వాల్మీకి
మహర్షి : సంస్కృత రామాయణ కర్త. ఆదికవి.
రామాయణానికి
గల పేర్లు : రామాయణం, పౌలస్త్యవధ, సీతాయాశ్చరితం మహత్.
దశరథ
మహారాజు : కోసలదేశానికి రాజు.
కోసలదేశం
: సరయూ నదీ తీరంలో ఉంది.
అయోధ్య
: కోసలదేశ రాజధాని
దశరథ
మహారాజు భార్యలు : కౌసల్య, సుమిత్ర, కైక (కైకేయి).
రాముడు
: కౌసల్య యందు దశరథ మహారాజుకు జన్మించాడు.
లక్ష్మణుడు
: సుమిత్ర యందు దశరథ మహారాజుకు జన్మించాడు.
భరతుడు
: కైక యందు దశరథ మహారాజుకు జన్మించాడు.
శత్రుఘ్నుడు
: సుమిత్ర యందు దశరథ మహారాజుకు జన్మించాడు.
రామాయణంలోని
శ్లోకాల సంఖ్య : 24 వేలు
రామాయణంలోని
కాండములు : 1. బాలకాండ, 2. అయోధ్యాకాండ, 3.
అరణ్యకాండ, 4.
కిష్కింధ
కాండ, 5. సుందరకాండ, 6. యుద్ధకాండ, 7.
ఉత్తరకాండ
నారదుడు
: దేవర్షి, తపస్వి, వాక్చతురుల్లో
శ్రేష్ఠుడు.
వాల్మీకి
ఆశ్రమం : తమసానదీ తీరంలో ఉంది.
వాల్మీకి
నోట అప్రయత్నంగా వచ్చిన శ్లోకం : “మానిషాద ప్రతిషం…..”
ఋష్యశృంగుడు
: విభాండక మహర్షి కుమారుడు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వానలు బాగా కురుస్తాయి.
పుత్రకామేష్టి : దశరథ మహారాజు సంతానం కోసం చేసిన యాగం.
మారీచసుబాహులు : తాటకాసునందనుల కుమారులు (రాక్షసులు). ఋషుల యజ్ఞయాగాలకు విఘ్నాలు
కలిగించేవాళ్ళు.
మారీచుడు
: ఇతడు తన రాక్షస మాయచేత బంగారు లేడి (మాయలేడి) రూపాన్ని ధరించాడు.
బల, అతిబల
: విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు ఉపదేశించిన విద్యలు. వీటి ప్రభావం వల్ల అలసట, ఆకలి దప్పులు ఉండవు.
రూపకాంతులు తగ్గవు.
తాటక
: యక్షిణి
సిద్ధాశ్రమం
: వామనుడు (విష్ణువు) సిద్ధిపొందిన చోటు.
జనక
మహారాజు : మిథిలానగరానికి ప్రభువు. సీతాదేవి తండ్రి.
కుశధ్వజుడు
: జనకమహారాజు తమ్ముడు.
అహల్య
: గౌతమ మహర్షి భార్య.
శతానందుడు
: అహల్యా గౌతముల కుమారుడు.
సీత
(జానకి) : శ్రీరాముని భార్య
ఊర్మిళ
: లక్ష్మణుని భార్య
మాండవి
: భరతుని భార్య
శ్రుతకీర్తి
: శత్రుఘ్నుని భార్య
పరశురాముడు
: రేణుకా జమదగ్నుల కుమారుడు. ఇరవై ఒక్కసార్లు భూప్రదక్షిణం చేసి ఎంతో మంది
క్షత్రియులను సంహరించాడు.
కార్తవీర్యార్జునుడు
: పరశురాముని తండ్రియైన జమదగ్నిని సంహరించాడు.
మంథర : కైకేయి అత్తవారింటికి వచ్చినప్పుడు ఆమె వెంట వచ్చిన అరణపు దాసి.
సుమంత్రుడు : దశరథుని మంత్రులలో ఒకడు. దశరథుని రథం తోలేవాడు. ఇతడే శ్రీరాముని
రథసారథి.
గుహుడు
: శృంగిబేరపురానికి రాజు. శ్రీరామభక్తుడు. దండకారణ్య వాసానికి పోతున్న సీతారామ
లక్ష్మణులను గంగానది దాటించాడు.
భరద్వాజుడు
: సప్త ఋషులలో ఒకడు. వనవాసం చేస్తున్న రాముడు ఈయన ఆశ్రమాన్ని దర్శించాడు.
భరద్వాజాశ్రమం
: గంగాయమున సంగమ ప్రదేశంలో ఉంది.
చిత్రకూటం
: ఒక పర్వతం. ఇక్కడే రాముని ఆదేశం ప్రకారం లక్ష్మణుడు నేరేడు కర్రలతో కుటీరాన్ని
నిర్మించాడు.
అత్రిమహర్షి
: సీతారామలక్ష్మణులు అరణ్యవాసం చేసేటప్పుడు ఈయన ఆశ్రమాన్ని దర్శించారు.
అనసూయ : అత్రి మహర్షి భార్య. ఈమె సీతాదేవికి దివ్య వస్త్రాభరణాలను ఇచ్చింది.
దండకారణ్యం : ఇక్కడ మునుల ఆశ్రమాలు చాలా ఉన్నాయి. వింధ్య పర్వతానికి దక్షిణాన ఉన్న
అరణ్యం. దండునిపురం మట్టిలో కలిసిపోయి అక్కడ అరణ్యంగా ఏర్పడటం చేత దీనికి
దండకారణ్యం అని పేరు వచ్చింది.
విరాధుడు
: తుంబురుడనే గంధర్వుడు కుబేరుని శాపంవల్ల రాక్షసుడిగా మారాడు. శరభంగ మహర్షిని
దర్శించుకుంటే శుభం జరుగుతుందని శ్రీరామునికి చెప్పాడు.
శరభంగ
మహర్షి : మహాతపస్వి. దైవ సాక్షాత్కారం పొందినవాడు. తన తపఃఫలాన్నంతా శ్రీరామునికి
ధారపోశాడు.
సుతీక్ష్య
మహర్షి : సీతారామలక్ష్మణులు ఈయన ఆశ్రమాన్ని దర్శించాడు. ఈయన తన తపశ్శక్తినంతా
శ్రీరామునికి ధారపోశాడు.
విశ్వామిత్రుడు
: గాధి కుమారుడు. యాగరక్షణార్థం రామలక్ష్మణులను తన వెంట తీసుకువెళ్ళాడు.
అగస్త్య
భ్రాత : అగస్త్యుని సోదరుడు. ఇతని పేరు రామాయణంలో చెప్పబడలేదు. అందుకే పేరు
తెలియని వారిని ‘అగస్త్య
భ్రాత’ అంటారు.
అగస్త్య
మహర్షి : వింధ్యపర్వత గర్వాన్ని అణచినవాడు. ఈయన శ్రీరామునికి దివ్య ధనుస్సు, అక్షయ తూణీరాలు, అమోఘమైన ఖడ్గాన్ని
బహూకరించాడు.
పంచవటి
: గోదావరి తీరాన ఉన్న ఒక అరణ్యం. వనవాసం చేస్తున్న సీతారామలక్ష్మణులు ఇక్కడే
పర్ణశాలను నిర్మించుకొని నివసించారు.
జటాయువు
: ఒక పెద్ద గ్రద్ద. సంపాతికి తమ్ముడు. ఈ జటాయువు దశరథునికి మిత్రుడు. శ్రీరాముడు
ఈయనకే సీత సంరక్షణ బాధ్యతను అప్పగించాడు. రావణాసురుడు సీతను అపహరించి తీసుకొని
వెళ్ళాడని శ్రీరామునికి తెలిపింది ఇతడే.
శూర్పణఖ
: ఒక రాక్షసి. రావణాసురుని చెల్లెలు, లక్ష్మణుడు ఈమె
ముక్కు, చెవులను
కోసి విరూపినిగా చేశాడు.
ఖరదూషణులు
: శూర్పణఖ సోదరులు.
అకంపనుడు
: రావణాసురుడి గూఢచారులలో ఒకడు.
రావణుడు
: కైకసీ విశ్రవసుల కుమారుడు. లంకానగరానికి అధీశుడు. సీతను అపహరించి తీసుకొని
వచ్చినవాడు.
లంకానగరం
: త్రికూట పర్వతం మీద ఉంది.
కబంధుడు
: ఒక రాక్షసుడు. ఇతని చేతుల్లో చిక్కి తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు. రావణునిచేత
అపహరింపబడిన సీతాదేవి దొరికే ఉపాయాన్ని శ్రీరామునికి తెలియజేసినవాడు ఇతడే.
శబరి
: ఒక బోయకాంత. తపస్సిద్ధురాలు. పంపాతీరంలో ఆశ్రమాన్ని ఏర్పరచుకొని నివసించింది.
శ్రీరామ దర్శనంతో ఈమె తనువు పులకించింది. పంపాతీరంలో దొరికే పండ్లను రామునికి
అర్పించింది.
ఋష్యమూక
పర్వతం : కిష్కింధకు దగ్గరలో గల ఒక పర్వతం. సుగ్రీవుడు నివసించింది ఈ పర్వతం పైనే.
వాలి
సుగ్రీవులు : వనరులు. అన్నదమ్ములు. వాలి సుగ్రీవులు శత్రువులుగా ఉన్నప్పుడే
సుగ్రీవుడు రామునితో స్నేహం చేశాడు.
హనుమంతుడు
: అంజనకు వాయుదేవుని అనుగ్రహం వల్ల జన్మించాడు. ఇతడు సుగ్రీవుని మంత్రి. ఇతడే
సుగ్రీవునికి రామలక్ష్మణులతో స్నేహం ఏర్పాటు చేశాడు. సముద్రానికి వారధి కట్టి
లంకలో ప్రవేశించాడు. సీత ఉన్న అశోకవనం తప్ప మిగిలిన లంక అంతా కాల్చాడు. కిష్కింధకు
వెళ్ళి సీతను చూసిన వృత్తాంతాన్ని తెలియజేశాడు.
తార
: వాలి భార్య.
రుమ
: సుగ్రీవుని భార్య. అంగదుడు : వాలి కుమారుడు.
నీలుడు
: ఒక వానరుడు. సుగ్రీవుని సేనలోనివాడు.
నలుడు
: ఒక వానరుడు. విశ్వకర్మ యొక్క పుత్రుడు. సుగ్రీవుని సేనలోనివాడు. సముద్రానికి
వారథి కట్టడానికి ఇతడే ప్రారంభించాడు.
జాంబవంతుడు
: భల్లూకరాజు.
సుషేణుడు
: వానరరాజు, తారతండ్రి.
సంపాతి
: పక్షిరాజు. జటాయువుకు అన్న. లంకలో సీత ఉన్న పరిస్థితులను దివ్యదృష్టితో చూసి
కళ్ళకు కట్టినట్లు వివరించాడు. లంకకు ఎలా వెళ్ళాలో చెప్పాడు.
మైనాకుడు
: ఒక పర్వతం. మేనకా హిమవంతుల కుమారుడు. ఇంద్రుడు పర్వతాల రెక్కలు
విరగగొడుతున్నప్పుడు ఇతడు భయపడి దక్షిణ సముద్రంలో దాక్కున్నాడు. హనుమంతుడు సముద్రం
దాటేటప్పుడు మైనాకుడు పైకి వచ్చి తనపై విశ్రమింపమని కోరాడు. హనుమంతుడు కొంతసేపు
విశ్రమించాడు.
సురస
: నాగమాత. హనుమంతుని సూక్ష్మబుద్ధిని, సమయస్ఫూర్తిని చూసి
ఆనందించి ఆశీర్వదించింది.
సింహిక
: ఒక రాక్షసి. హనుమంతుని మింగాలని చూసింది. కాని హనుమంతుడే తన వాడి అయిన గోళ్ళతో
సింహికను చీల్చేశాడు.
లంకిణి
: లంకాధిదేవత.
కుంభకర్ణుడు
: రావణుని తమ్ముడు. శ్రీరాముడు ఐంద్రాస్త్రంతో ఇతని శిరస్సును ఖండించాడు.
మహాపార్శ్వుడు
: రావణుని సేనానాయకులలో ఒకడు.
వీభీషణుడు
: రావణుని తమ్ముడు. రావణుడు పరాయి స్త్రీలను తీసుకొని వచ్చినప్పుడు అది తగదని
బోధించాడు. ఇతడు రాముని పక్షంలో చేరాడు.
మహూదరుడు
: ఒక రాక్షసుడు. రావణుని సేనలోనివాడు.
విరూపాక్షుడు
: మాల్యవంతుని కుమారుడు. రావణుని పక్షాన పోరాడాడు. యుద్ధంలో ఇతనిని సుగ్రీవుడు
సంహరించాడు.
విద్యుజిహ్వుడు
: ఒక రాక్షసుడు. శూర్పణఖ భర్త.
త్రిజట
: విభీషణుని కూతురు. లంకలో సీతకు కావలి ఉన్న రాక్షసి. తనకు వచ్చిన కలను బట్టి సీత
కోరిక నెరవేరుతుందని, రావణునికి
వినాశం తప్పదని, శ్రీరాముడికి
జయం కలుగుతుందని చెప్పింది.
ఇంద్రజిత్తు
: రావణుని పెద్ద కుమారుడు. ఇతని పేరు మేఘనాథుడు. ఇంద్రుని ఓడించడం వల్ల
ఇంద్రజిత్తు. అని పేరు వచ్చింది. ఇతడు బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించి హనుమంతుణ్ణి
బంధించాడు
ప్రహస్తుడు
: రావణుని సేనానాయకులలో ఒకడు.
శుకసారణులు
: రావణాసురుని మంత్రులు.
సరమ
: విభీషణుని భార్య.
జంబుమాలి
: ప్రహస్తుని కుమారుడు. రావణుని సేనలోనివాడు
అతికాయుడు
: రావణుని కుమారుడు. ఇతనిని లక్ష్మణుడు సంహరించాడు.
మాతలి
: ఇంద్రుని రథ సారథి.
పుష్పక
విమానం : ఇది కుబేరుని విమానం. దీన్ని బ్రహ్మ కుబేరునికి ఇచ్చాడు. రావణుడు
బలాత్కారంగా కుబేరుని వద్ద నుంచి తీసుకున్నాడు. రావణుని చంపిన తరువాత శ్రీరాముడు
దీన్ని ఎక్కి లంక నుండి వచ్చాడు. తరువాత దీన్ని కుబేరునకు ఇచ్చాడు.
త్రికూట
పర్వతం : లంకానగరం ఈ పర్వతం మీద ఉన్నది.
Excellent job
రిప్లయితొలగించండి