సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

కొత్త పొస్ట్



🌐 * L. I. P. తెలుగు ప్రారంభ పరీక్ష - BASELINE TEST 2026-27     🌐 * 10వ తరగతి 🌐 * 10వ తరగతి తెలుగులో 99% స్కోర్ సాధించాలంటే... 🌐 * తెలుగు వెలుగులీనేల 🌐 | ధ్వని గుర్తింపు / అక్షర గుర్తింపు     🌐 * సరళ పదాలు     🌐 * ఐ సి టి ఉపయోగించడం ఎలా?     🌐 * * DIKSHA WEB         🌐 SCERT         🌐 NCERT         🌐 NBT         🌐 UGC_NET         🌐 CIIL         🌐 * * NDL INDIA         🌐 SAHITHYA ACADEMY         🌐 | సిద్దెంకి కథలు     🌐 | సిద్దెంకి పుస్తకాలు     🌐 | సిద్దెంకి కవిత్వం 🌐 *"నీలి నేల ఎతలు - తెలంగాణ దళిత కథ పరిణామం కాలమ్ - కోలిమి"     🌐 | తెలుగులో అత్యుత్తమ పుస్తకాలు     🌐* | వ్యాసాలు / Articles     🌐* | దాశరథి పాటలు     🌐* | తెలంగాణ రాష్ట్రంలో దళిత కథ (2014:-07-2025)     🌐 * "సంస్కృతంతో తెలుగు కాలరాయొద్దు"     🌐 * పగిడి తెలంగాణ కథ 2024 "     🌐 * "ఆలోచనవాదుల పుష్పక విమానం దాశరథి ‘కవితా పుష్పకం’"     🌐 * Articles on Dr. Siddenky    

5, మార్చి 2023, ఆదివారం

అర్థ పరిణామం

అర్థ పరిమాణం అంటే మార్పు. భాషలో వర్ణాలు, ధ్వనులు, వాక్య నిర్మాణం, వ్యాకరణ నిర్మాణం ఇలా ప్రతిదీ మారినట్లుగా అర్థాలు కూడా మారుతుంటాయి. ఇలా ఆయా పదాలకు సంబంధించిన అర్థాల్లో కాలక్రమంలో కలిగిన మార్పుల్నే అర్థ పరిణామం అని అంటారు. అర్థ బోధనను వివరించేదానిని సెమాంటిక్స్ స్టడీ (synchronic study)అంటారు.

అర్ధ విపరిమాణంయొక్క నిర్వచనం
పదజాలానికి సంబంధించిన అర్థంలో కలిగే మార్పు అర్థ పరిణామం. – ఆచార్య జి.ఎన్.రెడ్డి (అర్ధపరిణామణ్ రకాలు గ్రంథం, A study of Telugu Semantics)
భాష కాలక్రమాన మారుతుంది. కాబట్టి ఒక భాషలో కాలక్రమాన వర్ణాలు, వ్యాకరణ నిర్మాణం మారినట్టుగానే పదాల అర్థాలు కూడా మారతాయి. ఒక భాషలోని పదాల అర్థాల్లో వచ్చిన మార్పుని అర్థ పరిణామం అని అంటారు. – ఆచార్య పి.ఎస్. సుబ్రహ్మణ్యం

అర్థ పరిణామం – రకాలు
1897లో ఫ్రెంచి భాషావేత్త మైఖేల్ బ్రెయిల్ ‘La Semanticue’ అనే గ్రంథాన్ని ప్రచురించారు. ఇది అర్థ విజ్ఞానానికి సంబంధించిన మొట్టమొదటి గ్రంథం. ఈ గ్రంథంలో బ్రెయిల్ చెప్పిన అర్థ పరిణామ రీతుల్ని ఆధారంగా చేసుకుని తెలుగుభాషలో జరిగిన అర్థ పరిణామాలను భాషావేత్తలు స్థూలంగా వర్గీకరించారు. అవి: 
1. అర్థ వ్యాకోచం: అర్థం విస్తృతి పెరగటం అనేక అర్ధాలను అందించడం అంటే మొదట పరిమితార్థాన్ని తెలిపే ఒక పదం కాలక్రమంలో విస్తృతార్థాన్ని తెలిపినట్లయితే అది అర్థ వ్యాకోచం. దీనికి ఉదాహరణలు

చెంబు
నూనె
కమ్మ
ధర్మరాజు
భీముడు
నారదుడు
మహారాజు
రాక్షసుడు
అవధాని
గంగ
అష్టకష్టాలు
అష్టైశ్వర్యాలు
తైలం
గ్లాసు.


అర్థ సంకోచం
అర్థం సంకోచం చెందడమే అర్థ సంకోచం. అంటే విశాల అర్థాన్ని బోధించే ఒక పదం సంకుచితార్థాన్ని లేదా తక్కువ అర్థాన్ని ఇస్తే దానిని అర్ధసంకోచ అంటారు దీనికి ఉదాహరణలు

చీర
కోక
మధు పర్కాలు
వస్తాదు
ఉద్యోగం
తద్దినం
ఆరాధ్యుడు
సంభావన
పెద్ద
వ్యవసాయం
మృగం
శ్రాద్దం
సాంవత్సరీకం
నెయ్యి
సాహెబు
పత్రం

అర్థ గౌరవం
ప్రాచీన కాలంలో నిందార్థంలో వాడిన పదాలు, సామాన్య అర్థంలో వాడిన పదాలు కొన్ని నేటి సాహిత్యంలో గౌరవార్థాన్ని సంతరించుకున్నాయి. ఇలా మారడాన్ని అర్థ సౌమ్యత లేదా అర్థోత్కర్ష అంటారు. దీనికి ఉదాహరనలు

సభికులు
ముహూర్తం
మర్యాద
వైతాళికుడు
అదృష్టం
అంతస్తు


అర్థ గ్రామ్యత
జన వ్యవహారంలో ఉన్న మౌలిక అర్థానికి నష్టం కలిగి పరిహాసార్థంలో, నిందార్థంలో, నిమ్నార్థంలో పదం వాడితే దాన్ని అర్థ గ్రామ్యత అంటారు. పాత కాలంలోని అర్థం కంటే తర్వాత కాలంలో అర్థం నీచమైంది, చెడ్డది అయితే దాన్ని అర్థాపకర్ష అంటారు. దీనికి ఉదాహరణలు

కర్మ
ఛాందసుడు
వ్యంగ్యం
కంపు
సన్యాసి
స్వాహా
దేవదాసి
కళావంతులు
కైంకర్యం
అసహ్యం
సాని
విధవ
ముండ
గ్రహచారం
పూజ్యం
నిండుకొన్నవి
శనిగ్రహం
ఘటం
సభ్యోక్తి
సభలో, కొందరి సమక్షంలో, సంఘంలో, ప్రత్యక్షంగా మాట్లాడటానికి, చెప్పటానికి చేయడానికి వీలుకాని పదాల అర్థాన్ని పరోక్షంగా లేదా నూతన పదబంధ కల్పనతో తెలియజేసే విధానాన్ని సభ్యోక్తి అంటారు. దీనికి ఉదాహరనలు

చనిపోవు: కాలధర్మం, కీర్తిశేషుడు, బాల్చితన్నాడు, శివైక్యం పొందాడు. స్వర్గస్థుడయ్యాడు, దివంగతుడయ్యాడు, దీర్ఘనిద్ర, నూకలు చెల్లాయి, పరమపదించాడు.
మూత్ర విసర్జన, మల విసర్జన: ఒంటికి, రెంటికి, లఘుశంక, గురుశంక, దొడ్డికెళ్లు, చెరువుకెళ్లు, కాల్వకు పోవు, చెంబట్టికెళ్లు, బయటకుపోవు, బహిర్భూమికి పోవు.
మలం: అశుద్ధం.
మల విసర్జన ప్రదేశం: పాయిఖానా, దొడ్డి,మరుగుదొడ్డి.
కడుపుతో ఉంది (గర్భవతి): ఆవిడ ఉత్తి మనిషి కాదు, నెల తప్పింది.
మృదూక్తి
కఠిన భావాల్ని, దుఃఖకరమైన విషయాన్ని, అభిప్రాయాన్ని మృదువైన రీతిలో చెప్పడమే మృదూక్తి. దీనికి ఉదాహరణలు

దీపం కొండెక్కింది – దీపం ఆరిపోయింది
సూత్రం పెరిగిపోయింది – తెగిపోయింది.
నల్లపూసలు పెరిగిపోయాయి – తెగిపోయాయి.

ముళ్ళ చినుకులు


"ఆధునిక మహిళ మానవ చరిత్రను తిరిగి రచిస్తుంది" అని గురజాడ అన్నారు.(21.05.1909న ఒంగోలు ముని సుబ్రహ్మణ్యంకు రాసిన గురజాడ లేఖ, చూ.. గురజాడ కవిత్వం-కొన్ని మహా వాక్యాలు, సాహితి పేజి, ప్రజాశక్తి దినపత్రిక, చంద్ర శేఖర్ రెడ్డి, రాచపాళెం. తేది: 4-10-2021)

         ఒక శతాబ్దం కంటే ముందే ఆధునిక మహిళా సమాజాన్ని సంస్కరించగలదనే ఒక భవిష్యత్తును గురజాడ కలగన్నాడు. నేటి సమాజంలో అనేక విజయాలతో తనను నిరూపించుకుంటున్న ఆధునిక మహిళలు చరిత్రపై తమ మార్పును, అభివృద్ధిలో, అనేక విషయాలలో తమను తాము రుజువు చేసుకుంటున్నారు. 

        తెలుగు కథా సాహిత్యం స్త్రీల నుంచే ప్రారంభమయ్యింది . 1902లో 'స్త్రీ ధనత్రయోదశి' అనే కథా రాసిన తొలి తెలుగు కథా రచయిత్రి భండారు అచ్చమాంభ. తెలుగు కథకు పాదులు వేసింది. 

   సత్య శోధక్ సమాజం ద్వారా ఫూలే వెలిగించిన చేయూత, మహిళల్లో అభ్యుదయాన్ని నింపింది. సామాజిక దృక్పతాన్ని కలిగించింది. నిజామాంధ్రలో భాగ్యరెడ్డి కలగన్న ఆధునిక సమాజం స్త్రీ విద్య ద్వారానే వ్యాప్తి చెందుతుందని బలంగా నమ్మారు. అంబేడ్కర్ ఇచ్చిన రాజ్యాంగ ఫలాల ద్వారా స్త్రీ విద్యా వ్యాప్తి జరిగింది. తత్ఫలితంగా స్త్రీ సృజనకారులు తమ బాధల్నీ తామే రాసి తెలియజేస్తున్నారు. 

  
      తొలి తెలుగు దళిత కథా రచయిత్రి తాడి నాగమ్మ. తూర్పు గోదావరి జిల్లాలో జన్మిచింది. ఆమె రాసిన తొలికథ 'ఇంకెక్కడి జయం' 1934లో గృహాలక్ష్మి పత్రికలో ప్రచురించబడింది. తెలంగాణలో తొలి కథ రాసిన రచయిత్రి మామిడిపూడి సత్యవతి.  

        చరిత్రను రాసేది ఆధునిక మహిళలే అని నిరూపితమవుతుంది. అందుఊ అణగారిన మహిళల పాత్ర గణనీయంగా ఉందని తమ కథలు, కవితలు, వివిధ సాహిత్య ప్రక్రియల ద్వారా సృజన శీలతలలో కనపడుతుంది. దళితమహిళలే చరిత్ర తిరిగి రచిస్తున్నారు అని చెప్పడానికి వారు రచిస్తున్న రచనలే బలమైన సాక్ష్యాలు. 

     1971-72 లో మహారాష్ట్రలో ప్రారంభమయిన దళిత పాంథర్స్ ఉద్యమం కొత్త చైతన్యాన్ని నింపింది. దళితోద్యమం పురుడుపోసుకుంది. దళిత స్పృహ పెరిగి రచనల్లో దళిత బాధలు సృజించబడుతున్నాయి. 

              దళిత కథా సంకలనాల్లో గోగు శ్యామల తెచ్చిన తొలి దళిత కథా సంకలనం "నల్లపొద్దు"., గోగు శ్యామల, జూపాక సుభద్రలు కలసి మాదిగ, మాదిగ ఉపకులాల కథ సంకలనం గా "నల్లరేగడి సాల్లు" గా వెలువరించారు. ఆ సంకలనాల్లో మొత్తం స్త్రీల కథలే (బహుశా...)

           దళిత రచయితలు, రచయిత్రులు రాసిన ఇరువై మూడు కథలతో కలిపి అరుణ గోగుల మండ, మానస ఎండ్లూరి (మిళింద కథా సంపుటి- కేంద్ర సాహిత్య అకాడెమీ యువ పురస్కార గ్రహీత) సంపాదకత్వంలో తెచ్చిన కథా సంకలనం "ముళ్ళ చినుకులు" . ఇందులో రెండు రాష్ట్రాలకు సంబధించిన కథలు ఉన్నాయి. వినూతనమైన కథలు ఉన్నాయి.  

కనపడే కనిపించని శత్రువు కులాన్ని అత్యాధునికంగా చిత్రించాయి. ఆధునిక యుగంలోకి మారుతున్న దళిత జీవన విధానం, వివిధ రకాల కుల వివక్షతలను చిత్రించాయి. ఆధునిక కాలంలో ఆధునిక దళిత కథలుగా దర్శనమిస్తాయి. ఇందులో నా కథ "ఆచరణ" ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు. 

            వినూత్న కథలతో సంకలనం తెచ్చినందుకు అభినందనలు ... 

జై భీమ్ లు,
జంబూ శనార్థులతో... 

డా. సిద్దెంకి యాదగిరి, 

జంబూ సాహతీ