సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

కొత్త పొస్ట్



🌐 * L. I. P. తెలుగు ప్రారంభ పరీక్ష - BASELINE TEST 2026-27     🌐 * 10వ తరగతి 🌐 * 10వ తరగతి తెలుగులో 99% స్కోర్ సాధించాలంటే... 🌐 * తెలుగు వెలుగులీనేల 🌐 | ధ్వని గుర్తింపు / అక్షర గుర్తింపు     🌐 * సరళ పదాలు     🌐 * ఐ సి టి ఉపయోగించడం ఎలా?     🌐 SCERT         🌐 School Edu Dept.         🌐 * * PGI(Performance Grading Index         🌐 * * DIKSHA WEB         🌐 NCERT         🌐 NBT         🌐 UGC_NET         🌐 CIIL         🌐 * * NDL INDIA         🌐 SAHITHYA ACADEMY         🌐 | సిద్దెంకి కథలు     🌐 | సిద్దెంకి పుస్తకాలు     🌐 | సిద్దెంకి కవిత్వం 🌐 *"నీలి నేల ఎతలు - తెలంగాణ దళిత కథ పరిణామం కాలమ్ - కోలిమి"     🌐 | తెలుగులో అత్యుత్తమ పుస్తకాలు     🌐* | వ్యాసాలు / Articles     🌐* | దాశరథి పాటలు     🌐* | తెలంగాణ రాష్ట్రంలో దళిత కథ (2014:-07-2025)     🌐 * "సంస్కృతంతో తెలుగు కాలరాయొద్దు"     🌐 * పగిడి తెలంగాణ కథ 2024 "     🌐 * "ఆలోచనవాదుల పుష్పక విమానం దాశరథి ‘కవితా పుష్పకం’"     🌐 * Articles on Dr. Siddenky    

19, ఆగస్టు 2026, బుధవారం

పాఠ్య ప్రణాళిక

www.siddenky.blogspot.com `
siddenky.blogspot.com siddenky.blogspot.com siddenky.blogspot.com siddenky.blogspot.com siddenky.blogspot.com siddenky.blogspot.com
తరగతి: 8వ తరగతి     విషయం: తెలుగు (ప్రథమ భాష)     పాఠం పేరు: 1. త్యాగనిరతి
కాలాంశం సంఖ్య: 1     బోధనాంశం : పూర్వ పాఠ్యభాగమ్ / కవి పరిచయాదులు
1. బొమ్మను చూడండి, పాఠం నేపథ్యం, పాఠ్యభాగ వివరాలు, కవి పరిచయం

కాలాంశము పూర్తి అయ్యేసరికి సాధించాల్సిన సామర్థ్యాలు

  • చదవండి – ఆలోచించి చెప్పండి ఆధారంగా మాట్లాడగలుగుతారు.
  • పాఠం నేపథ్యం, పాఠ్యభాగ వివరాలను అర్థం చేసుకుని మాట్లాడగలుగుతారు.
  • ఇతిహాస ప్రక్రియ గురించి తెలుసుకుంటారు.
  • పాఠ్యభాగ కవి నన్నయ గురించి అర్థం చేసుకుంటారు.
  • త్యాగం, సహాయనిరతి, పరోపకారం వంటి విలువలను గుర్తించగలుగుతారు.

సామర్థ్యాలు – అభ్యసన ఫలితాలు  | బోధనాభ్యసన సామాగ్రి

  • చదవండి – ఆలోచించి చెప్పండి ఆధారంగా మాట్లాడగలుగుతారు.
  • పాఠం నేపథ్యం, పాఠ్యభాగ వివరాలను అర్థం చేసుకుని మాట్లాడగలుగుతారు.
  • ఇతిహాస ప్రక్రియ గురించి తెలుసుకుంటారు.
  • కవి నన్నయ గురించి తెలుసుకుంటారు.
  • త్యాగం, పరోపకారం యొక్క ప్రాముఖ్యతను గ్రహిస్తారు.
  • కవి పరిచయం చార్టు
  • నన్నయ చిత్రపటం
  • పాఠ్యపుస్తకం
  • బ్లాక్‌బోర్డు/డిజిటల్ బోర్డు

కృత్యాల నిర్వహణ – సోపానాలు

1. ఉన్ముఖీకరణ:

పిల్లలూ! ఎలా ఉన్నారు? 

ఈ రోజు మనం ఒక గొప్ప మానవీయ గుణం గురించి తెలుసుకోబోతున్నాం. 

అది ఏమిటో తెలుసుకోవడానికి కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి.

2. మౌఖిక సామర్థ్యాల సాధన:

  • మనం ఇతరుల సహాయం లేకుండా జీవించగలమా?
  • తరగతి గదిలో మీరు ఎప్పుడైనా మీ స్నేహితునికి సహాయం చేశారా?
  • పాఠశాల నుండి ఇంటికి వెళ్లే సమయంలో వృద్ధులకు ఎప్పుడైనా సహాయం అందించారా?
  • ఎలాంటి సహాయం చేశారు?
  • తిరిగి ప్రతిఫలం ఆశించకుండా చేసేదానిని ఏమంటారు?
  • దధీచి మహర్షి ఎలాంటి త్యాగం చేశాడు?
  • ఇలాంటి స్వభావం కలిగి ఉండటాన్ని ఏమంటారు?

విద్యార్థుల సమాధానాలను స్వీకరించి, త్యాగం, పరోపకారం, సహాయనిరతి వంటి భావాలను పరిచయం చేస్తాను.

3. శీర్షికా ప్రకటన:

పిల్లలూ! ఇతరుల మేలు కోసం, ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా చేసే త్యాగం గొప్ప గుణం. ఈ త్యాగనిరతి గుణాన్ని తెలియజేసే “త్యాగనిరతి” అనే పాఠాన్ని ఈ రోజు మనం తెలుసుకుందాం.

4. కీలకపదాలు:

దధీచి, అస్త్రాలు, యోగాగ్ని, యజ్ఞం, అగ్నిదేవుడు, ఇంద్రుడు, శరణు, ఇతిహాసం, వాగ్రూపం, అరణ్యపర్వం, వాగను, శాసనుడు, శారద, రాత్రులు.

పఠన కృత్యాలు

అ. ఆదర్శ పఠనం:

“చదవండి – ఆలోచించి చెప్పండి” లోని ప్రశ్నలు, పాఠం ఉద్దేశం, పాఠ్యభాగ వివరాలు, కవి పరిచయాలను స్పష్టమైన ఉచ్చారణ, సరైన స్వరభంగిమ, విరామాలతో ఆదర్శంగా చదివి వినిపిస్తాను.

ఆ. వ్యక్తిగత పఠనం:

విద్యార్థులతో పాఠ్యభాగంలోని ప్రశ్నలు, పాఠం ఉద్దేశం, పాఠ్యభాగ వివరాలు, కవి పరిచయాలను వ్యక్తిగతంగా చదివిస్తాను. అవసరమైన చోట్ల ఉచ్చారణ, పదవిభజన, విరామాలను సరిచేస్తాను.

అవగాహన కృత్యాలు

అర్థం చేయించడం

  1. “చదవండి – ఆలోచించి చెప్పండి”లోని ప్రశ్నలను, పాఠం ఉద్దేశం, పాఠ్యభాగ వివరాలు, కవి పరిచయాలను విద్యార్థులతో మౌన పఠనం చేయిస్తాను.
  2. విద్యార్థులను చిన్నచిన్న బృందాలుగా విభజించి, ప్రశ్నలపై చర్చ ద్వారా అవగాహన కలిగిస్తాను.
  3. చర్చలో వచ్చిన సమాధానాలను విశ్లేషించి, పాఠ్యభాగంలోని ముఖ్యమైన విషయాలను వివరిస్తాను.
  4. విద్యార్థుల సమాధానాలను సమన్వయం చేసి, పాఠంలోని ముఖ్యాంశాలను క్రోడీకరిస్తాను.

 చర్చ ద్వారా అవగాహన

1. దధీచి మహర్షి తండ్రి ఎవరు?

    1. దేవతల అస్త్రాలను దొంగిలిస్తున్న వారు ఎవరు?

    2. దధీచి మహర్షి దేవతల అస్త్రాలను రూపంలో మార్చి తాగాడు?

    3. ఇంద్రుని వజ్రాయుధం తయారయ్యేందుకు దధీచి ఏమి చేశాడు?

    4. శిబి చక్రవర్తి యజ్ఞం చేసిన పర్వతం పేరు ఏమిటి?

    5. శిబి చక్రవర్తి గుణాలను పరీక్షించాలనుకున్న దేవతలు ఎవరు?

    6. పావురం, ఇంద్రుడు రూపాల్లో ప్రత్యక్షమయ్యారు?

    7. పావురం భయంతో ఎవరిని ఆశ్రయించింది?

    8. ఇతిహాసం అంటే ఏమని అర్థం?

    9. ఇతిహాస కథలు గ్రంథరూపం కాకముందు రూపంలో ఉండేవి?

    10. ఇతిహాసాలు అని గ్రంథాలను అంటారు?

    11. “త్యాగనిరతి” పాఠాన్ని గ్రంథం నుండి తీసుకున్నారు?

    12. “త్యాగనిరతి” రచించిన కవి ఎవరు?

    13. నన్నయకు ఉన్న బిరుదు ఏమిటి?

    14. నన్నయ కవిత్వంలోని ముఖ్య లక్షణాలను వివరించండి.


విశేషాంశాలు

యోగాగ్ని, వజ్రాయుధం, శరణు, ఇతిహాసాలు, “ప్రసన్న కథా కలితార్థయుక్తి”, “అక్షర రమ్యత”, “నానారుచిరార్థ సూక్తి నిధిత్వం” వంటి విశేషాంశాలపై విద్యార్థులకు అవగాహన కలిగిస్తాను.

క్రోడీకరణ

విద్యార్థులతో ప్రశ్నోత్తరాల రూపంలో చర్చిస్తూ, దధీచి మహర్షి త్యాగం, శిబి చక్రవర్తి పరోపకార గుణం, ఇతిహాసాల స్వరూపం, నన్నయ కవిత్వ విశిష్టతలను పునశ్చరణ చేయించి పాఠ్యాంశ సారాంశాన్ని క్రోడీకరిస్తాను.

ఆలోచింపజేయడం

ఇంద్రుడు, అగ్నిదేవుడు శిబి చక్రవర్తిని ఎందుకు పరీక్షించాలి అనుకున్నారు?
చర్చించండి – కారణాలను వివరించండి – మీ అభిప్రాయాన్ని చెప్పండి.

మూల్యాంకనం

  1. నన్నయ జీవితంలో ముఖ్యమైన విషయాలను వివరించండి.

  2. రామాయణం, మహాభారతం వంటి గ్రంథాలను ఎందుకు ఇతిహాసాలు అంటారు?

  3. దధీచి మహర్షి చేసిన త్యాగం గురించి మీ మాటల్లో చెప్పండి.

  












18, ఆగస్టు 2026, మంగళవారం

6వ తరగతి ప్రాజెక్టు పని – 4. (లేఖ)

ప్రాజెక్టు పని – 4

చార్మినార్ చరిత్ర

1. ప్రాథమిక సమాచారం

ప్రాజెక్టులో పాల్గొన్న విద్యార్థి పేరు: ........................................
తరగతి: 6వ తరగతి
సెక్షన్: (  )
క్రమసంఖ్య: (  )

2. సమాచార సేకరణ విధానం

ఇంటర్నెట్ ద్వారా

3. సంక్షిప్త వివరణ – 400 పదాలు

చార్మినార్  హైదరాబాద్ నగర చారిత్రక కట్టడం. “చార్” అంటే నాలుగు, “మినార్” అంటే స్తంభం అనే అర్థాన్ని ఇస్తుంది. నాలుగు వైపులా ఉన్న ఎత్తైన మినార్ల కారణంగా దీనికి చార్మినార్ అనే పేరు వచ్చింది. 

చార్మినార్‌ను కుతుబ్‌షాహీ వంశానికి చెందిన మహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించాడు. కొత్త నగరానికి కేంద్ర బిందువుగా చార్మినార్‌ను నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. సాధారణంగా చార్మినార్ నిర్మాణం 1591 సంవత్సరంలో జరిగినట్లు చరిత్రలో పేర్కొంటారు.

చార్మినార్ కొందరు చరిత్రకారుల ప్రకారం నగర స్థాపనకు గుర్తుగా దీనిని నిర్మించారు. మరికొందరు ఆ కాలంలో వ్యాపించిన అంటువ్యాధి నుంచి విముక్తి లభించిన సందర్భంగా నిర్మించారని చెబుతారు. అందువల్ల చార్మినార్ చరిత్రలో అనేక ఆసక్తికరమైన కథనాలు కనిపిస్తాయి.

చార్మినార్ వాస్తుశిల్పం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇండో-ఇస్లామిక్, పర్షియన్ వాస్తుశైలుల ప్రభావం కనిపిస్తుంది. దీని చతురస్రాకార నిర్మాణానికి నాలుగు వైపులా నాలుగు భారీ మినార్లు ఉన్నాయి. ప్రతి మినార్ సుమారు 48 మీటర్ల ఎత్తు ఉంటుంది. మినార్లలో మెట్ల మార్గం ఉంది. పైభాగంలో ప్రార్థనల కోసం మసీదు కూడా ఉంది.

చార్మినార్ చుట్టూ మార్కెట్లకు ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా లాడ్ బజార్లో గాజులు, ఆభరణాలు, సంప్రదాయ వస్తువులు లభిస్తాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు చార్మినార్‌ను సందర్శిస్తారు.

4. నేర్చుకున్న అంశాలు 

చార్మినార్ హైదరాబాద్ చరిత్రకు ప్రతీక అని తెలుసుకున్నాను. కుతుబ్‌షాహీ కాలం, దాని నిర్మాణం, వాస్తుశైలి, నాలుగు మినార్ల ప్రత్యేకత గురించి తెలుసుకున్నాను.

5. ప్రదర్శన

“చార్మినార్ హైదరాబాద్ నగరానికి చారిత్రక ప్రతీక. దీని నిర్మాణం, వాస్తుశైలి, నాలుగు మినార్ల ప్రత్యేకతలను మీకు వివరిస్తాను.”

6వ తరగతి ప్రాజెక్టు పని – 3

ప్రాజెక్టు పని – 3

వానకాలాన్ని వర్ణించే పాటలపై నివేదిక

1. ప్రాథమిక సమాచారం

ప్రాజెక్టులో పాల్గొన్న విద్యార్థి పేరు: ........................................
తరగతి: 6వ తరగతి
సెక్షన్: (  )
క్రమసంఖ్య: (  )

2. సమాచార సేకరణ విధానం

అంతర్జాలం నుండి సేకరణ


3. సంక్షిప్త వివరణ

వర్షం ప్రకృతికి ఎంతో ముఖ్యమైనది. మనిషి జీవించడానికి అవసరమైన నీటికి వర్షమే ప్రధాన ఆధారం. ముఖ్యంగా రైతుల జీవితం వర్షాలతో ఎంతో ముడిపడి ఉంటుంది. వర్షాలు కురిస్తే పొలాల్లో పంటలు పండుతాయి. చెరువులు, కుంటలు, వాగులు నీటితో నిండుతాయి. పశువులకు, పక్షులకు, మనుషులకు నీరు లభిస్తుంది. 

ఈ ప్రాజెక్టులో భాగంగా రెండు వానపాటలను సేకరించాను. మొదటి పాట “వానమ్మ వానమ్మ”. ఇందులో వర్షం కోసం ఎదురుచూస్తున్న రైతు ఆవేదన వ్యక్తమవుతుంది.

“వానమ్మ వానమ్మ వానమ్మ
ఒక్కసారన్నా ఒచ్చిపోవే వానమ్మా
చేలల్లో నీళ్లు లేవు
చెలకల్లో నీళ్లు లేవు
వాగుల్లో నీళ్లు లేవు
వంపుల్లో నీళ్లు లేవు
నిన్నే నమ్మిన రైతు కళ్లల్లో నీళ్లు లేవు.”

ఈ పాటలో వర్షం లేకపోవడం వల్ల ఏర్పడిన కరువు పరిస్థితిని కవి హృద్యంగా చిత్రించారు. పొలాలు, చెలకలు, వాగులు, వంపులు అన్నీ నీరు లేక వెలవెలబోతున్నాయి. వర్షాన్ని నమ్ముకున్న రైతు కూడా తీవ్ర ఆందోళనకు గురవుతున్నాడు. “నిన్నే నమ్మిన రైతు కళ్లల్లో నీళ్లు లేవు” అనే వాక్యం రైతు దుఃఖాన్ని ఎంతో ప్రభావవంతంగా తెలియజేస్తుంది. 

రెండవ పాటలో వానను అందమైన ప్రకృతి దృశ్యంగా, ఆనందాన్ని కలిగించే అనుభూతిగా చిత్రించారు.

“వానా వానా తేనెల వానా
వానా వానా వెన్నెల వానా
కురవని కురవని
నే నిలువునా కరగనీ
పాప కంటి చూపులలో
పాల పంటి నవ్వులలో
బాల మేఘ మాలికలో
జాలువారు తొలకరిలో
తడిసి తడిసిపోనీ
మది మురిసి మురిసిపొనీ
తడిసి తడిసిపోనీ
ముడి బిగిసి బిగిసిపొనీ”

అంటూ వానను తేనెలతో, వెన్నెలతో పోల్చడం ఎంతో అందంగా ఉంది. “పాప కంటి చూపులలో, పాల పంటి నవ్వులలో, బాల మేఘ మాలికలో, జాలువారు తొలకరిలో” అంటూ వానను పిల్లల నవ్వులు, మేఘాలు, తొలకరి జల్లులతో అనుసంధానించారు. ఈ పాటలో వర్షం వల్ల కలిగే ఆనందం, ప్రకృతి సౌందర్యం, మనసులో కలిగే ఉల్లాసం వ్యక్తమవుతున్నాయి.

 పాటలో వర్షం కోసం రైతు ఎదురుచూపు, బాధ కనిపిస్తే, రెండవ పాటలో వర్షం రాకతో కలిగే ఆనందం, ప్రకృతి సౌందర్యం కనిపిస్తాయి. కాబట్టి వర్షం కేవలం ప్రకృతి పరిణామం, అది మనిషి జీవితం, వ్యవసాయం, ఆనందం, ఆర్థిక పరిస్థితులతో ముడిపడి ఉన్న జీవనాధారం. ఈ పాటలు నీటిని సంరక్షించుకోవాలనే బాధ్యతను కూడా మనకు గుర్తుచేస్తాయి.


4. నేర్చుకున్న అంశాలు

వర్షం రైతులకు, ప్రకృతికి, మనుషులందరికీ ఎంతో అవసరమని తెలుసుకున్నాను. వానపాటల ద్వారా రైతుల బాధను, వర్షం వల్ల కలిగే ఆనందాన్ని తెలుసుకున్నాను. నీటిని సంరక్షించాలని నేర్చుకున్నాను.

5. ప్రదర్శన

“నేను సేకరించిన రెండు వానపాటలను చదివి వినిపిస్తాను. వాటిలోని రైతు బాధ, ప్రకృతి సౌందర్యం, వర్షం ప్రాధాన్యతను వివరిస్తాను.”