని
**************************
ఆలోచించండి- చెప్పండి.
"నిష్కపటము, నిర్మలమైన హృదయం కలిగి ఉండడం అంటే ఏమిటి?

జానపదగేయాలు ప్రచారానికి అత్యుత్తమ సాధనం. దీనిపై మీ అభిప్రాయం చెప్పండి.

జానపద గేయ సంపదను రక్షించుకోవడానికి ఏం చేయాలి?
*****************"*


ఇవి చేయండి

I. ధారాళంగా చదువడం అర్థం చేసుకొని 

II. విని, అర్ధంచేసుకొని, ఆలోచించి మాట్లాడడం

1. 'జానపదగేయాలే తెలుగువారి సంస్కృతికి ఉత్తమదర్పణం' - చర్చించండి.

2. మీకు తెలిసిన జానపద గేయాలు పాడండి. వాటి గురించి మాట్లాడండి.

1. కింద ఇచ్చిన అంశాల పేరా సంఖ్య, ఆ అంశాలకు సంబంధించిన కీలక విషయాలను పట్టికలో రాయండి.

అంశం

పేరా సంఖ్య

కీలక (ముఖ్యమైన) విషయాలు

* పౌరాణికగేయాలు
* చారిత్రకగేయాలు
* శ్రామికగేయాలు
* పిల్లలపాటలు

2. కింది పేరా చదువండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.

జానపదుల నిజమైన విద్యాభ్యాసానికి, లోకజ్ఞానానికి హేతువు వారి సాహిత్యమే. బడిలో చదివే చదువు కొంతే. సమాజం నుంచి నేర్చుకొనే చదువు కొండంత. పసి పిల్లలు ఆటలాడకుంటే వాళ్ళ మనస్సు చెడుతుంది.. దేహ ఆరోగ్యం చెడుతుంది. శారీరక శిక్షణ అన్నది జానపదులు తమకుతామే సహజంగా నేర్చుకున్నదేగాని ఒకరు నేర్పింది కాదు. పసిపిల్లలకు పెద్దలు చెప్పే కథలవల్ల వినోదమే కాక విజ్ఞానం కూడా లభిస్తుంది. అనేక విషయాలను వారు ఆలోచించేటట్లు చేస్తాయి. ప్రశ్నించే మనస్తత్త్వాన్ని పెంపొందిస్తాయి. పొడుపుకథలు జానపదుల బుద్ధికి పదునుపెట్టే సమస్యలు, ముక్తపదగ్రస్తాలు పదజ్ఞానానికి సాటి అయింది మరొకటిలేదు. ఇవి జానపదులకు ఎన్నో పాఠాలు నేర్పిస్తాయి, వారిని సంస్కారవంతులుగా తీర్చిదిద్దుతాయి. సంస్కృతికి సంబంధించిన విషయాలు కాలగర్భంలో కలిసిపోకుండా ఈ జానపద సాహిత్యం కాపాడుతుంది.

అ) జానపదులు సహజంగా నేర్చుకున్నది ఏమిటి?
జానపదులు తమకు తాము సహజంగా నేర్చుకున్నది కానీ వేరొకరు నేర్పింది కాదు.
ఆ) పెద్దలు చెప్పే కథల వల్ల పిల్లలకు కలిగే ప్రయోజనం ఏమిటి?
జ. పెద్దలు చెప్పే కథల వల్ల వినోదమే గాక విజ్ఞానం కూడా లభిస్తుంది.
ఇ) పిల్లలు ఎక్కువ చదువు నేర్చుకొనేది ఎక్కడ?
జ. పిల్లలు మాజం నుంచి నేర్చుకునే చదువుకొండంత.
ఈ) జానపద సాహిత్యం దేనికి హేతువు?
లోకజ్ఞానానికి హేతువు జానపదల సాహిత్యమే 
) పొడుపు కథలు, ముక్తపదగ్రస్తాలు వీటి ప్రత్యేకత ఏమిటి?
జ. పొడుపు కథలు వల్ల బుద్ధి, ముక్తపద గ్రస్తం వల్ల పదవిజ్ఞానం తెలుస్తుంది.
.............................

II. స్వీయ రచన
కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
అ)జానపద గేయాలను ఎందుకు భద్రపరచాలి?
జ. జానపద గేయాలు మన సంస్కృతికి నాగరికతకు, సంప్రదాయాలకు ప్రతీకలూ వాటిల్లో విద్యాభ్యాసము లోకజ్ఞానము, హేతువు అంతా వారి సాహిత్యమే. జానపద గేయాలలో ప్రశ్నించే మనస్తత్వాన్ని పెంపొందిస్తాయి. బుద్ధికి పదును పెట్టే సమస్యలు ఉంటాయి.  ముక్తపదగ్రస్తాలు వివిధ అలంకారాలు ఉంటాయి.  జానపద గేయాల్లో శైలి విశిష్టమైనదిగా పేర్కొనవచ్చు. వివిధ పురాణ గాథలు చారిత్రక కథలు విశిష్టమైన అంశాలు జానపద గేయాల్లో కనిపిస్తాయి. జానపద గేయాలు చాలా సరళమైన భాషలో ఉండి అందరికీ అర్థమవుతాయి. ఈ జానపద గేయాలు తరతరాల మన సంస్కృతికి నిదర్శనంగా నిలుస్తాయి. చరిత్రను తెలియజేస్తాయి. ఇటువంటి జానపద గేయాలను మనం వారసత్వ సంపదగా భావించాలి. ముందు తరాల వారికి అందించాలంటే వీటిని జాగ్రత్తగా భద్రపరచాల్సి ఉంటుంది.

ఆ)జానపద గేయాల్లో రామాయణ సంబంధమైన గేయాలు ఎక్కువగా ఉండడానికి కారణాలు ఏమిటి?
జవాబు:  రామాయణం పారాయణ గ్రంథం కాదు ఆచరణీయ గ్రంథము అని సూక్తి ఇది భారతీయులకు ఆదికావ్యం రామాయణం.  అనువాదాలలో మూలంలో లేని కథలు స్థానికంగా ప్రచారంలో ఉన్నవి ఉంటాయి. సీతారాములు ఆదర్శ దంపతులుగా దర్శనమిస్తారు. రాముడు మానవాళికి ఆరాధ్యుడు. శ్రీరాముడు, రాఘవ కళ్యాణం, రాములవారి అలక, సుగ్రీవ విజయం, లక్ష్మణ మూర్ఛ, లంక యాగం, శ్రీరామ పట్టాభిషేకం, ఊర్మిళాదేవి నిద్ర మొదలైనవి రామాయణంలో కొన్ని ఘట్టాలను తెలియజేస్తాయి. తెలుగువారికి ముఖ్యంగా స్త్రీలకు సీతమ్మ ఆరాధ్య దైవం. సీత అంటే కష్టాలకు చిరునామా అని భావిస్తారు. అప్పుడప్పుడు నాకు సీత కష్టం వచ్చిందని కూడా పేర్కొంటారు. సీత పుట్టుక కళ్యాణం మొదలైన వారిని ఉన్నాయి

ఇ) ‘గృహజీవనంలో స్త్రీకి పురుషునికంటే ఎక్కువ ప్రాధాన్యత ఉన్నది’ – దీనిపై మీ అభిప్రాయం ఏమిటి ?
జవాబు.
గృహజీవనంలో స్త్రీకి పురుషునికంటే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. సంసార విషయాలు స్త్రీలకే బాగా తెలుస్తాయి. పిల్లల్ని క్రమశిక్షణగా పెంచడం, కుటుంబాన్ని సమర్థవంతంగా నడపగలగడం, గృహసంబంధమైన వేడుకలు మొదలైన వాటిల్లో స్త్రీలకే ప్రాధాన్యం ఎక్కువ.

జానపదగేయాల్లో కూడా స్త్రీలకు సంబంధించినవే ఎక్కువగా ఉన్నాయి. సాధారణంగా తల్లి తన కుమారుడిని రామునిగానో, కృష్ణునిగానో, కుమార్తెను సీతగానో, రుక్మిణిగానో తలచుకొని తన్మయత్వం పొందుతుంది. పిల్లల అభివృద్ధి కోసం స్త్రీలు ఎన్నో త్యాగాలను చేస్తారు. స్త్రీకి పురుషుని కంటే ఓర్పు చాలా ఎక్కువ. కుటుంబజీవనం ఇంతగా వృద్ధి పొందడానికి స్త్రీలే ప్రధానకారణమని చెప్పవచ్చు.

ఈ) శ్రామిక గేయాల ప్రాముఖ్యత ఏమిటి ?
జవాబు.
జానపదగేయాల్లో శ్రామిక గేయాలకు ప్రత్యేకస్థానం ఉంది. ధాన్యం దంచుతున్నప్పుడు, నాగలి పట్టి దున్నుతున్నప్పుడు, నాట్లు నాటుతున్నప్పుడు, విత్తనాలు చల్లుతున్నప్పుడు శ్రామికులు అప్రయత్నంగా గీతాలను పాడుతారు. ఈ పాటలను పాడుతున్నప్పుడు శ్రామికులు తమ శ్రమను మరచిపోతారు. పాటలు పాడుతున్నప్పుడు వారికి శారీరక శ్రమ కలుగదు.

శ్రామిక గీతాలకు వస్తువు ఏదైనా ఉండవచ్చు. వృత్తికి సంబంధించిన పాటలు, శ్రామికులు పాడుకుంటారు. శ్రామిక గేయాలన్నీ సాధారణంగా వారి పనిపాట్లకు అనుగుణమై ఉంటాయి. శ్రామికుల శరీర భాగాల కదలికలో ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో ఈ గీతాలకు తాళలయలు సమకూరుతాయి.

2. కింది ప్రశ్నలకు పది వాక్యాల్లో జవాబు రాయండి.
అ) సాంఘిక, సాంస్కృతిక జీవనం పూర్తిగా కనిపిస్తుంది” – ఎట్లాగో వివరించండి.
జవాబు.
గృహజీవనంలో స్త్రీకి పురుషునికంటే ఎక్కువ ప్రాధాన్యత ఉన్నది. కాబట్టి సంసార విషయాలకు సంబంధించిన కవితకు ఆలంబనం స్త్రీలే. వీటిని స్త్రీల పాటలు అనవచ్చు. వీటిలో వాస్తవికతపాలు ఎక్కువ. శిశుజననం పురస్కరించుకొని అనేక రకాల పాటలు పాడతారు. లాలిపాటలు, జోలపాటలు పాడి నిద్రపుచ్చుతారు. తల్లి తన కుమారుణ్ణి రాముడిగానో, కృష్ణుడుగానో, తన కుమార్తెను సీతగానో, రుక్మిణిగానో, గౌరిగానో తలచుకొని, ఈ పాటలు పాడుతూ ఆనంద తన్మయత్వం చెందుతుంది.

జీవితంలో వివాహం అతి ముఖ్యమైన ఘట్టం. పెండ్లికి సంబంధించిన వివిధ ఆచార వ్యవహారాలు సంప్రదాయాలు, లాంఛనాలు, పరిహాసాలు వర్ణిస్తూ, పెక్కు జానపదగేయాలు ఉద్భవించాయి. ఇవి పెండ్లి పాటలు, ఇవి కట్నములతో ప్రారంభమై అప్పగింతలతో ముగుస్తాయి. కట్నముల పాటలు, నలుగు పాటలు, అలుక పాటలు, తలుపుదగ్గర పాటలు, బంతుల పాటలు, వధూవరుల పాటలు, ముఖము కడుగుపాటలు, కట్నాలపాటలు, అవిరేణిపాటలు, ఉయ్యాలవారి పాటలు, అప్పగింత పాటలు వంటివన్నీ పెండ్లిపాటలే. ఈ పాటలన్నిటిలో తెలుగువారి సాంఘిక, సాంస్కృతిక జీవనం పూర్తిగా ఆవిష్కృతమవుతుంది. సీత సమర్త, సీతగడియ, సీతమ్మవారి వసంతం, సీతవామనగుంటలు, సుభద్రసారె. రుక్మిణిదేవి సీమంతం, కౌసల్య బారసాల మొదలైనవి అతి రమణీయములు.

(లేదా)

ఆ) “జానపద గేయాలు మన సంస్కృతిని ప్రతిబింబిస్తాయి” – దీన్ని వివరిస్తూ రాయండి.
జవాబు.
ఇతర భాషలలోని జానపద గేయాల లాగే తెలుగు జానపద గేయాలు కూడా విలక్షణమైన సాహిత్య సాంస్కృతిక విలువ సంతరించుకున్నాయి. ప్రజల నోటినుండి అప్రయత్నంగా వెలువడిన ఈ గేయాలలో చక్కటి శిల్పం కానవస్తుంది. ఈ గేయ సంపదను భద్రపరచి విశ్లేషించి, పరిశీలించడం ఎంతైనా అవసరం. తెలుగు భాషా సంస్కృతుల చరిత్ర ఎంత ప్రాచీనమైనదో తెలుగు జానపద గేయచరిత్ర కూడా అంత ప్రాచీనమైనట్టిది.

ఈ జాతీయ కవిత ప్రజలకు అత్యంత సన్నిహితం కావడం చేత తెలుగులోని శిష్ట సాహిత్యంకంటే జానపదగేయాలే తెలుగువారి సంస్కృతికి ఉత్తమ దర్పణంగా ఉన్నాయి.

వాస్తవానికి జానపదగేయాలు శక్తిని, చైతన్య స్ఫూర్తిని తెలుగు ప్రజల జీవన స్రవంతి నుంచే పరిగ్రహించాయి. అందువల్ల మతపరమైన ఉద్యమాలు, వీరకృత్యాలు, మహాపురుషుల గాథలు, ఆచార వ్యవహారాలు సంప్రదాయాలు, విశ్వాసాలు, వినోద సాధనాలు, సౌందర్యం, సంపద, విషాదవృత్తాంతాలు. ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగు ప్రజల జీవితం యావత్తూ జానపద గేయాలలో మధుర మంజుల శృతిలో ప్రతిధ్వనిస్తుంది. తెలుగువారి దైనందిన జీవితంలో కవితాసౌరభం గుభాళిస్తుంది.

మనోల్లాసానికి, ఆనందానికి మాత్రమే కాక ఈ గేయాలను పడవనడిపేవారు, కుప్పనూర్చేవారు, పొలందున్నేవారు, బరువులు మోసేవారు, కాయకష్టంచేసే ఇతర ప్రజలు శ్రమ పోగొట్టుకునే నిమిత్తం పాడుకుంటారు. వీటిలో సరళమైన భావాలు, ఇతివృత్తం ఉంటాయి. ఇందలి కవితను ఆస్వాదించేందుకు కేవలం మేధస్సుకంటే మృదు హృదయం అవసరం. తెలుగు జానపదం ఎంతో మధురమైంది. ఈ జానపద వాఙ్మయాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది.

IV. సృజనాత్మకత / ప్రశంస
1. కింది ప్రశ్నలకు జవాబులు సృజనాత్మకంగా రాయండి.
అ) వారం రోజులపాటు వివిధ జానపద కళారూపాల ప్రదర్శన జరుగుతుంది. ఏ కళారూపం ఏ రోజు ఏ సమయంలో ప్రదర్శించబడుతుందో, ఎక్కడ ప్రదర్శించబడుతుందో మొదలైన వివరాలతో ఒక ఆహ్వాన పత్రికను తయారు చేయండి.

జానపద కళావారోత్సవాలు ఆహ్వాన పత్రిక

జై తెలంగాణ ! జై జై జానపదం !

దసరా పండుగను పురస్కరించుకొని వరంగల్లోని భద్రకాళీ ఆలయంలో జానపద కళా రూపాలను ప్రదర్శిస్తున్నాము. తరతరాల వారసత్వంగా మనకు సిద్ధించిన ఈ జానపదకళారూపాలను దర్శించి ఆనందించవలసిందిగా కోరుకుంటున్నాము.

వేదిక : కోటిలింగాల దేవస్థాన కళామండపం, సిద్దిపేట.
సమయం : రాత్రి 7 గం॥ నుండి 9 గం||ల వరకు

ప్రదర్శించే రోజు – ప్రదర్శించే జానపదకళారూపం
1) 13. 10. 18 – సీతాకళ్యాణం – తోలుబొమ్మలాట
2) 14.10.18 – సుగ్రీవ విజయం (యక్షగానం)
3) 15.10.18 – రాధాకళ్యాణం – కురువంజినృత్యం
4) 16.10.18 – వాలివధ – వీధి భాగవతం
5) 17.10.18 – వీరాభిమన్యు – హరికథ
6) 18.10.18 – రుక్మిణీ కళ్యాణం – బుర్రకథ
7) 19. 10. 18 – శ్రీకృష్ణలీలలు – ఒగ్గు కథ

ఇట్లు,
సిద్దిపేట జానపద కళా సమితి.

V. పదజాల వినియోగం:
1. కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు అదే అర్థం వచ్చే మరో రెండు పదాలను రాయండి 
సౌరభం : సువాసన, పరిమళం
అ)ఆలంబన : ఆధారం ఆశ్రయం
ఆ)మోక్షం : కైవల్యం ముక్తి 
ఇ)కష్టం : ఇక్కట్లు, శ్రమ

2. కింది పదాలతో సొంత వాక్యాలు రాయండి.
పురోగతి:  
ఇంకా మానవ పురోగతి సాధించాలి.
రూపురేఖలు:  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ప్రజల రూపురేఖలు మారాయి.

కూని రాగాలు : కొందరు తీరిక సమయాల్లో పోలిరాగాలు తీస్తారు.

VI. భాషను గురించి తెలుసుకుందాం.
ఒకటి కింది వాక్యాలను సంశిష్ట వాక్యాలుగా మార్చి రాయండి
అ)  మామయ్య ఇంటికి వచ్చాడు. మామయ్య కాఫీ తాగాడు.
జ. మామయ్య ఇంటికి వచ్చి, కాఫీ తాగాడు.

ఆ) కొమ్మ విరిగిపోయింది. కొమ్మ కింద పడింది. 
కొమ్మ విరిగి కింద పడింది.
శత్రువులు భయపడ్డారు.
 శత్రువులు పారిపోయారు. 
జవాబు: శత్రువులు భయపడి పారిపోయారు

2. కింది వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చి రాయండి.
అ) శివ అన్నం తిన్నాడు. రాజు పండ్లు తిన్నాడు.
జవాబు : శివ అన్నం, రాజు పండ్లు తిన్నారు.

ఆ) ఆమె పూలు తెచ్చింది.
ఆమె కొబ్బరికాయలు ఇచ్చింది.
జ. ఆమె పూలు మరియు కొబ్బరికాయ తెచ్చింది.

ఇ) నల్లని మబ్బులు కమ్ముకున్నాయి.
 వర్షం పడలేదు.
జ. నల్లని మబ్బులు కమ్ముకున్నా వర్షం పడలేదు.

కింది పదాలు చదవండి వాటికి విగ్రహవాక్యాలు రాయండి అవి ఏ తత్పురుష సమాసం రాయండి

అ) గదా ధరుడు : గదను ధరించిన వాడు ద్వితీయ తత్పురుష సమాసం 
ఆ) అగ్ని భయం : అగ్ని వలన భయం - పంచమి తత్పురుష సమాసం 
ఇ) గుణహీనుడు : గుణముల చేత హీనుడు - తృతీయ తత్పురుష సమాసం 

ఈ) ధనాశా : ధనమునందు ఆశ - సప్తమి తత్పురుష సమాసం 
ఉ) దైవభక్తి : దైవమునందు భక్తి - సప్తమి తత్పురుష సమాసం 
ఊ) అజ్ఞానం : జ్ఞానం కానిది - నణ్ తత్పురుష సమాసం

భాషా కార్యకలాపాలు ప్రాజెక్టు పని
పెళ్లిళ్లలో లేదా శ్రామికులకు సంబంధించిన జానపద గేయాలు సేకరించి నివేదిక రాయండి.
సీత కల్యాణ వైభోగమే 
రామ కల్యాణ వైభోగమే 
పవనజ స్తుతి పాత్ర పావని చరిత్ర 
రవి సోమ నవనేత్ర రమనీయ గాత్ర భక్తజన పరిపాల భరిత శరజాల 
భక్తి ముక్తి దలీల భూదేవ పాల

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి