పచ్చని అడవిలో ఇసుకవేస్తే రాలనంత జనం కంకవనం తోడుగా కుంకుమ బరిణెలో గద్దెలకు పయనం కోయపూజారులతో కొలువైన చిలుకలగుట్ట దేవగణం తడిబట్టల తానాలతో పూనకాల ప్రభంజనం నిలువెత్తు బెల్లాలు తల్లులకు మొక్కులుగా సమర్పణం సంప్రదాయ వేషధారణల నృత్యాల సమ్మేళనం రెండేళ్ళకొకసారి అంబరమంటే సంబురం - మన మేదారం కోరిన కోరికలు తీర్చే తెలంగాణ రాష్ట్ర కొంగు బంగారం.
2. మన జాతర - జన జాతర
(సమ్మక్క- సారక్కల మేడారం జాతర)
జాతర అంటే జనం ఒక్కచోట గుమిగూడడం, కష్టం సుఖం చెప్పుకోవడం. జాతర పదం సంస్కృతపదం 'యాత్ర' కు వికృతిరూపం. ఇప్పుడు ఉత్తరాలు, సెల్ఫోన్లు, రవాణసౌకర్యాలు ఉన్నాయి కాని ఇవేవీ లేని కాలంలో సకలజనం కలుసుకుని మాట్లాడుకునేది జాతరలోనె. పుట్టినా, చనిపోయినా, ఈ వార్తలన్నీ తెలిసిపోయేది 5-జాతరలోనె. ఊరికి దూరంగా వాగుపక్కనో. అడవిమధ్యనో జాతరలు రెండు మూడు రోజులు జరిగేవి. జనం బండ్లు కట్టుకొని వంటసామాగ్రి తీసుకుని పోయి రెండు మూడు రోజులు ఆత్మీయులతో కలిసి కడుపునిండా మాట్లాడుకొని వచ్చేవారు. మనుషులు కలుసుకోవడం, ఒక ఊరిలో జరిగిన మార్పులు, వింతలు విశేషాలు మరో ఊరికి తెలియడం ఈ జాతరల వెనుక ఉన్న అసలు ఉద్దేశం. ప్రస్తుతం భారతదేశంలోనే అతిపెద్ద జాతరగా పేరుపొందిన 'మేడారం' గిరిజన జాతర గురించి తెలుసుకుందాం.
జాతర జరిగే స్థలం : జయశంకర్ జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామం దగ్గర అడవిమధ్యలో 'చిలకల గుట్ట' ఉన్నది. చుట్టు దట్టమైన అడవి. ఇక్కడ రెండేండ్లకొకసారి మూడు
136
రోజులపాటు జాతర జరుగుతుంది. మాఘ శుద్ధ పౌర్ణమి (ఫిబ్రవరినెలలో) మొదలుకొని మూడురోజులపాటు జరిగే ఈ జాతరనే సమ్మక్క - సారక్క జాతర అంటారు. ఇది పూర్తిగా గిరిజన సంప్రదాయరీతిలో జరిగే జాతర. కేవలం మన రాష్ట్రంనుంచేకాక పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, దత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుండి కూడా లక్షలమంది భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకుంటారు.
ఎవరీ సమ్మక్క- సారక్క : గిరిజనులు దేవతామూర్తులుగా కొలిచి ఆరాధించే నమ్మక్క సారక్కలు ఇద్దరు తల్లీకూతుళ్లు, - గిరిజన హక్కులకోసం ఎదురుతిరిగి పోరాడిన వీరవనితలు.
12వ శతాబ్దంలో పూర్వపు కరీంనగర్ జిల్లా 'పొలవాస' ప్రాంతాన్ని గిరిజనదొర మేడరాజు పాలిస్తుండేవాడు. అతడికి సంతానం లేదు. ఒకనాడు వేటకు వెళ్లి అడవిలో పులుల మధ్య ఆడుకుంటున్న -దం న్నపిల్లను చూశాడు. దేవుడిచ్చిన వరంగా భావించి ఆ పాపను ఇంటికి తెచ్చి సాదుకున్నాడు. సమ్మక్క అని లేని రుపెట్టుకున్నాడు. చిన్నప్పటినుంచే సమ్మక్క చెట్లవైద్యం చేస్తూ తోటి గిరిజనులను రక్షించేది. ఆమెకు మహిమలు యేది న్నాయని, దేవతామూర్తి అనీ గిరిజనులు భావించేవారు. సమ్మక్క గిరిజన గూడానికి తలలో నాలుకయింది.
జనం మరో
ఆమెకు పెండ్లి వయసు వచ్చింది. మేడరాజు మేనల్లుడు పగిడిద్దరాజు. ఇతడు కాకతీయులకు సామంతరాజుగా ండి మేడారంను పాలిస్తుండేవాడు. పగిడిద్దరాజుకు సమ్మక్కనిచ్చి పెళ్లి చేశారు. సమ్మక్క మేడారం రాజ్యంలోకి డుగుపెట్టింది. వీరికి నాగులమ్మ, సారలమ్మ అనే ఇద్దరు బిడ్డలు, జంపన్న అనే కొడుకు పుట్టారు. సమ్మక్క ప్రజల ం వహించి పరిపాలనలో మార్పులు చేసింది. గిరిజనులకోసం ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టింది. ప్రజల గోగులు స్వయంగా తెలుసుకున్నది. మహారాణులంటే మేడల్లోనే ఉంటారు. ప్రజలకు కనిపించరు. కాని విదారం మహారాణి సమ్మక్క మాత్రం ఎప్పుడు ప్రజలమధ్యనే ఉండేది.
యుద్ధం అనివార్యం అప్పుడు కాకతీయ సామ్రాజ్యాన్ని ప్రతాపరుద్రుడు పాలిస్తుండేవాడు. రాజ్యవిస్తరణలో గంగా పొలవాసపై దండెత్తాడు. కాకతీయ సైన్యాన్ని ఎదిరించలేక మేడరాజు పారిపోయి అల్లుడు పగిడిద్దరాజు ద్ద అజ్ఞాతంగా కాలం గడుపుతున్నాడు. తన సామంతరాజు పగిడిద్దరాజు మేడరాజుకు ఆశ్రయమిచ్చినట్టు తాపరుద్రునికి తెలిసి కోపంగా ఉన్నాడు.
137
అప్పుడే కరువు కాటకాలొచ్చాయి. వానలు పడక పంటలు పండలేదు. ప్రజలనుంచి నిర్బంధంగా పన్నులు వసూలు చేయడం సమ్మక్కకు ఇష్టంలేదు. ఆదాయంలేక కాకతీయులకు కట్టాల్సిన కప్పం కట్టలేదు. ఇట్లా రెండు మూడేండ్లు గడిచాయి. కప్పం కోసం కాకతీయులు ఒత్తిడి చేశారు. పగిడిద్దరాజు ప్రజలను పీడించి పన్నులు కట్టలేనన్నాడు. అంతేగాక తన రాజ్యాన్ని స్వతంత్ర రాజ్యంగా ప్రకటించు కున్నాడు.
.
అసలే పగిడిద్దరాజుమీద కోపంతో ఉన్నాడు ప్రతాపరుద్రుడు. ఈ పనితో వెంటనే యుద్ధం ప్రకటించాడు. అతని మంత్రి యౌగంధరాయణుని నాయకత్వంలో సైన్యం లక్కవరం దగ్గర స్థావరం ఏర్పరుచుకున్నది.
సమ్మక్క వీరోచిత పోరాటం : యుద్ధవార్త విన్న సమ్మక్క భయపడలేదు. భర్తకు ధైర్యాన్ని నూరి పోసింది. తమ ప్రజలకోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమన్నది. యుద్ధం మొదలయింది. సంప్రదాయ ఆయుధాలు ధరించి సమ్మక్క కూడా యుద్ధరంగంలోకి దిగింది. వీరితోపాటు కొండాయి, గోవిందరాజు, కూతుర్లు నాగులమ్మ, సారలమ్మ, కొడుకు జంపన్న వీరోచితంగా పోరాడారు.
అతిపెద్ద సామ్రాజ్యమైన కాకతీయరాజు సైన్యం ముందు పగిడిద్దరాజు సైన్యం నిలబడలేకపోయింది. ఒక్కొక్కరుగా అందరు వీరమరణం పొందుతున్నారు. వీరోచితంగా పోరాడుతు గాయపడిన జంపన్న పక్కనే ఉన్న సంపెంగ వాగులోకి దూకి వీరమరణం పొందాడు. పగిడిద్దరాజు కూడ శత్రువుల చేతిలో హతం అయ్యాడు. చివరకు ఒక సమ్మక్క మాత్రమే మిగిలింది. కత్తి పట్టి వీరోచితంగా పోరాడుతూ శత్రుసైన్యాలను ఎదుర్కొన్నది.
యుద్ధంలో ముందుండి పోరాడుతారు తప్ప వెనకనుంచి వచ్చి దెబ్బకొట్టరు. ఇది యుద్ధనీతి. సమ్మక్క పోరాటాన్ని చూసి కాకతీయ సైన్యం ఆందోళన చెందింది. ఒక సైనికుడు దొంగచాటుగా వెనుకనుంచి వెళ్లి బల్లెంతో వీపులో పొడిచాడు. గాయపడిన సమ్మక్క గుర్రంమీద ఈశాన్యదిక్కున ఉన్న చిలకల గుట్టమీదికి పోయింది. ఎంత వెతికినా మళ్లీ ఎవరికీ కనిపించలేదు. ఆమెకోసం వెదుకుతున్న గిరిజనులకు ఓ నెమలినార చెట్టు, దానికింద ఓ పుట్ట. పుట్టమీద ఓ కుంకుమ బరిణ కనిపించింది.
సమ్మక్క గద్దె
138
ఆ బరిణలో పసుపు, కుంకుమ, చెట్లమూలికలు కనిపించాయి. సమ్మక్క తల్లి దేవతారూపం పొందిందని గిరిజనులు నమ్మారు.
రాజు కల : మేడారం కాకతీయుల వశమయింది. విజయగర్వంతో ఉన్న ప్రతాపరుద్రుని కలలో కులదైవం 'ఏకవీరాదేవి' కనిపించి సమ్మక్క మానవ రూపంలో వచ్చిన దేవత అని ఆమెకు జాతర జరిపించాలని చెప్పిందట. వెంటనే రాజు తన పురోహితుడిని మేడారం పంపి జాతర ఏర్పాట్లకు ఆదేశించాడట.
జాతర జరిగే విధం జాతరకు ప్రత్యేకంగా గిరిజన పురోహితులు ఉంటారు. వారు నియమనిష్టలతో జాతర కార్యక్రమం చేస్తారు. చిలకలగుట్టను గిరిజనులు పవిత్రమైనదిగా భావిస్తారు. ఆ గుట్టపైకి ఎవరూ పోరు.
జాతరకు ముందర ఒక కోయ యువకుడు చిలకలగుట్ట మీదికి పోయి పసుపు కుంకుమ ఉన్న బరిణను, చెదురుగడను తెచ్చి గద్దెలపై నిలపడంతో జాతర మొదలవుతుంది. అతడు పూనకంతో ఉంటాడు. సమ్మక్క 2. గాయపడ్డ చోటును తల్లిగద్దె అని, సారలమ్మ వీరమరణం పొందిన చోటును పిల్లగద్దె అని అంటారు. ఈ తతంగాన్ని 'దేవతలను ఆహ్వానించడం' అంటారు. తర్వాత భక్తులు గద్దెలను దర్శించుకోవడం మొదలవుతుంది. మూడవనాడు. య దేవతల వనప్రవేశంతో జాతర ముగుస్తుంది.
139
అమ్మవారి మొక్కులు : భక్తులు వివిధ రకాలుగా మొక్కులు చెల్లించుకుంటారు. ఈ జాతరలో బెల్లాన్ని 'బంగారం' అంటారు. భక్తులు నిలువెత్తు బంగారాన్ని అమ్మవారికి చెల్లించుకుంటారు. అంటే తమ బరువుకు సరిపోయిన బంగారాన్ని కొని అక్కడ పంచిపెడుతారు. అంతేకాకుండ ఒడి బియ్యం, తలవెంట్రుకలు ఇయ్యడం, వెదురుతొట్టె కట్టడం, కోడెలను కట్టేయడం ద్వారా తమ మొక్కులు చెల్లించుకుంటారు.
వందల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ జాతర 1940 నుండి ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చింది. 1996 సంవత్సరం నుండి ప్రభుత్వం ఈ పండుగను అధికారికంగా నిర్వహిస్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ పండుగకు మరింత ప్రాచుర్యం ఏర్పడింది.
పర్యావరణాన్ని రక్షించండి : మానవ మనుగడకు, అభివృద్ధికి ప్రకృతి ఎంతో ముఖ్యం. చెట్లు, గుట్టలు, వాగులు,
వంకలు, పేర్లు వీటిని కాపాడుకోవలసిన బాధ్యత మనమీద ఉన్నది. ఇవి లేకుంటే వర్షాలుండవు. వనరులు ఉండవు. కరువులు వచ్చి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇప్పుడు ప్లాస్టిక్ వాడకం ఎక్కువయింది. ఏ జాతరకు వెళ్లినా ప్లాస్టిక్ చెత్త కుప్పలు కుప్పలుగా తయారవుతున్నది. ప్లాస్టిక్ వాడకంతో పర్యావరణం దెబ్బతింటున్నది. జాతరల పేరిట ప్లాస్టిక్ చెత్తను తయారుచేయడం, అడవులను నరకడం వంటి వాటిని నివారించాలి.
జాతరలతో సుఖసంతోషాలు పొందాలే కాని పర్యావరణాన్ని పాడుచేసుకోకూడదు. మీరు ఎప్పుడు ఏ జాతరకు వెళ్లినా పర్యావరణానికి హాని కలిగించే పనులు చేయకూడదు.
140
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి