సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

కొత్త పొస్ట్



🌐 * L. I. P.     🌐 * 10వ తరగతి 🌐 * 10వ తరగతి తెలుగులో 99% స్కోర్ సాధించాలంటే... 🌐 * తెలుగు వెలుగులీనేల 🌐 | ధ్వని గుర్తింపు / అక్షర గుర్తింపు     🌐 * సరళ పదాలు     🌐 * ఐ సి టి ఉపయోగించడం ఎలా?     🌐 * * DIKSHA WEB         🌐 SCERT         🌐 NCERT         🌐 NBT         🌐 UGC_NET         🌐 CIIL         🌐 * * NDL INDIA         🌐 SAHITHYA ACADEMY         🌐 | సిద్దెంకి కథలు     🌐 | సిద్దెంకి పుస్తకాలు     🌐 | సిద్దెంకి కవిత్వం 🌐 | తెలుగులో అత్యుత్తమ పుస్తకాలు     🌐* | వ్యాసాలు / Articles     🌐* | దాశరథి పాటలు     🌐* | తెలంగాణ రాష్ట్రంలో దళిత కథ (2014:-07-2025)     🌐 * "సంస్కృతంతో తెలుగు కాలరాయొద్దు"     🌐 * పగిడి తెలంగాణ కథ 2024 "     🌐 * "ఆలోచనవాదుల పుష్పక విమానం దాశరథి ‘కవితా పుష్పకం’"     🌐 * Articles on Dr. Siddenky    

24, జులై 2023, సోమవారం

Viii - 1.త్యాగనిరతి --డా. సిద్దెంకి

త్యాగనిరతి 



ప్రక్రియ :  ఇతిహాస ప్రక్రియ
ఇతిహాసం అనగా ఇట్లా ఇది ఇట్లా జరిగింది అని తెలియజేయడం.
ఉదా: రామాయణం మహాభారతం
పాఠం: త్యాగనిరతి పాఠం శ్రీమధాంద్ర మహాభారతంలోని అరణ్యపర్వం తృతీయ ఆశ్వాసం లోనిది.

ఈ కథలు గ్రంథస్థం కాకముందు వాగ్రూపంలో ఉండేవి.

భారత రామాయణాలను ఇతిహాసాలు అంటారు.

ఈ పాఠాన్ని శ్రీమదాంధ్ర మహాభారతంలోని అరణ్యపర్వంలోని తృతీయ ఆశ్వాసం నుండి గ్రహించారు.



కవి పరిచయం: 
కవి పేరు : నన్నయ్య
కాలం : 11వ శతాబ్దం
ఆస్థానం : రాజరాజ నరేంద్రుని ఆస్థానం.
రచనలు : మహాభారతంలోని ఆది సభ అరణ్య పర్వాలు. 
అరణ్యపర్వంలోని నాలుగవ ఆశ్వాసం నందలి 142వ పద్యం 'శారద రాత్రులుజ్వల....'అనే పద్యం వరకు రాశారు.
బిరుదులు:  ఆదికవి, వాగను శాసనుడు, 
శైలి : ప్రసన్న కథాకళితార్థయుక్తి, 
అక్షర రమ్యత
నానారుచిరార్థ సూక్తినిధి





-----------------------------------------------
విద్యార్థులకు సూచనలు

“ పాఠం ప్రారంభంలోని ప్రవేశిక చదువండి. పాఠంలోని విషయాన్ని ఊహించండి.

పాఠం చదువండి. అర్ధంకాని పదాల కింద గీత గీయండి.

* వాటి అర్థాలను పుస్తకం చివర ఉన్న 'పదవిజ్ఞానం' పట్టికలో చూసి లేదా నిఘంటువులో చూసి తెలుసుకొండి.
--------------------------------------------

ప్రవేశిక

మన ప్రాచీనసాహిత్యంలో నైతికవిలువలకు ఎంతో ప్రాధాన్యం ఉన్నది. భారత, రామాయణాలు ఉత్తములైన రాజుల కథలను వివరిస్తాయి, వారిలో శిబిచక్రవర్తి త్యాగగుణానికి తార్కాణంగా నిలుస్తాడు. తనను ఆశ్రయించిన ఒక పావురాన్ని డేగ నుండి రక్షించడానికి తన ప్రాణాలను సైతం లెక్కచేయడు. అది ఎట్లానో తెలుసుకుందాం.

I

ఆ॥ నిన్ను సత్య ధర్మ నిర్మలుఁగా విందు 
నట్టి నీకు బాడియయ్య? యిప్పు 
డతి బుభుక్షితుండనై యున్న నాకు నా 
హార విఘ్న మిట్టులాచరింప?   1

వ॥ సర్వ భూతంబులు నాహారంబున జీవించి వర్ధిల్లు, నిదినాకు, భక్ష్యంబు గానినాఁదు బుభుక్షావేదనంజేసి ప్రా వియోగంబగు, నట్లయిన నా పుత్రులు భార్యయు జీవింపనేర, రొక్క కపోతంబు రక్షించి పెక్కు జీవులకు హిం సేయుట ధర్మవిరోధంబు 2

*క॥ ధర్మజ్ఞులైన పురుషులు 

ధర్మువునకు బాధసేయు ధర్మువునైనన్

 ధర్మముగా మదిఁ దలఁపరు 

ధర్మువు సర్వంబునకు హితంబుగ వలయున్.   3

వ॥ ఇక్కపోతంబు నాకు వేదవిహితంబైన యాహారంబు 'శ్యేనాః కపోతాన్ ఖాదయన్తి' యను వేదవచనంబ గలదు గావున దీని నాకు నాహారంబుగా నిమ్మసి దానికి శిబి యిట్లనియె. 4


ఆలోచించండి చెప్పండి.

* సత్యధర్మ నిర్మలుడని శిబి చక్రవర్తిని ఎందుకన్నారు?

* "ధర్మువు సర్వంబునకు హితంబుగ వలయున్” దీనిపై మీ అభిప్రాయాన్ని చెప్పండి.

* ఆశ్రితులను ఎందుకు విడిచి పెట్టరాదు?

* ఏ సందర్భంలో ఇతరులు మిమ్మల్ని ఆశ్రయిస్తారు?


తే॥ ప్రాణభయమున వచ్చి యిప్పక్షి నన్ను
 నాశ్రయించె నాశ్రితునెట్టి యధముఁడయిన
 విడువఁడనినను నేనెట్లు విడుతు దీని?
 నాశ్రిత త్యాగమిది ధర్మువగునె? చెపుమ 5




II


వ॥ నీవు పక్షివయ్యును ధర్మమెఱింగినట్లు పలికితి, శరణాగత పరిత్యాగంబు కంటె మిక్కిలి యధర్మం బొండెద్ది? నియాఁకలి దీననకాని యొంట నుపశమింపదే? నీ యత్నం బాహారార్థం బేని యిప్పు డివ్వనంబున మృగ మహిష వరాహ ఖగ మాంసంబులు దీనికంటె మిక్కిలిగాఁ బెట్టెద నిక్కపోతంబు వలని యాగ్రహం బుడుగుము, దీని నేనెట్లును విడువ' ననిన శ్యేసం బిట్లనియె.... 6

ఆ॥ నాకు విహిత భక్షణంబిది: యిప్పక్షిం
 బూని కావ నీకు బుద్ధియేని 
యవని నాథ! దీని యంత నీ మాంసంబు
 దూచి నాకుఁ బెట్టు తొలగ కిపుడ. 7


*చ„ అనిన 'ననుగ్రహించితి మహా విహగోత్తమ' యంచు సంతసం 

బున శిబి తత్ క్షణంబ యసి పుత్రిక నాత్మశరీర కర్తనం 

బనఘుఁడు సేసి చేసి తన యంగమునం గల మాంసమెల్లఁ బె 

ట్టినను గపోతభాగమ కడిందిగ డిందుచు నుండె నత్తులన్.   . 8


క। దానికి నచ్చెరువడి ధర 
ణీ నాథుఁడు తనువు నందు నెత్తురు దొరుఁగం 
దాన తుల యెక్కె సంతన్ 
వాని గుణోన్నతికి మెచ్చి వాసవ దహనుల్   9

వ॥ శ్యేనకపోత రూపంబులు విడిచి నిజరూపంబులఁ జూపి 'నీధైర్య శౌర్యాది గుణంబు లనన్యసాధారణంబులు గావున నీకీర్తి నిత్యంబై శబ్ద బ్రహ్మంబు గలయంత కాలంబు వర్తిల్లుచుండు'మని శిబికి వరంబిచ్చి యింద్రాగ్నులు చనిరి. 10



ఆలోచించండి-చెప్పండి.

->డేగ తన ఆకలిని తీర్చుకోవడానికి శిబి మాంసాన్ని ఎందుకు కోరింది?

"అనుగ్రహించితి మహా విహగోత్తమ' అని శిబిచక్రవర్తి అనటాన్ని మీరెట్లా అర్థం చేసుకున్నారు?

* శిబిచక్రవర్తి పావురాన్ని రక్షించడానికి ప్రాణత్యాగానికి పూనుకున్నాడు కదా! త్యాగం ఆవశ్యకత ఏమిటి?

I. విని, అర్థంచేసుకొని, ఆలోచించి మాట్లాడడం

1. త్యాగం అంటే ఏమిటి? త్యాగంలోని గొప్పతనం ఏమిటి?

2. ఇతరులకోసం, సమాజంకోసం త్యాగం చేసిన వారి గురించి చెప్పంది.

II. ధారాళంగా చదువడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం

1. కింది వాక్యాల ఆధారంగా పాఠంలోని పద్యపాదాలను గుర్తించి రాయండి.

అ) ధర్మం జగత్తుకంతటికీ మేలు చేయాలి
జ ధర్మువు సర్వంబునకు హితంబుగ వలయును
ఆ) ఈ పక్షి నాకు ప్రకృతి సహజంగా ఏర్పడిన ఆహారం
జ ఇక్కపోతంబు వేద విహితంబైన యాహారంబు
ఇ) ఆశ్రయించిన వారిని విడిచిపెట్టడం ధర్మమవుతుందా చెప్పు
జ. నాశ్రిత త్యాగమిది ధర్మవగునె? చెపుమ

2. కింది పద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు సరిపోయే జవాబును గుర్తించండి.

 బ్రతికి నన్నినాళ్ళు ఫలము లిచ్చుటెగాదు
 చచ్చిగూడ చీల్చియిచ్చు తనువు
 త్యాగభావమునకు తరువులే గురువులు
 లలిత సుగుణజాల తెలుగుబాల.

అ) 'చెట్టు' అను పదానికి సరిపోయేపదం (ఎ) 
ఎ) తరువు బి) గురువు.    సి) ఫలం.    డి) గుణం
ఆ) త్యాగానికి గురువులు ఎవరు? (బి)
ఎ) మానవులు,     బి) చెట్లు,     సి) పక్షులు ,      డి) జంతువులు

ఇ) తనువును చీల్చి యిచ్చేవి (సి)
ఎ) మేఘాలు,    బి) నదులు, సి) చెట్లు, డి) పక్షులు

ఈ) చచ్చుట పదానికి వ్యతిరేకార్థం (సి)
ఎ) పెరుగుట, బి) తరుగుట, సి) బ్రతుకుట, డి) మేల్కొనుట

ఉ) పై పద్యానికి తగిన శీర్షిక. (డి)
ఎ) భారం, బి) ప్రాణం, సి) యోగం,  డి) త్యాగం

--------------------------------------------

III స్వీయ రచన: 


1. ఇతరులు ఆహారం భుజించేటప్పుడు తినేటప్పుడు విఘ్నం కలిగించకూడదు?  
జ. ప్రాణులన్నీ జీవించాలంటే ఆహారం సేవించాలి ఆకలిగొని తినేటప్పుడు ఆటంకాలు కలిగించినట్లయితే అవి తినలేవు. కోటి విద్యలు కూటి కొరకే అన్నట్లు ఎంత సంపాదించినా తినడానికే
తినేటప్పుడు వాగులాటలు తిట్లు ఉన్నట్లయితే తినలేరు తినకపోవడం వలన శరీర జీవక్రియలు సన్నగిల్లుతాయి.
బలము తగ్గిపోతుంది. ఏ జీవి అయినా కృషించి నశించవచ్చు.

ఆ) 'అందరూ ధర్మాన్ని ఆచరించాలి,' అనే విషయాన్ని సమర్థిస్తూ రాయండి.
జ. ధర్మమనగా సక్రమము. అందరికీ మంచి మార్గం. మంచి వలన చెడు దూరమై అందరికీ మేలు చేకూరుతుంది.
తాను బాగుపడుతూ ఇతరులు బాగుపడాలని కోరుకోవడమే ధర్మం. అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అని అనుకొని ఆచరించడం వల్ల సమాజమంతా క్షేమంగా ఉంటుంది. అందుకే ధర్మంగా జీవించాలి.

ఇ) ఇతరుల కొరకు మనం ఎట్లాంటి త్యాగాల చేయవచ్చు రాయండి.
జ. మానవులలో అనేక తారతమ్యాలు ఉంటాయి. వాటిని మనము పూరించి వ్యత్యాసాలను తొలగించాలి.
1. ఒకటి ఉన్నంతలో సాయం చేయాలి.
2. దీనులైన వారికి కూడు గుడ్డ కల్పించాలి.
మన పండుగ దినాలలో జన్మదినాలలో లేనివారికి సాయం చేయాలి.
4. ప్రకృతి వైపరీత్యాలలో సహకారం అందజేయాలి.
5. రక్తదానము అవయవదానం లాంటి మొదలైనవి చేయవచ్చు.

ఈ) 'త్యాగనిరతి' అనే శీర్షిక ఈ పాఠానికి ఏ విధంగా తగినదో రాయండి.
త్యాగనిరతి అనే పేరు తగినది
1. ఇందులో శిబి చక్రవర్తి తన శరీరాన్ని త్యాగం చేశాడు.
2. శిబి చక్రవర్తి తనను ఆశ్రయించిన పక్షిని కాపాడాడు.
3. డేగ ఎంత వారించినా పావురాన్ని కాపాడడం కోసం తన మాంసం మొత్తం తక్కడలో తూచాడు.
4. ఇచ్చిన మాటకు కట్టుబడి త్యాగం చేశా సిబి తన దేహాన్ని త్యాగం చేశాడు. కాబట్టి త్యాగనిరతి అనే పాఠం సముచితం.

2. త్యాగం త్యాగం చేయటంలో ఉన్న గొప్పతనాన్ని, అనుభూతిని వివరించండి.

జ. త్యాగం చేయడంలో గొప్పతనము అనుభూతి: 
త్యాగం అనగా తిరిగి తీసుకోలేనిది. త్యాగం ఒక గొప్ప శక్తి.  గొప్ప చిరునామా. త్యాగం చేసేవారు ఎంతో గొప్పవారవుతారు. కొంతమంది త్యాగం చేయటం ఒక పిరికితనంగా భావిస్తారు.   త్యాగమంటే వస్తువైభవాలు, వ్యక్తులు, పరిస్థితులపైన మన అధికారాన్ని వదిలిపెట్టడం. నిస్వార్ధంగా జీవించడం. ఆశ్రిత పక్షపాతం లేకుండా వ్యవహరించడం. ఇష్టంతో సంతోషంతో ఇతరుల సుఖాన్ని ఆశ్రయించి సామాజిక శ్రేయస్సు కోసం త్యాగం చేయాలి.

 ఒకసారి త్యజించిన వస్తువు గురించి మనసులో ఆలోచన కూడా రాకపోవడమే త్యాగానికి సరైన అర్థం. అంటే త్యాగాన్ని కూడా త్యజించాలి. 

ఒకవేళ ఎవరికైనా త్యాగం చేసి నేనేమైనా తక్కువగా త్యాగం చేశానా ఏమిటి? అనే సంకల్పమొచ్చినా కూడా చేసిన త్యాగానికి ఫలితముండదు.

 నిజమైన సుఖాన్ని పొందాలంటే త్యాగమే ఆధారం. ఎందుకంటే త్యాగం వలన ఆత్మ సంతృప్తి లభిస్తుంది. విషయ వికారాలను, చెడు అలవాట్లను, వస్తువైభవాలు, సంబంధాలను మనసావాచాకర్మణా త్యాగం చేయడమనేది సత్యమైన త్యాగంలో భాగమే. అప్పుడే మనకు సత్యమైన శాంతి అనుభవమవుతుంది. కోరికలను త్యజించిన వారే శ్రేష్ఠాత్మలనబడతారు.

త్యాగం చాలా గొప్ప శక్తి, వ్యక్తికి సంతోషం, సమాధానం కలుగుతుంది
  త్యాగం ఆధారంగా మనకు ఉజ్జ్వలమైన భవిష్యత్తు తీర్చిదిద్దబడుతుంది.

IV సృజనాత్మకత/ ప్రశంస:

అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పది శరీరంలోని అవయవ దానం ఇంకా గొప్పది అవయవదానంపై ప్రజలకు చైతన్యం కలిగించమని వార్తా పత్రికలకు లేఖ రాయండి.
                          


లేఖ

                                      తేది:----------, 
                                     
ఇబ్రహీంనగర్.

గౌరవనీయలైన పత్రికా సంపాదకులు. ఈనాడు,  కార్యాలయం హైద్రబాద్ గారికి, 
విషయం: అవయవదానం గురించి అవగాహన 

అయ్యా!

అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పది. దానికంటే మనలోని అవయ వాలను తోటివారికి దానం చేయడం శిష్ఠం. ఈ కాలంలో అవయవదానం వల్ల తొటి వారిని 'సజిమగా ఉంచే అమానిం దొరుకుతుంది. కళ్ళను కిడ్నీలను-గుండెను - మొదలైన వాటిని దానంచేనే గుణాన్ని 'చిన్నతనం' నుండి' అలవరచుకోవాలి. అవయవదానంపైన అవగాహన కలిగించే విధంగా ప్రభుత్వం ముఖ్యాంశా లను రుపొందించాలి. పత్రికలు కూడా వ్రజిల్లా ' చైతనాన్ని కలిగించాలి. వీపత్రిక ఈ విషయంలో అన్ని పత్రికలకంటే ముందుంటుందని ఆశిస్తున్నాను. మీ పత్రిక ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించలసిందిగా

ఇట్లు

చి. వైష్ణవి, 
సంపాదకులు, 
ఆంధ్రజ్యోతి పత్రిక, 
----------,
---------.
హైద్రాబాద్. 


V. పదజాల వినియోగం
అర్థాలు:
కపోతములు = పావురములు
అ) ధర్మములు= ధర్మం
ఆ) హితము = మేలు
ఇ) పరిత్యాగము = ఇచ్చుట
ఈ) వర్ధిల్లు = వికాసము జీవించు అభివృద్ధి 
ఉ) బుబిక్షితుడు = ఆకలిగొన్నవాడు

నానార్ధాలు
ఆ) పాడి: న్యాయము ధర్మము
ఆ)అడవి విపినం అరణ్యం

Vi. భాషను గురించి తెలుసుకుందాం
లోపలికి రావచ్చు అనుమత్యర్థక వాక్యం
అ) దయచేసి వినండి - ప్రార్ధనార్ధక వాక్యం
ఆ)రమ చక్కగా రాయగలదు సామర్ధ్యార్థక వాక్యం
ఇ) ఆహా ఎంత బాగుందో - ఆశ్చర్యార్థక వాక్యం
ఈ) అల్లరి చేయవద్దు - నిషేధార్ధక వాక్యం ఉ) గిరి ఎక్కడున్నావ్ ప్రశ్నార్ధక వాక్యం

 కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి.
ఇంద్ర + అగ్ని =సవర్ణదీర్ఘ సంధి
త్యాగము + ఇది =ఉత్వ సంధి
ఆహార + ఆహారార్థం = సవర్ణదీర్ఘ సంధి
నేను + ఎట్లు =ఉత్వ సంధి
శౌర్య + ఆది= సవర్ణదీర్ఘ సంధి


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి