సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

కొత్త పొస్ట్



🌐 * L. I. P. తెలుగు ప్రారంభ పరీక్ష - BASELINE TEST 2026-27     🌐 * 10వ తరగతి 🌐 * 10వ తరగతి తెలుగులో 99% స్కోర్ సాధించాలంటే... 🌐 * తెలుగు వెలుగులీనేల 🌐 | ధ్వని గుర్తింపు / అక్షర గుర్తింపు     🌐 * సరళ పదాలు     🌐 * ఐ సి టి ఉపయోగించడం ఎలా?     🌐 * * DIKSHA WEB         🌐 SCERT         🌐 NCERT         🌐 NBT         🌐 UGC_NET         🌐 CIIL         🌐 * * NDL INDIA         🌐 SAHITHYA ACADEMY         🌐 | సిద్దెంకి కథలు     🌐 | సిద్దెంకి పుస్తకాలు     🌐 | సిద్దెంకి కవిత్వం 🌐 *"నీలి నేల ఎతలు - తెలంగాణ దళిత కథ పరిణామం కాలమ్ - కోలిమి"     🌐 | తెలుగులో అత్యుత్తమ పుస్తకాలు     🌐* | వ్యాసాలు / Articles     🌐* | దాశరథి పాటలు     🌐* | తెలంగాణ రాష్ట్రంలో దళిత కథ (2014:-07-2025)     🌐 * "సంస్కృతంతో తెలుగు కాలరాయొద్దు"     🌐 * పగిడి తెలంగాణ కథ 2024 "     🌐 * "ఆలోచనవాదుల పుష్పక విమానం దాశరథి ‘కవితా పుష్పకం’"     🌐 * Articles on Dr. Siddenky    

7, ఆగస్టు 2023, సోమవారం

IX. 2. నేనెర్గిన బూర్గుల - డా. సిద్దెంకి




చదువండి ఆలోచించి చెప్పండి.

సహనమ్ము, సత్యమ్ము, శాంతగంభీరమ్ము, ఆత్మవిశ్వాసమ్ము, నహరహమ్ము 

సాధన, దక్షత, సాధుభాషణమును, సద్వివేచనమును, సద్గమనము,

 దానమ్ము, ధైర్యమ్ము, త్యాగమ్ము, సునిశిత 
బుద్ధి, మేల్గాంచుట, పుణ్యగుణము, 

కరుణ, క్షమ, పరోపకారబుద్ధియనెడి 
యాలోచనారీతు లమరియుండు 

మనుజులెపుడును మాన్యులు, మంగళ
స్వ రూపులు, మహోన్నతులు, విరాడ్రూపశోభి 
తులు, సుకీర్తికాంతవరపతులు, సుమతులు,
 జగతిగతి విరచితులు, సజ్జనులువారు.

ప్రశ్నలు

1. పై పద్యం దేన్ని గురించి చెబుతున్నది?
ఈ పద్యం గొప్ప వారి గురించి మంచి వారి గురించి తెలియజేస్తుంది.

2. పై పద్యం ద్వారా గుర్తించిన లక్షణాలేవి?
సహనము సత్యము ఆత్మవిశ్వాసము సాధన యోగ్యత మితభాషణ మంచి వివేచన మంచి నడవడిక దానగుణం ధైర్యము త్యాగము సునిసిత బుద్ధి, హితం కోరే గుణము పుణ్యఫలము కరుణ క్షేమ పరోపకార బుద్ధులు మొదలైనవి ఇందులో ఉన్నాయి.

3. మంచి లక్షణాలు కలిగిన వారినేమంటారు?
మంచి లక్షణాలు గల వారిని సజ్జనులు అని అంటారు.

4. అలాంటివారి గురించి ఎందుకు తెలుసుకోవాలి? వారితో ఎందుకు సాంగత్యం చేయాలి?
అలాంటి వారిని గురించి తెలుసుకోవడం అంటే వారి గొప్ప గుణాలను మనం ఆదర్శంగా తీసుకోవడం వారితో సాంగత్యం చేయడం అంటే వారి జీవితాన్ని చదవడం అంటే వాటిని ఆచరించాలని అనుకోవడం

పాఠం ఉద్దేశం

సమాజంలో కొద్దిమందే ప్రభావశక్తి సంపన్నులు ఉంటారు. వీరి సాంగత్యం పొందినా, వీరి గురించి తెలుసుకున్నా, స్ఫూర్తి కలుగుతుంది. మంచిమార్గంలో నడవడానికి అవకాశం కలుగుతుంది. ఇలా స్పూర్తిదాయకులైన వారిలో బూర్గుల రామకృష్ణారావు ఒకరు. ఈయన హైదరాబాదు రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేసి, రాజనీతిజ్ఞుడిగా బహుభాషావేత్తగా పరిపాలనాదక్షుడిగా పేరెన్నికగన్నాడు. ఈయన మహోన్నత వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించేలా పి.వి. నరసింహారావు వ్యాసం రాశాడు. మహోన్నత వ్యక్తిత్వాల నుండి స్ఫూర్తి పొందడమే ఈ పాఠం ఉద్దేశం.

Page14

పాఠ్యభాగ వివరాలు

ఈ పాఠం వ్యాస ప్రక్రియకు చెందినది. గొప్పవారి జీవితాన్ని, వారి వ్యక్తిత్వంలోని ఉదాత్తమైన, స్ఫూర్తివంతమైన జీవన కోణాలను విశ్లేషిస్తూ, ప్రశంసిస్తూ రాసిన అభినందన వ్యాసం ఇది.

ఈ పాఠ్యభాగం ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక 1972 సం||పు డిసెంబర్ సంచిక నుండి తీసుకొనబడింది.

రచయిత పరిచయం

భారత ప్రధానిగా బహుభాషావేత్తగా భారతదేశ ఆర్థిక సంస్కరణల పితామహులుగా పేరొందిన పి.వి. పూర్తి పేరు పాములపర్తి వేంకట నరసింహారావు. వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట మండలంలోని లక్నేపల్లి గ్రామంలో జన్మించాడు. వరంగల్ దగ్గర భీమదేవరపల్లి మండలంలోని వంగర గ్రామస్థులు రుక్మిణమ్మ, రంగారావుగారలకు దత్తపుత్రుడు. స్వామి రామానంద తీర్థ పి.వి.కి రాజకీయ గురువు. బూర్గులవారు గురుతుల్యులు.

(1921-2004)

విద్యార్థిదశలోనే హైద్రాబాద్ సంస్థాన విముక్తి పోరాటంలో పాల్గొని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బహిష్కరణకు గురైనాడు. 1938లో హైద్రాబాద్ రాష్ట్రకాంగ్రెస్లో చేరి రాజకీయ జీవితాన్ని ఆరంభించాడు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలలో బహుకాలం మంత్రిగాను, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగాను, భారత ప్రధానిగాను విశిష్టమైన సేవలందించాడు. చతురతతో భారత రాజకీయయవనికపై ఒక వెలుగు వెలిగిన రాజనీతిజ్ఞుడు.

తెలుగుభాషతో సహా హిందీ, ఉర్దూ, ఆంగ్లం, మరాఠీ మొదలగు 17 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగిన బహుభాషావేత్త. తెలుగులో 'కాకతీయ' అనే పత్రికను నడిపించాడు. విశ్వనాథ 'వేయిపడగలు' నవలను హిందీలోకి "సహస్రఫణ్” అనే పేరుతో అనువదించాడు. దీనికి కేంద్రసాహిత్య అకాడమీ బహుమతి లభించింది. ఈయన ఆత్మకథగా ప్రసిద్ధికెక్కిన 'ది ఇన్సైడర్' అనేక భాషల్లోకి అనువదించబడింది. 'పన్ లక్షత్ కోన్ ఘ' అనే మరాఠి పుస్తకాన్ని తెలుగులో 'అబలా జీవితం'గా ఈయన అనువదించాడు.
నిరాడంబరజీవితం, నిజాయతీ, దేశభక్తి కలిగిన పి. వి. నరసింహారావు జీవిత పర్యంతం నిండుకుండలా స్థితప్రజ్ఞుడిగా వెలిగాడు.

విద్యార్థులకు సూచనలు
. పాఠం ప్రారంభంలోని ప్రవేశిక చదువండి. పాఠంలోని విషయాన్ని ఊహించండి.

. పాఠం చదువండి. అర్ధంకాని పదాల కింద గీత గీయండి.
వాటి అర్థాలను పుస్తకం చివర ఉన్న 'పదవిజ్ఞానం' పట్టికలో చూసి లేదా నిఘంటువులో చూసి తెలుసుకొండి.
విద్యార్థుల వికాసానికి ప్రభుత్వ కానుకల
Page 15

ప్రవేశిక
ప్రతి మానవునిలోనూ సాధారణంగా ఉన్నదానికంటే తనను గురించి ఘనంగా చిత్రించుకొనే స్వభావం ఉంటూ ఉంటుంది. ఇందుకు భిన్నంగా ప్రవర్తించేవారు బహు అరుదుగా ఉంటారు. రకరకాల ఒడిదుడుకులను ఎదుర్కొన్నా విపత్కర పరిస్థితులు సేనావాహినిలా చుట్టుముట్టినా చలించకపోవడం, మనః స్థైర్యాన్ని, సమచిత్తాన్ని విడనాడక పోవడం గొప్పవారికే సాధ్యమౌతుంది. జయాపజయాలను సమానంగా స్వీకరించడం, మిశ్రులు సైతం ద్రోహం తలపెట్టినా ప్రత్యర్థులు దూషించినా "సరే! ఇవన్నీ ఆటలో భాగమేగా!" అని స్థితప్రజ్ఞతను ప్రదర్శించడం అందరికీ సాధ్యమౌతుందా? మరి ఇటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు ఎవరు? ఈ పాఠం ద్వారా తెలుసుకొంది.

స్వర్గీయ డా. బూర్గుల రామకృష్ణారావు గారి 5వ వర్ధంతి సందర్భంలో వారిని గురించి వ్యాసమేదైనా యివ్వవలసిందిగా మిత్రులు కొందరు నన్ను కోరారు. డా. రామకృష్ణారావుగారి పేరు వినగానే గత స్మృతులెన్నో ముప్పిరిగొని భావోద్రేకంతో నా మనస్సు ఉక్కిరిబిక్కిరైపోతూ ఉంటుంది. నా భావాలన్నింటిని యీ వ్యాసంలో వివరించడం ఎలాగ? అవన్నీ వ్రాస్తే ఒక పెద్ద గ్రంథమే అవుతుంది. అందుకని రేఖామాత్రంగా నా భావాలను యిక్కడ పొందుపరుస్తాను.

కీ.శే.డా. రామకృష్ణారావుగారిని గురించి చరిత్రకారులు ఏమి వ్రాస్తారో మనం తేలికగానే ఊహించుకోవచ్చు. "డాక్టరు రామకృష్ణారావుగారు ఫలాన తేదీన ఫలాన గ్రామంలో పుట్టారు. పూనాలోని ఫెర్గూసన్ కాలేజి నుండి పర్షియన్భాష ఐచ్ఛిక విషయంగా తీసుకొని పట్టభద్రులయ్యారు. పర్షియన్ ట్యూటరుగ కొంతకాలం పనిచేశారు. తరువాత న్యాయవాద పట్టా పొంది ఫలానా సంవత్సరంలో న్యాయవాదిగా నమోదు అయ్యారు. ఇన్ని సంవత్సరాలు న్యాయవాదిగా పనిచేసారు. ఇన్ని ప్రజా ఉద్యమాలలో ఇన్నిసార్లు సత్యాగ్రహం జరిపి జైలుకు వెళ్ళారు. హైదరాబాదు స్టేటు కాంగ్రెసులో వారొక ప్రముఖ నాయకులు, మంత్రిగాను, ముఖ్యమంత్రిగాను, రెండు రాష్ట్రాలకు గవర్నరుగాను పని చేశారు. కొంతకాలం రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. అనేక కమిటీలకు, కమీషన్లకు అధ్యక్షులుగా ఉన్నారు. గుండెపోటు వలన 1967 సెప్టెంబరు 14వ తేదీన కన్నుమూశారు" మొదలయిన అంశాలు వ్రాస్తారు. చారిత్రకంగాను, కాలక్రమ ప్రకారంగాను అది అంతా నిజమే. కాని, అంతమాత్రం చేత డా. రామకృష్ణారావుగారి అసలు వ్యక్తిత్వం మనకు అవగతం కాదు.
Page 16

ప్రతి మానవునిలోను సాధారణంగా ఉన్నదానికంటే ఘనంగా తనను గురించి చిత్రించుకొనే స్వభావం ఉంటూ ఉంటుంది. దానిని గురించి వాని అంతరాత్మ బోధిస్తూనే ఉంటుంది. అయినప్పటికీ తాను చిత్రించుకొన్న ఆ కృత్రిమ ఘనతను ఇతరుల ముందు ప్రదర్శించి ఇతరులకంటే తాను అధికుడననిపించుకోవాలనే ఉబలాటం, పెనుగులాట ప్రతినిత్యం ఉంటూనే ఉంది. తత్ఫలితంగా ఒకరినొకరు కించపరుచుకొంటూ తమ శక్తిసామర్ధ్యాలను, అమూల్య సమయాన్ని వ్యర్థపరుచుకొంటూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. కాని యిందుకు డా. రామకృష్ణారావుగారు మాత్రం అరుదుగా కనవచ్చే ఒక చక్కని మినహాయింపు అని చెప్పవచ్చు. వారెల్లప్పుడు అన్ని విషయాలు ఆఖరికి తమలోని లోపాలను కూడా ఉన్నవి ఉన్నట్లుగా చెపుతూ వుండేవారు. ఎంత ఉంటే అంతే. వీసం ఎత్తు ఎక్కువాలేదు, వీసం ఎత్తు తక్కువా లేదు.

వారి పొట్టితనం కొంతవరకు వారిని మరుగుపరుస్తూ ఉండేదని కొంతమంది అంటారు. కాని అంతకంటే సత్యదూరమైన విషయం మరొకటి లేదని నా భావన. నిజానికి ఒడ్డూ పొడుగూ ఉన్న చాలామందికంటే కూడ వారు అతి చక్కగా గుర్తింపబడుతూ ఉండేవారు. తమ వామన రూపాన్ని గురించి స్నేహపూరితమైన ఎన్నో పరిహాసాలను వారే స్వయంగా చక్కటి భావనిర్లిప్తతతో చెప్తూ ఉండేవారు. లోగడ మన దేశంలో అమెరికా రాయబారిగా పనిచేసిన ప్రొఫెసర్ గాల్ బ్రాత్ అసాధారణ పొడగరితనం కంటె డా. రామకృష్ణారావు గారి పొట్టితనం వారిని ఏమాత్రం మరుగుపరచలేదు. పూర్వపు హైదరాబాదు సంస్థాన ముఖ్యమంత్రిగా ఉంటున్న రోజులలో డా. రామకృష్ణారావు గారు బేగంపేట విమానాశ్రయంలో అరేబియారాజు ఇబన్ ఉద్ను పుష్పమాలాలంకృతునిగా చేసిన సందర్భంగా అతిథి ఆతిథేయులిర్వురు పరస్పర సౌజన్య సౌహార్దాలతో ఎటువంటి ఫీటు చేయవలసి వచ్చిందో ఆ వినోదకర దృశ్యం యిప్పటికీ చాలా మందికి జ్ఞాపకముండే ఉంటుంది. అలాగే ఒక విందు సందర్భంలో ప్రొ. గాల్ బ్రెత్, డా. రామకృష్ణారావు గార్ల ఫొటో తియ్యడం ఫొటోగ్రాఫర్ల కళానైపుణ్యానికొక గీటురాయి అయి ఆ సందర్భానికొక చక్కని వినోదాన్ని చేకూర్చింది.

ఆలోచించండి - చెప్పండి.
అంతరాత్మ బోధించడం అంటే ఏమిటి? ఎప్పుడు?
* ఇతరులకంటే తాను అధికుడనని- పించుకోవాలనే ఉబలాటం. పెనుగులాట ప్రతినిత్యం ఉంటూనే ఉంటుంది. ఈ వాక్యం ద్వారా మీరేమి గ్రహించారు?
సత్యదూరమైన విషయం అంటే ఏమిటి? దీన్ని ఏఏ సందర్భాలలో వాడుతారు?

II

 *అవసరమైతే విరాట్ రూపం....* 
వారు గుర్తించబడడానికి, గుర్తించబడకపోవడానికి వారి శరీరాకృతి కారణం కానేలేదు. అంతకన్న గహనమైన దేదో వారి వ్యక్తిత్వంలో వుండి ఉండాలి. ఏదో నిత్య నైమిత్తికంగా (routine) వారు గుర్తించబడడంకాని, గుర్తించబడకపోవడం గాని జరుగలేదు. అవసరం వచ్చినప్పుడు వారు అలనాటి వామనమూర్తివలె ఇంతింతై ముల్లోకాలు ఆక్రమించి తమ విరాట్ రూపాన్ని ప్రదర్శించేవారు. పని పూర్తి అయిన వెంటనే తిరిగి తమ వామన రూపంలో ఇమిడిపోతూ ఉండేవారు, మరొక అవసరం వచ్చేవరకు. అందుచేత వారు కావాలని నిరాడంబరంగా తెరమరుగున ఉండడం జరుగలేదు. అసలు రహస్యం ఏమిటంటే చిన్న మూర్తిలో యిమిడి ఉన్న వారి బహుముఖ ప్రతిభాయుత మూర్తిమత్త్వం అవసరం వచ్చినప్పుడు తమ మహోన్నత రూపంలో ప్రదర్శితం కావడం, అవసరం తీరగానే తిరిగి స్వస్వరూపంలో యిమిడిపోవడం అనేది వారి స్వభావంలోనే ఉంది. విచిత్రం ఏమిటంటే డా. రామకృష్ణారావుగారి వ్యక్తిత్వపు మహోన్నత శిఖరాలు దాని అగాధపు లోతులలోనే పరిలక్షితమౌతూ ఉండేవి.

 *న్యాయవాదిగా
న్యాయవాదిగా వారికి కొన్ని ప్రత్యేక లక్షణాలుండేవి. వారి ప్రాక్టీసు roaring practice (క్షణం తీరికలేనిది) అని చెప్పడానికి వీలులేదు. అలా అని వారికి కేసుల కొరత ఎప్పుడూ ఉండేదికాదు. కాని వాటిలో ఎక్కువ కేసులు రాజకీయాలకు సంబంధించినట్టివి. ఫీజు లేనట్టివీను. ప్రజాహిత జీవితం కొందరు న్యాయవాదులకు ఫైలు పెరగడానికి, ధనసంపాదనకు ఉపకరిస్తే, డా. రామకృష్ణారావుగారి విషయంలో మాత్రం అది తారుమారైంది. వారి వద్దకు వచ్చే క్లయింట్లలో చాలామందికి ఒక రకమైన మిశ్రిత భావం ఉంటూ ఉండేది. డా.రామకృష్ణారావుగారి శక్తిసామర్థ్యాలు, ప్రజ్ఞా ప్రాభవాలలో సంపూర్ణ విశ్వాసానికి తోడు వారు రాజకీయ వ్యగ్రతవలన కేసులమీద ఎక్కువ ధ్యానముంచలేరేమో అన్న అనుమానంకూడా ఆ క్లయింట్ల మనస్సులలో ఉంటూ ఉండేది. నిజానికి రామకృష్ణారావుగారికి కేసును క్షుణ్ణంగా చదివి తయారవడానికి అవకాశమే ఉండేదికాదు. కేసు చేపట్టేటప్పుడే వారు విషయమంతా శ్రద్ధగా విని ఆ కేసు తాలూకు ఫైలు యొక్క వెనుక అస్పష్టమైన నోటులను కొన్నిరేఖామాత్రంగా వ్రాసిపెట్టుకొనే వారు అంతే. నిజానికి వాటిని కేసుకు తయారీ అనడానికి వీలు లేదు. కాని కోర్టులో ఆ రేఖామాత్రపు నోట్సే డా. రామకృష్ణారావుగారి జాజ్వల్యమానమైన ప్రతిభా విశేషతతో ఎదుటి న్యాయవాదుల వాదనాఘాతములకు దుర్భేద్యమైన కంచుగోడలుగా నిలవడం నేను స్వయంగా చూచాను. న్యాయవాద వృత్తిలో నిష్ణాతమైన సునిశిత మేధాసంపత్తిని వారు ప్రదర్శిస్తున్నారా అన్నట్లుగా ఉండేది వారి అనన్యమైన వాదనా పటిమ.

 *ప్రోత్సాహం
సీనియర్ న్యాయవాదిగా వారిదొక ప్రత్యేక తరహా. నేను వారివద్ద అందరికంటె జూనియర్గా ఉండేవాడిని. కాని తల్లికి తన కడగొట్టు బిడ్డపై ఎటువంటి విశేషమమకారం ఉంటుందో అటువంటి మమకారమే డా. రామకృష్ణారావుగారికి నామీద ఉంటూ ఉండేది. చొరవతోను, నిరాఘాటంగాను, నేను వారి ఆఫీసును ఒక న్యాయవాద కాఫీ పానశాలగా పరిగణించి నాకు కావలసిన కేసులను ముఖ్యంగా జూనియర్లకు కొరుకుడుపడని చిక్కు కేసులను స్వయంగా ఏరుకొని చదువుతూ ఉండేవాడిని. నా యీ చొరవ వారి సీనియర్ గుమాస్తాకు కోపకారణమై ఆయన నామీద కారాలు మిరియాలు నూరుతూ ఉండేవాడు. ఒకసారి డా. రామకృష్ణారావుగారు దానిని గమనించి నా చేష్టపై తమ ఆమోదముద్ర వెయ్యడం, అంతటితో కారాల మిరియాల ప్రకరణం ముగియడం జరిగింది. అప్పటినుండి మా యిరువురి మధ్య సీనియర్, జూనియర్ సంబంధంపోయి నిష్కాపట్యంతో కూడిన సమానస్థాయి చర్చాసంబంధం ప్రారంభమైంది. నేను అంచనా వేసుకొన్న దానికంటే ఎక్కువగానే నాలో శక్తిసామర్ధ్యాలున్నాయని, స్వయంగా గుర్తించగలిగేలా నన్ను రూపొందించిన డా. రామకృష్ణారావుగారి విశేష నైపుణ్యానికి నేను ఎల్లపుడూ జోహారు లర్పిస్తూనే ఉంటాను. వారు నాలో పూరించిన ఆ ఆత్మవిశ్వాసమే నాకు శాసనసభలలోను, యితర చోట్లను కూడ శ్రీరామరక్షగా ఉంటూ వస్తూంది. ప్రాతఃస్మరణీయులైన నా సీనియర్ రామకృష్ణారావుగారి విశిష్టవ్యక్తిత్వ మట్టిది.

రాజకీయాలలో వారి సమ్యక్ దృష్టికోణం సంకుచిత సైద్ధాంతిక అరలకు తావివ్వలేదు. వారు పుట్టింది జాగీర్దారీ కుటుంబంలో అయినప్పటికి వారు పూర్వపు హైదరాబాద్ సంస్థానంలో తరతరాల నుండీ వస్తూఉన్న జాగీర్దారీ వ్యవస్థను రూపుమాపడానికి వెనుకాడలేదు. వారి స్నేహకోటిలో పెద్ద పెద్ద భూస్వాములు చాలామంది ఉండేవారు. అయినప్పటికినీ వారు పూర్వపు హైదరాబాద్ రాష్ట్రంలో దున్నేవానికి భూమిహక్కు నిచ్చే కౌలుదారీచట్టాన్ని తయారుచేసి, దేశంలో సామ్యవాద వ్యవస్థకు మార్గదర్శకులైనారు. ఆ చట్టాన్ని అమలు పరచడానికి వారు ఎంపిక చేసిన జిల్లాల్లో ఎక్కువగా నష్టపోయిన భూకామందులు వారి బంధువులూ, రాజకీయ సహచరులే.
Page18

పూర్వపు హైదరాబాద్ సంస్థానవిచ్ఛిత్తి తన రాజకీయ ప్రాబల్యానికి స్వస్తివాచకం పలుకుతుందని వారికి ముందే తెలుసు. అయినప్పటికీ తనకు నష్టం ఇతరులకు మేలు చేకూర్చే నిర్ణయాలు తీసుకొంటూ తన రాజకీయ జీవితాన్నంతా ఆత్మపరిత్యాగానికీ, చివరకు సక్రియ రాజకీయాలనుండి తన నిష్క్రమణకు దారితీసే పరిస్థితులకు వీరివలె అంకితం చేసుకొనే రాజనీతి విశారదులు బహు అరుదు. డా. రామకృష్ణారావుగారు ఏ నిర్ణయం తీసుకొన్నా  దానిని అన్ని విధాలైన జాగ్రత్తలతోను, మంచి వ్యవహార దక్షతతోను తీసుకొనేవారు. ఒకసారి నిర్ణయం  తీసుకొన్నారంటే ఆరునూరైనా దానిమీద స్థిరంగా నిల్చేవారు. ఇదీ డా.రామకృష్ణారావుగారి సంక్షిప్త రాజకీయచరిత్ర.

ఆలోచించండి- చెప్పండి.
ఎవరైనా గుర్తింపుపొందడానికి శరీరాకృతి కారణం కాదని తెల్సుకొన్నారు కదా! దీన్ని మీరెలా సమర్థిస్తారు?
* అనన్యమైన వాదనాపటిమ అంటే ఏమిటి? ఇది ఎవరికి అవసరం? ఎందుకు?
'కొరుకుడు పడకపోవడం' అంటే ఏమిటి? దీన్ని ఏఏ సందర్భాలలో వాడతారు?

III
సౌజన్యానికి మారుపేరు :
వారి విశిష్టవ్యక్తిత్వానికి సంబంధించిన మరో ముఖ్యాంశం ఉంది. గత తరంలోని అన్ని సుగుణాల మూర్తిమత్వమే శ్రీరామకృష్ణారావుగారు. శరాఫత్ అంటే సౌజన్యానికి మారుపేరే వారు. మతదురభిమానాన్ని పెంపొందిస్తూ రాజ్యమేలుతున్న నాటి నిజాంకు బద్ధవ్యతిరేకి అయినప్పటికినీ రాష్ట్రంలోని ముసల్మానులందరికీ వారు పరమమిత్రులు, ఆప్తులూను! అతి నిరాడంబరముగా వారు మతాతీతస్థితిని పాటించేవారు. వారి డ్రాయింగు రూం ఒక సంస్కృతీ ప్రదర్శనశాలలా ఉండేది. నాటి హైదరాబాద్ ప్రభుత్వ పెద్దలు, కుచ్చుటోపీల మౌల్వీలు, గడ్డాలముల్లాలు, తలపాగాల పండితులు, మహామహోపాధ్యాయులు, గాంధీటోపీలవారు, ఖద్దరుధారులు, అధునాతన టెరిలిన్ యువకులు ఒకరేమిటి, అన్ని రకాలవారు, వారిని ఆహ్వానించడానికి అక్కడ హాజరు అయ్యేవారు. ఒక్కమాటలో చెప్పాలంటే డా. రామకృష్ణారావుగారు మూడు విభిన్నతరాల చివరి వారధిలా కన్పించేవారు. ఇంతటి విశాలవ్యక్తిత్వంతో వారు అనాటి ప్రజాజీవితాన్ని తీర్చిదిద్దారు.

నాటి హైదరాబాద్ రాష్ట్ర శాసనసభలో శాసనసభా నాయకులుగా వారు సునిశితమేధ, పరిమార్జితభాష, వ్యవహార దక్షతలను మేళవించి ఏర్పరచిన ఉన్నతప్రమాణాలను, నేటికి ముఖ్యంగా యీ రోజులలో ఎంతో గౌరవంతో చాలామంది స్మరించుకొంటూ ఉంటారు. అవసరమైనపుడు వారు ప్రత్యర్థులను చీల్చి చెండాడేవారు. కాని అలా చేయడంలో ప్రత్యర్థుల నుండి రక్తపుబొట్టుమాట అలా ఉంచి, ఒక్క కన్నీరుబొట్టు పడడంగాని, వారి హృదయాలకు రవ్వంత నొప్పి తగలడంగాని జరిగేదికాదు. పార్లమెంటేరియన్గా డా. రామకృష్ణారావుగారి అద్వితీయ కళాకౌశలమట్టిది.

 బహుభాషావేత్త :
వారు చాలా ప్రతిభావంతులైన భాషావేత్తలనే విషయం అందరికీ తెలిసినదే. వారు చదువుకున్న చాలా భాషలు వాటియందలి అభిరుచులచే ప్రయివేటుగా చదువుకొన్నవే. ముఖ్యమంత్రిగా ఉంటున్న రోజులలో డా. రామకృష్ణారావుగారు ప్రతిరోజూ అర్ధరాత్రివరకు ఆఫీసు ఫైళ్ళు చూచుకొని, ఆ తర్వాత నమ్మశక్యంగాని ఉత్సాహంతో సంస్కృత ప్రాచీన కావ్యాలు  చదవడంలో ఎలా మునిగిపోయేవారో నాకిప్పటికీ స్పష్టంగా జ్ఞాపకం ఉంది. బహుముఖ ప్రతిభావంతులైనప్పటికీ, డా. రామకృష్ణారావుగారు ప్రధానంగా సాహితీజగత్తుకు చెందినవారని నా నమ్మకం. ఇది చాల వింతగానే తోచవచ్చు. ఎందుకంటే వారి సాహిత్య వ్యాసంగం జరుగవలసినంత ఎక్కువగా జరుగలేదు.
Page 19
బహుముఖప్రజ్ఞతో వచ్చిన చిక్కే ఇది. డా. రామకృష్ణారావుగారు ముట్టని, పెంపొందించని క్షేత్రం ఏదీ లేదంటే అందులో అతిశయోక్తి ఎంతమాత్రం లేదు. కాని ఏం లాభం? ఏ సాహిత్య క్షేత్రానికైతే వారి సునిశిత మేధాసంపత్తి ఎక్కువ అనుకూలంగా ఉండేదో, ఆ సాహిత్య క్షేత్రంలో చెప్పుకోదగ్గ రచనలు చేయడానికే వారికి అవకాశం కలుగలేదు. రాజకీయవేత్తగా కూడ వారు తమ కాలంనాటి అంటే దేశచరిత్రలో చాల ప్రధానమైన, ఉత్తేజకరమైన దశాబ్దాలకు సంబంధించిన స్మృతులను గ్రంథస్థం చేసి ఉండవలసింది. నాబోటి హితైషులెంత చెప్పినప్పటికీ వారా పనులు చేయలేకపోయారు. ఆ విధంగా వారు తమ జీవితకాలంలో ఎంతో విలువైన పనులు చేసినప్పటికీ, చేయకుండా వదిలివేసింది కూడా అంతకన్న ఎక్కువ విలువైనదే అని నా అభిప్రాయం. ఎందుకంటే ఆ పనులు చేయడానికి ఇతరులెవరికంటె కూడ వారే మిక్కిలి సమర్థులు. ఇందుకు నేనూ, నాలాగే ఇతరులు చాలామంది కూడా ఎప్పుడూ బాధపడుతూనే ఉన్నాం.

వారి ఔదార్యం, ఉపకారబుద్ధి ఎంతవరకు ఉండేదంటే, ఒక్కొక్కపుడది ఒక దోషంగా పరిణమించేది. అసాధ్యమైన కోరికలు కోరినప్పుడు కూడ వారు నెమ్మదిగా నచ్చచెప్తూ ఓపికగా చాలసేపు కూర్చొనేవారు. అప్పుడు వారి స్థానంలో మరొకరెవరైనా ఉండిఉంటే ఒక్క చీదరింపుతో దానిని వెంటనే పరిష్కరించి ఉండేవారు. కాని డా. రామకృష్ణారావుగారి ఔదార్యం అలా చేయనిచ్చేది కాదు. వారి ఉదార ప్రవృత్తి వల్ల న్యాయముగా ఎక్కువ ధ్యానముంచవలసిన పనులకంటే, శక్తిని, సమయాన్ని వ్యర్థపరిచే పనులకు అప్పుడప్పుడు వారు ప్రాధాన్యమివ్వడం జరుగుతుండేది. ఏమైతేనేమి? వారావిధంగా మలచబడ్డారు. అది అంతే.

ఉపకారశీలి
డా. రామకృష్ణారావుగారిది పెద్దకుటుంబం. ఆ కుటుంబానికి వారొక ఆత్మీయులైన తండ్రి. ఆ కుటుంబానికే కాదు, ప్రతిచోటా ఆత్మీయుడైన తండ్రిగానే ఉంటూ ఉండేవారు. వారు ఎక్కడైనా బయలుదేరితే దారిలో వారిని ఎవరైనా ఎక్కడైనా ఆపి కష్టసుఖాలు చెప్పుకోవచ్చు. అందుచేత వారు ప్రతిదానికి ఆలస్యంగా రావడానికి పేరుబడ్డారు. అయినప్పటికీ మిత్రులు, సహచరులు, ప్రజలుకూడ ఎంతో ప్రేమతోను, ఓర్మితోను, గంటల తరబడి వేచిఉంటూ ఉండడం, వారు రాగానే "సోదర సోదరీమణులారా; నేను అలవాటు ప్రకారం నేడు కూడ ఆలస్యంగానే వచ్చాను" అంటూ ఉండడం పరిపాటి అయిపోయింది.
వారి సామాజికయాత్ర ఎప్పుడూ సాఫీగా జరుగలేదు. రకరకాలైన ఒడిదుడుకులను వారు ఎదుర్కొనవలసివచ్చేది. చాలా సందర్భాలలో విపత్కర పరిస్థితులు సేనావాహినిలా వచ్చి చుట్టుముట్టేవి. అయినప్పటికీ వారు చలించేవారు కాదు. మనస్తైర్యాన్నీ  సమచిత్తతను వారు ఎన్నడూ విడనాడేవారు కాదు. విజయాలు లభించినప్పుడు సంతోషంతో ఉప్పొంగనూ లేదు, కష్టాలు సంభవించినప్పుడు అధైర్యంతో క్రుంగిపోనూ లేదు. స్నేహితులు ద్రోహం తలపెట్టినప్పుడు కాని, ప్రత్యర్థులు దూషించినప్పుడుగాని వారనేదల్లా ఒకటే- “సరే- అవన్నీ ఆటలో ఉండేవేగా" అని.

డా.రామకృష్ణారావుగారిని గురించి ఎంతైనా వ్రాయవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే వారు పూర్ణపురుషులు.

ఆలోచించండి- చెప్పండి..
గొప్పవారు తమ జీవితానుభవాలను గ్రంథస్థంఎందుకు చేయాలి?
* మీరు వెచ్చించే సమయం దేనికి ఎక్కువగా ఉంటోంది? మీకుపయోగపడేవాటికా? లేక ఇతరపనులకా?
రామకృష్ణారావుగారిని పి.వి.గారు ప్రాతఃస్మరణీయులు అని పేర్కొన్నారు'కదా! నేటి రాజకీయ నాయకులు కూడా రామకృష్ణారావుగారిలా గొప్ప పేరు సంపాదించుకోవాలంటే ఎలా ఉండాలి? ఏమేం చేయాలి?
Page 20

ఇవి చేయండి
1. అవగాహన - ప్రతిస్పందన
1. కింది అంశం గురించి మాట్లాడండి.

ఇతరుల కంటే తాను అధికుడననిపించుకోవాలనే ఉబలాటం, పెనుగులాట ప్రతినిత్యం ఉంటూనే ఉంటుంది.

దీని గురించి మీ అభిప్రాయాలను తెలపండి.
2. కింది విషయాలు పాఠంలో ఏయే సేరాల్లో ఉన్నాయి.

వాటికి సంబంధించిన అంశాలను పట్టికలో రాయండి.

వ్యక్తిత్వం
పేరా సంఖ్య

సంబంధించిన అంశాలు
మహోన్నత వ్యక్తిత్వం
విశిష్ట వ్యక్తిత్వం విశాల వ్యక్తిత్వం

3. పాఠం మొత్తాన్ని చదువండి. పాఠంలో ఉన్న జాతీయాలను గుర్తించి రాయండి.

4. కింది గద్యాన్ని చదువండి.
క్లిష్టపరిస్థితుల్లో రాజ్యాధికారం చేపట్టిన రుద్రమ నిరంతరం యుద్ధాల్లో నిమగ్నమైనా, పరిపాలనా నిర్వహణలో మంచి సమర్థురాలుగా పేరొందింది. స్త్రీలు రాజ్యాధికారం చేపట్టడం అరుదైన ఆ కాలంలో రుద్రమాంబ తన తండ్రి తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయక వీరనారిగా చరిత్రలో నిలిచింది. స్త్రీ అయినప్పటికి పురుషవేషం, పురుషనామం ధరించి సమకాలీన రాజులందరికంటే మిన్నగా రాజ్యాన్ని పరిపాలించి సాహసవంతమైన జీవితాన్ని గడిపింది. గ్రామాలను దానంచేసి వాటిమీద ఆదాయంతో విద్యార్థులకు పాఠశాలలు, ఉచిత వసతిగృహాలు నెలకొల్పింది. ఆరోగ్యశాలలు, ప్రసూతిశాలలు ఏర్పాటు చేసింది. ఒక విద్యాపీఠం స్థాపించి అందులో వేదాలను, సాహిత్యాన్ని, ఆగమవ్యాఖ్యానాలను బోధింపచేసేది. పాఠశాలల్లో ఉపాధ్యాయులను, గ్రామాల్లో కరణాలను నియమించి వారికి వస్తువాహనాలను, ధాన్యాన్ని సమకూర్చేది. మార్కోపోలో అనే విదేశీ యాత్రికుడు ఈమె పరిపాలనా దక్షత, సాహిత్యసేవ, శిల్పకళలు, మహదైశ్వర్యం గురించి ప్రశంసిస్తూ తన డైరీలో రాసుకున్నాడు. అదీ రుద్రమదేవి ఘనత.

*. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
అ) రుద్రమాంబపై ఆమె తండ్రి ఉంచిన నమ్మకమేమిటి?
ఆ) రుద్రమాంబ చేసిన సత్కార్యాలేవి?
ఇ) మార్కోపోలో ఏయే అంశాల్లో రుద్రమదేవిని పొగిడాడు?
ఈ) రుద్రమదేవి సమర్థత యేమిటి?
ఉ) ఈ గద్యం ద్వారా రుద్రమదేవి వ్యక్తిత్వాన్ని ఒక వాక్యంలో రాయండి.

P21
అవగాహన ప్రతిస్పందన :
1.
2.
3
4. గద్యభాగం
అ)రుద్రమాంబపై ఆమె తండ్రి ఉంచిన నమ్మకం ఏమిటి 
జవాబు. రుద్రమాంబ సమర్ధరాలు
ఆ) రుద్రమ అమ్మ చేసిన సత్కార్యాలేవి
జ. రుద్ర మాంబ చేసిన సత్కార్యాలు విద్యార్థులకు పాఠశాలలు, ఉచిత వసతి గృహాలు, ఆరోగ్యశాలలు, ప్రసూతి శాలలు ఏర్పాటు చేసింది.
ఇ) మార్కోపోలో ఏ అంశాల్లో రుద్రమదేవిని పొగిడాడు?
జ.  పరిపాలన దక్షత సాహిత్య సేవ, శిల్పకళలు, మహదేశ్వరం గురించి ప్రశంసిస్తూ తన డైరీలో రాసుకున్నాడు.
ఉ) ఈ గద్యం ద్వారా రుద్రమదేవి వ్యక్తిత్వాన్ని ఒక వాక్యంలో రాయండి.
రుద్రమదేవి గొప్ప వీరవనిత, ప్రజాను రంజకంగా పరిపాలన చేసిన రాణి.

II. వ్యక్తీకరణ - సృజనాత్మకత:

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి
అ) బూర్గుల పి వి గార్ల సంబంధము గురు శిష్య సంబంధం లాంటిది. దీన్ని సమర్థిస్తూ రాయండి.
జ. బూర్గుల పివి గార్ల సంబంధము గురు శిష్య సంబంధం: బూర్గుల రామకృష్ణారావు గారు అప్పటికే పేరు మోసిన న్యాయవాది రాజకీయ నాయకులు. వారి వద్ద జూనియర్ లాయర్ గా పీవీ నరసింహారావు గారు ప్రాక్టీస్ ప్రారంభించారు. ఆ క్రమంలో అనేక విషయాలు తెలియని అంశాలను గురువు లాగా పివి నరసింహారావు గారికి బూర్గుల గారు బోధించేవారు. న్యాయవాద వృత్తిలో సీనియర్ గా ఉన్నప్పటికీ, స్నేహితుడిగా ఉన్నను పేద భావం అరమరిక్ లేకుండా బోధించేవారు. అనేక విషయాలు తెలియజేస్తున్నందువల్ల వీరిద్దరి సంబంధం గా మనం అర్థం చేసుకోవాలి.

ఆ) "సరే! అవన్నీ ఆటలు ఉండేవేగా" అని బూర్గుల వారు అనేవారు కదా ఏ సందర్భంలో ఎందుకనే వారు దానికి గల కారణాలు రాయండి.
జ. రాజకీయంలో ప్రత్యర్థులు ఉంటారు. ప్రత్యర్ధులు ఎప్పుడు తప్పుని వెతుకుతారు. మాట్లాడిన పని చేసిన మంచి బోధించిన వారికి తప్పే కనబడుతుంది. బూర్గుల గారి ద్వారా లాభము పొంది కూడా నిందారోపనలు చేస్తారు. మంచి చేసిన తప్పుని వెతుకు తారు. మళ్లీ అవసరమైనప్పుడు మీరే రక్షించాలి అని వేడుకుంటారు
 అవసరం తీరిన తర్వాత మళ్లీ పూర్వపు లాగానే వ్యవహరిస్తారు కాబట్టి ఈ రాజకీయ క్రీడలలో మిత్రులు ఎవరు ఉండరు గనుక వారి ఆరోపణలను అధిగమించడం కోసం ఇవన్నీ రాజకీయ ఆటలో ఉండేవేగా వాటిని పట్టించుకోవద్దని అర్థం లో వివరిస్తాడు

ఇ) బూర్గుల వారిని ప్రాతస్మరణీయులు అని పివి నరసింహారావు గారు పేర్కొనడాన్ని సమర్థిస్తూ రాయండి.
జ. బూర్గుల వారు ప్రాతస్మరణీయులు: ప్రాతస్మరణీయులనగానే ఉదయకాలం లేవగానే ఇష్ట దైవాన్ని తలచుకున్నట్లు ఉపయోగపడే వారిని తలచుకుంటారు. న్యాయవాద వృత్తిలో జూనియర్ అయిన పీవీకి అనేకమైన విషయాల పట్ల అవగాహన కలిగించారు. రాజకీయాల లో ఏ విధంగా మసులుకోవాలో బోధించాడు. ప్రత్యర్థులను ఏ విధంగా ఎదుర్కోవాలో తన ప్రత్యర్థుల పట్ల చేసిన మేలులను బట్టి తెలుసుకున్నాడు పీవీ నరసింహారావు. ప్రతి విషయంలో అతనికి మేలు చేసి అతని భవిష్యత్తును తీర్చిదిద్దాడు. అట్లా పీవీ నరసింహారావు గారికి ఎంతగానో ప్రయోజనం చేసిన బూర్గుల రామకృష్ణారావు గారిని ప్రాతస్మరణీయులు అన్నాడు.

2. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.
అ) బూర్గుల వ్యక్తిత్వంలోని మహోన్నత లక్షణాల గురించి సొంతమాటల్లో రాయండి.
జ. బూర్గుల రామకృష్ణారావు గారి వ్యక్తిత్వం:
శాంతి స్వభావులు: గురుకుల రామకృష్ణారావు గారు శాంతి శాంతికాముకులు. ఇతరులను ద్వేషించేవారు కాదు వారు పొట్టి వారైనప్పటికీ వారు గొప్ప  వ్యక్తిత్వం కలిగిన వారు. మిత్రులతోటి స్నేహపూరితమైన వాతావరణంలో ఎన్నో పరిహాసాలు వారే ఆడేవారు. 
అవసరమైతే విరాట్ స్వరూపం:
వారు మృదుస్వభావి అయినప్పటికీ అవసరాన్ని బట్టి వామనుని తీరు వ్యవహరించేవారు.

న్యాయవాదిగా... బూర్గుల వారి న్యాయవాద ప్రాక్టీసు క్షణం తీరిక లేనిది తన క్లైంట్లతో ఓపికతో వ్యవహరించేవారు అనన్య శక్తి సామర్థ్యాలతో తన జాజ్వలమానమైన ప్రతిభాపాటవాలను చూపుతూ ఎదుటివారిని దుర్యోధ్యమైన కంచుగోడలుగా నిలవడం అందరికీ సుపరిచితమే.

ఇతరులకు ప్రోత్సాహం: తన వద్ద పనిచేసే జూనియర్ న్యాయవాదులకు గుమస్తాలకు ఎంతో ప్రోత్సాహము ఇచ్చేవారు. రాజకీయాలలో తనకంటే తక్కువ స్థాయి నేతలతో ప్రజలతో సత్సంబంధాలను కలిగి వారి బాగోగులను తెలుసుకునేవారు. కౌలుదారి చట్టం తయారుచేసి సామ్యవాద వ్యవస్థకు వారు కారకులు అయ్యారు. మంచిదక్షిత తీసుకున్న నిర్ణయాన్ని అమలుపరచడంలో వారికి వారే సాటి.

సౌజన్యానికి మారుపేరు: రామకృష్ణారావు గారు సుగుణాల మూర్తిమత్వం అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. వారి వద్దకు ప్రభుత్వ పెద్దలు కుచ్చుటోపిల మౌళిలు, గడ్డాల ముల్లాలు, తలపాగ పండితులు, మహా మహా ఉపాధ్యాయులు, గాంధీ టోపీల వారు,... అన్ని రకాల వారు వారితో కలివిడిగా ఉండేవారు. వారంటే ఎంతో గౌరవంతో చాలామంది స్మరించుకుంటారు. 
బహుభాషా వేత్త: తీవ్రమైన పని ఒత్తిడిలో ఉన్న రామకృష్ణారావు గారు సంస్కృతిక చారిత్రక తెలుగు రాసిన కావ్యాలను అధ్యయనం చేసేవారు. 

లేదా
ఆ) నేనెరిగిన బూర్గుల పాఠం ఆధారంగా "గొప్పవారి సాంగత్యం వల్ల కలిగే స్ఫూర్తి గొప్పగా ఉంటుంది" అనే అంశం గురించి సమర్థిస్తూ రాయండి.
జ. గొప్పవారు సాంగత్యం వల్ల గొప్ప స్ఫూర్తి కలుగుతుంది.
గొప్ప వారితో ఉంటే గొప్ప లక్షణాలే అలవాడతాయి. పూల విలువ దారానికి లేదు.  పూలు తలకెక్కుతాయి పూలతో పాటు దారం తలకెక్కుతుంది. ఆ విధంగానే బూర్గుల రామకృష్ణారావు గారి ఉత్తమ వ్యక్తిత్వం వలన పీవీ నరసింహారావు గారు తన జీవితాన్ని సరిపడా తర్ఫీదు పొందారు. భారతదేశాన్ని ప్రగతి మార్గంలో పయనింపజేశారు. 

3. సృజనాత్మకంగా ప్రశంసాత్మకంగా రాయండి.
అ)పాఠంలోని పదజాలం విశిష్ట లక్షణాల ఆధారంగా ఒక కవిత రాయండి.
జ. పొట్టితనం ముందు పొడగరితనం అల్పమవుతుంది
విశిష్ట లక్షణాలు విశ్వమంతా వ్యాపిస్తాయి
ధర్మాగ్రం విరాట్ రూపం అయితే  
అధర్మం వాడిపోతుంది
న్యాయాన్ని వాదించేవాడు అన్యాయాన్ని వేధిస్తూనే ఉంటాడు
ప్రోత్సాహం ఒక సమ్మోహనం 
టన్నుల కొద్ది ఆత్మవిశ్వాసం నింపి భవిష్యత్తుకు బాటలేస్తుంది మనిషిలోని సౌజన్యత మహోన్నతునిగా తీర్చుతుంది అధ్యయనం బహుభాషా వేత్తగా మార్చి 
పాండిత్యం పరిణవిల్ల చేస్తుంది అపకారికి ఉపకారి అసలైన వ్యక్తిత్వంగా 
ఆరాధనల అందుకుంటుంది
అజరామరం అవుతుంది

ఆ)ఈ పాఠం ఓ అభినందన పత్రము గా ఉంది కాదు దీని ఆధారంగా మీకు నచ్చిన గొప్ప వ్యక్తుల గురించి అభినందన వ్యాసం రాయండి.
జ. నాకు నచ్చిన గొప్ప వ్యక్తి అంబేద్కర్
కడుగు జాతులు కటిక చీకట్లో ఉన్నప్పుడు ఉదయించే సూర్యుడు చీకట్లోంచి పుట్టిన జ్ఞానమే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్.
పుడుతూనే వెల్తురు వెలుగులు వెదజల్లినట్లు ప్రతిభతో పాఠశాలను గ్రామాన్ని ఉపాధ్యాయులను పరవశింపజేశారు. పుస్తకాలను చదివినట్టే సమాజాన్ని మనుషులను అంతరాలను అంచనా వేశారు. ఈ సమాజాన్ని మార్చాలంటే తానే చదువుకోవాలని సిద్ధపడ్డాడు. ఏ వైపు తిరిగిన ఆ వైపు కుల వివక్ష ఎదురయింది. చుట్టూ ఆవరించి ఉన్న పేదరికంలోంచి లేని ఆత్మగౌరవాన్ని కలగన్నాడు. రోజుకొక పూట భుజిస్తూ రాత్రింబవళ్లు కంట్లో వత్తులు పెట్టుకొని చదివా డు. ప్రయోజకుడు అయ్యాడు. మానవులంతా సమానమని ఎలుగెత్తి చాటాడు. జ్ఞానముొక్కరి సొత్తు కాదని, అందరూ గొప్పవారేనని ఆలోచింపజేశారు.  మనిషి ఒక ఓటు ఓటుకు ఒక విలువ అని సమానత్వాన్ని ప్రతిపాదించాడు. ఆమోదింప చేశాడు. హుహనా వాదన పటిమకు మేదస్సుతో అనేక మందిని మెప్పించాడు. నాయకులను ఒప్పించాడు. అనుకున్నది సాధించాడు బలహీనుల బలమైన గొంతుకయ్యాడు. హక్కులు కల్పించాడు బాధ్యతలను కూడా నేర్పాడు రాజ్యాంగాన్ని అందించి సువిశాల భారతదేశానికి మార్గదర్శనం చేశాడు.  (


III. భాషాంశాలు :
పదజాలం:

1.  కింద గీత గీసిన పదాలకు అర్థాలను రాయండి.
అ) ముప్పిరి = జ్ఞాపకాలు అల్లుకోవడం
ఆ) వీసమెత్తు = ఒక చిన్న కొలత
ఇ) కడగొట్టు =చిట్టచివరి
ఈ) ప్రాభవం=గొప్పతనం
ఉ) ప్రాతస్మరణీయుడు = ఉదయకాలం లేవగానే గుర్తు చేసుకునే లక్షణం కలవాడు
ఊ) హితైషి = మేలుకోరేవాడు

2.  కింది జాతీయాలను మీ సొంత వాక్యాలలో ప్రయోగించండి.
అ)శ్రీరామరక్ష - నాకు మా తల్లిదండ్రుల ఆశీర్వాదం =శ్రీరామరక్ష
ఆ)గీటు రాయి - నా జీవితంలో ఓ ప్రధానోపాధ్యాయులు మెచ్చడం మర్చిపోలేని గీటురాయి
ఇ)రూపుమాపడం నాలోని దురలవాట్లను రూపుమాపుకుంటాను.
ఈ) కారాలు మిరియాలు నూరడం నేను అనవసరంగా ఇతరుల మీదికి కారాలు మిర్యాలు నూరను.
ఉ) స్వస్తి వాచకం ఈరోజు నుండి నాకు ఇష్టమైన చాయ్ కి క స్వస్తి వాచకం పలుకుతున్నాను.

3. కింది వాక్యాలలో పర్యాయపదాలు గుర్తించండి.
అ)సాలు, వర్షం, సంవత్సరం
ఆ) భూమి, ధరిత్రి, అవని
ఇ) దక్షత, సామర్థ్యం

4. ప్రకృతి వికృతులు
అ)దవ్వు - దూరం
ఆ)గారవం గౌరవం
ఇ)పగ్గె/పగ్గియ = పగ
ఈ)దోసం- దోషం
ఉ)రాతిరి - రాత్రి 
ఊ)బాస- భాష

5. వృత్తులు - ప్రత్యేక లక్షణాలు
1. ఉపాధ్యాయ వృత్తి - నిరంతర అధ్యయనము బోధన
2. వైద్య వృత్తి - నిరంతరము చికిత్స అధ్యయనం
3. కులవృత్తులు - నైపుణ్యంగా చేయడం

వ్యాకరణాంశాలు:
కింది వాక్యాల్లోని గీత గీసిన పదాలను విడదీసి సంధులను గుర్తించండి.
విమానాశ్రయం - విమాన  ఆశ్రయం సవర్ణదీర్ఘ సంధి
ఆ) జ్ఞాపకముడడము - జ్ఞాపకము+ ఉండడము - ఉత్వ సంధి
ఇ) శరీరాకృతి = శరీర + ఆకృతి సవర్ణదర్ఘ సంధి
ఈ) మహోన్నత= మహా + ఉన్నత -గుణ సంధి
ఉ) జీవితాన్నంత = జీవితాన్ని + అంతా - ఇకార సంధి 
ఊ) చెప్పినప్పటికీ=  చెప్పిన + అప్పటికి అత్వ సంధి
ఋ) ఒక్కొక్క= ఒక్క+ఒక్క - ఆమ్రేడిత సంధి.

2. కింది సమాస పదాల్లోని తత్పురుష భేదాలను గుర్తించి, విగ్రహ వాక్యాలు రాయండి. సమాస నిర్ణయం చేయండి.

ఉదాహరణ సత్యదూరము సత్యమునకు దూరము - షష్టి తత్పురుష సమాసం
అ)అమెరికా రాయబారి - అమెరికా యొక్క రాయబారి - షష్టితత్పూర్ష సమాసం
ఆ) వాదనాపటిమ- వాదన యందు పటిమ - సప్తమి తత్పురుష సమాసం 
ఇ) అసాధ్యము - సాధ్యము కానిది - నైన్ తత్పురుష సమాసం.
ఉ) నెలతాల్పు - నెలను ధరించిన వాడు- ద్వితీయ తత్పురుష సమాసం 
ఊ)గురుదక్షిణ - గురువుకు దక్షిణ- తృతీయ తత్పురుష సమాసం 
ఋ) వయోవృద్ధుడు - వయసు చేత వృద్ధుడు - తృతీయ తత్పురుష సమాసం
ౠ) రెండు రాష్ట్రాలు -  రెండు సంఖ్యల గల రాష్ట్రాలు - ద్విగు సమాసం
ఎ) శక్తిసామర్థ్యాలు- శక్తియును, సామర్థ్యమును - ద్వంద సమాసం 
ఏ) అమూల్య సమయం - అమూల్యమైన సమయం - విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం.
ఐ) పూర్ణ పురుషులు - పూర్ణులైన  పురుషులు విశేషణ పూర్వ గల కర్మధారయ సమాసం
ఒ)ప్రాచీనమైన కావ్యాలు - ప్రాచీనమైన కావ్యాలు - విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం.
ఓ)పెద్ద కుటుంబం - పెద్దదైన కుటుంబం -విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం.

3. ఇది సామాన్య వాక్యాలను సంశిష్ట వాక్యాలుగా మార్చండి.
అ)పూనాలోని పెరుగుసన్ కాలేజీలో చేరాడు.
 పర్షియన్ భాషను చదివాడు.
 ఆ కళాశాల నుంచి పట్టభద్రుడయ్యాడు.
జ. పూనాలోని పెరుగు సన్ కాలేజీలో చేరి, పర్షియన్ భాషను చదివి, ఆ కళాశాల నుంచి పట్టభద్రుడయ్యాడు.

ఆ)బూర్గుల హైదరాబాదు రాష్ట్రంలో దున్నేవానికి భూమి హక్కునిచ్చే కౌలుదారి చట్టాన్ని తయారు చేశాడు. 
బూర్గుల సామ్యవాద వ్యవస్థకు పునాది వేశాడు.
బూర్గుల అజరామర కీర్తిని పొందాడు.
జ. బూర్గుల హైదరాబాదు రాష్ట్రంలో దున్నేవానికి భూమి హక్కునిచ్చే కౌలుదారి చట్టాన్ని తయారుచేసి, సామ్యవాద వ్యవస్థకు పునాదివేసి, అజరామర కీర్తిని పొందాడు.

నమస్కారం



6, ఆగస్టు 2023, ఆదివారం

X 4. కొత్తబాట - Dr. Siddenky

డా. పాకాల యశోద్ధా రెడ్డి 

 పాఠ్యభాగ వివరాలు: ఈ పాఠ్యభాగం డాక్టర్ పాకాల యశోద రెడ్డి గారు రచించిన "యశోద రెడ్డి ఉత్తమ కథలు" అనే గ్రంథంలోనిది. ఈ పాఠం కథానిక ప్రక్రియకు చెందినది. రెండు తరాలకు సంబంధించిన వివరాలు, తరాల మధ్య కాలానికి తగ్గట్టుగా వచ్చిన మార్పులు మొదలైన విషయాలను డాక్టర్ పి. యశోదా రెడ్డి గారు ఈ 'కొత్త బాట' కథలో తెలియజేశారు.


రచయిత్రి పరిచయం
* కొత్తబాట పాఠ్యాంశ రచయిత్రి - పాకాల యశోదా రెడ్డి. 
* మహబూబ్‌నగర్ జిల్లా బిజినేపల్లి గ్రామంలో 
జననం: ఆగస్టు 8, 1929లో జన్మించారు.
 * తెలుగులో హరివంశాలు అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పొందారు. 
* తెలుగు ప్రొఫెసర్‌గా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పనిచేశారు.
రేడియో కార్యక్రమం: మహాలక్ష్మి ముచ్చట్లు
రచనలు: ఆంధ్ర సాహిత్య వికాసం 
పారిజాతాపహరణ పర్యాలోచనము 
ఎర్ర ప్రగడ 
కథాచరిత్ర వంటి పరిశోధన గ్రంథాలు.
 మా ఊరి ముచ్చట్లు 
ఎచ్చమ్మ కథలు
కథా చరిత్ర 
ధర్మశాల కథా సంపుటాలు.




కొత్తబాట పరీక్ష


కింది లింక్ నొక్కి వినండి :



ప్రవేశిక

ఈ 'కొత్తబాట' గురించి డా|| పి.యశోదారెడ్డి మాట్లాడుతూ “ఈ కథ తెలంగాణ మాండలికంలో వ్రాయబడింది. అక్యాతమ్ముళ్ళిద్దరూ బస్సుదిగి అక్కడి నుండి ఎద్దుల బండిలో వాళ్ళ ఊరి వరకు ప్రయాణం చేసిన రెండు గంటల్లో రెండు తరాలకు జరిగిన ఘర్షణ, సాధించిన విజయాలు సప్రమాణంగా ప్రదర్శింపబడ్డాయి. ఈ సంభాషణలో ఎన్నో సాంఘిక దురాచారాలు తదమబడ్డాయి. భాష తెలంగాణ మాండలికాన్ని జీర్ణించుకొని, ఆ జాతీయాన్ని, జీవనరీతిని, నుడికారాన్ని ప్రదర్శిస్తుం"దని చెప్పింది. ఆ కొత్తబాటలో మనం నడక మొదలు పెడుదాం.

I

పొంగంగ అది ఎన్ని కయ్యలు గొట్టిందో? ఎన్ని గండ్లు వడ్లదో? కూసుంటే నడుములిరె, నడిస్తే కాళ్ళు బెణికెనంట వొ "నేను రానా తమ్ముడు! అది తరాల నాటి బాట. ఎప్పుడేసిందో ఏం కతనో? ఈ వార్తలకూ వొరదలక నొంపులల్ల వడి ఆ బాట పొంటి వడినద్వ నాశాతగాదు తండ్రి." అంట ఎంత జెప్పినగని వాని సెవ్వు మీద పేను వాసి నా మాట యింటెనా? వాని పట్టు ఇడిస్తెనా?

జారుడా 536 గురిగి గొర్రె ఘుట్టు అదు

తుమ్మబంక అంటుకున్నట్లు ఎంటవడి "కాదక్కా! మనూరికో కొత్త బాటేసినం, నీవు చూసి మెచ్చిందాక గాడు" ఒకటే పట్టు, మొండిపట్టు, జనిగెపట్టు, ఇదెక్కడి సొద? వీడెక్కడి నక్షత్రకుడురా? నాయినా! అంట పయనమై బండి బయలుదేర్శ, తోవపొంటి ఊకున్నాడా? లేదు, ఉల్లాసం బట్టలేక ఒకటే చెప్పుక పోతుండడు. వసదాగిన పిట్టోలె.

"అక్కా! ఇది ఈగ కాలం కాదె! పూలకాలం, ఎన్నెల మాసం, తియ్యటి తీపుల దినం, ఏమనుకున్నవో? ఎక్కడ జ కమ్మటి వాసన, ఇన సొంపైన రొద, పండాకు రాలంగ అడవి అంత పసరాకు పోషాకులు తొడ్డి సోకులు పోతుండడి. మోదుగు వనం జూడు! పెయి అంతపుల్కరిచ్చినట్లు మొగ్గదొడిగి, ఎర్రగపూసి, కొత్తబాటకు మంగళార్తులు పడ్తున్న ముత్తైదరి సాళ్ళు సాళ్ళుగ నిలవడ్డవి. ఆ పొంటె ఉన్న మద్దుల జరవార జూడు! ఎంత ఎత్తుకు ఎదిగినవో? కొటారి కొమ్మ తేనెతెట్టెలన్నీ పిక్కటిల్లంగ తేనెలు ఎట్ల నింపుకొన్నవో? ఏందే? అక్కా! ఉల్కవు? పల్కవు?

ఆపు బాట

లలాలా నిదా

అదో! అక్కడి దిక్కు జెరనా చెవువారిచ్చి ఇను, ఎడవాసిన ఎదలను ఏకంజేయ పేరు పెట్టి పిలుస్తున్నట్లు ఆ కోయిలకూతలు అక్కా! అదో! ఆ కండ్లపడేదే చింతలతోపు, చింతలింకా చిగురుకోలేదు. గున్నమావిళ్ళు జూడు! పొన్నకాయలసోట ఆడపిల్లలు సింగారించుకున్నట్లు కానొస్తుండవి. యాపలు ఇప్పుడిపుడె మొగ్గలు ఇచ్చుకుంటుండవి.

అదో! సూడు! మాటలల్లనే మనూరి పొలిమేర రానెవచ్చె. ఎదురుకోళ్ళ నాడు మొగపెండ్లి సుట్టాలకు మర్యాదలుకేర మంపు గట్టినట్లు గుబుర్గ వెరిగిన ఈ వాయిలు పొదలు జూడు! అక్కా! బాట పక్కల పొంటి ముసలి మాన్లన్ని గూలం

దిగి వస్తున్న కొత్త చెట్లను జూడమ్మా!

ఈ సూపుతోటే కొంచెం అటుదిక్కు నీ కన్నువారజేయి, ఆ చెర్వుజూడు! ఇప్పుడు నిండుగ నీల సముద్రమోలె నీ -స్తుండది. ఈ చెర్వుకు ఆయకట్ట కట్టిన పుణ్యాన అందరికీ ఆదెరువైంది".
అవును నిజంగనె! ఏకసిస్తుగ పాదరసం చొలువోసినట్లు ఈ చెర్వు ఎన్నెలకు మెరుస్తుందది, గని, ఇల్లలుకంగనె పండుగైతాది? ఈ పాయకుంటల కెళ్ళి పెద్ద కొర్రమాన్లు చెంగు చెంగున దుంకుకుంట ఎగిరి సన్న దాపలను గుట్కు గుట్కు మనుకుంట సుడిగుండాలను లేషనే ఉండవి. గవిన్ల గుడ్డెలుగులు చెదల పుట్టలను గోళ్ళగీకి పుట్టకు పుట్ట పెరుగుల గట్టెలను మెక్కింది జాలక, చెట్ల శికెలకు ఎగవారి జెంటి తేనెలు ఆపూటం జుర్రుకొన్నది సాలక, ఆ పూట కల్లుకు గట్టిన ఈతలొట్టి కోసం ఈక్కి ఆడ కాళ్ళుగాలిన పిల్లలులోలె అనువోస్లనే ఉండవి. అని, మనసులు అనుకుంట, ఆ గుడెల్టులను బ్రూసే కంటిని అట్ల మీదిమీదికి సారిచ్చేట్యాళ్ళకు గట్టుమీద జారుడు బండల ఎన్న అల్లుదుంకె కాడ, చిరగండు కాదు, అడిదే! అపుడే ఈనిందే ఏమో? కండ్లు గానక పొట్లాపతికి గాండ్రుగాండ్రు మనుకుంట తన పొట్టన పుట్టిన తన కూనల్నే నముల్కు మింగ జూస్తుండది. ఆ పక్కునే పోతును అమాతం మందు గుడిగెలు మింగినట్లు మింగిన తాసుపాము కెర చెట్టుకు తీగోలి సుట్టుకున్నది. తిన్నది అరుగని పూడువాము గురిగింజలోలె గుడ్లు మిట్కుమిట్కున మిట్కరిచ్చుకుంట సుట్టకుదురోలె సుట్టుకొని 'అతీ గతీ' ఎరుగకుంద వద్దది. ఆడాడ నక్కలు పొంచుకొని అదునుగాస్తున్న పాలిపెర గండ్లవడనె ఉండది.

ఆలోచించండి-చెప్పండి.

* "సెవ్వు మీద పేను వార్తెనా?' అంటే మీకేమి అర్థమైంది?
* మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా నడుచుకుంటూ పోతారా? పోయేటప్పుడు ఏమేం గమనిస్తారో చెప్పండి?
* మీ ఊరి పొలిమేరల్లో ప్రకృతి ఎట్లా ఉంటుందో చెప్పండి?

మరి! మా తిక్క సన్నాసి కొత్త బాటేసినం, కొత్తదారి, కొత్తమలుపు అంట పదం బాడండేంది? ఇదంత నాకు దెల్సిన బాటనె! ఎన్నేండ్ల నుంచో తొక్కుడు వడ్డ బాట! ఇందుట్ల కొత్త యాడుండది? అంట అనుకున్నగని, నా మనసు నాకు బుద్ధి చెప్పుతున్నట్లనిపిచ్చింది.

అయిన గాకున్నగని మరీ, ఇంత కరుగనితనం, ఉండగూడదు. పురాగ ఎలుతురుకు దడిగట్టినట్లు ఒక్క పచ్చరం బర్వగూడదు. యాదాన్ని మెచ్చకుండ మరి అంటె మరి, రొమ్మున ఎముకలు లెక్కబెడ్తానంటె ఎట్ల? రౌండు కండ్లు దెర్సి నిదానంగ లోతులు వాటిచ్చి సూడాలె, యాది కనుమరుగైన, మరుగున పడి తప్పినట్లే గద! నాకు ఎన్నటి నుండో ఎరుకున్న బాటైతే మట్కు బాగైందా? లేదా? బాట నడిసె కాలుకు రొంపి అంటుకోకుంటె కూసున్న కాడికి వచ్చి కాళ్ళకు రొచ్చు,

39
తాక్తదా? తగుల్తదా? ఎంత చెడ్డగని, ఎంత బాగ బతికిన గని ఇంకోని ఆసరతోటి, మంది బుజాలెక్కి నడువకుండ పయిన సాగితె సాలు మనకు కావలసింది, మనం జూడవలసిందల్ల, ఒగడు తన కాళ్ళమీద తాను నిలవడడా? లేదా? అనేది

ఊర చెరువు దాటినం, మత్తడి దాటినం, మోతెబరి రైతుల పసుల కొట్టాలు గాన్రావట్టినవి, ఈ కొట్టాల్ల గడ్డివాములని ఇగి చెదరకుండ కుదురుగ మట్టసంగ ఉండవి. ఇంటిమొకం బట్టిన ఎడ్లు లగేస్తుండవి. మా ఊరి ఎల్లమ్మ గుడి వొచ్చింది. ఆమె పసుపు బండార్లతోటి చెక్కు చెదరకుండ ఉండది. పూజారి కిష్టమాచార్ల ఇల్లు దాటినం,

ఆ కండ్ల నదేదే! గోపాల్రాయని భవంతి బంగుల, ఈడ్కి బండి జేరింది అంటే సూపుకు గోడ గట్టినట్లే, ఇంద్యా మరిసింది యాదికి వచ్చినట్లు మురిపాల వస్తువును గవుసెన్ల దాసినట్లు, ఎవరికంట్ల పడకుండ ఈ త్యాప గూడ వు తమ్మయ్య నొగల మీదికెళ్ళి చెంగున దుంకి కద్రానికి ఎర్రపర్దాలు సింగారిస్తడనుకొని నా పాపెట్ల సెదిరిన ఎంటికలు సక్కర్ల దిద్దుకొని కొంగు నిండుగ సవరిచ్చుకున్న, అసొంటి దాపరికపు పనులు యావి జరుగలేదు. అంతకొస్తె అడ పర్దాలు ఉన్న ఉనికి గూడ కండ్లపడలేదు. నా ప్రాణానికి కొత్తగ ఊపిరి పీల్చుకున్నట్లనిపిచ్చింది..

ఆలోచించండి- చెప్పంది
"తన కాళ్ళ మీద తను నిలబడటం" అంటే ఏమిటి? చర్చించండి.

పెండ్లి సూపుల నాడు పిలగాణోళ్ళు పెండ్లి పిల్లను గోటికొన నుండి శికెళ్ళ జూసినట్లు నేను మా ఊరిని జూడవట్టిన నా కంటి ఎదురుంగనె రచ్చకట్ట. కందెరుగని మణుసులోలె మా రచ్చకట్ట రాగి చెట్టు రౌండు ఒకదాన్నిడ్సి ఇంగో ఉండదన్నట్లు ఒకదానికోటి తోడంట దీటుగ నిలవడ్డవి. అదేం సిత్రమొ? గని ఈసారి సూడు సూడు మంట మా రచ్చకట్ట కింద అన్ని చెప్పుప కుప్పలైనవి. ఎప్పటి తీర్గ ముచ్చెలకన్న కిందై వోరగ గూసుండి మణుసులు మట్కు కాన్రాలేదు. ఇదేం ముంచుకొచ్చె మా ఊరికి? ఇది కలనా? మాయనా? అంట నిదానిచ్చి చూసెట్యాళ్ళకు వాళ్ళల్ల ఒగరో ఇద్దరో రచ్చమీద కూసున్నట్లు గానొచ్చిన్రు. నా కండ్లను నాకే నమ్మబుద్ధిగాలేదు. రొండు జేతుల బాగ నల్పుకొని మళ్ళ జూసిన గూడ అదే నిలుకడి నిలవడి నిజం అని తోసింది. ఓ రచ్చబండ! ఓ రాగిచెట్టు! ఎన్నాళ్ళ కెన్నాళ్ళకు ఏరుతార్లు ఎచ్చు తచ్చులు మాని తోటి మనిషికి సమానంగ తావును, నీడను పంచి ఇచ్చే యోగం, బుద్ధి మీకు దక్కింది! అని మెచ్చుకుంట సంబురాన ముందుకు సాగిన,

* నాటి నేటి ఆచార వ్యవహారాల్లో తేడాలు ఉన్నాయా? ఏమిటని?

మీ ఊర్లో రచ్చబండ/గ్రామ సచివాలయం ఉన్నదా? అక్కడ ఎవరెవరు ఏయే విషయాల గురించి మాట్లాడుతారు?

బండి సాగిపోతనే ఉండది. ఇంగ, గోపాల్రాయని బంగ్ల ఎంటనే అయిన బామ్మర్ది రంగరాయని రెండంతస్తుల గచ్చు బవంతి, ఊరంతటికి కులపెద్దనంట నెత్తి ఎత్తుకోని నిలవడ్డట్లు గానొచ్చింది. మరి? ఎన్నడు లేంది ఆ భవంతి బంకులేమొ దిగూళ్ళల్ల దీపాలు ఎలుగుత లేవు, నేను జూస్తున్నది పొద్దు మాపు పూటనేగని, ప్రమిదలన్ని చమురు నిండుకోంగ దుమ్ము కొట్లాడుతుండవి. ఇల్లంత పాడు గొట్లాడినట్లు, కళదప్పి 'దో' అంటుందది. ఎందుకో? అంట అనుమాన పడ్తుండంగనే మావోడు పెద్దపులిని ప్రాణంతోటి పగ్గాన ఏసిన కుశాలు తోటి.

"అక్కా! ఇన్నాళ్ళకు మనూరికి వట్టిన 'మిత్తి దొర్సాని' అదే పెద్ద మారెమ్మ పేరు లేకుండ ఊడ్సుక పోయింది. మన ఊరోళ్ళంత ఇప్పుడిప్పుడె తెలివి దెల్సి మిత్తి పూజ మీదనె మిద్దెలు మోపి శ్రీమంతుడైన రంగరాయని మీద మళ్ళెవడి అయినకె పంగనామం బెట్టిన్రు. దాంతోటి అయిన దిమ్మదిరిగి చెప్పుకుంటే సిగ్గువాయె, మూసుకుంటే ప్రాణం బాయెనంట 40

ఇర్చుటాన వడి కుడ్తాల పడ్డ ఎలుతీర్థ తండ్లాడిన గని ఉపాయం దోసక పెండ్లాం పిల్లల దీస్కొని సుట్టాల మార్గం అంట రంగాపురం జేరిండు."

ఈ రంగరాయుడు చిన్న సన్నోడుగాడే! ఈ పసికారు రొండెర్గక నివురు గమ్మిన కొరివి తోటి నెత్తి గోక్కుంట లేరు గదా! ఏమో? మనుసు ఉట్టి ఊగినట్లు ఊగింది.

బండి మా పాలొండ్ల ఇండ్లకాడికెళ్ళి సాగుతుండది. ఇప్పుడు మా బావ పోలీసుపటేలు పాపిరెడ్డికి సాగువాటు పరిగలేదంట సూచాయగ ఇన్న. మరి అయినం పచ్చపూస గనునా? రంగరాయనికి కుడి ఎడు అంతె! పేరుకు సవశేరు పొత్తిళ్ళనాడే అబ్బుకొచ్చినవి. అవును గని, అనుమంతరాయుడు? అయిని నోట్ల, నాలికె సింగోటం? వీళ్ళు మరి? అనుకుంటున్న 'ఆది': ఊళ్ళ ఒకణ్ణి ఎక్క్సిచ్చి ఒగణ్ణి దించి ఇద్దర్ని ఎదుగనీయకుండ ఎప్పటి శిగలు అప్పుడె గత్తరిచ్చె విద్దెలు ఈ అయ్యలకు మాటను పసిగట్టినట్లు నా తమ్ముడు.

"అక్కా! ఆ కుటిలవాజి అనుమంతరాయుడు, కడ్పుల ఇసం నాల్కెన తీపి తోటి నగుకుంట గొర్రె దాటుమంది గొంతులకు ఉరులు దగిలిస్తుంటే నకుతంతుల సింగోటం ఉన్నది లేంది దపురంల ఎక్కిస్తుండె. ఇంగ ఇప్పుడు కండ్లు దర్చిన జనం వాళ్ళ కన్న రొండాకులు ఎక్కువ జదివినట్లు ఆ తంత్రాలన్ని పురుట్లనే పుట్కుమనిపిస్తుండరు. లేకుంటె ఎందట? ఎన్నాళ్ళంట వీళ్ళ చెప్పుకింద తేళ్ళ తీర్గ అణిగి మణిగి ఉంటరు? సన్నకారు మంది అంత ఇప్పుడు అయిందానికి కానిదానికి కయ్యాలకు దిగి కుస్తిపట్లు పట్టి నెత్తురు కండ్ల జూస్కోని పంచాయితిల పడి ఆ పంచాయితిదార్లకు అప్పు సప్పు జేసి దండుగలు గట్టుకం లేదు. ఏ వాడన పంచాయితి ఆ వాడనె తీర్పులు జరుగుతుండవి. అక్కా! ఇన్నాళ్ళ తీరుగ అద్దమ్మ రాత్రిర్లు దొంగతనాలు లేవు, సేండ్ల దోపిండ్లు లేవు, పరిక్కంపలు లేవు, లాగుల కొండలు లేవు, ముంతపొగలు లేవు, ఈపు ముద్దెర్లు లేవు, బండ బర్వులు లేవు, అడుక్కు తిండ్లు లేవు".

IV

* 'కడ్పుల ఇసం నాల్కెన తీపి' అంటే మీరేం అర్థం చేసుకున్నారు?
* పంచాయితీలు చెప్పడం అంటే ఏమిటి? పంచాయితీలను ఎట్లా జరుపుతారు?
"కళదప్పిన ఇల్లు" ఎట్లా ఉంటుంది?

బండి మా ఇంటిదిక్కు మూలమల్పు దిరిగింది. ఆడ మా పెదమామ ఇంటిపోంటి ఉన్న గరిసెల ఇండ్లల్ల దీపాలు ఎలిగినట్లు నలుగురు మణుసులు మెసిల్నట్లు జళకళ గలగల సప్పుడు ఇనిపిచ్చింది. ఇదేందిరా? అన్నట్లు మా తమ్ముణి దిక్కుజూసిన, ఎంటనే మా హాజిర్ జవాబు ఎక్కళ్ళేని ఉల్లాసం తోటి బుజాన ఏసుకున్న దస్తు రుమాలు జాడిచ్చి దులుపుకుంట "అక్కా! ఇది మన మ్యాన పల్లకీ లుండె పాత పొత్తులిల్లు. జనం మెదులక బండ జింకలు జేరి అబ్బో అన్నట్లుంటుండె, అది ఇప్పుడు మనూరికి రాత్రిబడి ఐంది. మేమంత గలిసి ఈ ఊళ్ళ ఎవరి పెండ్లిళ్ళైనగాని, వాళ్ళెంత మోతెబరి కర్ణప్పటేండ్లైన, వాండ్ల పెండ్లిండ్లకు మణుసులు మోసే మ్యానా పల్లకీలు రాగూడదు. సంబురానికి మెరిమెణ జేసి పగటి దీపాలెలిగిచ్చి ఊరంత మెరిచ్చిన మెరియ్యని ఊరేగింపులు తీసె మగ్దూరు లేదు అంట కట్టడి జేసినం. ఇంగ మనపెత్తాత కండ్లు నిప్పుకలు సెరుగంగ, చేసేది లేక తామసం ఆపుకొని పణమీది చెముటలు చిన్నపంచె తోటి తుడ్సుకుంట బుస్సు బుస్సు మంటుండంగ మేమంత ఈ పాత సవారీలను బద్దురంగ గుమ్ములింట్ల అలంకారాలోలె యాళ్ళాడగట్టినం".

బండి మా ఇంటి కమాను ముంగల ఆగింది. గజ్జెల సప్పుడు ఇని ఆ సుట్టుపక్కల పిల్లలంత ఉరుక్కుంటొచ్చి సుట్టు జుట్టుకున్నరు. ఈ పిల్లలు ఇన్నాళ్ళ తీర్గ ఈసురుమంట లేరు, ఇప్పుడు సీమిడి ముక్కులు లేవు, సింపులు లేవు, సీరపేండ్లు లేవు, వోరగాళ్ళు లేవు, ఊడ్సుకండ్లు లేవు, పిల్లలందరు దోసపండ్లోలె, ఉంకు చెండ్లోలె కళకళ లాడ్తుండరు.
41
బండిదిగి బంకులు దాటి ఇంట్లకు నడ్సిన. అలువాటు సొప్పున బాయికాడి గచ్చుల్లకు నడ్సిన. ఆడ ఎప్పటి తీర్గ కండ్లు బయట బంకుల్లకు సారిచ్చి, ఓ చేత సెంబు, ఓ చేయి నడుమున వెట్టి వొయ్యారంగ వోనమాలి నిలవడి లేదు. వొనమాలమ్మ ఇప్పుడు మా పెద్దత్త పక్కన దేవుణింటి ముందల గూసుండి వొత్తులు పేనుతుండది. ఇది కలనా? నిజమా? అంట డింగై అక్కడికక్కడ జూస్తుండంగనే 'అక్కా'' అంట విల్సుకుంటొచ్చి కుసుమ నాకు నీల్ల చెంబు అందిచ్చింది. ఒక్కసారి అమాంతం నా చేతులున్న చెంబు జారినంత పనైంది, గని అనుకోకుండ నా రొండు చేతులు మా పాలేరు రాజని బిడ్డ కుసుమ (దానికి ఆ పేరు పెట్టింది నేనే) దిక్కు సాగినవి. అది నా ఎదకొచ్చి అనింది. అన్ని కండ్లు ఒక దిక్కే సేడవట్టినవి. ఇవ్వరుకదులలేదు. ఇవ్వరినోట మాట పెకులలేదు. మా బాయి దగ్గరున్న తరాలనాటి కారుమల్లె మొద్దు అనుకోకుండ మళ్ళా ఈనాటికి సిగురేసి సిగ్గారి తీర్గ వన్నెలు వడ్తుండది. ఇంతట్లకే మా తమ్ముడొచ్చి ముసి ముసి నగుకుంట బాయికాడి కమాను స్తంభానికి అని నిలవడ్డడు. ఇల్లంత ఎన్నెలలు కురిసినట్లనిపిచ్చింది.

అవును ఇది కొత్త బాటనే! ఇంతకంటె కొత్తబాట, మంచిబాట ఇంగెట్లుంటది? యాడుంటది? బాట ఏసెటోళ్ళు నడుస్తుండాలె గని, పాపం ఆ బాట వొల్లనంటదా? వొదుగనంటదా? నల్గురు పల్కిందె మాట, నల్గురు మెచ్చిందె నడుత, నల్గురు నడిసిందె బాట.

ఆలోచించండి-చెప్పండి
* రాత్రిబడి అంటే ఏమిటి? రాత్రి బళ్ళను ఎందుకు నడుపుతారు?
* 'నల్గురు నడిసిందె బాట'లోని అంతరార్థం ఏమిటి? చర్చించండి.
* మీ పరిసర ప్రాంతాల్లో పిల్లల రూపురేఖలు, వేషధారణ ఎట్లా ఉంటాయి?
ఇవి చేయండి

అవగాహన - ప్రతిస్పందన

1. ఈ కథకు 'కొత్తబాట' అనే పేరు తగినదని భావిస్తున్నారా? ఎందుకు? చర్చించండి..
భావిస్తున్నాను. ఎందుకంటే పల్లెల్లోనూ మనుషుల మధ్య గొప్ప మార్పు తెచ్చిన కొత్తదనాన్ని ఆవిష్కరించింది.

2. పాఠం చదువండి. కింది పేరాల ఆధారంగా పట్టిక నింపింది.

పేరా సంఖ్య
2. వసతాగిన పిట్ట లాంటి తమ్ముడు / మాటకారి తమ్ముడు

7. ప్రకృతి / వనం / అడవి

13. ఎచ్చుతచ్చులు లేని తత్వం

18.

పేరా శీర్షిక

పేరాలోని ముఖ్యమైన విషయం

3. కింది పేరా చదువండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.

పల్లెసీమకు పట్టుకొమ్మలాగ మారుమూల గిరిజన గ్రామమైన కొండాపూర్ ఆదర్శంగా నిలిచింది. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలానికి 18 కిలోమీటర్ల దూరాన ఉన్న కొండాపూర్ చుట్టూ దట్టమైన అడవిమధ్య నిలిచిన అటవీ గ్రామం. ఇక్కడ 1945లో ప్రత్యేక గ్రామపంచాయితీ ఏర్పడింది. 2007 డిసెంబర్ 5న సర్పంచ్ వాసం కన్నయ్య అధ్యక్షతన జరిగిన గ్రామసభలో గ్రామ సమస్యల పరిష్కారానికి గ్రామాభివృద్ధికి 8 కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు లోడిసంస్థ సహకారంతో, గ్రామస్థుల శ్రమదానంతో మేడివాగుపై పక్కారోడ్డు నిర్మించాయి. అధికారుల సహకారంతో మద్యపాన నిషేధం అమలులో ఉన్నది. వందశాతం అక్షరాస్యత సాధించారు. గ్రామ జనాభాకు సరిపడా మినరల్ ప్లాంట్ ఏర్పాటు చేసుకున్నారు. గ్రామంలో బాలకార్మికులు లేకుండా చేశారు. పిల్లలందరిని బళ్ళలో చేర్చారు. గిరిజనులు సాధించిన ఈ అభివృద్ధిని చూసి అంతర్జాతీయ గూగుల్ ఆర్గ్ సంస్థ ఈ గ్రామాన్ని ఉత్తమగ్రామ పురస్కార్కు ఎంపిక చేసింది.

అ) కొండాపూర్ ఎక్కడ ఉన్నది?
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలానికి 18 కిలోమీటర్ల దూరం లోఉన్నది.

) గ్రామపంచాయితీ ఎప్పుడు ఏర్పడింది?
జవాబు 1945లో ప్రత్యేక గ్రామపంచాయతీ ఏర్పడింది

ఇ) గ్రామ సర్పంచ్ ఎవరు?
 కొండాపూర్ సర్పంచ్ వాసం కన్నయ్య.

ఈ) పక్కా రోడ్డు ఎవరి సహకారంతో , ఎవరు నిర్మించారు?
లోడి సంస్థ సహకారంతో 'గ్రామ కమిటీలు', గ్రామస్తుల శ్రమదానంతో పక్కా రోడ్డు నిర్మించారు.

ఉ) గ్రామ ప్రజలు సాధించిన విజయాలు ఏవి?
జవాబు. మద్యపానం నిషేధం, 100% అక్షరాస్యత, మినరల్ వాటర్ ప్లాంట్, పిల్లలందరిని బడిలో చేర్చడం మొదలైనవి చేశారు.

ఊ) ఈ పేరాకు శీర్షిక ఏం పెట్టవచ్చు?  ఎందుకు?
జవాబు. ఆదర్శగ్రామం కొండాపూర్.
ఊరికి పక్కా రోడ్ వేసుకున్నారు. మద్యపాన నిషేధం, 100% అక్షరాస్యత, మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకున్నారు. బడిలో పిల్లల్ని చేర్చడం మొదలైనవి చేసుకుంటూ ఇతర గ్రామాల వారికి ఆదర్శంగా ఉన్నారు కాబట్టి ఆదర్శ గ్రామం కొండాపూర్ అనడం సబబు.
43

II. వ్యక్తీకరణ - సృజనాత్మకత:
1. కింది ప్రశ్నలకు ఐదు వాక్యాలలో జవాబులు రాయండి.

అ) "ఎంత చెడ్డగని, ఎంత బాగా బతికిన గాని ఇంకోణి ఆసరతోటి మంది భుజాలెక్కి నడవకుండ పయినం సాగితే సాలు" అన్న అక్క మాటల్లో ఆంతర్యం ఏమై ఉంటుంది?
జ. మనుషులు ఎవరు ఇతరుల పైన ఆధారపడి జీవించకూడదు. ఎవరైనా సరే ప్రతి దానికీ ఇతరుల మీద
ఆధారపడితే చులకనగా చూడబడుతారు. ఆ మనిషి విలువ తగ్గిపోతుంది. ఉన్నంతలో జీవితం ఉన్నతంగా ఉండాలంటే కష్టపడాలి. పని చేయాలి. ధర్మ మార్గంలో డబ్బు సంపాదించాలి. కలిగినంతలో కలో, గంజి, మంచినీళ్లో తాగి పూట గడిచేటట్లు జీవించాలి. తన మటుకు తను బతికితే ఎవరితో వైరం రాదు. స్వేచ్ఛగా, సంతోషంగా, జీవితం గడపడం సంతోషించే విషయం. అందుకోసం ఎవరిని ఆశించకూడదు. ఎవరిపై ఆధారపడ కూడదు.

ఆ) "అక్కడక్కడ నక్కలు అదునుగాస్తున్న జాడలు కనబడుతున్నది" అంటే మీకేం అర్థమైంది?
జ. నక్కలు అవకాశవాద జంతువులు. నక్కలకు జిత్తుల మారి తాను అధికం. ఎలా వంచించాలి? ఎవరిని వంచించాలని కుయుక్తులు పన్నుతూ సులువుగా ఆహారం సంపాదించాలని ఆలోచిస్తుంటాయి. పెద్దపులి సింహం మొదలైన జంతువులు తిని వదిలిపెట్టిన మాంసాన్ని భుజిస్తాయి. రెండు జంతువులు కొట్లాడి చనిపోయిన వాటి మాంసం కోసం కాచుకుని కనిపెడుతుంటాయి.

ఇ) మీ గ్రామంలోని ప్రకృతిని లేదా మీ ఊరి ప్రత్యేకతలను గురించి రాయండి.
జ. మా ఊరు పచ్చని పంట పొలాలతో పాడిపంటలతో పాడిపంటలతో కలకలలాడుతుంది. గ్రామం చుట్టూ ప్రకృతి సోయగం అందర్నీ అలరిస్తుంది. పారే ఏటి అలల మీద జెల్లా, బొచ్చె మెరుపులకు మరింత సౌందర్యాన్ని చేకూర్చుతాయి. ఊరు మధ్య మందిర్లు మసీదులు చర్చిలలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. 

ఈ) చెరువుల ప్రాముఖ్యత ఏమిటి?
చెరువులు ఒక లోతైన ప్రదేశంలో వాన నీరు పడడం వల్ల కాని, భూమి లోపలినుండి అంతర్జలం బయటకు పొరలు దాటుకొని వచ్చి చేరుతుంది. కొన్ని చెరువులు ప్రభుత్వమో, రాజులో త్రవ్వించారు. చెరువుల వల్లన వ్యవసాయానికి నీరు దొరుకుతుంది. కొన్ని గ్రామాలకు చెరువు లో నీరే మంచినీరు

2. కింది ప్రశ్నలకు పది వాక్యాల్లో జవాబు రాయండి.
అ) పాఠం ఆధారంగా పల్లెల్లో వచ్చిన మార్పులను విశ్లేషిస్తూ రాయండి.
జ: కొత్త పాట ఆధారంగా పనులు వచ్చిన మార్పులు: 
మా ఊరి పొలిమేరల్లో పచ్చని పొలాలు, నిండుకుండ లాంటి చెరువు, ఎప్పుడూ పారే కాలువలు, వంతెనహ్మ్ కింది నుంచి పారే వాగు పరవళ్లు అందంగా ఉంటాయి. మామిడి చెట్లు, చెరకు తోటలు విరివిగా ఉంటాయి. 
పంట పొలాల కింద ఇసుకు దిబ్బలు ఆహ్లాదాన్ని ఇస్తాయి.
పూర్వం పల్లెలో భూస్వాములు ఉండేవారు.
 వారు పేదలపై తమ పెత్తనాన్ని చలాయిస్తూ ఉండేవారు.
పేద ప్రజలను మోసం చేస్తూ ఉండేవారు.
బాకీలు ఇచ్చి అధికంగా వడ్డీలు వసూలు చేసేవారు. 
కొందరు జీవిత కాలం చేసిన అప్పు తీరకపోయే పరిస్థితులను కల్పించేవారు. పండుగలు పబ్బాలకు మా ఊరంతా కట్టుబడి ఉంటది. మా ఊరి ప్రజలు పరస్పర సహా కారం చేసుకుంటారు. కష్ట సుఖాల్లో తోడుంటారు.

3. కింది ప్రశ్నకు సృజనాత్మకంగా సమాధానం రాయండి.
అ) పల్లె సౌందర్యాన్ని వర్ణిస్తూ పది పంక్తులు వచన కవిత రాయండి.

పల్లే పై కవిత 

మా ఊరు మంచి స్ఫూర్తి

మతల హారతి మనసులు  చూద్దువు

చిరునవ్వులు రువ్వుతూ

కన్నతల్లి ఆత్మను మరిపించే ఆత్మను చూద్దువు  

పచ్చని చెట్లు,  పాడిపంటలతో 

కలకలలాడే మాపల్లె  

పంట పొలాలు పశు  సంపదతో

శోబిల్లే  మాపల్లె 

ఆత్మీయులకి పెట్టుబోతల తీరు 

అప్యాయతలకీ ఆయువుపట్టు  

పుట్టతేనె తీరు 

పిల్లగాలులతో పల్లె సేను ఒయ్యారం ఒలుకబోస్తది

చెరువు అలలతో చెంగలిస్తూ తుల్లిపాడ్తది 

విద్యుత్ కాంతిలో మాపల్లె విరాజిల్లోతోంది

అన్నదమ్ముల అనుబంధం తో అలరారుతోంది

కులమతాలు కాదనీ 

వరుసలతో అనుబాధాలు అల్లుకుంటది. 

ఒక్కసారి రా పోగొట్టుకున్న ప్రేమలో తేలుదువు

      

III. భాషాంశాలు

 1. పదజాలం:
 1. చెవి వారిచ్చి         = శ్రద్ధగా
 నేను మా నాన్న చెప్పే నీతి కథలు చెవివారిచ్చి వింటాను.
2. చిరుత పులులు గవినిలలో నివసిస్తాయి.
గవిన్లు = గుహలు
 3. మా ఊరి పొలిమేరలో పంట పొలాలు ఉన్నాయి.
        పొలిమేర = సరిహద్దు
4. కుటిలవాజితనం = సోమరితనము
   మనుషులకు కుటిలవాజితనం పనికిరాదు 
5. పోలిమేర : సరిహద్దు  

2. పర్యాయపదాలు
1. పెయి=  మేను దేహం
2. తావుల్ల = చోటు ప్రదేశం
3. ప్రకృతి వికృతులు:
1. సముద్రము      - సంద్రం 
2. విద్య               -  విద్దె 
3. ఆధారము       - ఆదెరువు
4. శిఖ                 - సిగ
5. ప్రయాణం - పయనం

4. జాతీయాలు:
నక్షత్రకుడు             : వెంటపడి పీడించేవాడని అర్థం లోవాడుతారు
నిండుకున్నవి        : అయిపోయినవి
దడిగట్టు                 :రక్షణ కల్పించు
నిప్పులు సెరగంగ : మిక్కిలి కోపాన్ని ప్రదర్శించడం.

4. జాతీయాలు వివరణ:
నక్షత్రకుడు : వెంటపడి పీడించేవాడని అద్దంలో వాడుతారు.
నిండుకొన్నవి :  అయిపోయాయని అర్థంలో వాడుతారు.
దడిగట్టు : చుట్టూ చేరారని అర్థంలో వాడుతారు.
నిప్పుకలు సెరగంగ: కోపోద్రిక్తులు అవుతుండగా అని అర్థంలో వాడుతారు.

వ్యాకరణాంశాలు: 

ప్రాణాలుగోల్పోవు = ప్రాణాలు +  కోల్పోవు గసడవాదేశ సంధి
మూటగట్టు   = మూట  +  కట్టు - సరళాదేశ సంధి / దృత ప్రకృతిక సంధి
ఆసుపోయుట =  ఆసు +    పయుట -గసడవాదేశ సంధి
కాలుసేతులు  =   కాలు  +   సేతులు  -గజదవాదేశ సంధి
 పూచెనుగలువలు  = పూచెను  +  కలువలు -సరళాదేశ సంధి లేదా ద్రుత/ ప్రకృతిక సంధి


వృద్ధి సంధి
రసైక = రస +ఏక - (అ  +ఏ = ఐ )
ఏకైక = ఏక  +  ఏక  - (అ +ఏ = ఐ )
వసుధైక = వసుధ  + ఏక - (అ +ఏ = ఐ )
ఉదా: దివ్యైరావతం  = దివ్య  + ఐరావతం  - (అ +ఏ = ఐ )
దేశైశ్వర్యం =దేశ  +  ఐశ్వర్యం   - (అ +ఏ = ఐ )
అష్టైశ్వర్యాలు = అష్ట  + ఐశ్వర్యాలు  - (అ +ఏ = ఐ )
ఉదా: ఘనౌషధి =ఘన  + ఓషధీ      - (అ +ఓ = ఓ )
వనౌషధి =వాన +  ఓషధి - (అ +ఓ = ఔ )
 ఉదా: రసౌచిత్యం =రస  + ఔచిత్యం - (అ +ఔ  = ఔ )
దివ్య ఔషధం =దివ్య  +  ఔషధం - (అ + ఔ  = ఔ )
నాటకౌచిత్యం =నాటక  +  ఔచిత్యం - (అ + ఔ  = ఔ )
పైన ఇచ్చిన పదాలను విడదీసినప్పుడు మీరు గమనించవలసిన విషయం సరి చూడండి. ఈ సంధి ఏర్పడేటప్పుడు ప్రతిసారి పూర్వస్వరంగా అ ఆ లు వచ్చాయి. పరస్వరం స్థానంలో వరుసగా ఏ, ఐ, ఓ, ఔ లు ఉన్నాయి. అకారానికి ఏ,ఐ కలిసినప్పుడు ఐకారం వచ్చింది. ఓ, ఔ లు కలిసినపుడు ఔ కారం వచ్చింది.

1. సూత్రం : ఐ, ఔ లను వృద్ధులు అంటారు.
2. సూత్రం: అకారానికి ఏ, ఐ లు పరమైతే ఐ కారం, ఓ, ఔ లు పరమైతే ఔ కారం  ఏకాదేశంగా వస్తాయి. 


:సారాంశం:

కొత్తబాట 

'నేను రాన్రా తమ్ముడు!' అని అక్క తమ్మునితో ఎంత జెప్పిన గాని వినకుండా, పట్టిన పట్టు విడవ కుండా ఎంటబడ్డడు.

అక్క పయనమై బండెక్కి బయలు దేరింది.

వసదాగిన పిట్టోలె ఒకటే చెప్పుక పోతుండు తమ్ముడు. 

అక్క  ఎంత సేపటికీ  మాట్లాడపోయే  సరికి

ఏందే? అక్కా! ఉల్కవు? పల్కవు? అంటడు.


  చెట్ల పచ్చదనం, పువ్వుల సోయగం, చింతలు, యాపలు, మావిళ్ళ సింగారం గూర్చి  తమ్ముడు చెబుతూ ఉండగానే మాటల్లో ఊరి పొలిమేర రానే వచ్చింది. బాటకు ఇరు వైపుల గుబుర్గ వెరిగిన వాయిలు పొదలు, ఎదిగి వస్తున్న కొత్తచెట్లు, ఆయకట్ట కట్టడం వలన నీలసముద్రమోలె నిండుగ వున్న చెర్వు, గవిండ్ల గుడ్డెలుగులు, చిర్తగండు, తాచుపాము, నక్కలు అన్నీ కనబడుతున్నయి.


  కొత్తబాటేసినం అంటే అక్క నమ్మలేదు. తరాలనాటి బాట కయ్యలు గట్టి, గండ్లు వడిన బాట. ఆ వొంపులల్ల, వొర్రెలల్ల వడి నడుసుకుంట వోవలంటే కాళ్ళు బెణికేది. బండ్లో కూసుంటే నడుములిరిగేవి. అలాంటిది హాయిగా ఊరి పొలిమేర రానె వచ్చింది. 

  ఊర చెరువు, మత్తడి, పసుల కొట్టాలు, ఎల్లమ్మ గుడి, పూజారి కిష్టమాచారి ఇల్లు దాటగానే గోపాల్రాయని భవంతి బంగుల, రావి చెట్టు కింద రచ్చకట్ట అన్నింటా మార్పు కొట్టచ్చినట్లు కనబడుతుంది.

   గోపాల్రాయని బంగ్ల ఎంటనే అయిన బామ్మర్థి మిత్తి పూజ మీదనే మిద్దెలు మోపిన శ్రీమంతుడు రంగరాయని రెండంతస్తుల గచ్చు భవంతి, తరువాత వారి పాలోండ్ల ఇండ్లు, వాళ్ళ బావ పోలీసు పటేలు పాపిరెడ్డి ఇద్దరూ ఇద్దరే. హనుమంత రాయుడు కుటిల వాజి. బండి వాళ్ళ ఇంటి మూల దిరుగంగనే వాళ్ళ  పెదమామ ఇంటిపొంటి ...... మ్యాన పల్లకీలుండే పాత పొత్తులిల్లులో అదే  గరిసెల ఇండ్ల దీపాలు, మనుసులు మెసలడం కనబడింది.

   బండి ఇంటి కమాను ముందర ఆగింది. పిల్లలందరూ వచ్చి సుట్టూ జేరిండ్రు, బండి దిగి బంకులు దాటి ఇంట్లకు నఢ్సిన అలవాటు సొప్కున బాయి కాడి గచ్చుల్లకు నడ్సింది. అక్కడ వొనమాలి లేదు అక్కా అని విల్సుకుంటూ కుసుమ నీళ్ళ చెంబు అందిచ్చింది. రెండు చేతులతో ఆ పాలేరు రాజని బిడ్డను ఎత్తుకుంది. కుసుమ అని పేరు పెట్టింది తనే. తమ్ముడు బాయికాడి కమాను స్తంభానికి ఆని నిలవడ్డడు.


బాట పాఠం ప్రకారం 

మారుతున్న సమాజంలో..

  1. ఊరికి వెళ్ళే బాట సక్రమంగా ఉండేది కాదు. ఆ బాటపై ప్రయాణం చాలా కష్టంతో కూడుకున్నపని. 
  2. కొత్తబాట వేయడం వలన ప్రయాణం సుగమమైంది. యిబ్బందులు లేకుండా సులభంగా, సుఖంగా సాగుతుంది. కాని బాటకిరువైపులా ఉన్న పెద్ద పెద్ద చెట్లు తొలగించబడ్డాయి. కొత్తచెట్లు నాటారు.
  3. చెరువుకు ఆయకట్ట కట్టడం వలన చెరువు నీటితో నిండి ఊరంతటికీ ఆధారమైంది.
  4. ఉన్నత వర్గాల స్త్రీలు బండి లో వెళ్ళినప్పుడు, బండి ఊళ్లోకి రాగానే వారు ఎవరికీ కనబడకుండా బండికి ఉన్న యెర్ర పర్దాలు కిందికి దించేవారు.
  5. రచ్చండకు దూరంగా నిలబడే జనాలు, రచ్చబండ పై కూర్చునే స్వాతంత్ర్యం లభించింది.
  6. మూఢనమ్మకాలను పెంపుజేసి, మిత్తి పూజలు జేసి శ్రీమంతులైన వారి మీద ప్రజలు తిరుగబడితే వారు ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వారి బంగ్లాలల్లో దీపంపెట్టే దిక్కులేక దుమ్ముకొట్టుకొనిపోయాయి.
  7. ఒకణ్ణి ఎక్కించి, ఒకణ్ణి దించి ఇద్దర్ని ఎదగనీయకుండా జేసే నక్కజిత్తుల కుటిలవాజీలు లేరు.
  8. పంచాయితీలకు దండుగలు గట్టడంలేదు.
  9. దొంగతనాలు, పంటచేలల్లో దోపిడీలు లేవు.
  10. ఎంతటి వారికైనా సరే మనుషులు మోసే మ్యాన పల్లకీలు లేవు. పగటి దీపాలెలిగిచ్చి చేసే ఊరేగింపులు లేవు.
  11. మ్యాన పల్లకీలుండే పాత పొత్తులిల్లు రాత్రిబడిగా మారింది.
  12. పిల్లలకు సీముడు ముక్కులు లేవు, సింపులు లేవు, సీరపేండ్లు లేవు, వోరగాళ్ళు లేవు, ఊడ్సు కండ్లు లేవు. పిల్లలందరు దోస పండ్లోలె ఉంకుచండ్లోలె కళకళలాడుతున్నారు.
  13. యజమానులు, పాలేరులు అని తేడాలేకుండా కలిసి మెలిసి ఒక ఇంటిలోని వారి వలె ఉంటున్నారు. 

ముగింపు :

  ఒకప్పటి పెద్దరికం, పెత్తందారీతనం, మూఢనమ్మకాల ముసుగులో జరిగే దోపిడీలు పోయి సమసమాజ స్థాపన దిశగా నూతన సమాజ నిర్మాణానికి కొత్తబాట వేయబడింది. ఇది కొత్తకొత్త బాటలు వేయడానికి కొత్త తరాన్ని నిర్మించడానికి నాందీ భూతం. 

అ ) "నల్గురు నడిసిందే బాట " లోని అంతరార్ధమేమిటి?

1.'నల్గురు నడిచిందే బాట 'అంటే పదిమంది ఏ పని చేస్తే అదే అందరికి ఆమోదం అవుతుందని భావం, పదిమంది పాటించింది పద్దతి అవుతుందని నానుడి.
ప్రక్రియ జీవితపు ముఖ్య సన్నివేశాలను క్లుప్తంగా తెలియజేస్తుంది కథ లేదా కథానిక. సంఘటనల మధ్య సంభాషణ సంబంధాల్ని కళాత్మకంగా చిత్రిస్తుంది. ఇది వచన ప్రక్రియ. సంభాషణ కథనం శిల్పం కథానికలోని ప్రధానాంశాలు. క్లూప్త దీని ప్రత్యేకత దీనిని ఆంగ్లంలో షార్ట్ స్టోరీ అని అంటారు.

2.అదే సాంప్రదాయ మవుతుంది.నలుగురు నడిచినప్పుడే అది బాటగా మారుతుంది.దాన్నే మిగిలిన వారందరూ అనుసరిస్తారు.పదుగురాడు మాట పాడి ఐ ధర చెల్లు" అని వేమన కూడా అన్నాడు కదా! 

౩.పై ప్రశ్న డాపాకాల యశోదారెడ్డి గారు రాసిన కొత్త బాట అనే కధానిక నుండి ఈయ బడింది.జీవితపు ముఖ్య సన్నివేశాల్ని క్లుప్తంగా తెలియజేస్తుంది కధానిక.

4.సంఘటనల మధ్య సంబoదాన్ని  కళాత్మకంగా చిత్రిస్తుంది.ఇది వచన ప్రక్రియ.ఈ కథ తెలంగాణా మాండలికం లో రాయబడింది. 

''అక్కడక్కడ నక్కలు అదునుగాస్తున్న జాడలు కనబడ్తున్నవిఅంటే మీకేం అర్థమైంది? జ: నక్కలు చాలా తెలివైనవి. అవి ఉచితంగా ఎక్కడ ఆహారం దొరుకుతుందోనని కనిపెడుతుంటాయి. పెద్ద జంతువులు తినగా మిగిలిన వాటిని తింటాయి.

ఆ) సేవ్వు మిద పెను వార్తెన? అంటే మీకు ఏమి అర్థమయ్యింది ...

మన చెవి మీద పెను పాకితే ,మనలో వెంటనే చైతన్యం కలుగుతుంది.దిని అర్థం పట్టించుకోవడం.
పంచేంద్రియాలలో చెవి కూడా ఒకటి. కాని ఈ పాఠం లో అక్క చెప్తున్నా మాటలు,తమ్ముడికి చెవి మిద పెను పాకితే కలిగే టంత చలనం కూడా కలిగించలేదు.

అందువల్ల అతను అక్క చెప్పిన మాటలు వినిపించుకోకుండా తానె అక్కకు చెప్తున్నాడు.'అసలు పట్టించుకోవడం లేదు','గ్రహించాడంలేదు అని .దిని అర్థం.

పాఠం ఆధారంగా పల్లెల్లో వచ్చిన మార్పులను విశ్లేషిస్తూ రాయండి
జ: పల్లెల్లో ఆనాడు దారులన్నీ వర్షంవస్తే బురదమయంగా మారేవి. ఇప్పుడు ప్రతి పల్లెకు మంచిదారి ఏర్పాటయ్యింది. అప్పట్లో ఆడవారు ఇంట్లోనే ఉండేవారు.

కొత్త బాట పాఠం

ప్రవేశిక:

ఈ 'కొత్తబాట' గురించి డా|| పి.యశోదారెడ్డి మాట్లాడుతూ “ఈ కథ తెలంగాణ మాండలికంలో వ్రాయబడింది. అక్యాతమ్ముళ్ళిద్దరూ బస్సుదిగి అక్కడి నుండి ఎద్దుల బండిలో వాళ్ళ ఊరి వరకు ప్రయాణం చేసిన రెండు గంటల్లో రెండు తరాలకు జరిగిన ఘర్షణ, సాధించిన విజయాలు సప్రమాణంగా ప్రదర్శింపబడ్డాయి. ఈ సంభాషణలో ఎన్నో సాంఘిక దురాచారాలు తదమబడ్డాయి. భాష తెలంగాణ మాండలికాన్ని జీర్ణించుకొని, ఆ జాతీయాన్ని, జీవనరీతిని, నుడికారాన్ని ప్రదర్శిస్తుం"దని చెప్పింది. ఆ కొత్తబాటలో మనం నడక మొదలు పెడుదాం.

I

"నేను రాన్రా తమ్ముడు! అది తరాల నాటి బాట. ఎప్పుడేసిందో ఏం కతనో? ఈ వానలకూ వొరదలకు ఏర్శ పొంగంగ అది ఎన్ని కయ్యలు గొట్టిందో? ఎన్ని గండ్లు వడ్డదో? కూసుంటే నడుములిర్గె, నడిస్తే కాళ్ళు బెణికెనంట వొర్రెల ఎ వొంపులల్ల వడి ఆ బాట పొంటి వడినడ్వ నాశాతగాదు తండ్రి." అంట ఎంత జెప్పినగని వాని సెవ్వు మీద పేను వార్తెనా? గ నా మాట యింటెనా? వాని పట్టు ఇడిస్తెనా?

తుమ్మబంక అంటుకున్నట్లు ఎంటవడి "కాదక్కా మనూరికో కొత్త బాటేసినం, నీవు చూసి మెచ్చిందాక గాదు" అంట ఒకటే పట్టు, మొండిపట్టు, జనిగెపట్టు, ఇదెక్కడి సాద? వీడెక్కడి నక్షత్రకుడురా? నాయినా! అంట పయనమై బండెక్కి బయలుదేర్శ, తోవపొంటి ఊకున్నాడా? లేదు, ఉల్లాసం బట్టలేక ఒకటే చెప్పుక పోతుండడు. వసదాగిన పిట్టోలె.

"అక్కా ఇది ఈగ కాలం కాదె! పూలకాలం, ఎన్నెల మాసం, తియ్యటి తీపుల దినం, ఏమనుకున్నవో? ఎక్కడ జూసిన కమ్మటి వాసన, ఇన సొంపైన రొద, పండాకు రాలంగ అడవి అంత పసరాకు పోషాకులు తొడ్డి సోకులు పోతుండది. • మోదుగు వనం జూడు! పెయి అంతపుల్కరిచ్చినట్లు మొగ్గదొడిగి, ఎర్రగపూసి, కొత్తబాటకు మంగళార్తులు పడ్తున్న ముత్తైదలో సాళ్ళు సాళ్ళుగ నిలవడ్డవి. ఆ పొంటె ఉన్న మద్దుల జరవార జూడు! ఎంత ఎత్తుకు ఎదిగినవో? కొటారి కొమ్మలు తేనెతెట్టెలన్ని పిక్కటిల్లంగ తేనెలు ఎట్ల నింపుకొన్నవో? ఏందే? అక్కా! ఉల్కవు? పల్కవు?

అదో! అక్కడి దిక్కు జెరనా చెవువారిచ్చి ఇను, ఎడవాసిన ఎదలను ఏకంజేయ పేరు పెట్టి పిలుస్తున్నట్లు ఆ కోయిలకూతలు! అక్కా అదో! ఆ కండ్లపడేదే చింతలతోపు, చింతలింకా చిగురుకోలేదు. గున్నమావిళ్ళు జూడు! పొన్నకాయలసోంటి ఆడపిల్లలు సింగారించుకున్నట్లు కానొస్తుండవి. యాపలు ఇప్పుడిపుడె మొగ్గలు ఇచ్చుకుంటుండవి.

అదో! సూడు! మాటలల్లనే మనూరి పొలిమేర రానెవచ్చె. ఎదురుకోళ్ళ నాడు మొగపెండ్లి సుట్టాలకు మర్యాదలుజేయ గుంపు గట్టినట్లు గుబుర్ల వెరిగిన ఈ వాయిలు పొదలు జూడు! అక్కా! బాట పక్కల పొంటి ముసలి మాన్లన్ని గూలంగ ఎదిగి వస్తున్న కొత్త చెట్లను జూడమ్మా!

ఈ సూపుతోటే కొంచెం అటుదిక్కు నీ కన్నువారజేయి, ఆ చెర్వుజూడు! ఇప్పుడు నిండుగ నీల సముద్రమోలె నీరు మోస్తుండది. ఈ చెర్వుకు ఆయకట్ట కట్టిన పుణ్యాన అందరికీ ఆదెరువైంది".
38


అవును నిజంగనే! ఏకసిస్తుగ పాదరసం వొలువోసినట్లు ఈ చెర్వు ఎన్నెలకు మెరుస్తుండది. గని, ఇల్లలుకంగనె పండుగైతాది? ఈ పాయకుంటల కెళ్ళి పెద్ద కొర్రమాన్లు చెంగు చెంగున దుంకుకుంట ఎగిరి సన్న దాపలను గుట్కు గుట్కు మనుకుంట సుడిగుండాలను లేప్తనే ఉండవి. గవిన్ల గుడ్డెలుగులు చెదల పుట్టలను గోళ్ళగీకి పుట్టకు పుట్ట పెరుగుల గెట్టెలను మెక్కింది జాలక, చెట్ల శిసెలకు ఎగవాకి జెంటి తేనెలు ఆపూటం జుర్రుకొన్నది. సాలక, ఆ పూట కల్లుకు గట్టిన ఈతలొట్టి కోసం ఈక్కి ఆడ్కి కాళ్ళు గాలిన పిల్లులోలె అసువోస్తనే ఉండవి, అని, మనసుల అనుకుంట, ఆ గుడ్డెల్గులను జూసే కంటిని అట్ల మీదిమీదికి సారిచ్చేట్యాళ్ళకు గట్టుమీద జారుడు బండల ఎన్క అల్గుదుంకె కాడ, చిరగండు ఆ కాదు, ఆడిదే! అప్పుడే ఈనిందో ఏమో? కండ్లు గానక పొట్టాపతికి గాండ్రుగాండ్రు మనుకుంట తన పొట్టన పుట్టిన తన కూనల్నే నముల్క మింగ జూస్తుండది. ఆ పక్కనే గొర్రెపోతును అమాతం మందు గుడిగెలు మింగినట్లు మింగిన తాసుపాము సీకెర చెట్టుకు తీగోలె సుట్టుకున్నది. తిన్నది అరుగని పూడువాము గురిగింజలోలె గుడ్లు మిట్కుమిట్కున మిట్కరిచ్చుకుంట సుట్టకుదురోలె సుట్టుకొని 'అతీ గతీ' ఎరుగకుండ వడ్డది. ఆడాడ నక్కలు పొంచుకొని అదునుగాస్తున్న పాలిపెర గండ్లవర్తనే ఉండది.
--------------------------------
----------------------------
ఆలోచించండి- చెప్పండి.

"సెవ్వు మీద పేను వార్తెనా?' అంటే మీకేమి అర్ధమైంది?

మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా నడుచుకుంటూ పోతారా? పోయేటప్పుడు ఏమేం గమనిస్తారో చెప్పండి? మీ ఊరి పొలిమేరల్లో ప్రకృతి ఎట్లా ఉంటుందో చెప్పండి?
--------------------------------
----------------------------

II
మరి! మా తిక్క సన్నాసి కొత్త బాటేసినం, కొత్తదారి, కొత్తమలుపు అంట పదం బార్తండేంది? ఇదంత నాకు దెల్సిన బాటనె! ఎన్నేండ్ల నుంచో తొక్కుడు వద్ద బాట! ఇందుట్ల కొత్త యాడుండది? అంట అనుకున్నగని, నా మనసు నాకు బుద్ధి చెప్పుతున్నట్లనిపిచ్చింది..

అయిన గాకున్నగని మరీ, ఇంత కరుగనితనం, ఉండగూడదు. పురాగ ఎలుతురుకు దడిగట్టినట్లు ఒక్క పచ్చరం బర్వగూడదు. యాదాన్ని మెచ్చకుండ మరి అంటే మరి, రొమ్మున ఎముకలు లెక్కబెడ్తానంటే ఎట్ల? రొండు కండ్లు దెర్సి నిదానంగ లోతులు వాటిచ్చి సూడాలె, యాది కనుమరుగైన, మరుగున పడి తప్పినట్లే గద! నాకు ఎన్నటి నుండో ఎరుకున్న బాటైతే మట్కు బాగైందా? లేదా? బాట నడిసె కాలుకు రొంపి అంటుకోకుంటె కూసున్న కాడికి వచ్చి కాళ్ళకు రొచ్చు,
(page. 39)


తాక్తదా? తగుల్తదా? ఎంత చెడ్డగని, ఎంత బాగ బతికిన గని ఇంకోని ఆసరతోటి, మంది బుజాలెక్కి నడువకుండ పయినం సాగితే  సాలు మనకు కావలసింది, మనం జూడవలసిందల్ల, ఒగడు తన కాళ్ళమీద తాను  నిలబడ్డడా? లేదా? అనేది.

ఊర చెరువు దాటినం, మత్తడి దాటినం, మోతెబరి రైతుల పసుల కొట్టాలు గాన్రావట్టినవి. ఈ కొట్టాల్ల గడ్డివాములన్ని ఇగి చెదరకుండ కుదురుగా మట్టనంగ ఉండవి. ఇంటిమొకం బట్టిన ఎడ్లు లగేస్తుండవి, మా ఊరి ఎల్లమ్మ గుడి వొచ్చింది. ఆమె పసుపు బండార్లతోటి చెక్కు చెదరకుండ ఉండది. పూజారి కిష్టమాచార్ల ఇల్లు దాటినం,

ఆ కండ్ల పడేదే! గోపాల్రాయని భవంతి బంగుల, ఈడ్కి బండి జేరింది అంటే సూపుకు గోడ గట్టినట్లే. ఇందాక మరిసింది యాదికి వచ్చినట్లు మురిపాల వస్తువును గవుసెన్ల దాసినట్లు, ఎవరికంట్ల పడకుండ ఈ త్యాప గూడ మా తమ్మయ్య నాగల మీదికెళ్ళి చెంగున దుంకి కద్రానికి ఎర్రపర్దాలు సింగారిస్తడనుకొని నా పాపెట్ల సెదిరిన ఎంటికలు సక్కన దిద్దుకొని కొంగు నిండుగ సవరిచ్చుకున్న. అసొంటి దాపరికపు పనులు యావి జరుగలేదు. అంతకొస్తె ఆడ పర్దాలు ఉన్న ఉనికి గూడ కండ్లపడలేదు. నా ప్రాణానికి కొత్తగ ఊపిరి పీల్చుకున్నట్లనిపిచ్చింది.

పెండ్లి సూపుల నాడు పిలగాణోళ్ళు పెండ్లి పిల్లను గోటికొన నుండి శికెళ్ళ జూసినట్లు నేను మా ఊరిని జూడపట్టిన. నా కంటి ఎదురుంగనె రచ్చకట్ట. కందెరుగని మణుసులోలె మా రచ్చకట్ట రాగి చెట్టు రొండు ఒకదాన్నిడ్చి ఇంగోటి ఉండదన్నట్లు ఒకదానికోటి తోడంట దీటుగ నిలవడ్డవి. అదేం సిత్రమొ? గని ఈసారి సూడు సూడు మంట మా రచ్చకట్ట కింద అన్ని చెప్పులె కుప్పలైనవి. కాన్రాలేదు. ఇదేం ముంచుకొచ్చె మా ఊరికి? ఇది కలనా? మాయనా? అంట నిదానిచ్చి చూసెట్యాళ్ళకు వాళ్ళల్ల ఒగరో ఇద్దరో రచ్చమీద కూసున్నట్లు గానొచ్చిన్రు. నా కండ్లను నాకే నమ్మబుద్ధిగాలేదు. రొండు జేతుల బాగ నల్పుకొని మళ్ళ జూసిన గూడ అదే నిలుకడై నిలవడి నిజం అని తోసింది. ఓ రచ్చబండ! ఓ రాగిచెట్టు! ఎన్నాళ్ళ కెన్నాళ్ళకు ఏరుతార్లు ఎచ్చు తచ్చులు మాని తోటి మనిషికి సమానంగ తావును, నీడను పంచి ఇచ్చే యోగం, బుద్ధి మీకు దక్కింది! అని మెచ్చుకుంట సంబురాన ముందుకు సాగిన.

iii

బండి సాగిపోతనే ఉండది. ఇంగ, గోపాల్రాయని బంగ్ల ఎంటనే అయిన బామ్మర్ది రంగరాయని రెండంతస్తుల గచ్చు బవంతి, ఊరంతటికి కులపెద్దనంట నెత్తి ఎత్తుకోని నిలవడ్డట్లు గానొచ్చింది. మరి? ఎన్నడు లేంది ఆ భవంతి బంకులేమొ దిగూళ్ళల్ల దీపాలు ఎలుగుత లేవు, నేను జూస్తున్నది పొద్దు మాపు పూటనేగని, ప్రమిదలన్ని చమురు నిండుకోంగ దుమ్ము కొట్లాడుతుండవి. ఇల్లంత పాడు గొట్లాడినట్లు, కళదప్పి 'దో' అంటుండది. ఎందుకో? అంట అనుమాన పడుండంగనె మావోడు పెద్దపులిని ప్రాణంతోటి పగ్గాన ఏసిన కుశాలు తోటి.

"అక్కా! ఇన్నాళ్ళకు మసూరికి వట్టిన 'మిత్తి దొర్సాని' అదే పెద్ద మారెమ్మ పేరు లేకుండ ఊడ్సుక పోయింది. మన ఊరోళ్ళంత ఇప్పుడిప్పుడె తెలివి దెల్సి మిత్తి పూజ మీదనె మిద్దెలు మోపి శ్రీమంతుడైన రంగరాయని మీద మళ్ళెవడి అయినకె పంగనామం బెట్టిన్రు. దాంతోటి అయిన దిమ్మదిరిగి చెప్పుకుంటె సిగ్గువాయె, మూసుకుంటే ప్రాణం బాయెనంట ఇర్కుటాన (page40)

-----------------------------------------------------------------

ఆలోచింంచండి - చర్చించండి. 

"తన కాళ్ళ మీద తను నిలబడటం" అంటే ఏమిటి

 ఎప్పటి తీర్ల! ముచ్చెలకన్న కిందై వోరగ గూసుండె మణుసులు 

నాటి నేటి ఆచార వ్యవహారాల్లో తేడాలు ఉన్నాయా? ఏమిటవి?
మీ ఊర్లో రచ్చబండ/గ్రామ సచివాలయం ఉన్నదా? అక్కడ ఎవరెవరు ఏయే విషయాల గురించి మాట్లాడుతారు?
-------------------------------------------------------------

వడి కుడ్తాల పడ్డ ఎల్కతీర్గ తండ్లాడిన గని ఉపాయం దోసక పెండ్లాం పిల్లల దీస్కొని సుట్టాల మార్గం అంట రంగాపురం జేరిండు."

ఈ రంగరాయుడు చిన్న సన్నోడుగాడే! ఈ పసికారు రొండెర్గక నివురు గమ్మిన కొరివి తోటి నెత్తి గోక్కుంట లేరు గదా! ఏమో? మనుసు ఉట్టి ఊగినట్లు ఊగింది.

బండి మా పాల్గొండ్ల ఇండ్లకాడికెళ్ళి సాగుతుండది. ఇప్పుడు మా బావ పోలీసుపటేలు పాపిరెడ్డికి సాగువాటు సరిగలేదంట సూచాయగ ఇన్న. మరి అయినేం పచ్చపూస గన్యనా? రంగరాయనికి కుడి ఎదు అంతె! సేరుకు సవశేరు 'ఉద్ది'. ఊళ్ళ ఒకణ్ణి ఎక్కిచ్చి ఒగణ్ణి దించి ఇద్దర్ని ఎదుగనీయకుండ ఎప్పటి శిగలు అప్పుడె గత్తరిచ్చె విద్దెలు ఈ అయ్యలకు పొత్తిళ్ళనాడె అబ్బుకొచ్చినవి. అవును గని, అనుమంతరాయుడు? అయిని నోట్ల, నాలికె సింగోటం? వీళ్ళు మరి? అనుకుంటున్న మాటను పసిగట్టినట్లు నా తమ్ముడు.

"అక్కా ఆ కుటిలవాజి అనుమంతరాయుడు, కడ్పుల ఇసం నాల్కెన తీపి తోటి నగుకుంట గొర్రె దాటుమంది గొంతులకు ఉరులు దగిలిస్తుంటే నక్కతంతుల సింగోటం ఉన్నది లేంది దస్తురంల ఎక్కిస్తుండె. ఇంగ ఇప్పుడు కండ్లు దెర్సిన జనం వాళ్ళ కన్న దొండాకులు ఎక్కువ జదివినట్లు ఆ తంత్రాలన్ని పురుట్లనే పుట్కుమనిపిస్తుండరు. లేకుంటె ఎందట? ఎన్నాళ్ళంట వీళ్ళ చెప్పుకింద తేళ్ళ తీర్గ అణిగి మణిగి ఉంటరు? సన్నకారు మంది అంత ఇప్పుడు అయిందానికి కానిదానికి కయ్యాలకు దిగి కుస్తీపట్లు పట్టి నెత్తురు కండ్ల జూస్కోని పంచాయితిల పడి ఆ పంచాయితిదార్లకు అప్పు సప్పు జేసి దండుగలు గట్టుకం లేదు. ఏ వాడన పంచాయితి ఆ వాడనె తీర్పులు జరుగుతుండవి. అక్కా! ఇన్నాళ్ళ తీరుగ అద్దమ్మ రాత్రిర్లు దొంగతనాలు లేవు, సేండ్ల దోపిండ్లు లేవు, పరిక్కంపలు లేవు, లాగుల తొండలు లేవు, ముంతపొగలు లేవు, ఈపు ముద్దెర్లు లేవు, బండ బర్వులు లేవు, అడుక్కు తిండ్లు లేవు".
-----------------------------
----------------------------
అలోచించండి-చెప్పండి.

* 'కడ్పుల ఇసం నాల్కెన తీపి' అంటే మీరేం అర్ధం చేసుకున్నారు?

* పంచాయితీలు చెప్పడం అంటే ఏమిటి? పంచాయితీలను ఎట్లా జరుపుతారు?

* "కళదప్పిన ఇల్లు" ఎట్లా ఉంటుంది?


----------------------------
----------------------------
IV
బండి మా ఇంటిదిక్కు మూలమల్పు దిరిగింది. ఆడ మా పెదమామ ఇంటిపోంటి ఉన్న గరిసెల ఇండ్లల్ల దీపాలు ఎలిగినట్లు నలుగురు మణుసులు మెసిల్నట్లు జళకళ గలగల సప్పుడు ఇనిపిచ్చింది. ఇదేందిరా? అన్నట్లు మా తమ్ముణి దిక్కుజూసిన, ఎంటనే మా హాజిర్ జవాబు ఎక్కుళ్ళేని ఉల్లాసం తోటి బుజాన ఏసుకున్న దస్తు రుమాలు జాడిచ్చి దులుపుకుంట "అక్కా ఇది మన మ్యాన పల్లకీ లుండె పాత పొత్తులిల్లు, జనం మెదులక బండ జింకలు జేరి అబ్బో అన్నట్లుంటుండె, అది ఇప్పుడు మనూరికి రాత్రిబడి బంది. మేమంత గలిసి ఈ ఊళ్ళ ఎవరి పెండ్లిళ్ళైనగాని, వాళ్ళెంత మోతెబరి కర్ణప్పటేండ్లన, వాండ్ల పెండ్లిండ్లకు మణుసులు మోసే మ్యానా పల్లకీలు రాగూడదు. సంబురానికి మెరిమెణ జేసి పగటి దీపాలెలిగిచ్చి ఊరంత మెరిచ్చిన మెరియ్యని ఊరేగింపులు తీసె మద్దూరు లేదు అంట కట్టడి జేసినం. ఇంగ మనపెత్తాత కండ్లు నిప్పుకలు సెరుగంగ, చేసేది లేక తామసం ఆపుకొని పణమీది చెముటలు చిన్నపంచె తోటి తుడ్చుకుంట బుస్సు బుస్సు మంటుండంగ మేమంత ఈ పాత సవారీలను బద్దురంగ గుమ్ములింట్ల అలంకారాలోలె యాళ్ళాడగట్టినం".

బండి మా ఇంటి కమాను ముంగల ఆగింది. గజ్జెల సప్పుడు ఇని ఆ సుట్టుపక్కల పిల్లలంత ఉరుక్కుంటొచ్చి సుట్టు జుట్టుకున్నరు. ఈ పిల్లలు ఇన్నాళ్ళ తీర్గ ఈసురుమంట లేరు, ఇప్పుడు సీమిడి ముక్కులు లేవు, సింపులు లేవు, సీరపేండ్లు లేవు, వోరగాళ్ళు లేవు, ఊడ్సుకండ్లు లేవు, పిల్లలందరు దోసపండ్లోలె, ఉంకు చెండ్లోలె కళకళ లాడ్తుండరు.
(page: 41)


బండిదిగి బంకులు దాటి ఇంట్లకు నడ్సిన, అలువాటు సొప్పున బాయికాడి గచ్చుల్లకు నడ్సిన. ఆడ ఎప్పటి తీర్ల కండ్లు బయట బంకుల్లకు సారిచ్చి, ఓ చేత సెంబు, ఓ చేయి నడుమున వెట్టి వొయ్యారంగ వోనమాలి నిలవడి లేదు. పౌనమాలమ్మ ఇప్పుడు మా పెద్దత్త పక్కన దేవుణింటి ముందల గూసుండి వొత్తులు పేనుతుందది. ఇది కలనా? నిజమా? అంట డింగై అక్కడికక్కడ జూస్తుండంగనే 'అక్కా!' అంట విల్సుకుంటొచ్చి కుసుమ నాకు నీల్ల చెంబు అందిచ్చింది. ఒక్కసారి అమాంతం నా చేతులున్న చెంబు జారినంత పనైంది, గని అనుకోకుండ నా రొండు చేతులు మా పాలేరు రాజని బిడ్డ కుసుమ (దానికి ఆ పేరు పెట్టింది నేనే) దిక్కు సాగినవి. అది నా ఎదకొచ్చి ఆనింది. అన్ని కండ్లు ఒక దిక్కే సూడవట్టినవి. ఇవ్వరుకదులలేదు. ఇవ్వరినోట మాట పెకులలేదు. మా బాయి దగ్గెరున్న తరాలనాటి కారుమల్లె మొద్దు అనుకోకుండ మళ్ళా ఈనాటికి సిగురేసి సిగ్గారి తీర్గ వన్నెలు వడ్తుండది. ఇంతట్లకే మా తమ్ముడొచ్చి ముసి ముసి నగుకుంట బాయికాడి కమాను స్తంభానికి ఆని నిలవడ్డడు. ఇల్లంత ఎన్నెలలు కురిసినట్లనిపిచ్చింది.

అవును ఇది కొత్త బాటనే! ఇంతకంటె కొత్తబాట, మంచిబాట ఇంగెట్లుంటది? యాడుంటది? బాట ఏసెటోళ్ళు నడుస్తుండాలె గని, పాపం ఆ బాట వొల్లనంటదా? వొదుగనంటదా? నల్గురు పల్కిందె మాట, నల్గురు మెచ్చిందె నడుత, నల్గురు నడిసిందె బాట.

-----------------------------------------------------------------

ఆలోచించంది చెప్పండి.

రాత్రిబడి అంటే ఏమిటి? రాత్రి బళ్ళను ఎందుకు నడుపుతారు?

* 'నల్గురు నడిసిందె బాట'లోని అంతరార్థం ఏమిటి? చర్చించండి.

-------------------------------------------------------------------