సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

కొత్త పొస్ట్



🌐 * L. I. P. తెలుగు ప్రారంభ పరీక్ష - BASELINE TEST 2026-27     🌐 * 10వ తరగతి 🌐 * 10వ తరగతి తెలుగులో 99% స్కోర్ సాధించాలంటే... 🌐 * తెలుగు వెలుగులీనేల 🌐 | ధ్వని గుర్తింపు / అక్షర గుర్తింపు     🌐 * సరళ పదాలు     🌐 * ఐ సి టి ఉపయోగించడం ఎలా?     🌐 * * DIKSHA WEB         🌐 SCERT         🌐 NCERT         🌐 NBT         🌐 UGC_NET         🌐 CIIL         🌐 * * NDL INDIA         🌐 SAHITHYA ACADEMY         🌐 | సిద్దెంకి కథలు     🌐 | సిద్దెంకి పుస్తకాలు     🌐 | సిద్దెంకి కవిత్వం 🌐 *"నీలి నేల ఎతలు - తెలంగాణ దళిత కథ పరిణామం కాలమ్ - కోలిమి"     🌐 | తెలుగులో అత్యుత్తమ పుస్తకాలు     🌐* | వ్యాసాలు / Articles     🌐* | దాశరథి పాటలు     🌐* | తెలంగాణ రాష్ట్రంలో దళిత కథ (2014:-07-2025)     🌐 * "సంస్కృతంతో తెలుగు కాలరాయొద్దు"     🌐 * పగిడి తెలంగాణ కథ 2024 "     🌐 * "ఆలోచనవాదుల పుష్పక విమానం దాశరథి ‘కవితా పుష్పకం’"     🌐 * Articles on Dr. Siddenky    

22, ఫిబ్రవరి 2024, గురువారం

VIII. 12. మాట్లాడే నాగలి

మాట్లాడే నాగలి

చదవండి ఆలోచించండి చెప్పండి.
ఈ విశ్వంలో, ఈ భూమండలంలో, ఈ జీవనచక్రంలో మనకంత ప్రాధాన్యముందో ….. ఓ చీమకు, ఓ దోమకు, ఓ ఈగకు, ఓ బూగకు, ఓ తేనెటీగకు, ఓ గద్దకు చివరకు ఓ నత్తకూ, ఓ ఏీతకూ కూడ 5ాస్త అటు ఇటుగా అంతే ప్రాధాన్యం ఉందని తేలిపోయింది. సమస్యేమిటంటే ఉన్నత జీవులం కావటంతో మనకు తెలివి ఎక్కువనుకుంటాం. కాని ఆ తెలివిని మనం వినాశానికి ఉపయోగిస్తున్నామనుకోం. నాటి వేటకాలం నుంచీ నేటి పారిశ్రామిక యుగం వరకూ మనం ఇతర జీవులనూ, ఈ ప్రకృతిలోని జీవవైవిధ్యాన్ని కాపాడుకోలేకపోతున్నాం. ఫలితం ఇప్పుడు ఈ భూమ్మీద మన ఆస్తిత్వమే ఆయోమయంలో పడింది.


పాఠ్యభాగ ఉద్దేశం:
ప్రాణులకు ముఖ్యంగా పెంపుడు జంతువులకూ సంవేదనలుంటాయనీ, మనం చూపే (పేమ, ఆప్యాయతలకు అవి స్పందిస్తాయనీ చెహ్తూ, తద్వారా జీవకారుణ్య దృష్టిని పెంపొందింపచేయటం ఈ పాఠం ఉద్దేశం.
పాఠ్యభాగ వివరాలు: 
ప్రశ్న 1.
అనువాద ప్రక్రియ గురించి రాయండి.
జవాబు.
ఒక భాషలో ఉన్న విషయాన్ని వేరొక భాషలోకి మార్చి రాసినట్లైతే దాన్ని అనువాదం (Translation) అంటారు. తెలుగు సాహిత్యంలో దీనిని అనువాద ప్రక్రియగా పేర్కొనటం జరుగుతున్నది. సాహిత్య అకాడమీ వారు ముద్రించిన భారతీయ సాహిత్యం సమకాలీన కథానికలుఅనే (్రంథంలోని మలయాళ భాషలోని అనువాదకథ ప్రస్తుత పాఠ్యాంశం. మలయాళ భాషలో పొన్కనన్నం వర్కెయ్ రాసిన కథను తెలుగులోకి ఎన్. వేణుగోపాలరావు అనువాదం చేశాడు.
రచయిత పరిచయం:
రచయిత పేరు : పొన్కున్నం వర్కెయ్
పాఠ్యభాగం పేరు : మాట్లాడే నాగలి
కాలం : 1910 – 2004
రచనలు : 24 కథానికా సంపుటాలు, 16 నాటకాలు, 2 కవితా సంపుటాలు ఒక వ్యాస సంకలనం, ఆత్మకథ మొదలైనవి.
ప్రవేశిక:
ఈ సృష్టిలోని ప్రతి ప్రాణిలో [పేమ, ఆప్యాయతలు ఉంటాయి. మానవ సమాజంలో తన కుటుంబంతో ఎంతో మమైకమై సహజీవనం చేస్తున్న మూగజీవులను అనుకోని పరిస్థితులలో దూరం చేసుకొని, తిరిగి ఎప్పుడో కలుసుకున్నప్పుడు మనస్సు ఎంతగా స్పందిస్తుందో ఓసెఫ్ కన్నన్ద్వారా తెలుస్తుంది. ఇంతకూ ఓసెఫ్
 
ఇవి చేయండి.
I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం
1. కింది అంశాల గురించి తెలుపండి.
అ. ఈ కథను సొంతమాటల్లో చెప్పండి.
జవాబుమానవత్వం గురించి, మూగ జీవుల పట్ల మానవులు చూపాల్సిన ప్రేమ గురించి చెప్పిన మంచి కథ ఇది. ఓసెఫ్ ఒక మనసున్న రైతు. అతని వద్ద కన్నన్ అనే ఎద్దు ఉండేది. ఆ ఎద్దే అతని లోకం. అది ఉంటే అతడు ఈలోకాన్ని మరచేవాడు. అందుకే అతనిని ఎద్దు పిచ్చోడు అని మిగిలిన రైతులు అనేవారు. కన్నన్ను ఎప్పుడూ ఓసెఫ్ చెర్నాకోలతో కొట్టలేదు. అదే తన యజమాని మనసు తెలుసుకుని ప్రవర్తించేది. పని అయిపోయాక హాయిగా కడుపునింపుకోమని వదిలేవాడు. అది గడ్డి తిన్నదే గాని ఏనాడు అరటి మొక్కలను కొబ్బరి మొక్కలను తాకనైనా తాకలేదు. ఓసెఫ్ పాట మాట అంటే కన్నన్కు ఇష్టం. ఇరవైఏళ్ళపాటు కన్నన్ ఓసెఫ్క మొక్కవోని సేవచేసింది.
ఓసెఫ్కు ఒక కూతురుంది. ఆమెపేరు కత్రి. ఆమెకు పెళ్ళిచేయాలనుకున్నాడు. కట్నంకోసం పొలాన్ని అమ్మాడు. అయినా చాలలేదు. కన్నన్ను కూడా అమ్మేయక తప్పిందికాదు. ఒక రోజు కూతురు కత్రికి బట్టలు తేవటానికి వెళ్ళిన ఓసెఫ్కు తన కన్నన్ను మాంసం దుకాణానికి తరలిస్తుండడం కన్పించింది. తట్టుకోలేక పోయాడు. కన్నన్.. అని పెద్దకేకవేసి బట్టలకని తెచ్చిన డబ్బులతో కన్నన్ను కొని ఇంటికి తీసుకువచ్చాడు. నాన్న బట్టలు తెస్తున్నాడని ఎదురువెళ్ళిన కత్రికి కన్నన్ కన్పించింది. విషయం అర్థమయింది. నాన్నా నువ్వు నాకు ఇలా అన్యాయం చేస్తావని ఎప్పుడూ అనుకోలేదని ఏడ్చింది. అప్పుడు ఓసెఫ్ ఓ బిడ్డా నువ్వు నాకు ఎంతో కన్నన్ కూడా అంతే అన్నాడు.
ఆ. మాట్లాడే నాగలిఅనే పేరు ఈ కథకు సరైందేనా? ఎందుకు?
జవాబు.దేశాభివృద్ధిలో రైతులదే కీలకపాత్ర. రైతు లేనిదే రాజ్యం లేదు. రైతు ఆయుధం నాగలి. రైతు యొక్క జీవితాన్ని విశ్లేషించిన కథ మాట్లాడే నాగలి’. రైతు అతనికి ప్రాణప్రదమైన ఎద్దుల అనుబంధం ఈ కథలో వివరించబడింది. కనుక ఈ కథకు మాట్లాడే నాగలి అనుపేరు సరైందేనని భావించాలి. ఇక్కడ నాగలి అంటే ఎద్దు. మాట్లాడడమంటే ప్రేమను చూపడం.
II. ధారాళంగా చదువడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం
1. కింది వాక్యాలు పాఠంలోని ఏ పేరాలో ఉన్నాయో గుర్తించండి. ఆ వాక్యాల కింద గీత గీయండి.
అ. ఒకసారి దాని చెవుల్లో జీవితం ప్రతిధ్వనించింది.
జవాబు.ఈ వాక్యం పాఠంలోని 125వ పేజీలో మొదటి పేరాలో ఉంది. మొద్దుబారి పోయింది. కన్నన్ అప్పుడు ఆ బ్రహ్మాండమైన భవనం ముందర తలదించుకొని ఉంది. మళ్ళీ ఒకసారి దాని చెవుల్లో జీవితం ప్రతిధ్వనించింది. తలపైకెత్తి చుట్టూ చూసింది.
అ. అది తన నోటితో కాదు; హృదయంతో ఏడ్చింది.
జవాబు.ఈ వాక్యం పాఠంలోని 125వ పేజీలో రెండవ పేరాలో ఉంది. బిడ్డా, నన్ను గుర్తుపట్టావా ? నిన్నీ స్థితిలో చూడవలసి వచ్చిందా? ప్రేమ స్పందిస్తున్న గుండెలకు అతను ఆ పశువును హత్తుకున్నాడు. దాని తలమీద నిమిరాడు. ఆ చేతుల స్పర్శ గుర్తించగానే అది తోకెత్తింది. అది తన నోటితో కాదు, హృదయంతో ఏడ్చింది. కన్నన్ మీద కూడా ముద్ర ఉందేమోనని చూశాడు ఓసెఫ్. ఔను, వెనకకాళ్ళ మీద ముద్ర స్పష్టంగా ఉంది. దాన్ని చెరిపెయ్యడానికి ప్రయత్నించాడు. కాని మునిసిపాలిటీ వేసిన ఆ నల్లముద్రను చెరపడం అంత సులభం కాదు.
2. కింది పేరా చదవండి. ఖాళీలు పూరించండి.
ఒక పండుగరోజు ఆశ్రమంలో సేవచేస్తున్న ఒక ముసలమ్మ హాలుకు ఎదురుగా ఉన్న గడపలకింద ఉన్న నేలమీద ముగ్గులు వేస్తుంది. అది రమణమహర్షి కంట పడింది. పాటీ! అని భగవాన్ పిలువగా ఎంతో సంతోషంగా భగవాన్ దగ్గరకు వచ్చిందామె. ఇదిగో అవ్వా! కష్టపడి ముగ్గులు పెడుతున్నావు గాని అది బియ్యపుపిండేనా ? అన్నారు భగవాన్. కాదు! రాతి ముగ్గే అంది ఆ అవ్వ. అయ్యో! చీమలకైనా ఉపయోగం ఉండదే. ముగ్గులు పెట్టడం అంటే చీమలకు ఆహారం వేయడమన్నమాట. ఆ ధర్మం విడిచిపెట్టి అచ్చంగా రాతిముగ్గే పెడితే చీమలు ఆ పక్కకే రావు. ఒకవేళ వచ్చినా ఆ ఘాటుకు చచ్చిపోతాయి కూడ. ఎందుకది ? కొంచెమైనా బియ్యపు పిండి చేర్చుకోండి అ సెలవిచ్చినారు భగవాన్. ఆ మాటలు విన్నవారొకరందుకొని ధనుర్మాసంలో ముగ్గులు అధికంగా పెట్టడం చీమలకు ఆహారం వెయ్యడం కోసమేనా!అన్నారు. ఆ! కాకపోతే మరేమి ? కొత్త ధాన్యం వచ్చిన సంబరంతో రంగవల్లులు తీర్చి చీమలకు ఆహారం వేస్తారన్నమాట. పెద్దలు నిర్ణయించిన ఆచారాలన్నీ జీవకారుణ్యంతో కూడినవే! ఇప్పుడవి పాటించేదెవరు? అలంకారానికి ఏదో చేస్తారంతేఅన్నారు భగవాన్.
అ. జీవకారుణ్యం అంటే తోటి జీవుల పట్ల కారుణ్యంతో వ్యవహరించటం.
ఆ. ముగ్గులు పెట్టడంలో అంతరార్థం చీమలకు ఆహారం వెయ్యటం
ఇ. పూర్వాచారాలను పాటించాలె ఎందుకంటే ఆ ఆచారాలన్నీ జీవకారుణ్యంతో కలిసి ఉన్నవి.
 
ఈ. పై పేరాకు శీర్షిక జీవకారుణ్యం
ఉ. పై పేరాలోని ఐదు ముఖ్యమైన పండుగరోజు, ఆశ్రమం, బియ్యపుపిండి, ఘాటు, ధనుర్మాసం, రంగవల్లులు, జీవకారుణ్యం.
III. స్వీయరచన
1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
అ. ఓసెఫ్ స్థానంలో మీరుంటే ఏం చేస్తారు?
జవాబు.ఓసెఫ్ స్థానంలో నేనుంటే కన్నన్ను ఓసెఫ్ లాగానే కన్న బిడ్డలా చూసుకుంటాను. దానితోడిదే లోకంలా భావిస్తాను. నా మనుగడకు కారణమైన కన్నన్ను జాగ్రత్తగా కాపాడుకుంటాను. అవసరం తీరిందిగదా, అది ఇంక ఎంతో కాలం పనిచేయలేదు కదా అని దానిని కటిక వానికి అమ్మను. పెంపుడు జంతువులపై ప్రేమను అందరికీ వివరిస్తాను.
ఆ. పశువులపట్ల క్రూరత్వాన్ని మానాలని ఉపన్యాసాలు వింటే ఓసెఫ్కు చిర్రెత్తేదిఎందుకని?
జవాబు.ఎవరైనా మాటల్లో చెప్పేవిషయాలు చేతల్లో చేసి చూపించాలనేది ఓసెఫ్ తత్వం. ఆయన పశువులను ప్రేమగా చూడడం కర్తవ్యంగా భావించేవాడు. అందుకే ఓసెఫ్ తనకుమార్తె అత్తారింటికి వెళ్ళటానికి బట్టలు కొనడం కన్నా, తనకు చాలా కాలం జీవనాధారంగా నిలచిన మూగజీవి కన్నన్ మాంసశాలకు వెళ్ళకుండా ఉండడానికి పైసలు ఖర్చు చేయడం సరైందని భావించాడు. పశువుల పట్ల క్రూరత్వాన్ని మానాలని ఉపన్యాసాలు చేసే కన్నా వాటిని రక్షిస్తే బాగుంటుందన్నాడు.
 
ఇ. క్రయపత్రం అంటే ఏమిటి ? ఏ సందర్భాల్లో దీన్ని ఉపయోగిస్తారు?
జవాబు.క్రయపత్రం అంటే బేరసారాలు జరిగేటప్పుడు కొనుగోలు దారుడు, అమ్మకం దారుడు నమ్మకం కోసం ఒకరికొకరు రాసుకునే పత్రం. వ్యాపార లావాదేవీలు ముగిసేవరకే దీని విలువ ఉంటుంది. పొలాలు, స్థలాలు, ఇండ్లు, గొడ్లు మొదలగు వాటికి క్రయవిక్రయాలు జరిపేటప్పుడు వీటిని రాసుకుంటారు. ఒక కంపెనీ తయారు చేసిన వస్తువులను ఇతరులకు విక్రయించేటప్పుడు కూడా ఈ క్రయపత్రాలు వ్రాసుకుంటారు. దీనిని ఇంగ్లీషులో అగ్రిమెంట్అని వ్యవహరిస్తారు. ఒకనాడు నోటి మాటలతోనే క్రయవిక్రయాలు జరిగేవి. ఇపుడు క్రయపత్రం రాసుకోవటం తప్పనిసరి అయింది.
ఈ. కన్నన్తో తిరిగివచ్చిన తండ్రిని చూసి కత్రి నాన్నా!అంది. అట్లా అనడంలో ఆమె ఉద్దేశం ఏమై ఉంటుంది?
జవాబు.కన్నన్తో తిరిగివచ్చిన తండ్రిని చూసి కత్రి నాన్నాఅంది. ఇలా అనటానికి కారణం లేకపోలేదు. తండ్రి తనకు
వివాహంచేసి అత్తగారింటికి పంపించటానికి బట్టలు తెస్తానని పెళ్ళిబట్టలు మానేసి కన్నన్ను వెంటబెట్టుకొచ్చాడు. మరి తను అత్తారింటికి వెళ్ళేదెట్లా. ఆ ఆశ నెరవేరేదెట్లా అని ఆలోచించిన కత్రి తన మనసులో కలిగిన ఆలోచనను ఆవేదనను నాన్నాఅన్న ఒక్క మాటలో వ్యక్తం చేయగలిగింది. ఇంత పనిచేస్తావని ఎప్పుడూ అనుకోలేదని మూగగా రోదించింది.
ఉ. మాట్లాడే నాగలి ఏ సాహిత్య ప్రక్రియకు చెందిన పాఠం ? రచయిత ఎవరు ? విశేషాలను తెలుపండి?
జవాబు.మాట్లాడే నాగలి అను పాఠం అనువాద ప్రక్రియకు సంబంధించిన పాఠం. దీనిని మలయాళంలో పొన్కున్నం వర్కెయ్, వ్రాయగా దానిని ఎన్. వేణుగోపాలరావు తెలుగులోకి అనువదించాడు. ఒక భాషలో ఉన్న విషయాన్ని వేరొక భాషలోనికి మార్చి రాసినట్లైతే దానిని అనువాదం అంటాం. ఆంగ్లంలో అనువాదాన్ని ‘Translation’ అంటారు. సాహిత్య అకాడమీవారు ముద్రించిన భారతీయ సాహిత్యం సమకాలీన కథానికలుఅనే గ్రంథంలో ప్రచురించిన మలయాళకథ ఇది. ప్రకృతి, మూగజీవుల పట్ల ప్రేమ ఆవశ్యకతను వివరించిన కథ ఇది. జీవకారుణ్యానికి ఈ కథ ఒక మచ్చుతునక.
ఊ. కన్నను, దాని స్వభావాన్ని వివరించండి. (లేదా) మాట్లాడే నాగలి పాఠం ఆధారంగా కన్నన్ ఎద్దు స్వభావాన్ని వివరించండి.
జవాబు.కన్నన్ ఓసెఫ్కు జీవనాధారమైన ఎద్దు. ఓసెఫ్క కన్నన్ తోడిదే జీవితం. అది బూడిదరంగులో బలంగా పొట్టిగా లావాటి వంపులు తిరిగిన కొమ్ములతో బ్రహ్మాండమైన ఆకారం గలిగిన వృషభరాజం. సుడి తిరిగిన బిగువైన చర్మం, బయటకు ఉబికిన కళ్ళుండేవి. అసలు కన్నన్ నడకలోనే ఒక ప్రత్యేకత కన్పించేది. కన్నన్ విచక్షణాజ్ఞానం కలిగిన ఎద్దు. దానిని తిట్టవలసిన కొట్టవలసిన అవసరం ఓసెఫ్కు ఏనాడు రాలేదట. దీనిని బట్టి కన్నన్ ఎంతటి పెంపుడు జంతువో అర్థమౌతుంది. ఓసెఫ్ మాటలను ముందుగానే అర్థంచేసుకొని కూతురితో సమానమనిపించుకుంది.
ఎ. ఓసెఫ్ కన్నన్ను ఎలా శాంతింపజేసేవాడు?
జవాబు.ఓసెఫ్ మాట్లాడిన ప్రతిమాట కన్నన్ అర్థం చేసుకునేది. ఎంతటి గుంపులో ఉన్నా కన్నన్ ఓసెఫ్ గొంతును గుర్తుపట్టేది. నాగలిని ఓసెఫ్ పడితేనే ఇష్టపడేది. ఇంకెవరు పట్టినా తన కొంటెతనం చూపించేది. కన్నన్ హెచ్చరికతో దానిని శాంతింపజేసేవాడు. పొలాల్లో పనిచేసే రైతులు చక్కగా పాటలు పాడుకుంటారు. వాటికి వ్యాకరణంతోగాని, శాస్త్రీయ రాగాలతోగాని పనిఉండదు. ఓసెఫ్ గొంతెత్తి చక్కని పాటలు పాడేవాడు. ఆ ఆలాపన కన్నన్కు మహాఇష్టం. ఒకసారి మడి దున్నుతున్నపుడు ఓసెఫ్కు బదులు ఓసెఫ్ మిత్రుడు పచన్ పాట అందుకున్నాడు. ఆ పాటను విన్న కన్నన్ సంగీతాన్ని పచన్ అవమానిస్తున్నాడని కుడి కాలు మీద ఒక్కటి తన్నింది. ఓసెఫ్ మాటలతో మరలా శాంతించింది. ఇలా కన్నన్ విషయంలో ఎవరైనా ఓసెఫ్ తరువాతే, ఓసెఫ్కు కన్నన్ తరువాతే ఎవ్వరైనా!
2. కింది ప్రశ్నలకు పది వాక్యాల్లో జవాబులు రాయండి.
అ. ఓసెఫ్ కన్నన్ను ఏ విధంగా ప్రేమించేవాడో తెలుపండి. (లేదా) మాట్లాడే నాగలిపాఠం ఆధారంగా ఓసెఫ్, కన్నన్ ల మధ్య అనుబంధం గురించి రాయండి.
జవాబు.ఓసెఫ్ ఒక రైతు. అతడు తన ఎద్దు కన్నన్ సంగతి వచ్చేసరికి అన్నీ మరచిపోతాడు. ఓసెఫ్కు కన్నన్ తోడిదేలోకం. బూడిదరంగులో పొట్టిగా లావాటి ఒంపు తిరిగిన కొమ్ములతో, సుడిదిగిన బిగువైన చర్మంతో బయటకు ఉబికిన కళ్ళతో ఠీవిగా నడుస్తుంది. ఓసెఫ్ ప్రతి అడుగు ప్రతి మాట దానికి ఎరుకే! అందుకే కన్నన్ పై ఓసెఫ్ ఏనాడూ చెర్నాకోల వాడలేదు. కన్నన్ను ఓసెఫ్ ఎప్పుడూ కట్టేయ లేదు. దున్నటం పూర్తవగానే దానిని మేతకు వదిలేవాడు.
కన్నన్ వంటికి అంటిన బురదను ఎప్పటికప్పుడు శుభ్రం చేసేవాడు. కన్నన్కు ఓసెఫ్ చేసేపనులలో నచ్చనిది ఇది ఒక్కటే. ఓసెఫ్ కన్నన్కు తన హృదయంలోని ప్రేమానురాగాలను పంచి పెట్టేవాడు. పశువులను రక్షించాలన్న ఉపన్యాస మంటే ఓసెఫ్కు కోపం వచ్చేది. ఓసెఫ్ దొడ్లో పశువులు ఆకలితో మాడితే ఆ ఇంటికి అరిష్టం వస్తుందనేవాడు. పనిఅవగానే ఇంటికి తీసుకొనిపోయి కన్నన్కు చేతినిండా గడ్డిపరకలను, అరటి తొక్కలను చిన్న కానుకగా ఇచ్చేవాడు.
ఓసెఫ్ ప్రేమగా కన్నన్ను దువ్వుతుంటే కన్నన్ అతనిని నాకుతుంటుంది. ప్రేమకు మాటలూ ప్రదర్శనలు అవసరంలేదు. ప్రేమంటే దుఃఖం తెలిసిన రెండు హృదయాలు. కుమార్తె నాన్నా నువ్వు నాకింత పని చేస్తావని ఎపుడూ అనుకోలేదుఅని అన్నపుడు ఓసెఫ్ బిడ్డా నాకు నువ్వెంతో కన్నన్ అంతేఅన్న మాటల్లో కన్నన్పట్ల ఓసెఫ్ ప్రేమ మనకు అర్థమౌతుంది.
ఆ. మూగజీవాలమీద ఎందుకు ప్రేమ చూపించాలి ? (లేదా) పశువుల్ని రక్షించుకోవాల్సిన అవసరం గురించి రాయండి.
జవాబు.ఈ సృష్టిలో మనిషికి బ్రతికే హక్కు ఎంత ఉందో మిగిలిన జీవరాశికి బ్రతికే హక్కు అంతే ఉంది. కాబట్టి మనం మూగ జీవాల మీద ప్రేమచూపించాలి. జీవరాశిలో మానవుడు విలక్షణమైనవాడు. మిగిలిన జీవరాశుల కంటే మానవుడు ఆలోచనా జ్ఞానం విచక్షణా జ్ఞానం కలిగినవాడు. మానవుడు జీవరాశి అంతటికి ఉన్నతుడు అవటంచేత ఇతర జీవరాశుల నియంత్రణకు పాల్పడుతున్నాడు. అది సరైన పద్ధతి కానేకాదు.
ప్రతి జీవిపై ప్రేమాభిమానాలను చూపించాలి. మనిషి తాను సుఖంగా బతకాలనుకొని ఇతర జీవరాశిని నాశనం చేస్తే ప్రకృతిలో అసమతౌల్యత తలెత్తే ప్రమాదం ఉంది. ఆ అసమతౌల్యతను అధిగమించటానికైనా మనం మూగ జీవాల మీద ప్రేమను చూపించాలి. మూగజీవులకు మాటలేదు. తమ బాధలను చెప్పుకోలేవు. అందుకే వాటిని ప్రేమగా లాలించాలి. అవి చేతలతో వ్యక్తం చేసే బాధలను అర్థం చేసుకోవాలంటే ప్రేమ చూపించడమే మార్గం.
ఇ. ఎద్దు (కన్నన్)ను అమ్మవలసిన పరిస్థితిలో ఓసెఫ్ పడిన బాధను వివరించండి. (లేదా) ఓసెఫ్కి ఎద్దులంటే చాలా ప్రేమ. వాటిని అమ్మేశాడు కదా ! పేదరైతులు తమకు విలువైన వాటిని ఎందుకమ్ముకుంటున్నారో వివరించండి.
జవాబు.కన్నన్ ఓసెఫ్ దగ్గర పన్నెండు సంవత్సరాలు విశ్రాంతి లేకుండా పనిచేసింది. కాలానుగుణంగా వచ్చిన పరిస్థితుల ప్రభావం వలన ఓసెఫ్కు కన్నన్ ను అమ్మేయవలసిన పరిస్థితి వచ్చింది. అప్పటికే తాను బంగారు బాతులాంటి పొలాన్ని తాకట్టు పెట్టాడు. అది కూడా ఇష్టపూర్వకంగా కాదు. అంతకంటే గత్యంతరం లేదు. ఓసెఫ్కు పెళ్ళీడుకు వచ్చిన ముద్దుల కూతురుంది.
ఆమె పెళ్లికి కట్నకానుకలు సమర్పించటానికి పొలాన్ని, తనకు ఇష్టమైన కన్నన్నీ అమ్మేయవలసివచ్చింది. పెళ్లికొడుకు కుటుంబం పైసాకు రికాణా లేనిదైనా 3 వేలు కట్నంగా అడగటంతో అమ్మేయక తప్పిందికాదు. కన్నన్ ను అమ్మినపుడు ఓసెఫ్ అక్కడ లేడు. ప్రేమకు ఎప్పుడూ మాటలు, ప్రదర్శనలు ఉండవు. ప్రేమంటే దుఃఖం తెలిసిన రెండు హృదయాల సాన్నిహిత్యమే. ఓసెఫ్ బాధ ఎవరూ తీర్చలేనిది. ఓసెఫ్ మనసు మనసులో లేదు. కన్నన్ పట్ల ఓసెఫున్న ప్రేమ కథ చివరిలో కూతురుతో బిడ్డా నాకు నువ్వెంతో కన్నన్ కూడా అంతేఅన్నమాటల్లో అర్థమౌతుంది.
IV సృజనాత్మకత/ప్రశంస
1. “మూగజీవులకు నోరొస్తే …..” ఊహాత్మకంగా ఒక కథ రాయండి.
జవాబు.
ఒక అడవిలోని మునీశ్వరుడు ఘోరతపస్సు చేసి ఎన్నో మహిమలు పొందాడు. ఆయన తన తపశ్శక్తిని పరీక్షింపదలచి తన ఆశ్రమంలోని జింకకు మాట్లాడే వరాన్నిచ్చాడు. దాంతో ఆ జింకకు గర్వమొచ్చి ఆశ్రమంలో తనకు అడ్డువచ్చే ప్రతి జంతువునూ నోటికొచ్చినట్లు తిట్టసాగింది. ఆశ్రమంలోని విద్యార్థులను కూడా అకారణంగా దూషించేది. ఒకరోజు తనకు మేత వేయడం ఆలస్యమైందని మహర్షిని కూడా తిట్టింది. దాంతో మహర్షికి కోపం వచ్చి మరలా దానికి మాట రాకుండా చేశాడు.
కాబట్టి ఎవరి స్థాయిని వారు మరువకూడదు.
2. “మూగజీవులను ప్రేమించాలిఅన్న అంశాన్ని ప్రజలకు తెలియచెపుతూ ఒక కరపత్రం రాయండి.
మూగజీవులను ప్రేమించాలి
ప్రజలారా!
సృష్టిలోని ప్రతి ప్రాణిలో ప్రేమ, అనురాగం, ఆప్యాయత లుంటాయి. ముఖ్యంగా పెంపుడు జంతువుల విషయంలో మనం ప్రేమానురాగాలను చూపించాలి. మనింట్లో ఒక ఆవో గేదో ఉందనుకుందాం. అది మనతో 10, 15 ఏండ్ల పాటు కలిసి మెలసి ఉంటుంది. మనకు ఒకరకంగా జీవనోపాధినిస్తుంది. తరువాత అది పాలివ్వటం లేదని కటికవానికి అప్పగించకూడదు. నాలుగు గడ్డిపరకలు వేస్తే దాని జీవనం అది గడుపుతుంది. అంతకన్నా మూగజీవాలు మనల్ని ఏమీ కోరవు. వాటి మూగ వేదనను రోదనను భరించవలసిన పని మనకేమిటంటే ఇక మానవత్వం ఎక్కడున్నది.
ఆకాశంలో ఎగురుతున్న పక్షులను చూడండి. అవి మనకు ఏ హాని చేయవు. వాటిని ప్రేమిస్తూ నాలుగు గింజలను వాటికోసం ఉంచండి. మనకు పోయేదేంలేదు. దారి వెంట తనదారిన తాను పోతున్నా తొండల మీద పక్షుల మీద రాళ్ళను విసరటం మానుకోవాలి. అవి గాయపడితే మనకేం లాభం. కాబట్టి మూగజీవాలను ప్రేమతో ప్రేమించండి. ప్రేమిస్తారు కదూ!
ఇట్ల
జీవావరణ పరిరక్షణ కమిటీ,
xxxxxx
V. పదజాల వినియోగం:
1. గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి.
ఉదా : వృషభం పరమేశ్వరుడి వాహనం.
(అ) పిల్ల మనసులో ఏముంటుందో తల్లి పసికడుతుంది
జవాబు. వృషభం = ఎద్దు.
(ఆ) కన్నన్ ఠీవిగా నడుస్తూ వుంటే అందరూ మురిసిపోయేవారు.
జవాబు. పసికట్టు = కనిపెట్టు
(ఇ) మనిషిని అసహనం ఇబ్బందులకు గురిచేస్తుంది.
జవాబు. ఠీవిగా = దర్జాగా
(ఈ) పశువులు మేతకు మాడితే ఇంటికి అరిష్టం దాపురిస్తదని రైతుల నమ్మకం.
జవాబు.అరిష్టం = కీడు
కింది వాక్యాలను చదివి సమానార్థం వచ్చే పదాలను గుర్తించి, వాటి కింద గీత గీయండి.
(అ) రైతు హృదయం దహించింది. కన్నన్ తన ఎదలో బాధను దాచుకున్నాడు. వీరి ఎడదను ఓదార్చేదెవరు?
జవాబు.హృదయము, ఎద, ఎడద
(ఆ) పక్షులు ఆకలిని తీర్చుకోవటానికి సంచరిస్తాయి. కొంగలు క్షుద్బాధ కోసం చెరువును ఆశ్రయిస్తాయి. ఇక ప్రజలు బుభుక్షను తీర్చుకోవడానికి పనిచేస్తారు.
జవాబు.
ఆకలి, క్షుద్బాధ, బుభుక్ష
(ఇ) పంటలు చేతికొచ్చినందుకు రైతులు సంబరపడ్డారు. వారి పిల్లలు సంతోషంతో గంతులు వేశారు. వారి కుటుంబమంతా ఆనందంగా గడిపింది.
జవాబు.
సంబరం, సంతోషం, ఆనందం
3. కింది గీత గీసిన పదాలకు గల వేర్వేరు అర్థాలు (నానార్థాలు) రాయండి.
(అ) తూర్పు దిక్కు వెళ్తున్న భక్తులు మాకు దేవుడే దిక్కు అంటూ వేడుకొంటున్నారు.
జవాబు.దిక్కు = దిశ, శరణము, వైపు
(ఆ) రాజేశ్ ఉత్తరం వైపున ఉన్న పోస్టాఫీసుకు వెళ్ళి ఉత్తరం తెచ్చాడు. ఎందుకు తెచ్చావని తండ్రి అడిగితే ఉత్తరమివ్వ లేదు.
జవాబు.ఉత్తరము = దిక్కు, లేఖ, జవాబు.
4. కింది ప్రకృతి వికృతి పదాలను జతపరచండి.
VI. భాషను గురించి తెలుసుకుందాం
1. కింది సంధులను విడదీసి, సంధి పేర్లను రాయండి.
2. కింది సమాసాలకు విగ్రహవాక్యాలు రాసి సమాసం పేరు రాయండి.
భాషాకార్యకలాపాలు / ప్రాజెక్టు పని
ప్రశ్న 1.నిత్యజీవితంలో జంతువులు, పక్షులపైన ప్రేమ చూపించే సంఘటనలు మీరు చూసినవి లేదా విన్నవాటి గురించి నివేదిక రాయండి.
జవాబు.
నిత్య జీవితంలో జంతువులు పక్షులపైన (పేమ చూపించే సంఘటనలు కోకొల్లలు. వాటిలో నాకు తెలిసిన కథ వివరిస్తాను. బౌద్ధమతం బుద్ధునిచే ప్రారంభించబడింది. అది అహింసో పరమోధర్మఃఅని ర్రబోధించింది. బుద్ధుడు చిన్నతనంలో ఒకానాక రోజున ఉద్యానవనంలో విహరిస్తుండగా హంసలు ఆ వనంలో హాయిగా అటుఇటు తిరుగుతున్నాయి. బుద్ధుని అన్న కుమారుడు ఆ హంసలలో ఒకదానిని బాణంతో కొట్టాడు.
ఆ హంస బుద్ధుని వద్దకు వచ్చి పడిపోయింది. అపుడు బుద్ధుడు ఆ హంస శరీరంలో గుచ్చుకున్న బాణాన్ని తీసి తన వస్తాన్ని చించి కట్టుకట్టి సంరక్షించాడు. ఆ హంసను నేను వేటాడాను; అది నాది నాకిమ్మని పట్టుపట్టాడు అన్న కుమారుడు. బుద్ధుడు అందుకు ఒప్పుకోలేదు. వారి తగవు రాజు వద్దకు చేరింది. రాజు వారిద్దరి వాదనలు విని హంసను [పేమతో రక్షించిన వాడు బుద్ధుడు కావున అది బుద్ధునిదేనని తీర్పు ఇచ్చాడు. (పేమించిన వానిదే ప్రాణి కాని హింసించిన వానిది కాదని ఈ కథలోని నీతి.
 
ప్రశ్న 2.వివిధ జంతువులు / పక్షులు పెంపకం దారుల వద్దకు వెళ్ళి, ఆయా జంతువుల / పక్షుల పెంపకంలో ఎలాంటి శ్రద్ధ కనబరుస్తున్నారో తెలుసుకొని నివేదిక రాయండి.
జవాబు.
సంప్రదించిన వ్యక్తులు
  1. డేవిడ్ కెన్నెల్ నిర్వాహకులు
  1. న్నూభాయ్ పావురాల ప్రేమికుడు
  1. కిరణ్ కుక్కపిల్ల (జూలీ) ని పెంచుకుంటున్న స్నేహితుడు
  1. రంగమ్మత్త పిల్లికూనను పెంచుకుంటున్న పక్కింటి అత్తమ్మ 5. రామయ్య ఆవును సాదుకుంటున్న పశుప్రేమికుడు
  1. సలీం అలీ పక్షుల సంరక్షకుడు
  1. శ్రావణి లవ్బర్డ్స్ని పెంచుతున్న ఒక అమ్మాయి.
  1. సురేందర్ ఆక్వేరియంలో చేపపిల్లలను పెంచుతున్న మిత్రుడు
ఈవిధంగా మన చుట్టూ సమాజంలో ఉన్న రకరకాల జంతుప్రేమికులను, పక్షుల ప్రేమికులను, చేపల ప్రేమికులను సంప్రదించిన తర్వాత అనేక విషయాలు తెలిశాయి. వివిధ రకాల పశుపక్ష్యాదుల పెంపకం మనలో జీవకారుణ్యాన్ని పెంపొందించడమే గాక, బాధ్యతను, సహానుభూతినీ, క్రమశిక్షణనూ నేర్పిస్తాయనీ తెలుసుకున్నాను. వాళ్ళ అనుభవాలూ అనుభూతులూ ఒక కొత్త ప్రపంచంలో విహరింపజేశాయి.
నివేదిక :
మనుషులకు దగ్గరై, వాళ్ళతో చక్కని అనుబంధాన్ని పెంచుకొని, విశ్వాసాన్ని, ప్రేమను ప్రకటిస్తూ మనసులకు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని పెంచే జంతువులూ, పక్షులూ మనచుట్టూ ఉన్నాయని, వాటి రక్షణ, పోషణ ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చని తెలుసుకున్నాను. ముఖ్యంగా మూగజీవుల మనోవేదనను, స్పందనను బాగా అర్థం చేసుకోవడానికి ఈ పెంపకం ఉపకరిస్తుందనీ గ్రహించాను.
మనకు ఇష్టమైన పక్షినో, జంతువునో పెంచుకోవాలనుకున్నప్పుడు వాటిని చిన్న వయస్సులో ఉండగానే తెచ్చుకోవాలి. అట్లా తెచ్చుకోవడానికి ముందే వాటికి సంబంధించిన ఆహారపు అలవాట్లు, రక్షణ, భద్రత, పోషణకు సంబంధించిన అన్ని విషయాలూ కూలంకషంగా తెలుసుకోవాలి.
కొన్ని కొన్ని పక్షులకు / జంతువులకు ప్రత్యేకమైన ఆహారం, ఇష్టమైన ఆహారం ఉంటుంది. ఉదాహరణకు పావురాలకు జొన్నలంటే ఇష్టం. అదే లవ్బర్స్కైతే కొర్రలు ఇష్టమైన ఆహారం. పిల్లులూ కుక్కలు కూడా పాలన్నా, మాంసాహారమన్నా ఇష్టపడతాయి. కుక్కలకు రొట్టెలు ఇష్టం. పిల్లులకు పెరుగన్నం ప్రీతిపాత్రం. చేపలకు నిర్దేశించిన ఆహారం ఎక్కువైతే విషతుల్యమౌతుంది.
అవి నివసించే పరిసరాలు శుభ్రంగా, ఆరోగ్యకరంగా ఉండాలి. పిల్లులు, కుక్కలకు మల విసర్జన కోసం బయటికి తీసుకెళ్ళే అలవాటు చేయాలి. పావురాలు, లబ్బర్డ్స్ తమ గూళ్ళను, పంజరాన్నీ బాగా మలిన పరుస్తుంటాయి. వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. పిల్లులకు, కుక్కలకు తరచూ స్నానం చేయిస్తుండాలి. ఆవులు కూడా స్నానానికి ఇష్టపడతాయి. ఎద్దులు అంతగా ఇష్టపడవు. చేపల అక్వేరియంలు తొందరగా మురికి అయిపోతుంటాయి. వాటిని 10-15 రోజులకొకసారి శుభ్రం చేయాలి.
పశువులు, పక్షులు సరిగ్గా నిద్రపోకున్నా, వాటి అరుపుల్లో తేడా వచ్చినా, నీరసంగా కనిపించినా వెంటనే వాటికి సంబంధించిన వైద్యులకో, అనుభవజ్ఞులకో చూపించి తగిన వైద్య సహాయం అందించాలి. అవి మూగజీవులు భాషను అవి అర్థం చేసుకుంటాయి. కాని వాటి భాషనే మనం అర్థం చేసుకోలేం. తగినంత శ్రద్ధ, పరిశీలన ఉంటే కనీసం వాటి మనోభావాలను అర్థం చేసుకొని, తగిన విధంగా స్పందించగలుగుతాం.
జీవులన్నీ స్వేచ్ఛను కోరుకుంటాయి. అందుకే వాటిని ఎప్పుడూ బంధించి ఉంచకూడదు. నగరాల్లో వాటిని స్వేచ్ఛగా వదిలేసే అవకాశం లేకుంటే కనీసం రోజుకొక్కసారైనా బయటి ప్రపంచంలో తిప్పడం మంచిది. లవ్బర్డ్స్ పెద్దవయ్యాక వాటిని పంజరంలో నుండి స్వేచ్ఛగా వదిలేయాలి. ఈవిధంగా తగినన్ని జాగ్రత్తలు తీసుకొని వాటిని పోషించడమేగాక, వీలైనంత సమయం వాటితో గడిపితే వాటికీ, మనకూ ఆనందంగా ఉంటుంది. మూగజీవులను స్వచ్ఛంగా ప్రేమించేవాళ్ళు సాటి మనుషులతో సఖ్యంగా నివసించగల్గుతా
పర్యాయపదాలు:
  • రైతు = కృషీవలుడు, కర్షకుడు
  • లోకము = ప్రపంచము, జగత్తు
  • రాజు = చక్రవర్తి, భూపాలకుడు
  • కళ్ళు = నయనము, నేత్రములు
  • స్నేహితుడు = మిత్రుడు, నేస్తము
  • చెట్టు = తరువు, వృక్షము
  • భూమి = ఇల, ధరణి
  • పండుగ = ఉత్సవము, సంబరము
నానార్థాలు:
  • రాజు = చంద్డు, భూపాలుడు
  • ఊరు = గ్రామము, గ్రవించు
  • స్నేహితుడు = చెలికాడు, సూర్యుడు
  • అర్థము = శబ్దార్థము, ఏయోజనము
ప్రకృతిలు వికృతిలు:
  • భాష బాస
  • మనిషి మనిసి
  • ప్రాణము పానము
  • కష్టము కస్తి
  • ఆశ ఆస
సంధులు:
బహ్మాండమైన బబ్మాండము + ఐన = ఉత్వసంధి
చిత్రమైన చిత్రము + ఐన = ఉత్వసంధి
గొంతెత్తి గొంతు + ఎత్తి = ఉత్వసంధి
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమైనపుడ సంధి అవుతుంది.
పత్యక్షము = పత్రి + అక్షము = యణాదేశసంధి
సూ(త్రం : ఇ, , ఋ లకు అసవర్ణాచ్చులు పరమైనప్పుడు య, , ర లు ఆదేశమవుతాయి.
చెప్పినదంతా = చెప్పినది + అంత = ఇత్వసంధి
సూత్రం : క్రియా పదాల్లోని ఇత్తునకు సంధి వైకల్పికము అవుతుంది.
(పేమానురాగాలు = ప్రేమ + అనురాగాలు = సవర్ణదీర్ఘసంధి
సూత్రం: అ, , , ఋ లకు సవర్ణాలైన అచ్చులు పరమైతే వాటి దీర్ఘం ఏకాదేశమవుతుంది.
ఆనందోత్సాహాలు = ఆనంద + ఉత్సహాలు = గుణసంధి
సూత్రం : అకారానికి ఇ, , ఋలు పరమైతే (క్రమంగా ఏ, , అర్లు ఏకాదేశమవుతాయి.
సమాసాలు:
అరటి చెట్టు అరటి అనుపేరుగల చెట్టు = సంభావనా పూర్వపద కర్మధారయము
[పేమానురాగాలు చేమయును, అనురాగమును = ద్వంద్వ సమాసము
మంచి భూమి మంచిదైన భూమి = విశేషణపూర్వపద కర్మధారయము
మధ్యాహ్నము అహ్నం యొక్క మధ్య భాగము = (ప్రమా తత్పురుష సమాసము

IX. 12. తీయని పలకరింపు

తీయని పలకరింపు


పాఠము తీయని పలకరింపు

  1. తులసిదళాలు
  1. రాజహంస
జవాబు:ఈ మాటలు విదేశాల్లో తమ పిల్లలు ఉంటున్న ముసలి తల్లిదండ్రులు అంటూ ఉండవచ్చు.
జవాబు:పిల్లలు దగ్గరలో లేకపోవడం వల్ల, వారికి ఆలనాపాలనా చూసే దిక్కు ఉండదు. వారిని డాక్టరు వద్దకు తీసుకువెళ్ళే దిక్కు ఎవరూ ఉండరు. వారికి కావలసిన వారు ఎవరూ దగ్గరలేక, వారు బెంగతో బాధపడుతూ ఉంటారు. వారు కమ్మని తమ బిడ్డల పలుకరింపుకై, ఎదురుచూస్తూ ఉంటారు.
జవాబు:మా ప్రక్క ఇంటి తాతగారు, బామ్మగారు ఇలాగే ఉన్నారు. వారికి ఇద్దరు పిల్లలు. వారి అబ్బాయి అమెరికాలో కంప్యూటర్ ఇంజనీరు. వారి అమ్మాయి జపాన్లో ఒక పెద్ద డాక్టరుకు భార్య. ఆమె కూడా ఉద్యోగం చేస్తోంది.
జవాబు:వారి పట్ల మనం జాలి, దయ, కరుణ కలిగి ఉండాలి. వారిని తీయగా తాతగారూ, బామ్మగారూ అంటూ పలకరించాలి. అప్పుడప్పుడు వారితో తీయగా కబుర్లు చెప్పాలి. వారి యోగక్షేమాలు తెలిసికోవాలి. వారి అవసరాలను తెలుసుకొని, వాటిని వారికి తెచ్చి పెట్టాలి. ముఖ్యంగా వారిని ప్రేమగా వరుసలు పెట్టి పిలువాలి.
జవాబు:నేడు కన్న కొడుకులు, కూతుళ్ళు ముసలివారిని పట్టించుకోడం మానివేశారు. కోడళ్ళూ, కొడుకులూ వారిని సూటిపోటి మాటలతో బాధపెడుతున్నారు. ముసలివారు తమ ఆస్తిలో భాగం తమకు సరిగా పంచి ఇవ్వలేదనీ, ముసలివారు, ఆస్తులు కూడబెట్టలేదనీ, ముసలివారిని పిల్లలు తప్పుపడుతున్నారు. మనుమలు, మనుమరాండ్రు సహితం, ముసలివారికి చాదస్తం ఎక్కువని, వారివి ఛాందసాచారాలనీ ఈసడిస్తున్నారు.
అ) చెట్టు కింద ఒక్కరూ కూర్చున్నారేం ?
జవాబు:గంగాధరరావు
జవాబు:విమల
జవాబు:సావిత్రమ్మ
జవాబు:కోడలు
జవాబు:కూతురు
జవాబు:మనువడు
జవాబు:పుత్రరత్నం
ఇల్లంటే అమ్మఒడి
ఇల్లంటమమతలు పల్లవించే యెద సడి
ఇల్లంటే
ఆత్మీయతల సందడి
ఇల్లంటే
మనల్ని మనం పునశ్చరణ చేసుకునే బడి
ఇల్లంటే
ప్రేమాభిమానాల సెలయేళ్ళ అలజడి
ఇల్లంటే
ఊరడింపుల రాబడి
స్వార్థం ఎండమావులవెంట పరుగులు
పెడ్తు
చలిచెలిమె వంటి
ఇల్లును దూరం చేసుకుంటే
తల్లివంటి ఇల్లు
మనసు చిన్నబుచ్చుకుంటుంది
అక్కడ నీళ్ళింకిపోతే
తరతరాలకు ఆ తడిలేని జీవితం
శాపంగా పరిణమిస్తుంది కొడుకా !
అ) ఇచ్చిన వచన కవితలోని అంత్యానుప్రాసపదాలను గుర్తించండి.
జవాబు:
అంత్యానుప్రాసలు :
  1. అమ్మబడి
  1. యెదసడి
  1. సందడి
  1. బడి
  1. అలజడి
  1. రాబడి
జవాబు:
ఇల్లు ఆత్మీయతల సందడిఅంటే, ఇంట్లో ఒకరంటే మరొకరికి అంతులేని అభిమానం, ప్రేమ, వాత్సల్యము, ఆర్ద్రత, ఉంటాయని అర్థం.
జవాబు:
పునశ్చరణఅంటే,      మళ్ళీ                                                                                                                                           మళ్ళీ చేయడం అని అర్ధము. మనం చేసే తప్పొప్పులను తిరిగి సవరించుకొనే బడివంటిది ఇల్లు. బడిలో మనం గురువు ద్వారా, మన తప్పులను సరిదిద్దుకుంటాము. ఇంట్లో కూడా పెద్దల మాటలను విని, మన తప్పులను మనం దిద్దుకొంటామని భావం.
జవాబు:
ఇల్లు చలిచెలిమె వంటిది. చలిచెలిమేలో నీరు ఎంత తోడినా, తిరిగి ఊరుతుంది. ఎండమావిలో నీరు ఉన్నట్లు భ్రాంతియే కాని, అసలు నీరు ఉండదు. చలిచెలిమెలో నీరు ఊరినట్లు, ఇంట్లో వారికి పరస్పర ప్రేమ ఊరుతుంది.
జవాబు:
మానవజీవితంలో చెలిమి ఎంతో ముఖ్యమైనది. చెలిమికి ప్రాణాలు ఇచ్చే సమయ సందర్భాలు ఉంటాయి. అలాంటి చెలిమిని దూరం చేసుకుంటే మనసు చిన్నబుచ్చుకుంటుంది.
జవాబు:గంగాధరరావు గారు ఉద్యోగం చేసే రోజుల్లో ఇంట్లో ఇద్దరు, ముగ్గురు బంట్రోతులు ఉండేవారు. కొడుకు, నాన్నగారూ! అంటూ ప్రేమగా పలుకరించి, కావలసిన డబ్బు పట్టుకెళ్ళేవాడు. ఇక, కోడలు ఎంతో ప్రేమను నటిస్తూ, సమయానికి ఆయనకు టిఫిన్లు, కాఫీ వగైరా సమకూర్చేది. మనవడు ఆయన వెంట షికారుకు తోడుగా వెళ్ళేవాడు. కూతురు ఆయన పూజకు కావలసిన పూవులు వగైరా తెచ్చి, పూజాద్రవ్యములు సమకూర్చేది.
జవాబు:గంగాధరరావు వ్యక్తిత్వమున్న వ్యక్తి. ఆయనకు గృహస్థ సభ్యుల ప్రేమాదరాలు కావాలి. ఇంటిలో అందరూ ఆయన మంచి, చెడ్డలను చూడాలని ఆయన కోరుకొనేవాడు.
జవాబు:తల్లిదండ్రులు తమపిల్లలను ఎంతో ప్రేమతో తమ గుండెలపై పెట్టుకొని పెంచుతారు. తమ కడుపు కట్టుకొని పిల్లలకు కావలసినది సమకూరుస్తారు. పిల్లల చదువులకై, పెళ్ళిళ్ళకై, తమకు ఉన్న ఆస్తులను అమ్ముకొని ఖర్చు చేస్తారు. వారికి శక్తి శరీరంలో ఉన్నంత కాలం బిడ్డల అభివృద్ధికే, తమ సర్వస్వాన్ని ధార పోస్తారు.
జవాబు:ఇల్లిందల సరస్వతీదేవిగారు సరళమైన, నిరాడంబరమైన వాస్తవిక అభివ్యక్తితో రచనలు సాగించేవారు. ఈమె తన రచనలో మానవ మనస్తత్వ ధోరణులను చక్కగా విశ్లేషించింది. ఇల్లిందల సరస్వతీదేవి గారి కథాకథనము అద్భుతంగా ఉంది.
జవాబు:
వృద్ధాప్యంలో మనుష్యులకు ఉండడానికి ఇల్లు, కట్టుకోడానికి బట్ట, తినడానికి తిండి కావాలి. వయస్సులో ఉన్నప్పుడే మనుషులు వృద్ధాప్యానికి కావలసిన ఏర్పాటు చేసికోవాలి. వృద్ధాప్యంలో సామాన్యంగా మంచి ఆరోగ్యం ఉండదు. అందువల్ల మంచి వైద్య సదుపాయం కావాలి.
జవాబు:గంగాధరరావు నిత్యం దైవపూజ చేసేవాడు. ఆశ్రమంలో సభ్యులు అందరూ గంగాధరరావు పట్ల మంచి అభిమానం చూపించేవారు. ఒక రోజున హైకోర్టు నుండి గంగాధరరావును గురించి ఎంక్వైరీ చేస్తూ, ఒక గుమాస్తా వచ్చాడు. ఆశ్రమం సూపర్నెంటును కలిశాడు. గంగాధరరావు మాతామహుడి బాపతు పొలం వంద ఎకరాలు గంగాధరరావుకు సంక్రమించాయని, ఆయన ఆర్డర్లు హైకోర్టు నుండి తెచ్చి ఇచ్చాడు. గంగాధరరావు సంతోషించాడు.
అ) చెట్టు వృక్షం, తరువు, మహీజం
జవాబు:అచ్చెరువు (వికృతి) ఆశ్చర్యము (ప్రకృతి)
జవాబు:సాయం (వికృతి) సహాయం (ప్రకృతి)
జవాబు:బోనం (వికృతి) భోజనం (ప్రకృతి)
(ఇది కర్తరి వాక్యము. క్రియను ఎవరు సేకరించారుఅని ప్రశ్నిస్తే రచయిత్రులుఅని కర్త జవాబు.)
జవాబు:రచయిత్రులచే ఎన్నో వివరాలు సేకరించబడ్డాయి. (ఇది కర్మణి వాక్యం)
(ఇది కర్మణి వాక్యం. రికార్డు చేయబడింది.అనే క్రియను దేనినిఅనే దానిచే ప్రశ్నిస్తే, ఇంటర్వ్యూను అనే కర్మ జవాబుగా వస్తుంది.)
జవాబు:ఆమె ఇంటర్వ్యూను రికార్డు చేశారు. (ఇది కర్తరి వాక్యం)
(ఇది కర్తరి వాక్యం. ప్రచురించారుఅనే క్రియను ఏవి ప్రచురించారు అని ప్రశ్నిస్తే, ‘ఇంటర్వ్యూలుఅనే కర్త జవాబుగా వచ్చింది. కాబట్టి ఇది కర్తరి వాక్యం.)
జవాబు:కొంతమంది స్త్రీలతో జరిపిన ఇంటర్వ్యూలు, యథాతథంగా ప్రచురింపబడ్డాయి. (కర్మణి వాక్యం)
(ఇది కర్మణి వాక్యం. క్రియలో, ‘ఐదుధాతువు చేరింది. ఇందులో మార్పుచేయబడలేదుఅనే క్రియను, ‘ఏదిఅన్న దానిచే ప్రశ్నిస్తే భాషఅనే కర్మపదం జవాబుగా వస్తుంది. కాబట్టి ఇది కర్మణి వాక్యం.)
జవాబు:వాళ్ళ భాషను మార్పు చేయలేదు. (కర్తరి వాక్యం)
జవాబు:ప్రతివాళ్ళూ భోజనాలు పెట్టి మళ్ళా రమ్మని పంపించబడ్డారు. (కర్మణి వాక్యం)
జవాబు:దాదాపు నలభై ఇంటర్వ్యూలు చేయబడ్డాయి. (కర్మణి వాక్యం)
జవాబు:ఊళ్ళో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. (కర్తరి వాక్యం)
జవాబు:గోడలమీద అందమైన చిత్రాలను గీశారు. (కర్తరి వాక్యం)
జవాబు:దేహాన్ని పంచభూతాలు నిర్మించాయి. (కర్తరి వాక్యం)
జవాబు:మాచే పెద్దలు గౌరవింపబడతారు. (కర్మణి వాక్యం)


రచయిత్రి : ఇల్లిందల సరస్వతీదేవి

పాఠం దేనినుండి గ్రహింపబడినది : రచయిత్రి రచించిన తులసిదళాలుకథానికల సంపుటి నుండి గ్రహింపబడింది.

జననము : 15 – 06 – 1918

మరణము : 31 – 07 – 1998

రచనలు : ఈమె స్వాతంత్ర్యం రావడానికి ముందే, సృజనాత్మక రంగంలోకి అడుగు పెట్టిన ప్రసిద్ధ రచయిత్రి. ఈమె వందలాది కథలు,                                                             కొన్ని                                  నవలలు,      రేడియో నాటికలు, అనేక వ్యాసాలు రచించింది.

అవార్డులు : 1982 లో ఈమె రచించిన స్వర్ణకమలాలుకథాసంపుటికి, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని ఇచ్చింది. ఈమె సుశీలా నారాయణరెడ్డిపురస్కారాన్ని కూడా పొందింది.

కథాసంపుటాలు :

పదవి : 1958లో ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యురాలిగా జైలు విజిటర్గానూ పనిచేసింది.

ఆంధ్ర యువతీమండలి : ఈమె 1934 లో స్థాపించిన ఆంధ్ర యువతీ మండలి వ్యవస్థాపకులలో ఒకరు.

రచనాశైలి : మానవ మనస్తత్త్వ ధోరణులనూ, వివిధకాలాల్లో, వివిధ సందర్భాల్లో జీవన పరిణామాలనూ విశ్లేషించడం, విశ్వజనీన భావాలతో రచనలు చేయడం ఈమె దృక్పథం.

 

ప్రవేశిక

మానవుడు సంఘజీవి. పదిమందితో కలసి జీవించాలనుకుంటాడు. దేశవిదేశాలతో సంబంధాలు. నెలకొల్పుకొంటున్నాడు. కాని తన కుటుంబసభ్యులతో ఆత్మీయంగా ఉంటున్నాడా ? ఇంటికి పెద్దదిక్కుగా ఉండే వృద్ధులను గౌరవంగా చూసుకుంటున్నాడా ?

నిర్లక్ష్యానికి గురి అయిన గంగాధరరావు అనే వృద్ధుడు,                                                                       తన ఇల్లువదిలి, తన వాళ్ళందరికీ దూరంగా జీవించసాగాడు. గంగాధరరావు అట్లా వెళ్ళిపోవడానికి దారితీసిన పరిస్థితులేమిటి ? వెళ్ళిన తర్వాత జరిగిన పరిణామాలేమిటి ? తెలుసుకునేందుకు ఈ కథ చదువుదాం…….

 

 

చదువండి ఆలోచించి చెప్పండి

అరే రాజన్నా ! ఈ బతకుమీద విరక్తి గలుగుతుందిరా! రెక్కలు ముక్కలు జేసుకోని పిల్లలను బెంచిన. విదేశాల్లో జదువుకుంటే గొప్ప ప్రయోజకులైతరు, మాకు మంచి పేరొస్తదనుకున్న. పెండ్లిల్లు జేసిన. రెక్కలొచ్చిన పక్షులు గూడువదలిపోయినట్లు, మల్ల సూడకుండా ఎల్లిపొయ్యిన్రురా. అప్పుల సంగతి సరే. ఆయాసమొచ్చినప్పుడు నరాలు దెగిపొయ్యేటట్లు ఏడిచినా వాళ్ళకు యినవడదు. ఇనవడ్డా, నేనొచ్చి ఏం జేస్త నాయినా, డాక్టరుకు జూపిచ్చుకో, కావాల్నంటె పైసలు పంపిస్తంఅని ఫోన్ పెట్టేస్తారు. ఈ బంగ్లలు, కార్లు, సౌకర్యాలు మనసు విప్పి మాట్లాడ్తాయా? మనసులోని బాధను పంచుకుంటయా? మనుమండ్లు, మనుమరాండ్ల స్పర్శను గలిగిస్తయా ? తియ్యగ ఒక్కసారి పలుకరిస్తయా?”

1.ఈ మాటలు ఎవ్వరంటుండవచ్చు?

2.పిల్లలను దూరం చేసుకున్న వృద్ధుల పరిస్థితి ఎట్లా ఉంటుంది ?

3.మీరు ఇటువంటి వాళ్ళను ఎవరినైనా చూశారా ?

4.వాళ్ళ పట్ల మన ప్రవర్తన ఎట్లా ఉండాలి ?

 

ఇవి చేయండి

I. అవగాహన ప్రతిస్పందన

ప్రశ్న 1.ముసలివారు వృద్ధాశ్రమాలకు వెళ్ళడానికి గల కారణాలు చర్చించండి.

వారి పిల్లలు విదేశాల్లోనూ, దూరప్రాంతాల్లోనూ. ఉద్యోగాలు చేస్తున్నారు. ముసలివారు శక్తిలేక, తమ పనులు తాము చేసికోలేకపోతున్నారు. కొడుకులూ, కోడళ్ళూ వారికి సాయపడడంలేదు. వేళకు కొంచెం కాఫీ, భోజనం కూడా వారికి ఇవ్వడం లేదు. ముసలివారిని డాక్టర్ల వద్దకు పిల్లలు తీసుకువెళ్ళడం లేదు. వారికి కావలసిన మందులు తెచ్చి ఇవ్వడం లేదు. అందువల్లనే ముసలివారు వృద్ధాశ్రమాలకు వెడుతున్నారు.

 

ప్రశ్న 2.పాఠం ఆధారంగా కింది మాటలు ఎవరి గురించి చెప్పినవో గుర్తించి, రాయండి.

ఆ) సంసార బాధ్యతలు లేవు.

ఇ) ఆ చీరలూ, ఆ నగలూ ఎంత వైభోగంగా బతికింది.

ఈ) ఆ ఇల్లు ఇప్పుడే రాయించుకోవాలన్న పట్టుదల.

ఉ) ఫిక్స్డ్ డిపాజిట్ తనకిస్తే పండుగకు వస్తా.

ఊ) మంచి బట్టలు కూడా కుట్టించుకోవాలి.

ఎ) ఈ జబ్బువస్తే తగ్గదు. డాక్టరు ఎందుకు ?

ప్రశ్న 3.కింది వచనకవిత చదివి ప్రశ్నలకు జవాబు లివ్వండి.

ప్రశ్నలు :

 

ఆ) ఇల్లు ఆత్మీయతల సందడి అంటే

ఇ) ఇల్లు పునశ్చరణ చేసుకునే బడి’ – ఎందుకంటే ?

ఈ) చలిచెలిమెకు, ఎండమావికీ భేదం

ఉ) మనసు చిన్నబుచ్చుకునేది ఎప్పుడు ?

 

II. వ్యక్తీకరణ- సృజనాత్మకత

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) గంగాధరరావు ఉద్యోగం చేస్తున్నప్పుడు కుటుంబ సభ్యులు ఎట్లా ప్రవర్తించి ఉంటారో, ఊహించి రాయండి.

భార్య సావిత్రమ్మ భర్తపై ప్రేమ కురిపించేది. హొయలు ఒలకపోస్తూ పట్టు చీరలూ, నగలూ ధరించి భర్తకు సకల సౌఖ్యాలూ అందించేది. ఇంట్లో నౌకర్లు ఆయన కనుసన్నల్లో నడుచుకుంటూ, ఆయనకు కావలసిన సమస్త సౌకర్యాలూ సమకూర్చేవారు. సావిత్రమ్మగారు భర్తకు కావలసిన మందులు దగ్గర ఉండి ఇచ్చేది. ఆయన ధరించే బట్టలు, బూట్లు ఒకరోజు ముందే ఆమె సిద్ధంగా ఉంచేది. ఇంట్లో ఆయనకు ఇష్టమైన కూరలే వండేవారు. ఆయనకు నచ్చే టిఫిన్లు మాత్రమే తయారుచేసేవారు. ఇంటివారు అంతా గంగాధరరావు చుట్టూ తిరిగేవారు.

 

 

ఆ) ఇల్లు వదిలి, ఆశ్రమానికి చేరిన విధాన్ని బట్టి గంగాధరరావు ఎలాంటివాడో రాయండి.

తాను సంపాదించిన ధనాన్ని ఉద్యోగం చేసే రోజుల్లో ఆయన ఎందరికో సాయం చేశాడు. ఉద్యోగానంతరం వచ్చిన ధనాన్ని జాగ్రత్తగా డిపాజిట్టు చేశాడు. తన డబ్బు తాను దాచుకున్నాడు. కట్టుకున్న భార్య కూడా తన మంచి, చెడ్డలను చూసుకోకపోవడం, ఆయనకు కోపాన్ని తెప్పించింది. కొడుకూ, కోడలూ తాను బ్రతికి ఉండగానే తాను కట్టించిన ఇంటిని వారిపేర రాయమని ఒత్తిడి చేయడం, ఆయనకు బాధ కల్గించింది.

ఆయనను అందరూ పట్టించుకోవాలి కాని ఆయన వారిని పట్టించుకొనేవాడు కాడు. గంగాధరరావు పట్టుదల మనిషి. అందుకే తనవారందరినీ విడిచిపెట్టి, తాను ఆశ్రమానికి చేరాడు. గంగధారరావుకు తీయని పలకరింపు కావాలి. అది ఆశ్రమంలో ఆయనకు దొరికింది. తనకు వైద్యం అనవసరం అన్న కొడుకు మాట, ఆయనకు నొప్పి కల్గించింది. మొత్తం మీద గంగాధరరావు కాస్త మొండి మనిషి. తాను అనుకున్న పనిని తాను చేసేవాడు. తన ఇంటివారు తనపై చూపిన అనాదరణను, ఆయన సహించలేకపోయాడు.

 

ఇ) పెంచి, పెద్దచేసి, బ్రతుకునిచ్చిన తల్లిదండ్రులను ముసలితనంలో పట్టించుకోకపోవటం సమంజసమేనా ? మీ అభిప్రాయం రాయండి.

అటువంటి తల్లిదండ్రులను పట్టించుకోకపోడం, వారికి తిండిపెట్టకపోడం చాలా అన్యాయము. దుర్మార్గము. తమ వృద్ధాప్యంలో పిల్లలు తమను ఆదుకుంటారనే ఉద్దేశ్యంతోనే, తల్లిదండ్రులు తమ సర్వస్వాన్నీ బిడ్డల చదువులకూ, వారి అభివృద్ధికీ వినియోగిస్తారు. తల్లిదండ్రుల ప్రేమ నిస్వార్ధమైనది. అవ్యాజమైనది. అటువంటి ప్రేమజీవులను నిర్లక్ష్యం చేయడం, ముసలితనంలో వారిని పట్టించుకోకపోడం మహాపాపం.

తల్లిదండ్రులను పట్టించుకోని తనయులను కఠినంగా శిక్షించాలని నా అభిప్రాయం. తాను తిన్నదే, తల్లిదండ్రులకూ పెట్టాలి. ప్రేమగా వారిని పలుకరించాలి. తల్లిదండ్రులకు తిండికన్న తీయని పలుకరింపు, వాత్సల్యం ముఖ్యమని నా అభిప్రాయం.

 

ఈ) పాఠం ఆధారంగా ఇల్లిందల సరస్వతీదేవి రచనా విధానం ఎట్లా ఉన్నదో తెలుపండి.

ప్రస్తుత కథ తీయని పలకరింపులో గంగాధరరావు మనస్తత్వాన్ని రచయిత్రి చక్కగా వెల్లడించింది. గంగాధరరావు మంచితనము, ఉదారగుణము, తోడి ఉద్యోగులతో ఆయన నడవడి ఆయనను ఆదర్శమూర్తిగా నిలబెట్టాయి.

అటువంటి సజ్జనుడిని ఇంట్లో వారు, తలోరీతిగా బాధపెట్టడం, గంగాధరరావు తట్టుకోలేకపోయాడని రచయిత్రి వెల్లడించింది. ఈ జబ్బు వస్తే తగ్గదు. డాక్టరు ఎందుకు అనే పుత్రరత్నంఅన్న రచయిత్రి మాటలో హాస్యం తొంగి చూసింది. గంగాధరరావు ఇంట్లో ఆయనను ఇంటి సభ్యులు ఎలా బాధించారో రచయిత్రి చక్కగా చెప్పింది.

గంగాధరరావు భార్యగా మంచి చీరలు, నగలతో వైభోగంగా బతికిన సావిత్రమ్మ, ఆయనను నిర్లక్ష్యం చేయడం చిత్రంగా అనిపిస్తుంది. మానవుల మనస్తత్వాలను అద్భుతంగా ఈ కథ వ్యక్తీకరించింది. వృద్ధాప్యంలో పెద్దవారిని అనాదరంగా చూడడం తప్పని       

 

2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

అ) 

(లేదా)

ఆ) వృద్ధాప్యంలో మనుషులకు ఏమి కావాలి? కుటుంబ సభ్యులు వాళ్ళను ఎట్లా చూసుకోవాలి ?

పైన చెప్పిన వాటన్నింటితో పాటు బిడ్డల ప్రేమ పూర్వకమైన ఆదరణ, తీయని పలకరింపు కావాలి. వేళకు తగిన మితాహారం కావాలి. కుటుంబసభ్యులతో కలిసిమెలసి హాయిగా నవ్వుతూ సాగించే జీవనం కావాలి. ఆధ్యాత్మికమైన జీవనం కావాలి. వారు చదువుకోడానికి దైవ సంబంధమైన సాహిత్యం కావాలి.

భారత, భాగవత, రామాయణ గ్రంథాలు కావాలి. నేటి కాలానికి అవసరమైన టీ.వీ., రేడియో,, ఫోను వంటి సౌకర్యాలు వారికి కావాలి. కుటుంబ సభ్యులు

వృద్ధులను ప్రేమగా, ఆప్యాయతతో పలుకరిస్తూ వారి అవసరాలను అడిగి తెలుసుకోవాలి. మధ్యమధ్య వారిని డాక్టర్ల వద్దకు తీసుకువెళ్ళి పరీక్షలు చేయించాలి. వారికి ముఖ్యావసరమయిన మందులను అందివ్వాలి. వృద్ధులను వృద్ధాశ్రమాలలో చేర్చక,                                              తమతోపాటే కలో గంజో వారు త్రాగే ఏర్పాట్లు చేయాలి. వృద్ధులకు ముఖ్యంగా కావలసిన ప్రేమాదరాలను కుటుంబ సభ్యులు వారికి పంచి ఇవ్వాలి.

 

3. కింది అంశం గురించి సృజనాత్మకంగా / ప్రశంసాత్మకంగా రాయండి.

అ) తీయని పలకరింపు కథను పొడిగించి ఒక మంచి ముగింపును రాయండి.

దీన జనసేవలో మునిగిపోయాడు గంగాధరరావు. ఒకసారి కలక్టరు వచ్చి, ఆశ్రమంలో సభ పెట్టి దీనబంధుఅనే బిరుదును గంగాధరరావుకు ప్రభుత్వం తరపున అందచేశాడు. ఈ వార్త పేపర్లలో, టీ.వీ.ల్లో ప్రముఖంగా వచ్చింది. టీ.వీ. ఎక్కువగా చూసే సావిత్రమ్మ ఆ వార్త చూసి, ఇంట్లో అందరికీ చెప్పింది. తాము తప్పు చేశామని అందరూ తీర్మానించుకొని, వెళ్ళి గంగాధరరావు కాళ్ళపై పడ్డారు.

సావిత్రమ్మ కూడా ఆశ్రమంలోనే భర్తతో ఉండాలని నిశ్చయించుకుంది. గంగాధరరావు కుటుంబ సభ్యుల పశ్చాత్తాపానికి సంతోషించాడు. వారానికి ఒకరోజు కొడుకు, కోడలు, మనుమడు గంగాధరరావు దంపతులతో ఆశ్రమంలోనే గడుపుతున్నారు. కూతురు, అల్లుడు వచ్చారు. గంగాధరరావు తన ఆస్తిలో సగం ఆశ్రమానికి రాసి ఇచ్చాడు. కుటుంబసభ్యులు ఆనందించారు.

III. భాషాంశాలు

పదజాలం

1) కింది పట్టికను పరిశీలించండి. పట్టిక కింద ఇచ్చిన పదాలకు సరిపోయే పర్యాయపదాలు వెతికి రాయండి

అ ) చెట్టు వృక్షం మహిజము

ఆ) ఆకాశం = అంబరం, గగనం

ఇ) నిలయం = ఆవాసం, స్థానం, నెలవు

ఈ) రాత్రి = రజని, రేయి, నిశ, నిశీథి

2. కింది వాక్యాల్లోని గీత గీసిన వికృతి పదాలకు ప్రకృతి పదాలు పాఠంలో వెతికి రాయండి.

అ) ఆకాశంలో హరివిల్లును చూసి పిల్లలు అచ్చెరువొందారు.

జవాబు ఆశ్చర్యం

ఆ) అడిగినవారికి సాయం చేయడం మా నాన్నకు అలవాటు. జవాబు సహాయం

ఇ) మా తాతయ్య బోనం చేయనిదే బయటికి వెళ్ళడు. జవాబు భోజనము

వ్యాకరణాంశాలు

1. కింది పదాలను కలిపి, సంధి పేరు రాయండి.

అ) రోజులు + ఐనా = రోజులైనా (ఉత్వసంధి)

ఆ) ఆదర + అభిమానాలు = ఆదరాభిమానాలు (సవర్ణదీర్ఘ సంధి)

ఇ) లేదనక + ఉండ లేదనకుండ (అత్వసంధి)

ఈ) వీలు + ఐతే = వీలైతే (ఉత్వసంధి)

ఉ) కావలసినవి + అన్నీ కావలసినవన్నీ (ఇత్వసంధి)

ఊ) పగలు + పగలు = పట్టపగలు (ఆమ్రేడిత సంధి)

2. కింది విగ్రహ వాక్యాలను సమాసం చేసి, సమాసం పేరు రాయండి.

అ) అధికారం చేత దర్పం -అధికారదర్పం తృతీయా తత్పురుష సమాసం

ఆ) గది యొక్క తలుపులు = గదితలుపులు షష్ఠీ తత్పురుష సమాసం

ఇ) మంచివైన బట్టలు = మంచిబట్టలు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం

ఈ)పది సంఖ్యగల గంటలు = పదిగంటలు ద్విగు సమాసం

ఉ) న్యాయమూ, అన్యాయమూ = న్యాయాన్యాయములు ద్వంద్వ సమాసం

3. కింది వ్యాక్యాల్లో కర్తరి/కర్మణి వాక్యాలను గుర్తించండి. నియమాలతో సరిపోల్చుకోండి.

అ) రచయిత్రులు ఎన్నో వివరాలు సేకరించారు.

ఆ) ఆమె ఇంటర్వ్యూ రికార్డు చేయబడింది.

ఇ) కొంతమంది స్త్రీలతో జరిపిన ఇంటర్వ్యూలు యథాతథంగా ప్రచురించారు.

ఈ) వాళ్ళ భాష మార్పు చేయబడలేదు.

ఉ) ప్రతివాళ్ళూ భోజనాలు పెట్టి, మళ్ళా రమ్మని పంపించారు. (కర్తరి వాక్యం)

ఊ) దాదాపు నలభై ఇంటర్వ్యూలు చేశాం. (కర్తరి వాక్యం)

ఋ) ఊళ్ళో సమావేశం ఏర్పాటు చేయబడింది. (కర్మణి వాక్యం)

ౠ) గోడలమీద అందమైన చిత్రాలు గీయబడ్డాయి. (కర్మణి వాక్యం)

ఎ) దేహం పంచభూతాలచే నిర్మించబడింది. (కర్మణి వాక్యం)

ఏ) మేం పెద్దలను గౌరవిస్తాం. (ఇది కర్తరి వాక్యం).