సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

10, ఫిబ్రవరి 2023, శుక్రవారం

10. బిక్ష


కం. తనకోపమె తన శత్రువు
తనశాంతమె తనకురక్ష దయ చుట్టంబౌఁ
దనసంతోషమె స్వర్గము
తనదుఃఖమె నరకమండ్రు తథ్యము సుమతీ.

ప్రశ్నలు – జవాబులు


ప్రశ్న 1.
ఈ పద్యంలో శత్రువుగా దేనిని పేర్కొన్నాడు ? ఎందుకు ?
జవాబు:
ఈ పద్యంలో శత్రువుగా కోపాన్ని పేర్కొన్నాడు. కోపం అంతర్గతమైన శత్రువు. ఇది సకల అనర్థాలను కలిగిస్తుంది. బంధువులను, ఆప్తులను, మిత్రులను దూరం చేస్తుంది. రోగాలను కల్గిస్తుంది.


ప్రశ్న 2.
శాంతి రక్షగా ఉంటుందనడంలో కవి ఉద్దేశమేమిటి ?
జవాబు:
శాంతి మానవాళికి రక్షణకవచంలా ఉంటుంది. శాంతం ఉంటే మనకు శ్రీరామరక్ష. సమాజంలో గౌరవ మర్యాదలను వృద్ధి పొందింపజేస్తుంది. ఆప్తులను, బంధువులను దూరం చేయదు. పనులు త్వరగా అవుతాయి. ఇంట్లో సకల సుఖాలు కలుగుతాయి. యుద్ధోన్మాదాలు కలుగవు. అందువల్ల శాంతి అనేది కేవలం శరీరానికేకాదు. సకల సమాజానికి రక్షణగా ఉంటుంది. “తనశాంతమె తనకు రక్ష” అని సుమతీ శతకకర్త బద్దెన చెప్పాడు.


పాఠం నేపథ్యం / ఉద్దేశం :
 వేద విభజన చేసి, పంచమ వేదంగా మహాభారతాన్ని రచించి, అష్టాదశ (18) పురాణాలను రచించిన బ్రహ్మజ్ఞాని వేద వ్యాసుడు. పరమ పవిత్రం,  పరమేశ్వరునికి ప్రీతి పాత్రమైన కాశిలో వ్యాసము తన పదివేల మంది శిష్యులతో కొంతకాలం నివసించాడు బ్రహ్మీ ముహూర్తంలో నిద్ర లేచి, ప్రాతర్మద్యాహ్నిక విధులను పూర్తిగా శిష్యులతో కాశీ నగరంలో భిక్షాటనం చేసేవాడు. శిష్యులు తాను వేరువేరుగా తెచ్చిన బిక్షలో సగం అతిధి అభ్యాగతులకు సమర్పించి, మిగిలింది భుజించేవారు. ఒక రోజున కాశీ విశ్వనాథునికి వ్యాసుడిని పరీక్షించాలన్న సంకల్పం కలిగింది. ఆ సందర్భంగా జరిగిన సంఘటనే ఈ పాఠం.

 ఆకలి ఎంత వారినైనా విచక్షణ కోల్పోయేలా చేస్తుంది. ఇది మంచిది కాదు అని తెలియజెప్పడమే ఈ పాఠం ఉద్దేశం దేశం.

పాఠ్య భాగ వివరాలు: 
ఈ పాఠం కావ్య ప్రక్రియకు చెందింది. ఇది శ్రీనాథుడు రచించిన 'కాశీ ఖండం' కావ్యంలోని సప్తమాశ్వాసం లోనిది.

కవి పరిచయం: 
కవి పేరు : శ్రీ నాథుడు 
కాలం: 1380-1470
తల్లిదండ్రులు:  బీమాంబ మారయ
తల్లి దండ్రులు :  మారయ, భీమాంబ.
ఎవరి ఆస్థాన కవి: కొండవీటిని పరిపాలించిన పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారిగా ఈయన వున్నారు.

బిరుదు : కవి సార్వభౌముడు (విజయనగర దేవరాయల స్థానంలో 'గౌడ డిండిమ భట్టు' ను ఓడించి కనకాభిషేకంతోపాటు పొందిన బిరుదు)

 శ్రీనాధుడి చమత్కారానికి,ఆయన జీవన విధానానికి అద్దం పట్టే చాటువులు చాల వున్నాయి.

శ్రీనాధుని రచనలు:  
1. మరుత్తరాట్చరిత్ర 
2. శాలివాహన సప్తశతి 
3. పండితారాధ్య చరిత్ర 
4. శృంగార నౌషదం
5. భీమఖండం
6. కాశీఖండం 
7. హరవిలాసం 
7. ధనంజయ విజయం 
8. క్రీడాభిరామం 
9. శివరాత్రి మాహాత్మ్యం 
10. పల్నాటి వీర చరిత్ర 
11. నందనందన చరిత్ర 
 

చమత్కారానికి లోకానుశీలనకు రసజ్ఞతకు జీవిత విధానానికి అర్థం పట్టించాడు చాలా చెప్పాడు.

శైలి: ఉద్దండ లీల, ఉభయ వాక్ప్రౌఢి,  రసాభ్యుచితబంధం, సూక్తి వైచిత్రి. 


ఈ కింది లింకులు నొక్కి భిక్ష పాఠం వినండి.



ప్రవేశిక: 
ఈనాడు "బిక్ష" అనే మాటకి అడుక్కు తినడమనే అల్పార్థానికి పరిమితమైంది. కానీ ఒకప్పుడు బిక్ష అనేది పరమ పవిత్రమైన వ్రతం. శివుడు ఆదిబిక్షువుగా ప్రసిద్ధి. గురువులు శిష్యులకు జ్ఞాన బిక్ష పెట్టేవాళ్ళు. బుద్ధుడు రాజకుమారుడైన
 భిక్షాధర్మంతోనే జీవనం సాగించాడు. బౌద్ధులందరికీ అదే జీవన సూత్రంగా ఉండేది. గురుకులంలో చదువుకునే రాజకుమారులైన భిక్షాటనంతో విద్యార్థి జీవితం గడిపేవారు. బిక్ష పెట్టే వాళ్ళు కూడా అది మహా పుణ్యకార్యంగా భావించి, తమ ఇంటికి వచ్చిన వారికి నమస్కరించి, పూజించి బిక్ష సమర్పించేవాళ్ళు. బిక్షా ధర్మంతో చరించిన వేద వ్యాస మహర్షి కాశీనగరంలో పొందిన అనుభవం ఏమిటో ఈ పాఠం చదివి తెలుసుకోండి.



I


1. తే॥గీ॥ నెట్టుకొని కాయ బీటెండ పట్టపగలు
తాను శిష్యులు నిల్లిల్లు దప్పకుండఁ
గాశికా విప్రగృహ వాటికల నొనర్చు
నఖిల విద్యాగురుండు భిక్షాటనంబు.

అధికమైన ఎండలో కాశీనగరంలోని బ్రాహ్మణ వీధిలో భిక్షకోసం ఇల్లిల్లూ తిరగసాగాడు.

2. తే॥గీ॥ వండుచున్నారమను నొక్క వనజనేత్ర
తిరిగి రమ్మను నొక్క లేఁదీఁగె బోఁడి
దేవకార్యంబు నేఁడనుఁ దెఱవ యోర్తు
ద్వాః కవాటంబుఁ దెఱవదు వనిత యొకతె
1. సమస్త విద్యలకు గురుడైన వ్యాస మహర్షి శిష్యులతో కూడి పట్టపగలు కాశీనగరంలోని బ్రాహ్మణ వీధిలో బిక్ష కోసం ఇల్లిల్లూ తిరగసాగాడు.

2. ఒక ఇల్లాలు "వండుతున్నాం" అన్నది. మరొక స్త్రీ "మళ్ళీ" రండి అన్నది. ఇంకొకామె ఈరోజు వ్రతం (దేవకార్యం) అని చెబుతుంది. వేరొకామె అసలు తలుపులే తెరవడం లేదు.

3. 3. సీ॥
ముంగిట గోమయంబున గోముఖము దీర్చి
కడలు నాల్గుగ మ్రుగ్గుకఱ్ఱ వెట్టి,
యతిథి నచ్చో నిల్పి యర్ఘ్య పాద్యము లిచ్చి
పుష్పగంధంబులఁ బూజసేసి,
ప్రక్షాళితంబైన పసిడి చట్టువమున
నన్నంబుమీఁద నెయ్యభిఘరించి,
ఫలపాయసాపూప బహుపదార్థములతో
భక్తివిశ్వాస తాత్పర్య గరిమఁ

తే॥గీ॥ బెట్టుదురు మాధుకరభిక్ష భిక్షుకులకుఁ
గంకణంబులతో సూడిగములు రాయఁ
గమ్రకరముల బ్రాహ్మణాంగనలు కాశి
నన్నపూర్ణ భవాని కట్టనుఁగుఁ జెలులు
సూడిగములు = గాజులు
రాయన్ = ఒరసికొనగా
కాశిన్ = కాశీయందు
అన్నపూర్ణ = అన్నపూర్ణ అను పేరుగల
భవాని = పార్వతి
కడు + అనుంగు = గారాబమైన
చెలులు = స్నేహితురాండ్రు
భిక్షకులను = యాచకులకు
మధుకర = మధూకరమను
భిక్షన్ = భిక్షను
పెట్టుదురు = పెడతారు

తాత్పర్యము
కాశీనగరంలోని గృహిణులు అన్నపూర్ణ భవానికి ప్రియమైన చెలులుగా పేరుగాంచినవారు. వారు భిక్షార్థమై వచ్చిన వాళ్ళను సాక్షాత్తు శివుడిగా భావించి, అపురూపంగా ఆదరిస్తారు. వాకిట్లో ఆవుపేడతో చక్కగా అలికి, నాలుగంచులూ కలిసేటట్లు ముగ్గుపెట్టి, దాని మధ్యలో వచ్చిన అతిథిని నిలబెట్టి, కాళ్ళకూ, చేతులకూ నీళ్ళిచ్చి, పూవులతో, గంధంతో వారిని అర్చించి, శుభ్రంగా కడిగిన బంగారుగరిటెతో అన్నం మీద నెయ్యి అభిఘరించి (వేసి), పండ్లు, పరమాన్నం, పిండివంటలు చేర్చి, భక్తి విశ్వాసాలు ఉట్టిపడుతుండగా భిక్ష సమర్పిస్తారు. (అతిథి దేవోభవ ! అనే భారతీయ సంప్రదాయాన్ని ఈ పద్యంలో వర్ణించాడు కవి)..
అష్టవిధ అర్ఘ్యములు :
పెరుగు,
తేనె,
నెయ్యి,
అక్షతలు,
గరిక,
నువ్వులు,
దర్భ,
పుష్పము
రేపాడి = ప్రాతఃకాలమునందు
మేలుకని = నిద్రలేచి
ఏ పాపాత్ముని = ఏ పాపాత్మునియొక్క
ముఖంబున్ = ముఖాన్ని
ఈక్షించితినో = చూచియున్నానో

తాత్పర్యము
అటువంటి పుణ్యస్త్రీలున్న ఈ నేలలో ఒక్కరైనా భిక్ష సమర్పించడం లేదంటే ఆశ్చర్యంగా ఉన్నది. ఈ రోజు ఉదయమే లేచి, ఏ పాపిష్టివాని ముఖం చూశానో ‘అనుకున్నాడు వ్యాసుడు.

కింది పద్యానికి ప్రతిపదార్థం రాయండి (5మా.)


ఉత్పలమాల

    I   I

  I    U

 I    I   I  

 U  I   I   

 U   I   I 

  I   U   

    I  

వేదపు

రాణశా

 స్త్ర పద 

వీ నద

వీయసి

యైన పె

   ద్దము 

ఉత్పలమాల షట్కాట్ : శా మస (టేన్) 10

ఉత్పలమాల లక్షణాలు : (వృత్త పద్యం)

1.      పద్యంలో 4 పాదాలుంటాయి.

2.      ప్రతి పాదంలో భ, , , , , , ‘లగ’ (వ) అనే గణాలుంటాయి.

3.      10వ అక్షరం యతి స్థానం.

4.      ప్రాస నియమం ఉంటుంది.

5.     పాదంలో 20 అక్షరాలుంటాయి. 


వేదపురాణశాస్త్ర పదవీ నదవీయసియైన పెద్దము 

        త్తైదువ కాశికానగర హాటకపీఠ శిఖాధిరూఢ య

        య్యాదిమ శక్తి, సంయమివరా! యిటు రమ్మనిపిల్చె హస్తసం 

        జ్ఞాదరలీల రత్నఖచితాభరణంబులు ఘల్లు ఘల్లనన్‌


జ: ప్రతిపదార్థం


వేదపురాణ శాస్త్ర పదవీనదవీయసియైన;
వేద          = వేదాల్లో
పురాణ    = పురాణాల్లో
శాస్త్ర         = శాస్త్రాల్లో ప్రతిపాదించిన
పదవీ       = జ్ఞానానికి
నదవీయసియైన (న+దవీయసి+ఐన) = మిక్కిలి దూరంగా లేని
పెద్ద          = పెద్దదైన

ముత్తైదువ =  పురంధ్రి
కాశికా       = కాశికా

నగర         =  నగరం అనే
హాట
క       = స్వర్ణ

పీఠ            =  పీఠం యొక్క

శిఖా          = శిఖరంపై
అధిరూఢ = అధిరోహించియున్న

(ఆ + ఆదిమశక్తి)

అయ్యాదిమశక్తి = ఆ ఆదిశక్తి స్వరూపిణియైన అన్నపూర్ణాదేవి
హస్త సంజ్ఞాదరలీలన్‌; 

హస్త  = చేతి
సంజ్ఞా = (సైగల)సంజ్ఞలతో వెల్లడవుతున్న
ఆదరలీలన్‌ = ఆదరణతో కూడిన విధంగా రత్నఖచితాభరణంబులు (రత్నఖచిత + ఆభరణంబులు)
రత్న          = రత్నాలతో
ఖచిత       = పొదిగిన
ఆభరణంబులు = నగలు (చేతి గాజులు)
ఘల్లు ఘల్లనన్‌ = ఘల్లు ఘల్లు మని శబ్దం చేస్తుండగా
సంయమివరా = ఓ మునీశ్వరా!
ఇటు               =ఇటు

 రమ్ము + అని =  రమ్మని
పిల్చెన్‌ = పిలిచింది


విశేషాలు :

అతిథి: తిథి నియమాలు లేకుండా భోజనం సమయానికి వచ్చేవాడు.

ఆరోగ్యం వ్యుత్పత్తి పూజకు తగినది అష్టార్ఘ్యములు:  8రకాలు: పెరుగు తేనె నెయ్యి అక్షతలు గరిక నువ్వులు దర్భ పుష్పం


పద్యము పాదములకు అర్హమైనది నీరు

మధుకరభిక్ష మాధుకరం అంటే తుమ్మెద. తుమ్మెద పుష్పాలపై వ్రాలి తీరును గ్రహించినట్లు బిక్షాన్న స్వీకరిస్తారు.

5. తే॥గీ॥ ఉపవసింతుముగాక నేఁడుడిగి మడిఁగి

యస్తమించుచు నున్నవాఁ డహిమభానుఁ

డెల్లి పారణకైన లేదెట్లు మనకు ?

మాధుకరభిక్ష బ్రాహ్మణమందిరముల

ప్రతిపదార్థములు:

ఉడిగి = భిక్షకై తిరుగుట మాని

మడిగి = అణగి యుండి

నేడు = ఈరోజు

ఉపవసింతుముగాక = ఉపవాసం ఉందుముగాక !

అహిమభానుడు = వేడికిరణములు గల సూర్యుడు

అస్తమించుచున్నవాడు = అస్తమించుచున్నాడు

ఎల్లి = రేపు

మనకున్ = మనకు

బ్రాహ్మణమందిరములన్ = ఆ బ్రాహ్మణుల ఇళ్ళలో

మాధురభిక్ష = మధూకరరూపమైన భిక్ష

పారణకైనన్ = ఉపవాసాంత భోజనముకైనను

లేదెట్లు = లేకుండా ఎలా ఉంటుంది (తప్పక లభిస్తుంది) ?


తాత్పర్యము

సరే, ఇక భిక్షాటనం మాని ఈ రోజుకు ఉపవాసమే చేద్దాం. సూర్యుడు అస్తమిస్తున్నాడు. రేపైనా మనకు ఈ బ్రాహ్మణ వాటికలో ఉపవాసాంత భోజనానికి సరిపడ భిక్ష దొరకక పోదు.


II

శివునిమాయచేత

ఏ మచ్చెకంటియున్ = మీనాక్షియును

వంటకంబు = అన్నమును

పెట్టకున్న (పెట్టక + ఉన్నన్) = పెట్టకపోగా

కటకటంబడి = బాధపడి

భిక్షాపాత్రంబు = శివభిక్షాపాత్రను

నట్టనడివీధికి = వీధి నట్టనడుమ

పగులవైచి = పగులగొట్టి

కోపావేశంబునన్ = కోపావేశంతో


తాత్పర్యము

అని వ్యాసుడు శిష్యులతో ఆ రాత్రి మఠంలో గడిపి, మరునాడు యథావిధిగా మధ్యాహ్న సమయానికి శిష్యులు, తాను వేరువేరుగా విప్రవాటికల్లో భిక్షాటనం చేయసాగారు. కాని మొదటి రోజులాగానే విశ్వనాథుని మాయవల్ల ఏ ఇల్లాలు భిక్షపెట్టలేదు. దాంతో బాధపడి కోపంతో భిక్షాపాత్రను నట్టనడి వీథిలో ముక్కలు ముక్కల య్యేటట్లు విసిరి ఆవేశంతో.


7. తే॥గీ॥ ధనము లేకుండెదరు మూఁడు తరములందు

మూఁడు తరములఁ జెడుఁగాక మోక్షలక్ష్మి

విద్యయును మూఁడు తరముల వెడలవలయుఁ

బంచజనులకుఁ గాశికాపట్టణమున

యొక్క

వాకిటన్ = వాకిటయందు

పార్వతి = పార్వతీదేవి

ప్రాకృతవేషంబునన్ = సామాన్య స్త్రీ వేషముతో


తాత్పర్యము

అని ఆకలిదప్పులచే బాధపడుతున్న వ్యాసుడు శపించబోయిన సమయంలో ఒక బ్రాహ్మణ మందిరపు వాకిట పార్వతీదేవి సామాన్య స్త్రీ వేషంలో –



శార్ధూలమ్

U   U   U 

  I  I    U

 I    U   I  

 I   I   U

U     U   I 

U   U    I  

      U 

ఆ కం ఠం

  బు  గ ని

ప్డు మా ధు

క ర భి,

క్షా న్నం బు

 భ క్షిం పఁ

  గా

శార్ధూలమ్ షట్కాట్ : శా మస (తర్థీన్) 13

1వ అక్షరానికి 13 కి యతి మైత్రి  మొత్తం అక్షరాలు 19

1.     శార్ధూలమ్  లక్షణాలు : (వృత్త పద్యం)

  1. ఇందులో 4 పాదాలుంటాయి.
  2. , స జ,,,,అనే గణాలు (19 అక్షరాలు) ఉంటాయి.
  3. ప్రతి పాదంలో 13వ అక్షరం యతి స్థానం.
  4. ప్రాసనియమం ఉంటుంది.

 

శా॥             ఆకంఠంబుగ నిప్డు మాధుకర భిక్షాన్నంబు భక్షింపఁగా

లేకున్నం గడు నంగలార్చెదవు మేలే ? లెస్స ! శాంతుండవే!

నీకంటెన్ మతిహీనులే కటకటా ! నీవార ముష్టింపచుల్

శాకాహారులుఁ గందభోజులు, శిలోంఛప్రక్రముల్ తాపసుల్ !


ప్రతి పదార్థాలు:
ఇప్డు                 = ఇప్పుడు
ఆ కంఠంబుగన్ = గొంతుదాకా
మాధుకర భిక్షాన్నంబు = మాధుకర రూపమైన భిక్షాన్నము
భక్షింపగా   = తినడానికి లేదని
లెస్స.         = బాగు
శాంతుండవే = శాంతస్వభావము గలవాడవేనా!
కటకటా       = అయ్యెయ్యో !
నీవారముష్టింపచుల్ = పిడికెడు వరిగింజలతో కాలం వెళ్ళబుచ్చేవారును
శాకాహారులు = కాయకూరలు తినేవారును
కందభోజులు = దుంపలు మాత్రమే తినెడివారును
శిల = కోతకోసిన వరిమళ్ళలో జారిపడిన కంకులను ఏరుకొని బ్రతుకువారును
ఉంచక్రముల్ = రోళ్ళవద్ద మిగిలిన బియ్యంతో జీవనం గడుపువారికంటే
తాపసుల్ = మునులు (తపస్సుచేసుకొనేవారు)
నీ కంటెన్ = నీ కన్నా
మతిహీనులే = తెలివితక్కువ వారా ?



చంపకమాల

 I   I   I

  I    

U   I   I  

 I    

 I    

 I    

  U  I  

అనవు

డు నల్ల

 నవ్వి క

మలాన

న యిట్ల

ను, లెస్స

 గాక, యో

ఉత్పలమాల షట్కాట్ : శా మస (టేన్) 10

1.     చంపకమాల లక్షణాలు : (వృత్త పద్యం)

2.     ఇందులో 4 పాదాలుంటాయి.

3.     , , , , , , ర అనే గణాలు (21 అక్షరాలు) ఉంటాయి.

4.     ప్రతి పాదంలో 11వ అక్షరం యతి స్థానం.

5.     ప్రాసనియమం ఉంటుంది.

14. చ॥
అనవుడు నల్ల నవ్వి కమలానన యిట్లను, లెస్సగాక, యో
మునివర ! నీవు శిష్యగణముంగొని చయ్యన రమ్ము విశ్వనా
థుని కృప పేర్మి నెందఱతిథుల్ చనుదెంచినఁ గామధేనువుం
బనిగొనునట్లు పెట్టుదు నపారములైన యభీప్సితాన్నముల్ 
ప్రతిపదార్థం

అనవుడున్     = వేదవ్యాసునితో ఈ విధంగా
అల్ల                 = కొంచెం
నవ్వి               = నవ్వి
కమల              = కమలమువంటి
ఆనన              =  ముఖముగల ఆ ముత్తైదువ
ఇట్లనున్         = ఈ విధముగా పలికింది 
ఓ మునివర    = ఓ మునీశ్వరుడా
లెస్సగాక        = మేలగునుగాక  !
నీవు               = నీవు
శిష్య              = శిష్య
గణముంగొని =  సమూహముతో కలిసి
చయ్యన         = వెంటనే (వేగముగా)
రమ్ము              = రావలసినది
విశ్వనాథుని    = విశ్వనాథుని యొక్క
కృప పేర్మిన్      = అతిశయమైన దయతో
ఎందఱు           = ఎంతమందైనా
అతిథులు         = అతిథులు
చనుదెంచినన్  = వచ్చినప్పటికీ
కామధేనువున్  = కామధేనువును బనిగొనునట్లు   =  కల్గియున్నట్లు
అపారములైన (అభీప్సితాన్నముల్) = అంతులేని
అభి                  = ఇష్టంగా 
ఈప్సిత            = కోరినటువంటి
అన్నముల్        = భోజనములను
పెట్టుదున్          = పెడతాను

తాత్పర్యము
అని వేదవ్యాసుడు పల్కగా కొంచెం నవ్వి పద్మముఖియైన ఆ ఇల్లాలు సరేలే ! మునీంద్రా ! విశ్వనాథుని దయవల్ల ఎంతమంది అతిథులు వచ్చినా కామధేనువు వలె కోరిన పదార్థాలన్నీ అనంతంగా నేను ఏర్పాటు చేయగలను. నీ శిష్యగణాన్ని తీసుకొని వెంటనే రా ! అన్నది.


II. వ్యక్తీకరణ – సృజనాత్మకత

1. క్రింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు వ్రాయండి.
అ) పాఠం ఆధారంగా వ్యాసుడు ప్రవర్తించిన తీరుపై మీ అభిప్రాయాన్ని వ్రాయండి.
జ: వ్యాసుడు ప్రవర్తించిన తీరు:
“భిక్ష” పాఠం ఆధారంగా వ్యాసుడు ప్రవర్తించిన తీరును పరిశీలించగా ఎంతటి వారికయినా ఆకలిబాధ భరించరానిది అని అర్థమవుచున్నది. ఈ ఆకలి బాధచే వేదాలను నాలుగు విధాలుగా విభజించిన వేదవ్యాసుడు కోపానికి లోనయ్యాడు. కోపం వలన మంచి చెడుల విచక్షణను కోల్పోయి కాశీనగరాన్ని శపించబోయాడు. అంతేగాకుండా సకలశాస్త్రాలను చదివి, వాటి సారాన్ని తెలుసుకున్న వ్యాసుడు కేవలం 20 రోజులు భిక్ష దొరకని కారణంగా తీవ్రకోపానికి లోనై తన చేతిలోని భిక్షపాత్రను నేలకేసి విసిరిగొట్టెను.
“కనుక కోపం చాలా ప్రమాదకరమయినది. కోపం మానవునికి అంతర్గత శత్రువు. కోపం మన ప్రశాంతతను దెబ్బ తీస్తుంది. తోటివారిని ప్రశాంతంగా ఉండనివ్వదు. మనిషి ఆలోచనా శక్తిని, జ్ఞానాన్ని క్రమంగా క్షీణింపజేస్తుంది. ఆప్తులను, స్నేహితులను దూరం చేస్తుంది. గౌరవ, మర్యాదలు తగ్గిస్తుంది. కనుక మనిషి కోపాన్ని దూరం చేసుకోవాలి. అప్పుడే అందరికీ ఆదర్శంగా ఉండగలము” అనే విషయాన్ని గ్రహించాలి. మనిషికి కేవలం శాస్త్రజ్ఞానం మాత్రమే ఉంటే సరిపోదనీ, ఆత్మజ్ఞానం మరియు ఇంద్రియ నిగ్రహం ఉండాలని వ్యాసుని పాత్ర ద్వారా గ్రహించవచ్చు.

ఆ) నేఁడు నిన్నటికి మఱునాఁడు నిక్కువంబు” అను మాటలు ఎవరు ఎవరితో ఏ సందర్భంలో అన్నారు ? వీటి అంతరార్థమేమిటో వివరించండి.


భావము : ఈ రోజు నిన్నటికి మరునాడే కదా !
అంతరార్థం : అంటే ఈ రోజు నాకు భిక్ష లభించకపోతే నిన్నటిలాగే ఈ రోజు కూడా ఉపవాసం తప్పదని వ్యాసుని మాటల్లోని అంతరార్థము.

ఇ) ఆకలి వల్ల వ్యాసుడు కాశీ నగరాన్ని శపించాలను కున్నాడు కదా ! “ఆకలి మనిషి విచక్షణను నశింప జేస్తుంది” అనే దాని గురించి రాయండి.
జవాబు:వేదవ్యాసుడు మహాపండితుడు. వేద విభజన చేసినవాడు. 18 పురాణాలు రచించినవాడు. సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువు అంశతో జన్మించాడు. అటువంటి మహర్షి కూడా ఆకలి వల్ల విచక్షణ కోల్పోయాడు. కాశీని శపించాలనుకొన్నాడు. ఎందుకంటే మనిషి దేనినైనా జయించగలడు. కానీ ఆకలిని జయించలేడు. ఆకలి ఎక్కువైతే కడుపులో మంట వస్తుంది. కళ్ళు తిరుగుతాయి.

తలపోటు, వికారం, చిరాకు, కోపం అన్నీ వస్తాయి. వాటివలన మనిషి విచక్షణను కోల్పోతాడు. విచక్షణ కోల్పోయిన మనిషి ఎంతకైనా తెగిస్తాడు. తనకు అన్నం పెట్టని లోకంపై కక్ష పెంచుకొంటాడు. రాక్షసుడుగా మారతాడు. అంటే మనిషిని రాక్షసుడిగా మార్చేది ఆకలి. అందుకే ఆకలిగొన్న వారికి అన్నం పెట్టాలి.

ప్రశ్న 2.క్రింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబులు వ్రాయండి.
అ) “భిక్ష” పాఠంలోని కథను సంక్షిప్తంగా వ్రాయండి. 
(లేదా)
“భిక్ష” పాఠ్యభాగ కథను మీ మాటల్లో వివరించండి.

వ్యాసమహర్షి శిష్యులతో కూడి నగరంలో నివ సిస్తున్నాడు. ఒకసారి వ్యాసుడు శిష్యులతో కలిసి భిక్షాటనకై బయలుదేరాడు. శివుని యోగమాయతో వ్యాసునికి గాని, అతని శిష్యులకు గాని భిక్ష లభించలేదు. ఏ ఇల్లాలు కూడా భిక్షను వేయలేదు. వాస్తవంగా కాశీ నగరంలోని ఇల్లాండ్రు అన్నపూర్ణా దేవికి చెలికత్తెలు. వారంతా అతిథులను గౌరవిస్తారు. కాని రెండు రోజుల పాటు భిక్ష దొరకలేదు.

వ్యాసుడు తీవ్రమైన కోపాన్ని పొందాడు. కాశీ నగరంలోని ప్రజలను శపించబోయాడు. ఆ సమయంలో అన్నపూర్ణాదేవి సాధారణ స్త్రీ వలె వ్యాసుని ముందుకు వచ్చింది. అతనితో మహర్షి ! నీవు కాశీపై కోపగించుట తగునా ? నీవు శాంత స్వభావం కల వాడివా ? పిడికెడు వరి గింజలతో కాలం వెళ్ళబుచ్చే శాకా హారంతో జీవించే తాపసుల కంటే నీవు గొప్ప వాడివా ? ‘ఉన్న ఊరు కన్నతల్లితో సమానం’ అనే ధర్మాన్ని మరిచిపోయావా ? ఆకలితో ఉన్న నిన్ను ఇంకా మాటలతో బాధపెట్టడం తగదు. నీవు వెంటనే భోజనానికి రమ్ము.

తరువాత నీకు కొన్ని మాటలు చెప్పాలి. అని పలికింది. వ్యాసుడు ఆ మాటలను విని ‘అమ్మా ! నా శిష్యులు, ఇతరులు మొత్తం పదివేల మంది ఉన్నారు. వారందరు తినకుండా నేను భోజనం చేయటం మంచిది కాదు’ అని పలికాడు. అది విని అన్నపూర్ణాదేవి “మహర్షీ! నీతోపాటు నీ శిష్యులు కలసి రావలసినది. విశ్వనాథుని అనుగ్రహంతో మీకందరికి రుచి కరములైన ఆహారాన్ని అందిస్తాను” అని పలికింది. వ్యాసుడు అంగీకరించిన శిష్యులతో కలిసి అన్నపూర్ణాదేవి ఇంటికి భోజనానికి వెళ్ళాడు. భోజన శాలలో భోజనం చేశాడు.



ఆ) కోపంవల్ల కలిగే దుష్పరిణామాలను గురించి రాయండి.

మనం జయించవలసిన మనలోని శత్రువులు ఆరు. వీటిని అరిషడ్వర్గాలు అంటారు. అవి
కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం.
ఈ ఆరు అంతః శత్రువులను జయించిన వాడే మహనీయుడు అవుతాడు. వీటిలో ప్రధానమైన శత్రువు క్రోధం. అదే కోపం. ‘తన కోపమే తన శత్రువు – తన శాంతమే తనకు రక్ష’ అని శతకకర్త ఎప్పుడో చెప్పాడు. ‘కోపమునను ఘనత కొంచెమై పోవును’ అని కూడా మహాకవి చెప్పాడు.

కోపాన్ని జయించి సహనాన్ని శాంతాన్ని అలవరచుకోవడం చాలా కష్టం. ఎంతో సాధన చేస్తే తప్ప కోపాన్ని జయించలేం. భృగు మహర్షి, విశ్వామిత్రుడు, దుర్వాసుడు లాంటి గొప్ప మహర్షులు సహితం ఈ ప్రయత్నంలో విఫల మయ్యారు. కోపాన్ని జయించలేక తమను తాము తగ్గించుకొన్నారు. ఈ కోపం మనిషిని క్షణికావేశానికి లోను చేసి ఎన్నో అనర్థాలకు కారణమౌతుంది.
బ్రహ్మజ్ఞాన సంపన్నుడైన వేదవ్యాస మహర్షి ఆకలి బాధ తాళలేక కోపానికి వశుడై, పరమేశ్వరునికి ప్రీతి పాత్రమైన కాశీనగరాన్ని శపించడానికి సిద్ధపడ్డాడంటే – కోపం ఎంతటి వారినైనా విచక్షణను కోల్పోయేటట్లు చేస్తుందనేదానికి నిదర్శనం. సాధన చేస్తే సాధ్యం కానిది లేదు. ప్రతి ఒక్కరూ అంతః శత్రువైన కోపాన్ని జయించాలి. సహనాన్ని అలవర్చుకోవాలి. ఆనాడే సమాజంలో శాంతి పరిఢవిల్లుతుంది.

“కోపాన్ని జయించండి – ఉత్తమ వ్యక్తులుగా ఎదగండి”

3. క్రింది అంశాలను గురించి సృజనాత్మకంగా / ప్రశంసిస్తూ వ్రాయండి.
అ) భిక్ష, రక్ష, పరీక్ష, సమీక్ష, వివక్ష… వంటి పదాలతో ఒక చక్కని భావాన్ని ప్రకటించే కవిత వ్రాయండి.

నేను వెళ్తాను పాఠశాలకు జ్ఞాన భిక్ష కోసం
అధ్యయనమే నాకు కొండంత అండ
నింపుతుంది ఆత్మస్థైర్యం గుండె నిండా
నా భవిష్యత్తుకు అదే రక్ష
విజయం సాధిస్తాను ఏ పరీక్ష కైనా
అపజయపు ఆరోపణల మీద పేర్చుకుంటాను మెట్లను
అదే కదా అసలైన సమీక్ష
నేటి ఓటమి రేపటి జయానికి నాందిగా
నేను విశ్వనరుడినై
ప్రసరిస్తాను విద్యుల్లతనై
నాకు ఇక్కడ రాదు వివక్ష 
ఆదర్శమై మెరుస్తాను రత్నంలా....
    (డా. సిద్దెంకి)


సకల శుభదాయక కల్పవల్లీ
జనులందరికీ జ్ఞాన భిక్ష ప్రసాదించు
నీ కృపారస దృష్టే జనులందరికీ రక్ష
అదే మాకందరికి జీవన రక్ష.
జీవన పోరాట పరీక్షలెన్నో ఉన్నాయి
పరీక్షలన్నింటిలో నీ రక్షతో గెలవాలి మేము
నవ సమాజంలో ఎన్నో వివక్షలు
కక్షలేని రహదారులు లేవెక్కడ
నిరక్షరాస్యులైన నిర్భాగ్యులెందరో
వారందరినీ చూడుము నిష్పక్షపాతంగా
సమీక్షలు లేని ప్రభుత్వ పథకాలెన్నో
దూరమవుతున్నాయి నిర్భాగ్యులకు
నాగరిక సమాజంలో ఎన్నో వివక్షలు
కనిపించని మానవ నైతిక సంబంధాలు
తల్లీ ! ఇక రక్షించు ! నీవైనా !
మా కందరికీ పంచిపెట్టు జ్ఞానభిక్ష !




III. భాషాంశాలు

పదజాలం
1. క్రింది వాక్యాల్లో గీతగీసిన పదాలకు పర్యాయ పదాలు రాయండి.
అ) ద్వాఃకవాటంబు దెఱవదు వనిత యొకతె
వనిత = మహిళ, స్త్రీ, పడతి, ఉవిద, నారి, పురంధ్రి, అంగన, మగువ
ఆ) ప్రక్షాళితంబైన పసిఁడి చట్టువము.
పసిడి = బంగారం, కాంచనం, పుత్తడి, సువర్ణం, కనకము, హిరణ్యము
ఇ) పారాశర్యుండు క్షుత్పిపాసా పరవశుండై శపియింపఁ
పారాశర్యుండు = వ్యాసుడు, బాదరాయణుడు, కృష్ణ ద్వైపాయనుడు, సాత్యవ తేయుడు
) ఇవ్వీటిమీద నాగ్రహము తగునె ?

గ్రహము = కోపము, క్రోధము, అలుక, ఉద్రేకం, రోషము
ఉ) అస్తమింపగ జేసినాడు అహిమకరుడు.
అహిమకరుడు = సూర్యుడు, భానుడు, రవి, ప్రభాకరుడు, ఆదిత్యుడు, ఇనుడు

2. క్రింది పదాలను అర్థాలను రాయండి.

పర్యాయపదాలు :

వనిత: స్త్రీ పురంధ్రీ అంగన పడితి నారీ

పసిడి : బంగారము సువర్ణము కనకము హిరణ్యము

పారాశర్యుడు: వ్యాసుడు బాధరాయణుడు సత్యవతేయుడు, కృష్ణ ద్వైపాయనుడు 

ఆగ్రహము :కోపము క్రోధము రోషము కినుక 

అహిమకరుడు సూర్యుడు రవి భాస్కరుడు ఆదిత్యుడు


అర్ధాలు

ద్వా:కవాటము=ద్వారము, తలుపు 

వీక్షించు = చూచు 

అంగన = స్త్రీ 

మచ్చ కంటి = చేపల వంటి కన్నులు కలది స్త్రీ 

భుక్తి శాల = భోజనశాల 


నానార్ధాలు

వీడు: ఇతడు, పట్టణం, వదులుట

రాజు: క్షత్రియుడు, చంద్రుడు, ప్రభువు


ప్రకృతి వికృతులు:

విద్య - విద్దె

భిక్షము - బిచ్చము 

యాత్ర - జాతర 

మత్స్యము - మచ్చెము

రతనము - రత్నము 

పంక్తి - బంతి 

ఈ వాక్యంలో ‘వీడు’ అనే పదం మూడు అర్థాలలో వాడబడింది.
వీడు (నానార్థాలు) : ఈ మనుష్యుడు, పట్టణము, వదలుట
ఆ) రాజు ఆకాశంలోని రాజును చూసి సంతోషించాడు. 
ఈ వాక్యంలో ‘రాజు’ అనే పదం మూడు అర్థాల్లో వాడబడింది.
రాజు (నానార్థాలు) : క్షత్రియుడు, చంద్రుడు
4. క్రింది ప్రకృతి పదాలకు సరైన వికృతి పదాలను ఎంపిక చేయండి.


పుణ్య + అంగన = పుణ్యాంగన
సవర్ణదీర్ఘ సంధి సూత్రం : అ, ఇ, ఉ, ఋలకు అవే అచ్చులు పరమైతే వాటి దీర్ఘాలు ఏకాదేశమౌతాయి.
భిక్ష + ఇడదయ్యె = భిక్షయిడదయ్యె
యడాగమసంధి సూత్రం : సంధిలేని చోట అచ్చుకంటె పరమైన అచ్చునకు యడాగమం వస్తుంది.
ఇడదయ్యెన్ + కటా = ఇడదయ్యెఁ గటా! ద్రుతప్రకృతిక సంధి (సరళాదేశ సంధి)
సూత్రాలు :

ద్రుత ప్రకృతికము మీది పరుషాలకు సరళాలు వస్తాయి.
ఆదేశ సరళానికి ముందున్న ద్రుతానికి బిందు, సంశ్లేషలు విభాషగా వస్తాయి.
ఆ) కాశి; యివ్వీటి మీద నాగ్రహము దగునె.


1) కాశి + ఇవ్వీటి = కాశి యివ్వీటి (యడాగమ సంధి)
ఈ + వీటి = ఇవ్వీటి (త్రికసంధి)

త్రికసంధి సూత్రాలు :
ఆ,ఈ,ఏ లు త్రికములు.
త్రికము మీదున్న అసంయుక్త హాల్లునకు ద్విత్వ బహుళంగా వస్తుంది.
ద్విరుక్తంబగు హల్లు పరమగునపుడు ఆచ్ఛికంబగు దీర్ఘానికి హ్రస్వం.
2) గసడదవాదేశ సంధి
సూత్రం : ప్రథమమీది పరుషములకు గ, స, డ, ద, వ లు బహుళముగానగు.

ఇ) ఓ మునీశ్వర ! వినవయ్య
జవాబు:

1) ముని + ఈశ్వర = మునీశ్వర (సవర్ణదీర్ఘ సంధి)

సవర్ణదీర్ఘసంధి సూత్రం : అ, ఇ, ఉ, ఋలకు అవే అచ్చులు పరమైతే వాటి దీర్ఘాలు ఏకాదేశమౌతాయి.
యడాగమసంధి సూత్రం:
సంధిలేని చోట అచ్చుకంటే పరమైన అచ్చునకు యడాగమం వస్తుంది
వినవు + అయ్య = వినవయ్య (ఉత్వ సంధి)
ఉత్వసంధి సూత్రం : ఉత్తునకు అచ్చు పరమైనప్పుడు సంధి నిత్యంగా వస్తుంది.

2. పాఠంలోని తేటగీతి పద్యాన్ని గుర్తించి లక్షణాలతో సమన్వయం చేయండి.

అ) మునీశ్వర! ……….. నా గ్రహముదగునె ?


పై పద్యంలోని ప్రతి పాదంలో ఒక సూర్య గణం, రెండు ఇంద్ర గణాలు, రెండు సూర్య గణాలు వరసగా వచ్చాయి కాబట్టి ఇది తేటగీతి పద్యం.
ఇది ఉపజాతి
ప్రాసనియమం ఉండదు.
ఒకటవ గణం మొదటి అక్షరానికి నాల్గవ గణం మొదటి అక్షరానికి యతి చెల్లుతుంది.

సీస పద్యం

క్రింది తరగతులలో తేటగీతి, ఆటవెలది పద్యాలు తెలుసుకున్నారు కదా ! ఇప్పుడు ‘సీస పద్య’ లక్షణాలను పరిశీలిద్దాం.

క్రింది ఉదాహరణలను పరిశీలించండి.

సీసపద్య లక్షణం:

ఇందులో నాలుగు పాదాలుంటాయి.
ప్రతిపాదంలో ఆరు ఇంద్రగణాలు, రెండు సూర్యగణాలు వరుసగా ఉంటాయి.
పద్యపాదం రెండు సమభాగాలుగా ఉంటుంది. రెండు భాగాల్లోను మూడో గణంలోని మొదటి అక్షరం యతి లేదా ప్రాస యతి.
ప్రాసనియమం లేదు.
తేటగీతి లేదా ఆటవెలది దీనికి చివరగా ఉంటుంది.

పై పద్యపాదాల్లో –

ఒక్కొక్కటి రెండు భాగాలుగా ఉన్నాయి.
రెండు భాగాల్లో కలిపి ఎనిమిది గణాలున్నాయి. (ఆరు ఇంద్రగణాలు + రెండు సూర్యగణాలు)
యతి, ప్రాస యతులు (కా – గ, ర – ర) (ప-పు, ప-ప) ఉన్నాయి.
ప్రాసనియమం లేదు. వీటిని బట్టి ఇది సీసపద్యం అన్ని గుర్తించవచ్చు.
ప్రశ్న 1.
పాఠంలోని సీసపద్యానికి గణవిభజన చేసి లక్షణాలను అన్వయించండి.

లక్షణాలు :

4 పాదాలుంటాయి.
ప్రతి పాదంలో 6 ఇంద్ర గణాలు + 2 సూర్య గణాలు ఉంటాయి.
3వ గణంలో 1 మొదటి అక్షరం యతి లేదా ప్రాస యతి.
ప్రాస నియమం లేదు.
తేటగీతి దీనికి చివరగా.

బిక్ష పాఠం సారాంశం :
1. సమస్త విద్యలకు వ్యాసుడు గురువు.ఈయనకు పదివేలమంది శిష్యులు వుండేవారు.ఈయన కాసి నగరంలో శిష్యులకు విద్య నేర్పుతూ ,భిక్షాటన చేసుకొంటూ జీవనం సాగించేవాడు.
2.ఒకరోజు మధ్యాన్నం వేళలో ఆయన భిక్షకోసం శిష్యులతో కలసి బ్రాహ్మణ వాడలలో కి వెళ్ళాడు.ఏవేవో కారణాలతో ,ఎవరూ భిక్ష పెట్టలేదు.
౩.ఆ రోజుకు ఉపవాసం ఉందామని ,మరుసటి రోజు తప్పక భిక్ష దొరుకుతుందని ,వ్యాసుడు నిశ్చయించుకొన్నాడు.
4.ఈస్వరుడి మాయ వల్ల మరుసటి రోజున కూడా ఎవరూ ఆయనకు భిక్ష వేయలేదు.వ్యాసుడు కోపంతో భిక్ష పాత్రను నడివీధిలో పగులగొట్టి ,కాశివాసులకు మూడు తరాల పాటు దానం,మోక్షం,లేకుండుగాక  అని సపించబోయాడు.
5.ఇంతలో పార్వతి దేవి ఒక సామాన్య స్త్రీ రూపంలో ఒక బ్రాహ్మన గృహం వాకిట్లో ప్రత్యక్షమై ,వ్యాసుని మందలించి తన ఇంటికి భోజనానికి రమ్మని పిలిచింది.
6.అప్పుడు వ్యాసుడు తనకు పదివేలమంది శిష్యులున్నారని ,సూర్యాస్తమయం అవుతున్నదని తన శిష్యులను విడచి తానోక్కడు తినడం తగదని చెప్పాడు.
అంటే నిన్న ఎలాగైతే భోజనం లేకుండా ఉపవాసమున్నమో ,అలాగే ఈ రోజు కూడా ఉంటామని  దీని అంతరార్ధం.
7.అప్పుడు పార్వతి దేవి నవ్వి,నీవు నీ  శిష్యులన్దరినీ ని వెంట తీసుకోని రా.ఈస్వరుడి దయతో ఎంత మంది వచ్చిన కావలసిన పదార్ధాలు పెడతాను.అని చెప్పింది.
8.వ్యాసుడు సరే అని ,శిష్యులతో గంగలో స్నానం చేసి వచ్చాడు.పార్వతీదేవి వారికి ఎదురేగి స్వాగతం చెప్పి భోజన శాలలో వారందరికీ భోజనం పెట్టింది.

కోపం వల్ల కలిగే దుష్పరిణామాలను గురించి రాయండి.

జ. కోపం పాప కారణం. కోపం వల్ల మనిషి విచక్షణ కోల్పోతాడు. ఏది మంచి ఏది చెడో తెలుసుకోలేక పోతాడు ఫలితంగా అనర్ధాలు జరుగుతుంటాయి. ప్రమాదాలు జరుగుతుంటాయి. కొంతమంది "కోపం వస్తే నేను మనిషిని కాను" అనే మాటని ఊతపదంగా వాడుతుంటారు.
 కోపం వల్ల మనుషులోని రాక్షసుడు మేల్కొంటాడు.
 కోపంలోనే మనిషి మృగంలా మారిపోతాడు. అన్నదమ్ములను, అక్కాచెల్లెళ్లను, భార్యను, పిల్లల్ని చంపిన సంఘటనలు వార్తల్లో చూస్తూ ఉంటాం.
 కాబట్టి కోపం మంచిది కాదు.
 బిక్ష పాఠం లో మహాజ్ఞాని, సకల శాస్త్రాలకు ఆది గురువు అయిన వ్యాసుడు రెండు రోజులపాటు బిక్ష దొరకలేదని కాశీ నగరాన్ని శపించబోయాడు. అంటే విచక్షణ కోల్పోయాడు. "క్షమ కవచంబు క్రోధమది శత్రువు" అని బర్తహరి అంటాడు.
అనగా ఓర్పు కవచం, కోపం శత్రువు లాంటిది అని అర్థం. శత్రువులు శత్రువు లాంటి కోపాన్ని విడిచిపెట్టాలని వారు సూచించే అర్థం. "కోపము నను ఘనత కొంచెమైపోవును' అని వేమన గారు చెప్పారు. 
"తనకోపమే తన శత్రువు" అని సుమతి శతక కర్త అయిన బద్దెన వివరించాడు.
 కోపాన్ని విడిచిపెడదాం.
 మనుషులుగా బతుకుదాం. మానవత్వాన్ని పెంచుదాం.


ఆ) భిక్ష, రక్ష, పరీక్ష, సమీక్ష, ఒక కవిత


పాఠ్యభాగ సారాంశము


వేదవ్యాసుడు ఒకరోజు కాశీనగరంలో శిష్యులతో మధ్యాహ్న సమయంలో భిక్ష కోసం బ్రాహ్మణ వీధులలో ఇంటింటికీ తిరిగాడు. ఎవరూ ఆయనకు భిక్ష పెట్టలేదు. కాశీ నగరంలోని బ్రాహ్మణ స్త్రీలు రోజూ అతిథులకు మధూకర భిక్ష పెడుతూ ఉంటారు. కాని ఆనాడు వ్యాసుడికి భిక్ష పెట్టలేదు.


ఆ రోజుకు ఉపవాసం ఉందామని, మరునాడు పారణకు భిక్ష దొరకకపోదని వ్యాసుడు నిశ్చయించాడు. మరుసటి రోజున వ్యాసుడు తిరిగి శిష్యులతో భిక్షాటనకు వెళ్ళాడు. ఈశ్వరుడి మాయవల్ల ఆ రోజు కూడా ఆయనకు ఎవ్వరూ భిక్ష పెట్టలేదు. వ్యాసుడు కోపంతో తన భిక్షాపాత్రను వీధి మధ్యలో పగులగొట్టి, కాశీ వాసులకు మూడు తరాల దాకా ధనం, మోక్షం, విద్య లేకుండా పోవాలి అని శపించ డానికి సిద్ధమయ్యాడు.


అప్పుడు పార్వతీదేవి ఒక బ్రాహ్మణ మధూభవనం వాకిట్లో సామాన్య స్త్రీ వలె కనబడి, వ్యాసుని రమ్మని పిలిచి ఇలా మందలించింది. “ఓ మహర్షీ ! నీవు గొంతు దాకా తినడానికి మధూకర భిక్ష దొరకలేదని గంతులు వేస్తున్నావు. నివ్వరి బియ్యం తినేవారు, శాకాహారులూ, కందభోజులూ, ఉంఛవృత్తితో జీవించేవారూ అయిన మునీశ్వరులు నీ కంటే తెలివితక్కువ వారు కాదు. ఉన్న ఊరు, కన్నతల్లితో సమానం అంటారు. అదీకాక ‘కాశీ’, ఈశ్వరుడి భార్య. భిక్ష దొరక లేదని నీవు కాశీ నగరాన్ని శపించడం తగదు.


నీవు ఆకలితో ఉన్నావు. మావంటి గృహిణులు నిన్ను ఇలా నిందించడం మంచిది కాదు. మా ఇంటికి భోజనానికి రా, భోజనం చేసిన తరువాత నీతో మాట్లాడవలసిన మాటలు ఉన్నాయి”.


పార్వతీదేవి మాటలు విని, వ్యాసుడు ఆమెతో “అమ్మా! సూర్యుడు అస్తమిస్తున్నాడు. నాకు పదివేలమంది శిష్యులు ఉన్నారు. వారు తినకుండా నేను తిననని నాకు వ్రతం ఉంది. నిన్నటిలాగే ఈ రోజు కూడా పస్తు ఉంటాం” అన్నాడు.


అప్పుడు పార్వతీదేవి చిరునవ్వు నవ్వి “మునీశ్వరా ! నీవు శిష్యులను కూడా వెంటబెట్టుకొని తొందరగా రా. ఈశ్వరుడి దయవల్ల ఎంతమంది అతిథులు వచ్చినా, అందరికీ కోరిన అన్నం పెడతాను” అంది.


వ్యాసుడు సరేనని గంగలో స్నానం చేసి, శిష్యులతో వచ్చాడు. పార్వతీదేవి వారికి స్వాగతం చెప్పి, వారందరికీ భోజనశాలలో బంతివేసి వడ్డించింది.


9441244773



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

వెతలకు వెలుతురు చూపిన 'మూడు గుడిసెల పల్లె' కథలు

ప్రముఖ కవి, రచయిత డా. సిద్దెంకి యాదగిరి రచించిన  మూడు గుడిసెల పల్లె కథల పుస్తకం పై  డా. మండల స్వామి  రాసిన సమీక్షా వ్యాసాన్ని  ఈ రోజు తేది: ...