సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

కొత్త పొస్ట్



🌐 * L. I. P.     🌐 * 10వ తరగతి 🌐 * 10వ తరగతి తెలుగులో 99% స్కోర్ సాధించాలంటే... 🌐 * తెలుగు వెలుగులీనేల 🌐 | ధ్వని గుర్తింపు / అక్షర గుర్తింపు     🌐 * సరళ పదాలు     🌐 * ఐ సి టి ఉపయోగించడం ఎలా?     🌐 * * DIKSHA WEB         🌐 SCERT         🌐 NCERT         🌐 NBT         🌐 UGC_NET         🌐 CIIL         🌐 * * NDL INDIA         🌐 SAHITHYA ACADEMY         🌐 | సిద్దెంకి కథలు     🌐 | సిద్దెంకి పుస్తకాలు     🌐 | సిద్దెంకి కవిత్వం 🌐 | తెలుగులో అత్యుత్తమ పుస్తకాలు     🌐* | వ్యాసాలు / Articles     🌐* | దాశరథి పాటలు     🌐* | తెలంగాణ రాష్ట్రంలో దళిత కథ (2014:-07-2025)     🌐 * "సంస్కృతంతో తెలుగు కాలరాయొద్దు"     🌐 * పగిడి తెలంగాణ కథ 2024 "     🌐 * "ఆలోచనవాదుల పుష్పక విమానం దాశరథి ‘కవితా పుష్పకం’"     🌐 * Articles on Dr. Siddenky    

6, ఆగస్టు 2023, ఆదివారం

X 4. కొత్తబాట - Dr. Siddenky

డా. పాకాల యశోద్ధా రెడ్డి 

 పాఠ్యభాగ వివరాలు: ఈ పాఠ్యభాగం డాక్టర్ పాకాల యశోద రెడ్డి గారు రచించిన "యశోద రెడ్డి ఉత్తమ కథలు" అనే గ్రంథంలోనిది. ఈ పాఠం కథానిక ప్రక్రియకు చెందినది. రెండు తరాలకు సంబంధించిన వివరాలు, తరాల మధ్య కాలానికి తగ్గట్టుగా వచ్చిన మార్పులు మొదలైన విషయాలను డాక్టర్ పి. యశోదా రెడ్డి గారు ఈ 'కొత్త బాట' కథలో తెలియజేశారు.


రచయిత్రి పరిచయం
* కొత్తబాట పాఠ్యాంశ రచయిత్రి - పాకాల యశోదా రెడ్డి. 
* మహబూబ్‌నగర్ జిల్లా బిజినేపల్లి గ్రామంలో 
జననం: ఆగస్టు 8, 1929లో జన్మించారు.
 * తెలుగులో హరివంశాలు అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పొందారు. 
* తెలుగు ప్రొఫెసర్‌గా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పనిచేశారు.
రేడియో కార్యక్రమం: మహాలక్ష్మి ముచ్చట్లు
రచనలు: ఆంధ్ర సాహిత్య వికాసం 
పారిజాతాపహరణ పర్యాలోచనము 
ఎర్ర ప్రగడ 
కథాచరిత్ర వంటి పరిశోధన గ్రంథాలు.
 మా ఊరి ముచ్చట్లు 
ఎచ్చమ్మ కథలు
కథా చరిత్ర 
ధర్మశాల కథా సంపుటాలు.




కొత్తబాట పరీక్ష


కింది లింక్ నొక్కి వినండి :



ప్రవేశిక

ఈ 'కొత్తబాట' గురించి డా|| పి.యశోదారెడ్డి మాట్లాడుతూ “ఈ కథ తెలంగాణ మాండలికంలో వ్రాయబడింది. అక్యాతమ్ముళ్ళిద్దరూ బస్సుదిగి అక్కడి నుండి ఎద్దుల బండిలో వాళ్ళ ఊరి వరకు ప్రయాణం చేసిన రెండు గంటల్లో రెండు తరాలకు జరిగిన ఘర్షణ, సాధించిన విజయాలు సప్రమాణంగా ప్రదర్శింపబడ్డాయి. ఈ సంభాషణలో ఎన్నో సాంఘిక దురాచారాలు తదమబడ్డాయి. భాష తెలంగాణ మాండలికాన్ని జీర్ణించుకొని, ఆ జాతీయాన్ని, జీవనరీతిని, నుడికారాన్ని ప్రదర్శిస్తుం"దని చెప్పింది. ఆ కొత్తబాటలో మనం నడక మొదలు పెడుదాం.

ఇవి చేయండి

అవగాహన - ప్రతిస్పందన

1. ఈ కథకు 'కొత్తబాట' అనే పేరు తగినదని భావిస్తున్నారా? ఎందుకు? చర్చించండి..
భావిస్తున్నాను. ఎందుకంటే పల్లెల్లోనూ మనుషుల మధ్య గొప్ప మార్పు తెచ్చిన కొత్తదనాన్ని ఆవిష్కరించింది.

2. పాఠం చదువండి. కింది పేరాల ఆధారంగా పట్టిక నింపింది.

పేరా సంఖ్య
2. వసతాగిన పిట్ట లాంటి తమ్ముడు / మాటకారి తమ్ముడు

7. ప్రకృతి / వనం / అడవి

13. ఎచ్చుతచ్చులు లేని తత్వం

18.

పేరా శీర్షిక

పేరాలోని ముఖ్యమైన విషయం

3. కింది పేరా చదువండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.

పల్లెసీమకు పట్టుకొమ్మలాగ మారుమూల గిరిజన గ్రామమైన కొండాపూర్ ఆదర్శంగా నిలిచింది. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలానికి 18 కిలోమీటర్ల దూరాన ఉన్న కొండాపూర్ చుట్టూ దట్టమైన అడవిమధ్య నిలిచిన అటవీ గ్రామం. ఇక్కడ 1945లో ప్రత్యేక గ్రామపంచాయితీ ఏర్పడింది. 2007 డిసెంబర్ 5న సర్పంచ్ వాసం కన్నయ్య అధ్యక్షతన జరిగిన గ్రామసభలో గ్రామ సమస్యల పరిష్కారానికి గ్రామాభివృద్ధికి 8 కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు లోడిసంస్థ సహకారంతో, గ్రామస్థుల శ్రమదానంతో మేడివాగుపై పక్కారోడ్డు నిర్మించాయి. అధికారుల సహకారంతో మద్యపాన నిషేధం అమలులో ఉన్నది. వందశాతం అక్షరాస్యత సాధించారు. గ్రామ జనాభాకు సరిపడా మినరల్ ప్లాంట్ ఏర్పాటు చేసుకున్నారు. గ్రామంలో బాలకార్మికులు లేకుండా చేశారు. పిల్లలందరిని బళ్ళలో చేర్చారు. గిరిజనులు సాధించిన ఈ అభివృద్ధిని చూసి అంతర్జాతీయ గూగుల్ ఆర్గ్ సంస్థ ఈ గ్రామాన్ని ఉత్తమగ్రామ పురస్కార్కు ఎంపిక చేసింది.

అ) కొండాపూర్ ఎక్కడ ఉన్నది?
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలానికి 18 కిలోమీటర్ల దూరం లోఉన్నది.

) గ్రామపంచాయితీ ఎప్పుడు ఏర్పడింది?
జవాబు 1945లో ప్రత్యేక గ్రామపంచాయతీ ఏర్పడింది

ఇ) గ్రామ సర్పంచ్ ఎవరు?
 కొండాపూర్ సర్పంచ్ వాసం కన్నయ్య.

ఈ) పక్కా రోడ్డు ఎవరి సహకారంతో , ఎవరు నిర్మించారు?
లోడి సంస్థ సహకారంతో 'గ్రామ కమిటీలు', గ్రామస్తుల శ్రమదానంతో పక్కా రోడ్డు నిర్మించారు.

ఉ) గ్రామ ప్రజలు సాధించిన విజయాలు ఏవి?
జవాబు. మద్యపానం నిషేధం, 100% అక్షరాస్యత, మినరల్ వాటర్ ప్లాంట్, పిల్లలందరిని బడిలో చేర్చడం మొదలైనవి చేశారు.

ఊ) ఈ పేరాకు శీర్షిక ఏం పెట్టవచ్చు?  ఎందుకు?
జవాబు. ఆదర్శగ్రామం కొండాపూర్.
ఊరికి పక్కా రోడ్ వేసుకున్నారు. మద్యపాన నిషేధం, 100% అక్షరాస్యత, మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకున్నారు. బడిలో పిల్లల్ని చేర్చడం మొదలైనవి చేసుకుంటూ ఇతర గ్రామాల వారికి ఆదర్శంగా ఉన్నారు కాబట్టి ఆదర్శ గ్రామం కొండాపూర్ అనడం సబబు.
43

II. వ్యక్తీకరణ - సృజనాత్మకత:
1. కింది ప్రశ్నలకు ఐదు వాక్యాలలో జవాబులు రాయండి.

అ) "ఎంత చెడ్డగని, ఎంత బాగా బతికిన గాని ఇంకోణి ఆసరతోటి మంది భుజాలెక్కి నడవకుండ పయినం సాగితే సాలు" అన్న అక్క మాటల్లో ఆంతర్యం ఏమై ఉంటుంది?
జ. మనుషులు ఎవరు ఇతరుల పైన ఆధారపడి జీవించకూడదు. ఎవరైనా సరే ప్రతి దానికీ ఇతరుల మీద
ఆధారపడితే చులకనగా చూడబడుతారు. ఆ మనిషి విలువ తగ్గిపోతుంది. ఉన్నంతలో జీవితం ఉన్నతంగా ఉండాలంటే కష్టపడాలి. పని చేయాలి. ధర్మ మార్గంలో డబ్బు సంపాదించాలి. కలిగినంతలో కలో, గంజి, మంచినీళ్లో తాగి పూట గడిచేటట్లు జీవించాలి. తన మటుకు తను బతికితే ఎవరితో వైరం రాదు. స్వేచ్ఛగా, సంతోషంగా, జీవితం గడపడం సంతోషించే విషయం. అందుకోసం ఎవరిని ఆశించకూడదు. ఎవరిపై ఆధారపడ కూడదు.

ఆ) "అక్కడక్కడ నక్కలు అదునుగాస్తున్న జాడలు కనబడుతున్నది" అంటే మీకేం అర్థమైంది?
జ. నక్కలు అవకాశవాద జంతువులు. నక్కలకు జిత్తుల మారి తాను అధికం. ఎలా వంచించాలి? ఎవరిని వంచించాలని కుయుక్తులు పన్నుతూ సులువుగా ఆహారం సంపాదించాలని ఆలోచిస్తుంటాయి. పెద్దపులి సింహం మొదలైన జంతువులు తిని వదిలిపెట్టిన మాంసాన్ని భుజిస్తాయి. రెండు జంతువులు కొట్లాడి చనిపోయిన వాటి మాంసం కోసం కాచుకుని కనిపెడుతుంటాయి.

ఇ) మీ గ్రామంలోని ప్రకృతిని లేదా మీ ఊరి ప్రత్యేకతలను గురించి రాయండి.
జ. మా ఊరు పచ్చని పంట పొలాలతో పాడిపంటలతో పాడిపంటలతో కలకలలాడుతుంది. గ్రామం చుట్టూ ప్రకృతి సోయగం అందర్నీ అలరిస్తుంది. పారే ఏటి అలల మీద జెల్లా, బొచ్చె మెరుపులకు మరింత సౌందర్యాన్ని చేకూర్చుతాయి. ఊరు మధ్య మందిర్లు మసీదులు చర్చిలలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. 

ఈ) చెరువుల ప్రాముఖ్యత ఏమిటి?
చెరువులు ఒక లోతైన ప్రదేశంలో వాన నీరు పడడం వల్ల కాని, భూమి లోపలినుండి అంతర్జలం బయటకు పొరలు దాటుకొని వచ్చి చేరుతుంది. కొన్ని చెరువులు ప్రభుత్వమో, రాజులో త్రవ్వించారు. చెరువుల వల్లన వ్యవసాయానికి నీరు దొరుకుతుంది. కొన్ని గ్రామాలకు చెరువు లో నీరే మంచినీరు

2. కింది ప్రశ్నలకు పది వాక్యాల్లో జవాబు రాయండి.
అ) పాఠం ఆధారంగా పల్లెల్లో వచ్చిన మార్పులను విశ్లేషిస్తూ రాయండి.
జ: కొత్త పాట ఆధారంగా పనులు వచ్చిన మార్పులు: 
మా ఊరి పొలిమేరల్లో పచ్చని పొలాలు, నిండుకుండ లాంటి చెరువు, ఎప్పుడూ పారే కాలువలు, వంతెనహ్మ్ కింది నుంచి పారే వాగు పరవళ్లు అందంగా ఉంటాయి. మామిడి చెట్లు, చెరకు తోటలు విరివిగా ఉంటాయి. 
పంట పొలాల కింద ఇసుకు దిబ్బలు ఆహ్లాదాన్ని ఇస్తాయి.
పూర్వం పల్లెలో భూస్వాములు ఉండేవారు.
 వారు పేదలపై తమ పెత్తనాన్ని చలాయిస్తూ ఉండేవారు.
పేద ప్రజలను మోసం చేస్తూ ఉండేవారు.
బాకీలు ఇచ్చి అధికంగా వడ్డీలు వసూలు చేసేవారు. 
కొందరు జీవిత కాలం చేసిన అప్పు తీరకపోయే పరిస్థితులను కల్పించేవారు. పండుగలు పబ్బాలకు మా ఊరంతా కట్టుబడి ఉంటది. మా ఊరి ప్రజలు పరస్పర సహా కారం చేసుకుంటారు. కష్ట సుఖాల్లో తోడుంటారు.

3. కింది ప్రశ్నకు సృజనాత్మకంగా సమాధానం రాయండి.
అ) పల్లె సౌందర్యాన్ని వర్ణిస్తూ పది పంక్తులు వచన కవిత రాయండి.

పల్లే పై కవిత 

మా ఊరు మంచి స్ఫూర్తి

మతల హారతి మనసులు  చూద్దువు

చిరునవ్వులు రువ్వుతూ

కన్నతల్లి ఆత్మను మరిపించే ఆత్మను చూద్దువు  

పచ్చని చెట్లు,  పాడిపంటలతో 

కలకలలాడే మాపల్లె  

పంట పొలాలు పశు  సంపదతో

శోబిల్లే  మాపల్లె 

ఆత్మీయులకి పెట్టుబోతల తీరు 

అప్యాయతలకీ ఆయువుపట్టు  

పుట్టతేనె తీరు 

పిల్లగాలులతో పల్లె సేను ఒయ్యారం ఒలుకబోస్తది

చెరువు అలలతో చెంగలిస్తూ తుల్లిపాడ్తది 

విద్యుత్ కాంతిలో మాపల్లె విరాజిల్లోతోంది

అన్నదమ్ముల అనుబంధం తో అలరారుతోంది

కులమతాలు కాదనీ 

వరుసలతో అనుబాధాలు అల్లుకుంటది. 

ఒక్కసారి రా పోగొట్టుకున్న ప్రేమలో తేలుదువు

      

III. భాషాంశాలు

 1. పదజాలం:
 1. చెవి వారిచ్చి         = శ్రద్ధగా
 నేను మా నాన్న చెప్పే నీతి కథలు చెవివారిచ్చి వింటాను.
2. చిరుత పులులు గవినిలలో నివసిస్తాయి.
గవిన్లు = గుహలు
 3. మా ఊరి పొలిమేరలో పంట పొలాలు ఉన్నాయి.
        పొలిమేర = సరిహద్దు
4. కుటిలవాజితనం = సోమరితనము
   మనుషులకు కుటిలవాజితనం పనికిరాదు 
5. పోలిమేర : సరిహద్దు  

2. పర్యాయపదాలు
1. పెయి=  మేను దేహం
2. తావుల్ల = చోటు ప్రదేశం
3. ప్రకృతి వికృతులు:
1. సముద్రము      - సంద్రం 
2. విద్య               -  విద్దె 
3. ఆధారము       - ఆదెరువు
4. శిఖ                 - సిగ
5. ప్రయాణం - పయనం

4. జాతీయాలు:
నక్షత్రకుడు             : వెంటపడి పీడించేవాడని అర్థం లోవాడుతారు
నిండుకున్నవి        : అయిపోయినవి
దడిగట్టు                 :రక్షణ కల్పించు
నిప్పులు సెరగంగ : మిక్కిలి కోపాన్ని ప్రదర్శించడం.

4. జాతీయాలు వివరణ:
నక్షత్రకుడు : వెంటపడి పీడించేవాడని అద్దంలో వాడుతారు.
నిండుకొన్నవి :  అయిపోయాయని అర్థంలో వాడుతారు.
దడిగట్టు : చుట్టూ చేరారని అర్థంలో వాడుతారు.
నిప్పుకలు సెరగంగ: కోపోద్రిక్తులు అవుతుండగా అని అర్థంలో వాడుతారు.

వ్యాకరణాంశాలు: 

ప్రాణాలుగోల్పోవు = ప్రాణాలు +  కోల్పోవు గసడవాదేశ సంధి
మూటగట్టు   = మూట  +  కట్టు - సరళాదేశ సంధి / దృత ప్రకృతిక సంధి
ఆసుపోయుట =  ఆసు +    పయుట -గసడవాదేశ సంధి
కాలుసేతులు  =   కాలు  +   సేతులు  -గజదవాదేశ సంధి
 పూచెనుగలువలు  = పూచెను  +  కలువలు -సరళాదేశ సంధి లేదా ద్రుత/ ప్రకృతిక సంధి


వృద్ధి సంధి
రసైక = రస +ఏక - (అ  +ఏ = ఐ )
ఏకైక = ఏక  +  ఏక  - (అ +ఏ = ఐ )
వసుధైక = వసుధ  + ఏక - (అ +ఏ = ఐ )
ఉదా: దివ్యైరావతం  = దివ్య  + ఐరావతం  - (అ +ఏ = ఐ )
దేశైశ్వర్యం =దేశ  +  ఐశ్వర్యం   - (అ +ఏ = ఐ )
అష్టైశ్వర్యాలు = అష్ట  + ఐశ్వర్యాలు  - (అ +ఏ = ఐ )
ఉదా: ఘనౌషధి =ఘన  + ఓషధీ      - (అ +ఓ = ఓ )
వనౌషధి =వాన +  ఓషధి - (అ +ఓ = ఔ )
 ఉదా: రసౌచిత్యం =రస  + ఔచిత్యం - (అ +ఔ  = ఔ )
దివ్య ఔషధం =దివ్య  +  ఔషధం - (అ + ఔ  = ఔ )
నాటకౌచిత్యం =నాటక  +  ఔచిత్యం - (అ + ఔ  = ఔ )
పైన ఇచ్చిన పదాలను విడదీసినప్పుడు మీరు గమనించవలసిన విషయం సరి చూడండి. ఈ సంధి ఏర్పడేటప్పుడు ప్రతిసారి పూర్వస్వరంగా అ ఆ లు వచ్చాయి. పరస్వరం స్థానంలో వరుసగా ఏ, ఐ, ఓ, ఔ లు ఉన్నాయి. అకారానికి ఏ,ఐ కలిసినప్పుడు ఐకారం వచ్చింది. ఓ, ఔ లు కలిసినపుడు ఔ కారం వచ్చింది.

1. సూత్రం : ఐ, ఔ లను వృద్ధులు అంటారు.
2. సూత్రం: అకారానికి ఏ, ఐ లు పరమైతే ఐ కారం, ఓ, ఔ లు పరమైతే ఔ కారం  ఏకాదేశంగా వస్తాయి. 


:సారాంశం:

కొత్తబాట 

'నేను రాన్రా తమ్ముడు!' అని అక్క తమ్మునితో ఎంత జెప్పిన గాని వినకుండా, పట్టిన పట్టు విడవ కుండా ఎంటబడ్డడు.

అక్క పయనమై బండెక్కి బయలు దేరింది.

వసదాగిన పిట్టోలె ఒకటే చెప్పుక పోతుండు తమ్ముడు. 

అక్క  ఎంత సేపటికీ  మాట్లాడపోయే  సరికి

ఏందే? అక్కా! ఉల్కవు? పల్కవు? అంటడు.


  చెట్ల పచ్చదనం, పువ్వుల సోయగం, చింతలు, యాపలు, మావిళ్ళ సింగారం గూర్చి  తమ్ముడు చెబుతూ ఉండగానే మాటల్లో ఊరి పొలిమేర రానే వచ్చింది. బాటకు ఇరు వైపుల గుబుర్గ వెరిగిన వాయిలు పొదలు, ఎదిగి వస్తున్న కొత్తచెట్లు, ఆయకట్ట కట్టడం వలన నీలసముద్రమోలె నిండుగ వున్న చెర్వు, గవిండ్ల గుడ్డెలుగులు, చిర్తగండు, తాచుపాము, నక్కలు అన్నీ కనబడుతున్నయి.


  కొత్తబాటేసినం అంటే అక్క నమ్మలేదు. తరాలనాటి బాట కయ్యలు గట్టి, గండ్లు వడిన బాట. ఆ వొంపులల్ల, వొర్రెలల్ల వడి నడుసుకుంట వోవలంటే కాళ్ళు బెణికేది. బండ్లో కూసుంటే నడుములిరిగేవి. అలాంటిది హాయిగా ఊరి పొలిమేర రానె వచ్చింది. 

  ఊర చెరువు, మత్తడి, పసుల కొట్టాలు, ఎల్లమ్మ గుడి, పూజారి కిష్టమాచారి ఇల్లు దాటగానే గోపాల్రాయని భవంతి బంగుల, రావి చెట్టు కింద రచ్చకట్ట అన్నింటా మార్పు కొట్టచ్చినట్లు కనబడుతుంది.

   గోపాల్రాయని బంగ్ల ఎంటనే అయిన బామ్మర్థి మిత్తి పూజ మీదనే మిద్దెలు మోపిన శ్రీమంతుడు రంగరాయని రెండంతస్తుల గచ్చు భవంతి, తరువాత వారి పాలోండ్ల ఇండ్లు, వాళ్ళ బావ పోలీసు పటేలు పాపిరెడ్డి ఇద్దరూ ఇద్దరే. హనుమంత రాయుడు కుటిల వాజి. బండి వాళ్ళ ఇంటి మూల దిరుగంగనే వాళ్ళ  పెదమామ ఇంటిపొంటి ...... మ్యాన పల్లకీలుండే పాత పొత్తులిల్లులో అదే  గరిసెల ఇండ్ల దీపాలు, మనుసులు మెసలడం కనబడింది.

   బండి ఇంటి కమాను ముందర ఆగింది. పిల్లలందరూ వచ్చి సుట్టూ జేరిండ్రు, బండి దిగి బంకులు దాటి ఇంట్లకు నఢ్సిన అలవాటు సొప్కున బాయి కాడి గచ్చుల్లకు నడ్సింది. అక్కడ వొనమాలి లేదు అక్కా అని విల్సుకుంటూ కుసుమ నీళ్ళ చెంబు అందిచ్చింది. రెండు చేతులతో ఆ పాలేరు రాజని బిడ్డను ఎత్తుకుంది. కుసుమ అని పేరు పెట్టింది తనే. తమ్ముడు బాయికాడి కమాను స్తంభానికి ఆని నిలవడ్డడు.


బాట పాఠం ప్రకారం 

మారుతున్న సమాజంలో..

  1. ఊరికి వెళ్ళే బాట సక్రమంగా ఉండేది కాదు. ఆ బాటపై ప్రయాణం చాలా కష్టంతో కూడుకున్నపని. 
  2. కొత్తబాట వేయడం వలన ప్రయాణం సుగమమైంది. యిబ్బందులు లేకుండా సులభంగా, సుఖంగా సాగుతుంది. కాని బాటకిరువైపులా ఉన్న పెద్ద పెద్ద చెట్లు తొలగించబడ్డాయి. కొత్తచెట్లు నాటారు.
  3. చెరువుకు ఆయకట్ట కట్టడం వలన చెరువు నీటితో నిండి ఊరంతటికీ ఆధారమైంది.
  4. ఉన్నత వర్గాల స్త్రీలు బండి లో వెళ్ళినప్పుడు, బండి ఊళ్లోకి రాగానే వారు ఎవరికీ కనబడకుండా బండికి ఉన్న యెర్ర పర్దాలు కిందికి దించేవారు.
  5. రచ్చండకు దూరంగా నిలబడే జనాలు, రచ్చబండ పై కూర్చునే స్వాతంత్ర్యం లభించింది.
  6. మూఢనమ్మకాలను పెంపుజేసి, మిత్తి పూజలు జేసి శ్రీమంతులైన వారి మీద ప్రజలు తిరుగబడితే వారు ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వారి బంగ్లాలల్లో దీపంపెట్టే దిక్కులేక దుమ్ముకొట్టుకొనిపోయాయి.
  7. ఒకణ్ణి ఎక్కించి, ఒకణ్ణి దించి ఇద్దర్ని ఎదగనీయకుండా జేసే నక్కజిత్తుల కుటిలవాజీలు లేరు.
  8. పంచాయితీలకు దండుగలు గట్టడంలేదు.
  9. దొంగతనాలు, పంటచేలల్లో దోపిడీలు లేవు.
  10. ఎంతటి వారికైనా సరే మనుషులు మోసే మ్యాన పల్లకీలు లేవు. పగటి దీపాలెలిగిచ్చి చేసే ఊరేగింపులు లేవు.
  11. మ్యాన పల్లకీలుండే పాత పొత్తులిల్లు రాత్రిబడిగా మారింది.
  12. పిల్లలకు సీముడు ముక్కులు లేవు, సింపులు లేవు, సీరపేండ్లు లేవు, వోరగాళ్ళు లేవు, ఊడ్సు కండ్లు లేవు. పిల్లలందరు దోస పండ్లోలె ఉంకుచండ్లోలె కళకళలాడుతున్నారు.
  13. యజమానులు, పాలేరులు అని తేడాలేకుండా కలిసి మెలిసి ఒక ఇంటిలోని వారి వలె ఉంటున్నారు. 

ముగింపు :

  ఒకప్పటి పెద్దరికం, పెత్తందారీతనం, మూఢనమ్మకాల ముసుగులో జరిగే దోపిడీలు పోయి సమసమాజ స్థాపన దిశగా నూతన సమాజ నిర్మాణానికి కొత్తబాట వేయబడింది. ఇది కొత్తకొత్త బాటలు వేయడానికి కొత్త తరాన్ని నిర్మించడానికి నాందీ భూతం. 

అ ) "నల్గురు నడిసిందే బాట " లోని అంతరార్ధమేమిటి?

1.'నల్గురు నడిచిందే బాట 'అంటే పదిమంది ఏ పని చేస్తే అదే అందరికి ఆమోదం అవుతుందని భావం, పదిమంది పాటించింది పద్దతి అవుతుందని నానుడి.
ప్రక్రియ జీవితపు ముఖ్య సన్నివేశాలను క్లుప్తంగా తెలియజేస్తుంది కథ లేదా కథానిక. సంఘటనల మధ్య సంభాషణ సంబంధాల్ని కళాత్మకంగా చిత్రిస్తుంది. ఇది వచన ప్రక్రియ. సంభాషణ కథనం శిల్పం కథానికలోని ప్రధానాంశాలు. క్లూప్త దీని ప్రత్యేకత దీనిని ఆంగ్లంలో షార్ట్ స్టోరీ అని అంటారు.

2.అదే సాంప్రదాయ మవుతుంది.నలుగురు నడిచినప్పుడే అది బాటగా మారుతుంది.దాన్నే మిగిలిన వారందరూ అనుసరిస్తారు.పదుగురాడు మాట పాడి ఐ ధర చెల్లు" అని వేమన కూడా అన్నాడు కదా! 

౩.పై ప్రశ్న డాపాకాల యశోదారెడ్డి గారు రాసిన కొత్త బాట అనే కధానిక నుండి ఈయ బడింది.జీవితపు ముఖ్య సన్నివేశాల్ని క్లుప్తంగా తెలియజేస్తుంది కధానిక.

4.సంఘటనల మధ్య సంబoదాన్ని  కళాత్మకంగా చిత్రిస్తుంది.ఇది వచన ప్రక్రియ.ఈ కథ తెలంగాణా మాండలికం లో రాయబడింది. 

''అక్కడక్కడ నక్కలు అదునుగాస్తున్న జాడలు కనబడ్తున్నవిఅంటే మీకేం అర్థమైంది? జ: నక్కలు చాలా తెలివైనవి. అవి ఉచితంగా ఎక్కడ ఆహారం దొరుకుతుందోనని కనిపెడుతుంటాయి. పెద్ద జంతువులు తినగా మిగిలిన వాటిని తింటాయి.

ఆ) సేవ్వు మిద పెను వార్తెన? అంటే మీకు ఏమి అర్థమయ్యింది ...

మన చెవి మీద పెను పాకితే ,మనలో వెంటనే చైతన్యం కలుగుతుంది.దిని అర్థం పట్టించుకోవడం.
పంచేంద్రియాలలో చెవి కూడా ఒకటి. కాని ఈ పాఠం లో అక్క చెప్తున్నా మాటలు,తమ్ముడికి చెవి మిద పెను పాకితే కలిగే టంత చలనం కూడా కలిగించలేదు.

అందువల్ల అతను అక్క చెప్పిన మాటలు వినిపించుకోకుండా తానె అక్కకు చెప్తున్నాడు.'అసలు పట్టించుకోవడం లేదు','గ్రహించాడంలేదు అని .దిని అర్థం.

పాఠం ఆధారంగా పల్లెల్లో వచ్చిన మార్పులను విశ్లేషిస్తూ రాయండి
జ: పల్లెల్లో ఆనాడు దారులన్నీ వర్షంవస్తే బురదమయంగా మారేవి. ఇప్పుడు ప్రతి పల్లెకు మంచిదారి ఏర్పాటయ్యింది. అప్పట్లో ఆడవారు ఇంట్లోనే ఉండేవారు.

కొత్త బాట పాఠం

ప్రవేశిక:

ఈ 'కొత్తబాట' గురించి డా|| పి.యశోదారెడ్డి మాట్లాడుతూ “ఈ కథ తెలంగాణ మాండలికంలో వ్రాయబడింది. అక్యాతమ్ముళ్ళిద్దరూ బస్సుదిగి అక్కడి నుండి ఎద్దుల బండిలో వాళ్ళ ఊరి వరకు ప్రయాణం చేసిన రెండు గంటల్లో రెండు తరాలకు జరిగిన ఘర్షణ, సాధించిన విజయాలు సప్రమాణంగా ప్రదర్శింపబడ్డాయి. ఈ సంభాషణలో ఎన్నో సాంఘిక దురాచారాలు తదమబడ్డాయి. భాష తెలంగాణ మాండలికాన్ని జీర్ణించుకొని, ఆ జాతీయాన్ని, జీవనరీతిని, నుడికారాన్ని ప్రదర్శిస్తుం"దని చెప్పింది. ఆ కొత్తబాటలో మనం నడక మొదలు పెడుదాం.

I

"నేను రాన్రా తమ్ముడు! అది తరాల నాటి బాట. ఎప్పుడేసిందో ఏం కతనో? ఈ వానలకూ వొరదలకు ఏర్శ పొంగంగ అది ఎన్ని కయ్యలు గొట్టిందో? ఎన్ని గండ్లు వడ్డదో? కూసుంటే నడుములిర్గె, నడిస్తే కాళ్ళు బెణికెనంట వొర్రెల ఎ వొంపులల్ల వడి ఆ బాట పొంటి వడినడ్వ నాశాతగాదు తండ్రి." అంట ఎంత జెప్పినగని వాని సెవ్వు మీద పేను వార్తెనా? గ నా మాట యింటెనా? వాని పట్టు ఇడిస్తెనా?

తుమ్మబంక అంటుకున్నట్లు ఎంటవడి "కాదక్కా మనూరికో కొత్త బాటేసినం, నీవు చూసి మెచ్చిందాక గాదు" అంట ఒకటే పట్టు, మొండిపట్టు, జనిగెపట్టు, ఇదెక్కడి సాద? వీడెక్కడి నక్షత్రకుడురా? నాయినా! అంట పయనమై బండెక్కి బయలుదేర్శ, తోవపొంటి ఊకున్నాడా? లేదు, ఉల్లాసం బట్టలేక ఒకటే చెప్పుక పోతుండడు. వసదాగిన పిట్టోలె.

"అక్కా ఇది ఈగ కాలం కాదె! పూలకాలం, ఎన్నెల మాసం, తియ్యటి తీపుల దినం, ఏమనుకున్నవో? ఎక్కడ జూసిన కమ్మటి వాసన, ఇన సొంపైన రొద, పండాకు రాలంగ అడవి అంత పసరాకు పోషాకులు తొడ్డి సోకులు పోతుండది. • మోదుగు వనం జూడు! పెయి అంతపుల్కరిచ్చినట్లు మొగ్గదొడిగి, ఎర్రగపూసి, కొత్తబాటకు మంగళార్తులు పడ్తున్న ముత్తైదలో సాళ్ళు సాళ్ళుగ నిలవడ్డవి. ఆ పొంటె ఉన్న మద్దుల జరవార జూడు! ఎంత ఎత్తుకు ఎదిగినవో? కొటారి కొమ్మలు తేనెతెట్టెలన్ని పిక్కటిల్లంగ తేనెలు ఎట్ల నింపుకొన్నవో? ఏందే? అక్కా! ఉల్కవు? పల్కవు?

అదో! అక్కడి దిక్కు జెరనా చెవువారిచ్చి ఇను, ఎడవాసిన ఎదలను ఏకంజేయ పేరు పెట్టి పిలుస్తున్నట్లు ఆ కోయిలకూతలు! అక్కా అదో! ఆ కండ్లపడేదే చింతలతోపు, చింతలింకా చిగురుకోలేదు. గున్నమావిళ్ళు జూడు! పొన్నకాయలసోంటి ఆడపిల్లలు సింగారించుకున్నట్లు కానొస్తుండవి. యాపలు ఇప్పుడిపుడె మొగ్గలు ఇచ్చుకుంటుండవి.

అదో! సూడు! మాటలల్లనే మనూరి పొలిమేర రానెవచ్చె. ఎదురుకోళ్ళ నాడు మొగపెండ్లి సుట్టాలకు మర్యాదలుజేయ గుంపు గట్టినట్లు గుబుర్ల వెరిగిన ఈ వాయిలు పొదలు జూడు! అక్కా! బాట పక్కల పొంటి ముసలి మాన్లన్ని గూలంగ ఎదిగి వస్తున్న కొత్త చెట్లను జూడమ్మా!

ఈ సూపుతోటే కొంచెం అటుదిక్కు నీ కన్నువారజేయి, ఆ చెర్వుజూడు! ఇప్పుడు నిండుగ నీల సముద్రమోలె నీరు మోస్తుండది. ఈ చెర్వుకు ఆయకట్ట కట్టిన పుణ్యాన అందరికీ ఆదెరువైంది".
38


అవును నిజంగనే! ఏకసిస్తుగ పాదరసం వొలువోసినట్లు ఈ చెర్వు ఎన్నెలకు మెరుస్తుండది. గని, ఇల్లలుకంగనె పండుగైతాది? ఈ పాయకుంటల కెళ్ళి పెద్ద కొర్రమాన్లు చెంగు చెంగున దుంకుకుంట ఎగిరి సన్న దాపలను గుట్కు గుట్కు మనుకుంట సుడిగుండాలను లేప్తనే ఉండవి. గవిన్ల గుడ్డెలుగులు చెదల పుట్టలను గోళ్ళగీకి పుట్టకు పుట్ట పెరుగుల గెట్టెలను మెక్కింది జాలక, చెట్ల శిసెలకు ఎగవాకి జెంటి తేనెలు ఆపూటం జుర్రుకొన్నది. సాలక, ఆ పూట కల్లుకు గట్టిన ఈతలొట్టి కోసం ఈక్కి ఆడ్కి కాళ్ళు గాలిన పిల్లులోలె అసువోస్తనే ఉండవి, అని, మనసుల అనుకుంట, ఆ గుడ్డెల్గులను జూసే కంటిని అట్ల మీదిమీదికి సారిచ్చేట్యాళ్ళకు గట్టుమీద జారుడు బండల ఎన్క అల్గుదుంకె కాడ, చిరగండు ఆ కాదు, ఆడిదే! అప్పుడే ఈనిందో ఏమో? కండ్లు గానక పొట్టాపతికి గాండ్రుగాండ్రు మనుకుంట తన పొట్టన పుట్టిన తన కూనల్నే నముల్క మింగ జూస్తుండది. ఆ పక్కనే గొర్రెపోతును అమాతం మందు గుడిగెలు మింగినట్లు మింగిన తాసుపాము సీకెర చెట్టుకు తీగోలె సుట్టుకున్నది. తిన్నది అరుగని పూడువాము గురిగింజలోలె గుడ్లు మిట్కుమిట్కున మిట్కరిచ్చుకుంట సుట్టకుదురోలె సుట్టుకొని 'అతీ గతీ' ఎరుగకుండ వడ్డది. ఆడాడ నక్కలు పొంచుకొని అదునుగాస్తున్న పాలిపెర గండ్లవర్తనే ఉండది.
--------------------------------
----------------------------
ఆలోచించండి- చెప్పండి.

"సెవ్వు మీద పేను వార్తెనా?' అంటే మీకేమి అర్ధమైంది?

మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా నడుచుకుంటూ పోతారా? పోయేటప్పుడు ఏమేం గమనిస్తారో చెప్పండి? మీ ఊరి పొలిమేరల్లో ప్రకృతి ఎట్లా ఉంటుందో చెప్పండి?
--------------------------------
----------------------------

II
మరి! మా తిక్క సన్నాసి కొత్త బాటేసినం, కొత్తదారి, కొత్తమలుపు అంట పదం బార్తండేంది? ఇదంత నాకు దెల్సిన బాటనె! ఎన్నేండ్ల నుంచో తొక్కుడు వద్ద బాట! ఇందుట్ల కొత్త యాడుండది? అంట అనుకున్నగని, నా మనసు నాకు బుద్ధి చెప్పుతున్నట్లనిపిచ్చింది..

అయిన గాకున్నగని మరీ, ఇంత కరుగనితనం, ఉండగూడదు. పురాగ ఎలుతురుకు దడిగట్టినట్లు ఒక్క పచ్చరం బర్వగూడదు. యాదాన్ని మెచ్చకుండ మరి అంటే మరి, రొమ్మున ఎముకలు లెక్కబెడ్తానంటే ఎట్ల? రొండు కండ్లు దెర్సి నిదానంగ లోతులు వాటిచ్చి సూడాలె, యాది కనుమరుగైన, మరుగున పడి తప్పినట్లే గద! నాకు ఎన్నటి నుండో ఎరుకున్న బాటైతే మట్కు బాగైందా? లేదా? బాట నడిసె కాలుకు రొంపి అంటుకోకుంటె కూసున్న కాడికి వచ్చి కాళ్ళకు రొచ్చు,
(page. 39)


తాక్తదా? తగుల్తదా? ఎంత చెడ్డగని, ఎంత బాగ బతికిన గని ఇంకోని ఆసరతోటి, మంది బుజాలెక్కి నడువకుండ పయినం సాగితే  సాలు మనకు కావలసింది, మనం జూడవలసిందల్ల, ఒగడు తన కాళ్ళమీద తాను  నిలబడ్డడా? లేదా? అనేది.

ఊర చెరువు దాటినం, మత్తడి దాటినం, మోతెబరి రైతుల పసుల కొట్టాలు గాన్రావట్టినవి. ఈ కొట్టాల్ల గడ్డివాములన్ని ఇగి చెదరకుండ కుదురుగా మట్టనంగ ఉండవి. ఇంటిమొకం బట్టిన ఎడ్లు లగేస్తుండవి, మా ఊరి ఎల్లమ్మ గుడి వొచ్చింది. ఆమె పసుపు బండార్లతోటి చెక్కు చెదరకుండ ఉండది. పూజారి కిష్టమాచార్ల ఇల్లు దాటినం,

ఆ కండ్ల పడేదే! గోపాల్రాయని భవంతి బంగుల, ఈడ్కి బండి జేరింది అంటే సూపుకు గోడ గట్టినట్లే. ఇందాక మరిసింది యాదికి వచ్చినట్లు మురిపాల వస్తువును గవుసెన్ల దాసినట్లు, ఎవరికంట్ల పడకుండ ఈ త్యాప గూడ మా తమ్మయ్య నాగల మీదికెళ్ళి చెంగున దుంకి కద్రానికి ఎర్రపర్దాలు సింగారిస్తడనుకొని నా పాపెట్ల సెదిరిన ఎంటికలు సక్కన దిద్దుకొని కొంగు నిండుగ సవరిచ్చుకున్న. అసొంటి దాపరికపు పనులు యావి జరుగలేదు. అంతకొస్తె ఆడ పర్దాలు ఉన్న ఉనికి గూడ కండ్లపడలేదు. నా ప్రాణానికి కొత్తగ ఊపిరి పీల్చుకున్నట్లనిపిచ్చింది.

పెండ్లి సూపుల నాడు పిలగాణోళ్ళు పెండ్లి పిల్లను గోటికొన నుండి శికెళ్ళ జూసినట్లు నేను మా ఊరిని జూడపట్టిన. నా కంటి ఎదురుంగనె రచ్చకట్ట. కందెరుగని మణుసులోలె మా రచ్చకట్ట రాగి చెట్టు రొండు ఒకదాన్నిడ్చి ఇంగోటి ఉండదన్నట్లు ఒకదానికోటి తోడంట దీటుగ నిలవడ్డవి. అదేం సిత్రమొ? గని ఈసారి సూడు సూడు మంట మా రచ్చకట్ట కింద అన్ని చెప్పులె కుప్పలైనవి. కాన్రాలేదు. ఇదేం ముంచుకొచ్చె మా ఊరికి? ఇది కలనా? మాయనా? అంట నిదానిచ్చి చూసెట్యాళ్ళకు వాళ్ళల్ల ఒగరో ఇద్దరో రచ్చమీద కూసున్నట్లు గానొచ్చిన్రు. నా కండ్లను నాకే నమ్మబుద్ధిగాలేదు. రొండు జేతుల బాగ నల్పుకొని మళ్ళ జూసిన గూడ అదే నిలుకడై నిలవడి నిజం అని తోసింది. ఓ రచ్చబండ! ఓ రాగిచెట్టు! ఎన్నాళ్ళ కెన్నాళ్ళకు ఏరుతార్లు ఎచ్చు తచ్చులు మాని తోటి మనిషికి సమానంగ తావును, నీడను పంచి ఇచ్చే యోగం, బుద్ధి మీకు దక్కింది! అని మెచ్చుకుంట సంబురాన ముందుకు సాగిన.

iii

బండి సాగిపోతనే ఉండది. ఇంగ, గోపాల్రాయని బంగ్ల ఎంటనే అయిన బామ్మర్ది రంగరాయని రెండంతస్తుల గచ్చు బవంతి, ఊరంతటికి కులపెద్దనంట నెత్తి ఎత్తుకోని నిలవడ్డట్లు గానొచ్చింది. మరి? ఎన్నడు లేంది ఆ భవంతి బంకులేమొ దిగూళ్ళల్ల దీపాలు ఎలుగుత లేవు, నేను జూస్తున్నది పొద్దు మాపు పూటనేగని, ప్రమిదలన్ని చమురు నిండుకోంగ దుమ్ము కొట్లాడుతుండవి. ఇల్లంత పాడు గొట్లాడినట్లు, కళదప్పి 'దో' అంటుండది. ఎందుకో? అంట అనుమాన పడుండంగనె మావోడు పెద్దపులిని ప్రాణంతోటి పగ్గాన ఏసిన కుశాలు తోటి.

"అక్కా! ఇన్నాళ్ళకు మసూరికి వట్టిన 'మిత్తి దొర్సాని' అదే పెద్ద మారెమ్మ పేరు లేకుండ ఊడ్సుక పోయింది. మన ఊరోళ్ళంత ఇప్పుడిప్పుడె తెలివి దెల్సి మిత్తి పూజ మీదనె మిద్దెలు మోపి శ్రీమంతుడైన రంగరాయని మీద మళ్ళెవడి అయినకె పంగనామం బెట్టిన్రు. దాంతోటి అయిన దిమ్మదిరిగి చెప్పుకుంటె సిగ్గువాయె, మూసుకుంటే ప్రాణం బాయెనంట ఇర్కుటాన (page40)

-----------------------------------------------------------------

ఆలోచింంచండి - చర్చించండి. 

"తన కాళ్ళ మీద తను నిలబడటం" అంటే ఏమిటి

 ఎప్పటి తీర్ల! ముచ్చెలకన్న కిందై వోరగ గూసుండె మణుసులు 

నాటి నేటి ఆచార వ్యవహారాల్లో తేడాలు ఉన్నాయా? ఏమిటవి?
మీ ఊర్లో రచ్చబండ/గ్రామ సచివాలయం ఉన్నదా? అక్కడ ఎవరెవరు ఏయే విషయాల గురించి మాట్లాడుతారు?
-------------------------------------------------------------

వడి కుడ్తాల పడ్డ ఎల్కతీర్గ తండ్లాడిన గని ఉపాయం దోసక పెండ్లాం పిల్లల దీస్కొని సుట్టాల మార్గం అంట రంగాపురం జేరిండు."

ఈ రంగరాయుడు చిన్న సన్నోడుగాడే! ఈ పసికారు రొండెర్గక నివురు గమ్మిన కొరివి తోటి నెత్తి గోక్కుంట లేరు గదా! ఏమో? మనుసు ఉట్టి ఊగినట్లు ఊగింది.

బండి మా పాల్గొండ్ల ఇండ్లకాడికెళ్ళి సాగుతుండది. ఇప్పుడు మా బావ పోలీసుపటేలు పాపిరెడ్డికి సాగువాటు సరిగలేదంట సూచాయగ ఇన్న. మరి అయినేం పచ్చపూస గన్యనా? రంగరాయనికి కుడి ఎదు అంతె! సేరుకు సవశేరు 'ఉద్ది'. ఊళ్ళ ఒకణ్ణి ఎక్కిచ్చి ఒగణ్ణి దించి ఇద్దర్ని ఎదుగనీయకుండ ఎప్పటి శిగలు అప్పుడె గత్తరిచ్చె విద్దెలు ఈ అయ్యలకు పొత్తిళ్ళనాడె అబ్బుకొచ్చినవి. అవును గని, అనుమంతరాయుడు? అయిని నోట్ల, నాలికె సింగోటం? వీళ్ళు మరి? అనుకుంటున్న మాటను పసిగట్టినట్లు నా తమ్ముడు.

"అక్కా ఆ కుటిలవాజి అనుమంతరాయుడు, కడ్పుల ఇసం నాల్కెన తీపి తోటి నగుకుంట గొర్రె దాటుమంది గొంతులకు ఉరులు దగిలిస్తుంటే నక్కతంతుల సింగోటం ఉన్నది లేంది దస్తురంల ఎక్కిస్తుండె. ఇంగ ఇప్పుడు కండ్లు దెర్సిన జనం వాళ్ళ కన్న దొండాకులు ఎక్కువ జదివినట్లు ఆ తంత్రాలన్ని పురుట్లనే పుట్కుమనిపిస్తుండరు. లేకుంటె ఎందట? ఎన్నాళ్ళంట వీళ్ళ చెప్పుకింద తేళ్ళ తీర్గ అణిగి మణిగి ఉంటరు? సన్నకారు మంది అంత ఇప్పుడు అయిందానికి కానిదానికి కయ్యాలకు దిగి కుస్తీపట్లు పట్టి నెత్తురు కండ్ల జూస్కోని పంచాయితిల పడి ఆ పంచాయితిదార్లకు అప్పు సప్పు జేసి దండుగలు గట్టుకం లేదు. ఏ వాడన పంచాయితి ఆ వాడనె తీర్పులు జరుగుతుండవి. అక్కా! ఇన్నాళ్ళ తీరుగ అద్దమ్మ రాత్రిర్లు దొంగతనాలు లేవు, సేండ్ల దోపిండ్లు లేవు, పరిక్కంపలు లేవు, లాగుల తొండలు లేవు, ముంతపొగలు లేవు, ఈపు ముద్దెర్లు లేవు, బండ బర్వులు లేవు, అడుక్కు తిండ్లు లేవు".
-----------------------------
----------------------------
అలోచించండి-చెప్పండి.

* 'కడ్పుల ఇసం నాల్కెన తీపి' అంటే మీరేం అర్ధం చేసుకున్నారు?

* పంచాయితీలు చెప్పడం అంటే ఏమిటి? పంచాయితీలను ఎట్లా జరుపుతారు?

* "కళదప్పిన ఇల్లు" ఎట్లా ఉంటుంది?


----------------------------
----------------------------
IV
బండి మా ఇంటిదిక్కు మూలమల్పు దిరిగింది. ఆడ మా పెదమామ ఇంటిపోంటి ఉన్న గరిసెల ఇండ్లల్ల దీపాలు ఎలిగినట్లు నలుగురు మణుసులు మెసిల్నట్లు జళకళ గలగల సప్పుడు ఇనిపిచ్చింది. ఇదేందిరా? అన్నట్లు మా తమ్ముణి దిక్కుజూసిన, ఎంటనే మా హాజిర్ జవాబు ఎక్కుళ్ళేని ఉల్లాసం తోటి బుజాన ఏసుకున్న దస్తు రుమాలు జాడిచ్చి దులుపుకుంట "అక్కా ఇది మన మ్యాన పల్లకీ లుండె పాత పొత్తులిల్లు, జనం మెదులక బండ జింకలు జేరి అబ్బో అన్నట్లుంటుండె, అది ఇప్పుడు మనూరికి రాత్రిబడి బంది. మేమంత గలిసి ఈ ఊళ్ళ ఎవరి పెండ్లిళ్ళైనగాని, వాళ్ళెంత మోతెబరి కర్ణప్పటేండ్లన, వాండ్ల పెండ్లిండ్లకు మణుసులు మోసే మ్యానా పల్లకీలు రాగూడదు. సంబురానికి మెరిమెణ జేసి పగటి దీపాలెలిగిచ్చి ఊరంత మెరిచ్చిన మెరియ్యని ఊరేగింపులు తీసె మద్దూరు లేదు అంట కట్టడి జేసినం. ఇంగ మనపెత్తాత కండ్లు నిప్పుకలు సెరుగంగ, చేసేది లేక తామసం ఆపుకొని పణమీది చెముటలు చిన్నపంచె తోటి తుడ్చుకుంట బుస్సు బుస్సు మంటుండంగ మేమంత ఈ పాత సవారీలను బద్దురంగ గుమ్ములింట్ల అలంకారాలోలె యాళ్ళాడగట్టినం".

బండి మా ఇంటి కమాను ముంగల ఆగింది. గజ్జెల సప్పుడు ఇని ఆ సుట్టుపక్కల పిల్లలంత ఉరుక్కుంటొచ్చి సుట్టు జుట్టుకున్నరు. ఈ పిల్లలు ఇన్నాళ్ళ తీర్గ ఈసురుమంట లేరు, ఇప్పుడు సీమిడి ముక్కులు లేవు, సింపులు లేవు, సీరపేండ్లు లేవు, వోరగాళ్ళు లేవు, ఊడ్సుకండ్లు లేవు, పిల్లలందరు దోసపండ్లోలె, ఉంకు చెండ్లోలె కళకళ లాడ్తుండరు.
(page: 41)


బండిదిగి బంకులు దాటి ఇంట్లకు నడ్సిన, అలువాటు సొప్పున బాయికాడి గచ్చుల్లకు నడ్సిన. ఆడ ఎప్పటి తీర్ల కండ్లు బయట బంకుల్లకు సారిచ్చి, ఓ చేత సెంబు, ఓ చేయి నడుమున వెట్టి వొయ్యారంగ వోనమాలి నిలవడి లేదు. పౌనమాలమ్మ ఇప్పుడు మా పెద్దత్త పక్కన దేవుణింటి ముందల గూసుండి వొత్తులు పేనుతుందది. ఇది కలనా? నిజమా? అంట డింగై అక్కడికక్కడ జూస్తుండంగనే 'అక్కా!' అంట విల్సుకుంటొచ్చి కుసుమ నాకు నీల్ల చెంబు అందిచ్చింది. ఒక్కసారి అమాంతం నా చేతులున్న చెంబు జారినంత పనైంది, గని అనుకోకుండ నా రొండు చేతులు మా పాలేరు రాజని బిడ్డ కుసుమ (దానికి ఆ పేరు పెట్టింది నేనే) దిక్కు సాగినవి. అది నా ఎదకొచ్చి ఆనింది. అన్ని కండ్లు ఒక దిక్కే సూడవట్టినవి. ఇవ్వరుకదులలేదు. ఇవ్వరినోట మాట పెకులలేదు. మా బాయి దగ్గెరున్న తరాలనాటి కారుమల్లె మొద్దు అనుకోకుండ మళ్ళా ఈనాటికి సిగురేసి సిగ్గారి తీర్గ వన్నెలు వడ్తుండది. ఇంతట్లకే మా తమ్ముడొచ్చి ముసి ముసి నగుకుంట బాయికాడి కమాను స్తంభానికి ఆని నిలవడ్డడు. ఇల్లంత ఎన్నెలలు కురిసినట్లనిపిచ్చింది.

అవును ఇది కొత్త బాటనే! ఇంతకంటె కొత్తబాట, మంచిబాట ఇంగెట్లుంటది? యాడుంటది? బాట ఏసెటోళ్ళు నడుస్తుండాలె గని, పాపం ఆ బాట వొల్లనంటదా? వొదుగనంటదా? నల్గురు పల్కిందె మాట, నల్గురు మెచ్చిందె నడుత, నల్గురు నడిసిందె బాట.

-----------------------------------------------------------------

ఆలోచించంది చెప్పండి.

రాత్రిబడి అంటే ఏమిటి? రాత్రి బళ్ళను ఎందుకు నడుపుతారు?

* 'నల్గురు నడిసిందె బాట'లోని అంతరార్థం ఏమిటి? చర్చించండి.

-------------------------------------------------------------------

1 కామెంట్‌: