వట్టికోట ఆల్వారు స్వామి
పాఠం ఉద్దేశం :
ఒకప్పటి నిజాం రాష్ట్రంలో తెలుగు భాషా సంస్కృతులు ఉపేక్షకు గురికావడాన్ని నిరసిస్తూ ఆంధ్రోద్యమము విస్తరించింది. ఆ సందర్భంగా సభల ద్వారా పత్రికల ద్వారా రచనల ద్వారా ప్రజా చైతన్యాన్ని ఎట్లా సాధించారో తెల్పడం ఈ పాఠం ఉద్దేశం.
పాఠ్యభాగ వివరాలు:
ఈ పాఠం కథానిక ప్రక్రియకు చెందినది. ఇది జీవితం ముఖ్య సన్నివేశాలను క్లుప్తంగా తెలియజేస్తుంది; సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది; ఇటువంటి వచన ప్రక్రియని 'కథానిక' అంటారు. కథనం, సంభాషణ, శిల్పం ఇవి కథానికలోని ప్రధానాంశాలు. సంక్షిప్తతా లక్షణమే కథానిక ప్రత్యేకత.
1945లో మీజాన్ పత్రికలో ప్రచురితమైన ఆల్వార్ స్వామి కథానికనే ప్రస్తుత పాఠ్యాంశం.
కవి పరిచయం:
పేరు : వట్టి కోట ఆళ్వారు స్వామి
జన్మస్థలం : నల్గొండ జిల్లాలోని చెరువు మాదారం
జననం : 01-11-1915.
మరణం : 05-02-1961.
నిర్వహించిన పదవి : ఆంధ్ర మహాసభ నల్గొండ జిల్లా శాఖకు అధ్యక్షుడు.
సంస్థలు : దేశోద్ధారక గ్రంథమాల 35 పుస్తకాల ప్రచురణ.
నడిపించిన పత్రికలు: 'తెలంగాణ', 'గుమస్తా'.
కథా సంపుటి : జైలు లోపల.
నవలలు : 'ప్రజల మనిషి', 'గంగు'.
ఇతర రచనలు : 'రామప్ప రభస', 'తెలంగాణ'. వ్యాసాలు.
ప్రవేశిక
రజాకార్ల అఘాయిత్యాలకు పెత్తందార్ల పీడనకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజానీకం తిరగబడ్డది. అట్లా తిరగబడటానికి ప్రేరణనిచ్చినవారు ఉద్యమ కార్యకర్తలు, నాయకులు, ఆనాటి మానవ సమాజానికి స్వతంత్రత, వ్యక్తిత్వం, గౌరవం, మర్యాద, విశ్వమానవ సౌభ్రాతృత్వం, సహనశక్తి, పరహితం వంటి ఉత్తమ గుణాలనందించేటందుకు వాళ్ళు ఏవిధమైన ప్రయత్నం చేశారు? ఆనాటి సాంఘిక పరిస్థితులెట్లా ఉండేవి? ఇవన్నీ కళ్ళకు కట్టినట్లు వివరించే కథనంకోసం.. ఈ పాఠం చదువుదాం......
I
ఆంధ్రమహాసభ కార్యకర్త వెంకటరావు నాయకులతో రంగాపురానికి బయలు దేరాడు.
“మనం నేరుగా ఊళ్ళోకి వెళ్ళకూడదు. గ్రామీయులకు నిరుత్సాహం కలుగుతుంది. గ్రామీయులు వాయిద్యాలతో -ఎదుర్కొని తీసుకు వెళ్ళుతారు" అని వెంకటరావు హెచ్చరించాడు నాయకులను.
ఉదయం 12 గంటల కాలం. వరికోతల రోజులు. అయినా పొలాల్లో ఎవరూ లేరు. జనం అంతా నాయకులు ఊరేగింపు సన్నాహాల్లో ఉన్నారు. నాయకులు ఊరిబయట మోటబావి వద్ద కూర్చున్నారు. చెట్టునీడను కూర్చున్న ఒకరైతు యువకుడు “దండమండే" అని పెద్దగొంతుతో అన్నాడు. వెంకటరావువైపు చూస్తూ, విధిగా గ్రామ అగ్రజాతుల వారికి పెట్టే దండంలోను, భయంతో గ్రామ పెత్తందార్లకు పెట్టే దండంలోను వెంకట్రావుకు పెట్టే దండంలోను ఎంతో భేదం కనిపించింది. వికసించిన ముఖం, ఉప్పొంగి వస్తున్న సంతోషం, చనువు "దండమండే" అన్న శబ్దంలో నగ్నంగా కనిపించినవి. వెంకట్రావు ఆంధ్రమహాసభ కార్యకర్తగా సుమారు రెండు నెల్లనుండి ఏక దీక్షతో గ్రామీయులు సమస్యలను తీసుకుని పని చేస్తున్నాడు. 90 ఏండ్ల ముసలి మొదలు 8 ఏండ్ల బాలుని వరకూ వెంకట్రావంటే ధన, మాన, ప్రాణ రక్షకునిగా భావిస్తారు. అడుగడుగుకు గ్రామ పెత్తందార్లు నిందలు, నేరాలు మోపి లాగే లంచాలు లేకుండా చేశాడు వెంకట్రావు, చిన్న, పెద్దు గౌరవ మర్యాద లేక ప్రతివారిని, ప్రతి స్త్రీని దుర్భాషలాడటం, నీచంగా ప్రవర్తించటం వెంకట్రావు కృషి ఫలితంగా లేకుండా పోయినవి. గ్రామ పెత్తందార్లు దయతో ఇచ్చే కూలితో, విధి విరామం లేకుండా జీవితాంతం పని చేయించుకోవటం తుదకు పనివారు కడుపునిండా తిండి లేక మాడుచుండటం మానిపించాడు వెంకట్రావు. బావివద్ద చెట్టుక్రింద కూర్చున్న రైతుయువకుడు బాటసారితో ఆంధ్ర మహాసభ నాయకుల ఆగమన వార్తను ఊళ్ళోకి తెల్పాడు.
కొద్ది సేపట్లోనే కొందరు బాలురు నాయకులు కూర్చున్న వైపుకు వచ్చారు. మెల్లమెల్లగా సమీపంలో ఉసిరిచెట్టు వద్దకు వెళ్ళి ఉసిరికాయలు రాల్చుకొని, జేబులు నింపుకొని నములుతూ మెల్లగా నాయకుల ప్రక్క కూర్చున్నారు.
నాయకులు పచ్చని పచ్చికపై హాయిగా కూర్చుని మాటామంతీ సాగించారు.
వారిలో ఒకరు "నీపేరేం" అని బాలుడ్ని ప్రశ్నించాడు.
"లింగయ్య" అని మెల్లగా అన్నాడు. ఆ పిల్లవాని వయస్సు పదిఏండ్లు సుమారు ఉంటాయి.
80
"లింగా! అని మొదలు మేము పిలిచేది" వెంకట్రావు వైపు చూపుతూ "సంగంపంతులు బడి పెట్టినప్పటినుండీ లింగయ్య అని పిలుస్తున్నాం" అని ఇంకొక పిల్లవాడు అందుకున్నాడు.
నాయకులు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. వెంకట్రావు ఆలోచిస్తున్నట్లు తల నేలకు వేశాడు.
"మీరెవరు" అని ఒక నాయకుడు ప్రశ్నించాడు.
"మేం బట్టలుతుకుతాం" అని లింగయ్య చెప్పాడు.
“నాకొక ఉసిరికాయ ఇస్తావు" అని ఒక నాయకుడు లింగయ్య వైపు చేయిచాపాడు. మొదట పరిహాసమనుకున్నాడు. లింగయ్య. అయినా తేల్చుకుందామన్నట్టుగా అనుమానంతో మెల్లగా జేబులో నుండి ఒక ఉసిరికాయ తీసి అందిచ్చాడు.
ఆ నాయకుడు వెంటనే అందుకుని కొరికాడు. కొరుకుతూ ఉండగానే అక్కడ కూర్చున్న పిల్లలందరూ గభాలున ఆ నాయకునివైపు వచ్చి తమ జేబులో నున్న కాయలన్నీ అతని ముందర పోశారు.
"ఎందుకివన్నీ, చాలు, చాలు" అని నాయకుడంటుండగానే "ఇది బాగుంది. ఇది బాగుంది" అని పిల్లలందరూ తాము బోర్లించిన కాయల్లో నుండి మంచి మంచివి వీరి అందించసాగారు.
ఆ నాయకుడు పట్టలేని సంతోషంతో అందరిని తన కౌగిట్లోకి తీసుకొని కన్న కొడుకుల్లాగ వీపులపై చేతులు నిమిరాడు. ఆ బాలురు అమితోత్సాహంతో ఆ నాయకుణ్ణి చుట్టివేశారు.
ఆ బాలురకు, ఆ నాయకునకు ఏర్పడిన ఆ ప్రేమకు ఎంత విలువ గట్టగలం? ప్రతిరోజు, ప్రతివస్తువు అన్యాయంగా -హరించే గ్రామ పెత్తందారుణ్ణి అసహ్యించుకునే ఆ బాలురు తాము స్వయంగా ఇవ్వటమేగాక దాన్ని నాయకుడు
81
R0011
అంగీకరించటంతో పొందిన ఆనందానికి ఎంత విలువ కట్టగలం? తమ గ్రామీయులైనప్పటికీ గ్రామ పెత్తందార్లు అంటే హడలిపోయే ఆ బాలుదు పరగ్రామీయుడు, పది నిమిషాలక్రింద పరిచయుడైన ఆ నాయకుడు చిరపరిచిత, అవ్యాజబంధువుగా తలచ బడ్డాడంటే వారికి పరస్పరం ఏర్పడిన గాఢాభిమానానికి ఎంత విలువ కట్టగలం?
ఆలోచించండి - చెప్పండి
వరికోతల రోజులు, అయినా పొలాల్లో ఎవరూ లేరు ఈ మీకేమి అర్ధమయింది.
ఊళ్ళోకి ఎదుర్కొని తీసుకొని పోవడమంటే ఏమిటి?
• పిల్లలు నాయకుణ్ణి అమితోత్సాహంతో చుట్టివేశారు' అట్లా ప్రవర్తించడానికి కారణాలు ఏమై ఉంటాయి?
II
"వీండ్లందరెవరో ఎరికేనా?" అని ఆ బాలురను వెంకట్రావు ప్రశ్నించాడు.
"మే మెందుకొచ్చామో చెప్పు" అని నాయకుల్లో ఒకరడిగారు.
పిల్లలు ఒకరి ముఖం ఒకరు చూచుకున్నారు. అందరిముఖాలు వికసించినవి.
"మమ్ముల బతికించటానికి" అని ఒక బాలుడన్నాడు.
"మీబతుకుకేమైంది? నీ చేతులకు వెండికడియాలున్నాయి. ఆ పిల్లవాని చెవులకు బంగారు పోగులున్నాయి.. పిల్లవానికి బంగారు గుండీలున్నాయి" అని ఒక నాయకుడు పిల్లలవైపు చేతులు చూపుతూ అన్నాడు.
"ఇవి ఉంటే? ఒకసారి మాపూరిదొర మా బర్రెను బందెలదొడ్లో పెట్టించాడు".
"మా అన్న కోడెదూడ చేలో బడ్డదని మావూరి పటేలు పదిరూపాయలు వసూలు చేశాడు"
"మా దున్నపోతు 'బుస్సుమన్నదట, ముకుతాడు లేదని ముప్పయిరూపాయలు తీసుకున్నాడు మాలిపటేలు."
"సర్కారీ రకం కట్టలేదని మా నాయనకు బండలెత్తారు ఒకసారి"
"వెంకట్రావు పంతులు పెట్టిన బడిలోకిపోతె దెబ్బలు కొడతానని మొన్న మా దొర గుమాస్తా బెదిరించాడు."
"మొన్న మా అమ్మ కూలికిపోయి వస్తూ చేటో కట్టెపుల్ల లేరుకుంటుంటే ఎందుకేరుకున్నావని మా అమ్మని సిగపట్టుకొని కొట్టాడు. మా అయ్య అడ్డంబోతే చేతికర్ర ఇరిగేదాకా కొట్టాడు దొరగారి శేగిదారు."
ఈ విధంగా పిల్లవాండ్లంతా తమకష్టాలు కుప్పలుగా కురిపించారు.
“పొయ్యిలో కట్టెలు లేకపోతె ఆరోజు రాత్రి బువ్వెట్లా వండింది మీ అమ్మ?" అని ఒక నాయకుడు ప్రశ్నించాడు.
"నేను పసులుకాడనుండి ఇంటికొచ్చేవరకూ మా అమ్మా అయ్యా మూలుక్కుంటూ పండుకున్నారు. ఇంట్లో బువ్వ ఉన్నదేమోనని కుండలన్నీ వెతుకుతూంటే, మా అయ్యలేచి చెట్లపొదల్లోంచి కట్టెలు తెచ్చి బువ్వ పండుతుంటే, గిర్దావరు బరులకు పోవాలని షేక్ సింది బట్టుకపోయిండు. పొయ్యిమీద బువ్వంత చెడిపోయింది. దాంట్లనే మీరం, ఉప్పు పోసుకుని, నీళ్ళు పోసికొని తిన్న" అని ఆ బాలుడు జనాబు చెప్పాడు.
"మీరెవరబ్బాయి?" అని నెత్తినుండి కారేటంత నూనె పెట్టుకున్న ఒక అబ్బాయిని ప్రశ్నించాడు ఒక నాయకుడు.
"నేను సంగి శెట్టి కొడుకును"
82
"మీకేం కష్టాలున్నాయి చెప్పు" అని తిరిగి ప్రశ్నించాడు నాయకుడు.
"ఏమో నాకేం ఎరుక. మా నాయనకెరుక" అని ముఖం తిప్పాడు.
" ఓసారి మీ అమ్మ పసుల జంగల్లోనుంచి పేడ తెచ్చిందని పోలీసు పటేలు ఇనుపతట్ట గుంజుకోలే?" అని వేరొక పిల్లవాడు జ్ఞాపకం చేశాడు. "ఇంకా ఆ తట్ట ఇవ్వలేదు కూడ" అని శెట్టి కొడుకు అందుకున్నాడు.
ఈ విధంగా నాయకులు సుమారు అరగంటకాలం పిల్లలతో గడిపారు.
"పాపం! చిన్నప్పుడే కుటుంబ ఇబ్బందులన్నీ ఈ పిల్లలు తెలుసుకోవాల్సిన గతి బట్టిందంటే పరిస్థితులు ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో తెలుస్తున్నది" అని నాయకుల్లో ఒకరన్నారు.
"మనం మన సంతానానికి ఆస్తిగా ఇచ్చేవి అప్పులు, రోగాలు, కష్టాలేగా" అని ఒక నాయకుడన్నాడు.
"మనం ఈ రోజు స్వార్థ రహితంగా, ధైర్యంగా, పట్టుదలతో పనిచేస్తే మన సంతానం అంత హాయిగా బతుకుతారు" అని ఒక నాయకుడన్నాడు.
"స్వతంత్రం, వ్యక్తిత్వం, గౌరవం, మర్యాద, విశ్వమానవ సౌభ్రాతృత్వం, సహనశక్తి, పరహితం. ఇదే నేటి మానవ సమాజానికి వజ్ర, వైడూర్యాలు, దివ్యభవనాలు, నగలు, నాణ్యాలు, ఆస్తి, ఆదాయం" ఇంకొక నాయకుడన్నాడు.
ఇంతలో గ్రామంలో వాద్యాలచప్పుడు వినబడింది., "వాళ్ళతో కలిసి మళ్ళావస్తాం" అని స్నేహితులతో సెలవు తీసుకుంటున్నట్టు చెప్పి ఆ బాలురంతా పరుగెత్తారు.
ఆలోచించండి-చెప్పండి..
* పిల్లలు చెప్పిన విషయాలను బట్టి ఆనాటి గ్రామాల పరిస్థితిని ఎట్లా అర్ధం చేసుకున్నారు.
"మనం మన సంతానానికి ఆస్తిగా ఇచ్చేవి అప్పులు, రోగాలు, కష్టాలేగా" అని నాయకుడు అనడంలోని ఉద్దేశమేమి?
I. విని అర్థం చేసుకొని ఆలోచించి మాట్లాడడం
చిన్నప్పుడే కథ చదివారు కదా! దీని ఆధారంగా స్వాతంత్రానికి ముందు గ్రామాల్లో పరిస్థితి ఎట్లా ఉండేదో ఊహించండి, మాట్లాడండి.
II. ధారాళంగా చదవడం అర్థం చేసుకుని ప్రతిస్పందించడం
1. పాఠం ఆధారంగా కింది మాటలు ఎవరు ఎవరితోటి ఏ సందర్భంలో అన్నారు చర్చించండి.
అ) వీండ్ల అందరెవరో ఎరికేనా?
వెంకట్రావు పిల్లలతో
ఆ) నేను సంగిశెట్టి కొడుకును.
వెంకట్రావు ఒక బాబుని చూచి మీరెవరు అని అడిగినప్పుడు ఇచ్చిన సమాధానం.
ఇ) మన సంతానమంతా హాయిగా బతుకుతారు.
పిల్లల దీనత్వాన్ని చూచి చలించిన ఒక నాయకుడు పలికిన మాటలు
2. కింది పేరా చదవండి ప్రశ్నలకు జవాబులు రాయండి.
(టెక్స్ట్ బుక్ పేజి నెంబర్ 84 లోని పేరా.)
ప్రశ్నలు
అ) అణిచివేత గురైన వారెవరు?
జవాబు : తెలంగాణ ప్రజలు.
ఆ)వాళ్ళు ఏ ఏ విషయాల్లో అణిచివేతకు గురి అయ్యారు ?
జవాబు. సాంస్కృతికంగా భాషాపరంగా అంచవేయబడ్డారు.
ఇ) తెలంగాణలో ఆంధ్రోద్యమము ఎందుకు విస్తరించింది ?
జవాబు: జాతిని చైతన్యపరిచే లక్ష్యంతోనే ఆంద్రోద్యమము విస్తరించింది.
ఈ) తెలంగాణ ప్రజల్లో భాషా సంస్కృతుల పట్ల అభిమానాన్ని పెంచిన సంస్థలేవి ?
జవాబు. గ్రంధాలయాలు పఠనాలయాలు తెలుగు పత్రికలు
ఉ) తెలంగాణలో జాతీయ, సాంస్కృతిక వికాసానికి కృషి చేసిన మహనీయులు ఎవరు?
జవాబు : మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, అహల్యాబాయ్, రాజబహద్దూర్ వెంకటరామిరెడ్డి, రావి నారాయణరెడ్డి లు ముఖ్యులు
III. స్వీయ రచన
1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
అ) వెంకట్రావు స్వభావాన్ని తెలపండి.
జ. వెంకట్రావు నాయకుడు ఆంధ్ర మహాసభ కార్యకర్త అతనిని చిన్న పెద్ద ప్రజలంతా తమ ధన మాన ప్రాణ రక్షకునిగా భావించేవారు. గ్రామీయుల సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కారం చేసే విధంగా పనిచేసేవాడు. అడగడానికి నిందలు నేరాలు మోపడం లంచాలు లాగడం వంటివి లేకుండా పెత్తందాల నుండి ప్రజలకు రక్షణ కల్పించారు. పెత్తందారుల దుర్భాషల నుండి కాపాడడం, నీచంగా మాట్లాడడం వంటివి వెంకట్రావు నిరోధించాడు. దయతో గ్రామ పెద్దలు ఇచ్చే కూలితో వెట్టి చాకిరి చేయకుండా వెంకట్రావు కృషి చేశాడు.
ఆ) వెంకట్రావు వంటి యువకుల వల్ల కలిగే ప్రయోజనాలు ఏవి?
జ. వెంకట్రావు వంటి యువకులు ప్రజలకు మేలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. కష్టసుఖాల్లో అండగా ఉండి వారికి జరిగే అన్యాయాన్ని ఎదిరించి పోరాడుతారు. పెత్తందారులు, యజమానులు చేసే దుర్మార్గాలను అరికడతారు. యువకులను పెద్దలను అందర్నీ చైతన్యవంతం చేసి వారి సాయంతో గ్రామీయుల సమస్యలను తీరుస్తారు. సుఖ సంతోషాలు కలిగేలా సహాయపడతారు. ఇతరుల మేలుకోసిన వారు పనిచేస్తారు. స్వార్థానికి చోటు ఇవ్వరు. నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారు మంచి కోసం మార్గదర్శనం చేస్తారు.
ఇ)వెంకట్రావు తో నేటి యువతను పరిశీలించి, పోల్చండి.
జ. వెంకట్రావు నాయకుడు. హితవరి. సంఘసేవకుడు పరోపకారి. ఇతరుల కష్టాలను తన కష్టంగా భావించి వాటిని నిర్మూలించడానికి కృషి చేస్తాడు. అవసరమైతే ప్రభుత్వాన్ని కూడా ఎదిరిస్తాడు. విజయాన్ని సాధిస్తాడు. ప్రజలందరూ వెంకట్రావును తమ ధన, మాన, ప్రాణ రక్షకునిగా భావించారు. మరి నేటి యువకులు స్వార్థంగా ఆలోచిస్తున్నారు తమకు మేలు జరుగుతుందంటే ఇతరులకు హాని తలపెడుతున్నారు. వివిధ వ్యసనాల బారిన పడకపోతే చాలా మంచిది. కొంతమంది యువకులు సంఘ సేవకులుగా, పరోపకారులుగా వ్యవహరిస్తున్నారు.
ఈ) "మనం ఈ రోజు స్వార్ధ రహితంగా, ధైర్యంగా పట్టుదలతో పని చేస్తే, మన సంతానం అంతా హాయిగా బతుకుతారు" అని ఒక నాయకుడు ఎందుకని ఉంటాడు?
జ. నిజాం రాష్ట్రంలో గ్రామ పెత్తందారులు మునసబులు, గ్రామ నౌకరు, పోలీస్ అధికారులు, పోలీస్ పటేల్, మాలి పటేల్ , మొదలైన వారు ఆనాటి అధికారం కలిగిన వ్యక్తులు నిజాం ప్రభువు వద్ద పనిచేసి చిన్న అధికారులు ప్రజల్ని బెదిరించి తిట్టి కొట్టి జర్మానాలు వసూలు చేసి దోపిడీ చేసేవారు. ప్రజలు వారికి నమస్కారం చేయవలసి వచ్చేది.
ప్రజల నుండి బలవంతంగా ఆ పెత్తందారులు కావాల్సినవన్నీ తీసుకుపోయేవారు అడవిలో కట్టెలు ఏరుకోవడానికి ప్రజలకు అనుమతి లేదు.
ఆ నాయకుడు తామంత ధైర్యంగా పట్టుదలతో ఆ పెత్తందారులకు ఎదురు తిరిగితే తమకు స్వాతంత్రం వస్తుందని హాయిగా బతుకుతారని చెప్పే ప్రజలకు కార్యకర్తలకు ధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని నూరిపోశాడు.
2. కింది ప్రశ్నలకు పది వాక్యాల్లో జవాబులు రాయండి.
అ) చిన్నప్పుడే కథ ద్వారా ఆనాటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయో తెలుసుకున్నారు కదా! ఆనాటి పరిస్థితులు నేటి సమాజంలో కూడా ఉన్నాయా? కారణాలు ఏమిటి?
జ. తెలంగాణ ఒకప్పుడు నిజాం చక్రవర్తి పాలనలో ఉండేది. గ్రామంలో వివిధ రకాల అధికారులు ఉండేవారు. వారు మాటిమాటికి హింసించి జరిమానాలు విధించి వసూలు చేసేవారు. ప్రజలకు పెత్తందారులంటే మహా భయం. ఊరిదొరలు ప్రజలను బర్రెలను బందెల దొడ్డిలో పెట్టించేవారు. చేలో పడితే ఊరు పట్టేలు పది రూపాయలు జరిమానా పుచ్చుకునేవాడు. ఒక దున్న పక్క వారిపై బుసుమంటే దానికి మూతాడు లేదని నేరం మోపి మాలి పటేల్ వారి వద్ద 30 రూపాయల పన్ను వసూలు చేసేవాడు.
ఆడవారు కూలికి వెళ్లి చేలో కట్టెలేరుకుంటే దొర సేగిదారు ఆడవాళ్ళ జుట్టు పట్టుకుని కొట్టేవాడు. ఎవరైనా అడ్డుపడితే వారి సైతం బాధేవాడు. వండుకున్న తిండిని కూడా గిర్ధవార్ల కోసం పట్టుకపోయేవారు.
ఆనాడు అడవులలో పీడ ఏరుకున్నా తట్ట లాగుకునే వారు మందలించేవారు ఈ విధంగా గ్రామ పెత్తందారు నిజాం పేరు చెప్పి ప్రజలపై పెత్తనం సాగించేవారు.
IV. సృజనాత్మకత ప్రశంస
అ) కింది అంశాల గురించి సృజనాత్మకంగా రాయండి.
అ) ఈ పాఠం ఆధారంగా చేసుకొని మీ అనుభవాలతో ఒక చిన్న కథ రాయండి.
జ. తరతరాలుగా ప్రజల బాధలు తీర్చడానికి నాయకులు అంకణం కట్టుకుంటారు సిద్దిపేట పురోభివృద్ధి చెందడానికి చాలామంది నాయకులు కృషి చేశారు డిగ్రీ కళాశాల తేవడానికి రాజేశ్వరరావు ఎడ్ల గురువారెడ్డి గారు తమ రాజకీయ జీవితాన్ని అంకితం చేశారు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు సిద్దిపేట పట్టణంలో తాగునీరు అందజేశారు శ్రీ తన్నీరు హరీష్ రావు గారు అద్భుతంగా తీర్చిదిద్దారు కోమటి చెరువు రంగనాయక సాగర్ ఆధునిక నగరముగా అభివృద్ధి చేశారు.
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారల ఆశీస్సులతో ఈ పట్టణానికి రైలు సౌకర్యం కల్పించబడ్డది.
లేదా
ఆ) వెంకటరావు వలె గ్రామం బాగుకోసం పాటుపడుతున్న వాళ్లు నేడు కూడా ఉంటారు. అటువంటి వారి సేవలను ప్రశంసిస్తూ ఒక అభినందన పత్రం రాయండి.
జ. మాది సిద్దిపేట జిల్లా సిద్దిపేట మున్సిపాలిటీ వారు చెత్త ఎత్తేందుకు కాంట్రాక్టర్లను ఏర్పాటు చేశారు తడి చెత్త పొడి చెత్త ప్లాస్టిక్ చెత్త విడివిడిగా సేకరిస్తున్నారు. మున్సిపల్ కార్మికులు చాలా ప్రయాస కోర్చి ఆ దుర్వాసనలోనూ పట్టణాన్ని శుభ్రంగా ఉంచడానికి అహర్నిశలు కృషి చేస్తున్నారు కరోనాకాలంలో ప్రాణాలకు తెగించి మరీ శుభ్రపరిచారు నిజంగా వారి సేవను ఏమని కొనియాడగలుగుతాము
మున్సిపల్ కార్మికులకు వారి కుటుంబ సభ్యులు అందరికీ అభినందనలు అందిస్తున్న
ఇట్లు
ఎస్ హరీష్
8వ తరగతి, జడ్.పి.హెచ్.ఎస్ ఇందిరానగర్
IV. పదజాలం :
1. కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు అర్ధాలు తెలుసుకొని రాయండి.
అ) దండం నమస్కారం
ఆ) అవ్యాజ కపటం లేని సహజమైన
ఇ) రకం పన్ను
ఈ) మిరం కారం మీడియం
ఉ) ఎరుక జ్ఞానం తెలుసుకోవడం
2. సమానార్థకాలు అదే అర్థం వచ్చే పదాలు.
అ) విలువ
విలువ ఖరీదు మూల్యం
ఆ) కుప్పలుగా :ప్రోగులు, రాశులు
ఇ) గభాలున : గుభేలున, గుభిల్లున
ఈ) వెండి : రజితం, కలధౌతం
3. ప్రకృతి పదాలు
వికృతి ప్రకృతి
అ) మొగం - ముఖం
ఆ) సంతసం - సంతోషం
ఇ) సుకం - సుఖం
ఈ) గారవం - గౌరవం
V. భాషను గురించి తెలుసుకుందాం:
1. కింది పట్టికలోని ఖాళీలను పూరించండి.
సమాస పదం విగ్రహవాక్యం సమాసం పేరు
అ) రాజ్య కాంక్ష : రాజ్యం నందుకాంక్ష - సప్తమి తత్పురుష సమాసం
ఆ) విజయ గర్వం : విజయం వల్ల గర్వం - పంచమి తత్పురుష సమాసం
ఇ) అష్టదిక్కులు : అష్టసంఖ్య గల దిక్కులు - ద్విగు సమాసం
ఈ) బలరాములు : బలరాముడును, కృష్ణుడు - ద్వంద్వ మాసం
ఉ) ప్రజల భాష : ప్రజల యొక్క భాష- షష్టి తత్పురుష సమాసం
ఊ) అక్రమము : క్రమం కానిది నైన్ - తత్పురుష సమాసం
ఆమ్రేడిత సంధి
కింది వాటిని చదవండి.
ఔరౌర! ఎంత గొప్ప పని చేశావు
ఆహాహా ఎంతో ఆనందం కలిగించావు
పై వాక్యాలలో గీత గీసిన పదాలను విడదీసి రాస్తే
ఔరౌర = ఔర + ఔర = ఔరౌర
ఆహాహా = ఆహా + ఆహా = ఆహాహా అవుతున్నాయి కదా!
ఇప్పుడు ఒకే పదం రెండుసార్లు వచ్చింది అట్లా వచ్చినప్పుడు రెండోసారి వచ్చిన పదాన్ని ఆమ్రేడితం అంటారు.
అచ్చునకు ఆమ్రేడితం పరమైతే సంధి తరచుగానగు.
కింది పదాలను కలిపి రాయండి అప్పుడు అప్పుడు అప్పుడప్పుడు
ఏమి ఏమి ఏమేమి
ఊరు ఊరు ఊరూరు
ఇంట ఇంట ఇంటింటా
ఓరి ఓరి ఓరోరి
ద్విరుక్త టకార సంధి:
పగలు+పగలు = పట్టపగలు
చివర + చివర = చిట్టచివర
పై పదాలు కలిపినప్పుడు ఏం జరిగిందో చెప్పండి పగలు పగలు పట్టపగలు అవుతుంది అంటే మొదటి పదంలోని పగలులో తర్వాత ఉన్న గలు పోయి దానికి బదులుగా ట వచ్చింది అప్పుడు పట్టపగలు అయింది అట్లనే చిట్టచివర పదం కూడా.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి