సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

కొత్త పొస్ట్



🌐 * L. I. P. తెలుగు ప్రారంభ పరీక్ష - BASELINE TEST 2026-27     🌐 * 10వ తరగతి 🌐 * 10వ తరగతి తెలుగులో 99% స్కోర్ సాధించాలంటే... 🌐 * తెలుగు వెలుగులీనేల 🌐 | ధ్వని గుర్తింపు / అక్షర గుర్తింపు     🌐 * సరళ పదాలు     🌐 * ఐ సి టి ఉపయోగించడం ఎలా?     🌐 * * DIKSHA WEB         🌐 SCERT         🌐 NCERT         🌐 NBT         🌐 UGC_NET         🌐 CIIL         🌐 * * NDL INDIA         🌐 SAHITHYA ACADEMY         🌐 | సిద్దెంకి కథలు     🌐 | సిద్దెంకి పుస్తకాలు     🌐 | సిద్దెంకి కవిత్వం 🌐 *"నీలి నేల ఎతలు - తెలంగాణ దళిత కథ పరిణామం కాలమ్ - కోలిమి"     🌐 | తెలుగులో అత్యుత్తమ పుస్తకాలు     🌐* | వ్యాసాలు / Articles     🌐* | దాశరథి పాటలు     🌐* | తెలంగాణ రాష్ట్రంలో దళిత కథ (2014:-07-2025)     🌐 * "సంస్కృతంతో తెలుగు కాలరాయొద్దు"     🌐 * పగిడి తెలంగాణ కథ 2024 "     🌐 * "ఆలోచనవాదుల పుష్పక విమానం దాశరథి ‘కవితా పుష్పకం’"     🌐 * Articles on Dr. Siddenky    

2, ఆగస్టు 2024, శుక్రవారం

VII. 4 అమ్మ జ్ఞాపకాలు

కవి పరిచయం:

కవి : టి. కృష్ణమూర్తి యాదవ్.
కాలం : 1914 – 1985.
జన్మస్థలం : వరంగల్ అర్బన్ జిల్లా, భీమదేవరపల్లి.
రచనలు : ఈయన తన తొలి కవితా సంపుటి “తొక్కుడు బండ”తో సాహితీ క్షేత్రంలో ప్రవేశించాడు. ‘శబ్నం’ వీరి రెండవ కవితాసంపుటి. గ్రామీణ జీవితానుభవాలు, మధ్యతరగతి జీవన చిత్రణ తన కవిత్వంలో ప్రధానంగా కనిపిస్తాయి.
రచనా శైలి : సరళమైన వచనాభివ్యక్తి, నిరాడంబరమైన శైలి ఈయన ప్రత్యేకత.


ప్రవేశి క :

అమ్మంటే ఆత్మీయత అనురాగాల కలబోత. అమ్మ మంకు చేసే పిల్లవాడికి చందమామను చూపిస్తూ గోరుముద్దలు తినిపిస్తుంది. అమ్మ గొప్పతనం మాటలకందనిది. కుటుంబంకోసం అమ్మ పడే తపన, ఆరాటం అనితరసాధ్యం. అమ్మ జ్ఞాపకాలను హృదయానికి హత్తుకునే విధంగా కవి ఎట్లా వర్ణించాడో చూద్దాం.ప్రశ్న 1.
పై బొమ్మలో ఎవరెవరున్నారు?
జవాబు. పై బొమ్మలో తల్లి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆకాశంలో చందమామ ఉన్నాడు.

పాఠ్యభాగ వివరాలు:

ఈ పాఠం వచన కవిత (ప్రక్రియకు చెందినది. తెలుగులోనికి వచన కవిత ఆంగ్ల సాహిత్య (ప్రభావంతో వచ్చింది. ఆంగ్లంలో దీనిని ‘Free Verse’ అంటారు. పద్యగేయాల్లో ఉండే ఛందస్సు, మాత్రాగణాల నియమం లేకుండా స్వేచ్ఛగా భావయుక్తంగా వాక్యాలతో ఉంటుంది. వచనశైలిలో రాసే ఈ విధానాన్ని వచన కవితగా పిలుస్తున్నాం. ఈ పాఠం కృష్ణమూర్తి యాదవ్ రచించిన ‘శబ్నం’ కవితా సంపుటిలోనిది.



ఇవి చేయండి

I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం

ప్రశ్న 1.అమ్మ జ్ఞాపకాలను కవి గుర్తుకు తెచ్చుకున్నాడు కదా! మీరు మీ అమ్మ గురించి చెప్పండి.
జవాబు.
మా అమ్మ నా బాల్యంలో నాకు నీళ్ళు పోసేది. పాలిచ్చేది. ఆకలివేస్తే అన్నంకాని ఏదో ఒకటిగాని పెట్టేది. దెబ్బ లేదా బాధ పడి వెళ్ళి ‘అమ్మా!’ అంటే ఓదార్చేది. నొప్పి వెంటనే పోయేది. జ్వరం, జబ్బు చేస్తే నిద్రపోయేదికాదు. రాత్రి, పగలు నావెంటే ఉండేది. అమ్మ పక్కనే ఉంటే ఎంతో హాయిగా ఉండేది. అమ్మ ఉన్నప్పుడు విలువ తెలియదు. అమ్మ లేనపుడే అమ్మ విలువ తెలుస్తుంది. మేమెప్పుడూ మా అమ్మను మరచిపోము.

ప్రశ్న 2.మీరు మీ అమ్ సంతోషపెట్టడానికి ఏమేమి చేస్తారు?
జవాబు.
మేము మా అమ్మను సంతోషపెట్టడానికి మంచి పనులు చేస్తాము. మంచి ప్రవర్తనతో ఉంటాము. బాగా చదువుకొంటాము. ఇతరులతో తగాదాలకు వెళ్ళము. అమ్మ చెప్పిన పనులు చేస్తే అమ్మకు చాలా ఇష్టం కదా! అవే చేస్తాము. మా అమ్మ ఇంటి పనులలో సహాయపడతాము. అమ్మ కోరుకున్నది సాధించడానికి ఏమి చేయడానికైనా సిద్ధపడతాము.

II. ధారాళంగా చదవడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం.

1. పాఠం చదవండి. వివిధ అంశాలను కవి ఎట్లా పోల్చాడో పట్టికలో రాయండి.

అంశం పోలిక
ముగ్గులేసిన ప్రాంగణం అద్దకపు చీర
పండ్లు పాల బలపాలు
ఇల్లు దవాఖానా
దొరలబిడ్డలు తెల్లకుందేళ్ళు
ముక్కుపోగు నెలవంకలా అర్ధచంద్రాకారం
వడ్లు దంచే చప్పుడు మద్దెల మోత
ముక్కు పుల్ల విష్ణువు ముట్టెమీద ఎత్తిన భూగోళం
గంటీలు గడియారంలోని లోలకం
అమ్మ ఒడి గుమ్మి

2. కింది పేరా చదివి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

ధర్మం మూర్తీభవించిన శ్రీరాముణ్ణి తీర్చిదిద్దింది తల్లి కౌసల్యే. లవకుశులు వీరులుగా, శూరులుగా, పరాక్రమశీలురుగా తయారైంది తల్లి సీతమ్మ శిక్షణలోనే. కాలినడకన ఆసేతు హిమాచలం పర్యటించి, అద్వైత సిద్ధాంతాన్ని బోధించి, దేశసమైక్యతను, సమగ్రతను కాపాడిన ఆదిశంకరులు కూడా తల్లి ఆర్యాంబ ఒడిలోనే పెరిగి పెద్దవాడయ్యాడు.



భారతజాతికి గర్వకారణమైన వీరుడుగా, శూరుడుగా, పేరు ప్రఖ్యాతులనందుకొనిన వీరశివాజీ తన తల్లి జిజియాబాయి చేతులలోనే పెరిగి పెద్దవాడయ్యాడు. ఒక సామాన్య బాలునిలో నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, దేశభక్తి భావాలను నాటి, పెంచి, పోషించి గాంధీని మహాత్మునిగా రూపొందించగలిగింది ఆయన మాతృమూర్తి పుతిలీబాయి. ప్రపంచ చరిత్రను సునిశితంగా పరిశీలిస్తే ఒక వాస్తవం తేటతెల్లమౌతుంది. జాతి గర్వించదగిన వీరులను, శూరులను, మహనీయులను, మహాపురుషులను, ప్రవక్తలను, సంఘసంస్కర్తలను, జ్ఞానులను, యోగులను రూపుదిద్దగల్గిన శిల్పులు మాతృమూర్తులేనని స్పష్టమవుతున్నది.

(అ) సీతమ్మ లవకుశులను ఎట్లా తీర్చిదిద్దింది?
జవాబు.
సీతమ్మ లవకుశులను వీరులుగా, శూరులుగా, పరాక్రమశీలురుగా తీర్చిదిద్దింది.

(ఆ) ఆదిశంకరుల తల్లి పేరేమిటి?
జవాబు.
ఆదిశంకరుల తల్లిపేరు ఆర్యాంబ.

(ఇ) శివాజీని జిజియాబాయి ఎట్లా పెంచింది?
జవాబు.
శివాజీని జిజియాబాయి వీరుడిగా, శూరుడిగా పేరు ప్రఖ్యాతులు వచ్చేటట్లు పెంచింది.

(ఈ) గాంధీ మహాత్ముడుగా రూపుదిద్దుకోవడానికి కారణం ఎవరు?
జవాబు.
గాంధీ మహాత్ముడుగా రూపుదిద్దుకోవడానికి కారణం అతని తల్లి పుతిలీబాయి.

(ఉ) జాతి గర్వించదగిన మహనీయులను రూపుదిద్దిన మహాశిల్పులు ఎవరు?
జవాబు.
జాతి గర్వించదగిన మహనీయులను రూపుదిద్దిన మహాశిల్పులు అంతా ఆ మహనీయుల తల్లులే!

III. స్వీయరచన

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ. కవి రచనా శైలిని సొంతమాటల్లో రాయండి.
(లేదా)
ఈ కవితలోని రచయిత రచనాపద్ధతి ఎట్టిది?
జవాబు.
కవి ఈ గేయాన్ని వచనకవితా ప్రక్రియలో రాశాడు. గేయాన్ని ఎలాంటి ఛందో నియమాలను పట్టించుకోకుండా భావానికి ప్రాధాన్యత నిస్తూ రాశాడు. ‘అమ్మ’ను కవితా వస్తువుగా తీసుకొని ప్రతి వాడి మనసులో అమ్మ స్థానాన్ని, విలువను నింపాడు. సరళమైన భాషతో, తేలికైన పదాలతో చెప్పదలచుకొన్న అభిప్రాయాన్ని చక్కగా తెలిపాడు. తెలంగాణ భాషలో, యాసలో వచన కవిత రాసిన వాడుగా గుర్తింపు పొందాడు.


ఆ. కాలుష్య నిర్మూలన కార్యకర్తగా అమ్మ పనిచేసింది’ అని అనడంలో కవి ఉద్దేశం ఏమిటి?
(లేదా)
అమ్మ కుటుంబంలో పరిశుభ్రతను ఎలా పాటిస్తుంది ?
జవాబు.
కవి తన రచనలో అమ్మను స్వచ్ఛభారత్లో కాలుష్య నిర్మూలనా కార్యకర్తగా చూపాడు. ఇంటి ముందరి ముగ్గులో రంగులద్దిన చీరను చూపాడు. అమ్మ పళ్ళను తెల్లని పాలబలపాలుగా చిత్రీకరించాడు. పిల్లలకు జ్వరం వస్తే ఇంటినే దవాఖానాగా మార్చాడు. దొరల కొట్టంలో బర్లను శుభ్రంచేసి, పెండను తీసే కార్యకర్తగా వర్ణించాడు. అమ్మ పిల్లల పెంపకంలో ఆరోగ్య కార్యకర్తగా చూపాడు.

ఇ. మీ అమ్మ ఇష్టాలను గురించి మీ సొంత మాటలో రాయండి.
(లేదా)
మీ అమ్మ ఆలోచనలను, కోరికలను గూర్చి వ్రాయండి.
జవాబు.
మా అమ్మకు తన పిల్లలంటే చాలా ఇష్టం. తన బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలని, బాగా ఎదగాలని కోరేది. తన పిల్లలు అందరికంటే బాగా చదివితే ఇష్టం. తన పిల్లలు తన ముందే ఆటలలోను, పాటలలోను బాగా రాణిస్తే ఇష్టం. తన బిడ్డలు తన కళ్ళముందే ఎదుగుతుంటే లోలోపల ఆనందంతో మురిసిపోవడం తన కిష్టం. అమ్మ ఇష్టాలను తీర్చడం కష్టమైనా మా కిష్టం.

ఈ. అమ్మచేసే పనుల్లో మనం కూడా ఎందుకు సహాయం చేయాలి.
(లేదా)
మీ ఇంట్లో నీ తల్లికి సాయం చేయడంలో నీ పాత్ర ఏమిటి?
జవాబు.
అమ్మ తన బిడ్డలు కష్టపడకూడదని అన్ని పనులు తనే చేసుకుంటుంది. పిల్లలు పెద్దయిన తర్వాత వారే నేర్చుకుంటారని ఏ పనీ మనకు చెప్పదు. మనం ఇంట్లో అన్ని పనుల్లోను ఎంతో కొంత అమ్మకు సాయం చేయాలి. అమ్మకు సాయం చేస్తే అందులో మనకు కూడా పనులు అలవాటవుతాయి. నేర్చుకుంటాము. తృప్తి మిగులుతుంది. అమ్మ శిక్షణలో చేసేపనుల వలన పెద్దయిన తర్వాత మన పనులు మనమే చేసుకోగలుగుతాం. ఒక పని అందరూ చేస్తే ఎవరికీ ఎక్కువ శ్రమ, ఆయాసం ఉండదు. త్వరగా కూడా పూర్తవుతుంది.

2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

ప్రశ్న 1.అమ్మ గొప్పతనాన్ని మీ సొంత మాటల్లో రాయండి.
జవాబు.
అమ్మ పరిశుభ్రత : అమ్మ వాకిట్లో ముగ్గులేస్తే రంగులు అద్దిన చీరలా కనిపించేది. నవ్వితే పళ్ళు బలపాల్లా ఉండేవి. పిల్లలకు జలుబుచేస్తే, జ్వరం వస్తే ఇంటినే దవాఖానా (హాస్పటల్)గా మార్చేది. ఒక నర్సులాగా మందు బిళ్ళలు వేసేది. అమ్మ కష్టం : అయ్య పాలు పిండితే అమ్మ దొర కొట్టంలో పెండ తీసేది. భూస్వాముల ఇళ్ళముందు కుందీలో పోసి వడ్లను దంచేది.

అమ్మ అందం : అమ్మ ముక్కు పోగు ఆకాశానికి హత్తుకొన్న నెలవంకలాగా అందంగా ఉంది. అమ్మ ముక్కుపుల్ల ముట్టె మీద ఎత్తిన భూగోళంలా ఉంది. గంటలు గడియారంలోని లోలకంలాగా ఊగేవి. అమ్మకు కాళ్ళకు కడియాలు వేసుకోవడం, మట్టెలు తొడుక్కోవడం చాలా ఇష్టం.

అమ్మ ప్రేమ : అమ్మ రోజంతా పనిచేసి సోలెడు నూకలను చీరకొంగున మూటగట్టి తెచ్చేది. అమ్మ పిల్లలు ఎదురు చూస్తారని ఒడిలో పల్లికాయలు, పెసరకాయలు తెచ్చి పెట్టేది. అమ్మ ఒడి నుండి ఎన్ని తీసుకొన్నా ఇంకా మిగిలే ఉంటాయి. అమ్మ గొప్పదనాన్ని చెప్పడం ఎవరికీ సాధ్యంకాదు.

IV. సృజనాత్మకత/ప్రశంస

1. మీ అమ్మ బొమ్మ గీయండి. అమ్మ గొప్పతనం తెలిపేటట్లు చిన్న కవిత రాయండి.

అమ్మ ప్రేమ చాలా మధురం
తీయని మాటల సమూహం
చక్కని అందాల సమస్తం
తన పలుకులతో పిల్లలను
ఉత్తమ రత్నాల్లా తీర్చేది అమ్మ
తన శ్రమనంతా కూర్చి
వారి కెలాంటి బాధ, వ్యధ లేకుండా చేసేది అమ్మ
తన శరీరాన్ని స్థానంగా చేసి, అమృత ధారలను పంచి
హాయినీ, ఆనందాన్ని కుటుంబానికిచ్చేది అమ్మ

2. పాఠ్యభాగం ఆధారంగా క్రింది ఖాళీలను పూర్తిచేయండి. (అదనపు ప్రశ్న)

1. అమ్మ ముగ్గులేస్తే ప్రాంగణం అద్దకపు చీర లా కన్పించేది.
2. దూడల నోళ్ళు కట్టి పితికిన పాలు ఆస్థానపు తెల్ల కుందేళ్ళు తాగేవి.
3. గోవుల ప్రక్కన ల్యాగల్లా ఇంటిముందు ఆడుకొనేవాళ్ళు.
4. చెవుల గెంటీలు గడియారంలోని పెండ్యులం లా ఊగేవి.
5. తేనెటీగల్లా అమ్మ జ్ఞాపకాలు నా చుట్టూ ముసురుతాయి.

3. అమ్మ ప్రేమ గొప్పతనాన్ని గూర్చి










V. పదజాల వినియోగం:

1. కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు సరైన అర్థాలు గుర్తించండి.

ప్రశ్న 1.
జెండావందనం రోజు మా పాఠశాల ప్రాంగణాన్ని ముగ్గులతో అలంకరిస్తాం.
జవాబు.ఇ) ముంగిలి

ప్రశ్న 2.
మా ఊరిలో వస్త్రాలపై అద్దకం చేసేవారు ఉన్నారు.
అ) గోడకు వేసే సున్నం
ఆ) బట్టలకు రంగు వేసే విధానం
ఇ) రంగు వేయడం
ఈ) రంగు తీసివేయడం
జవాబు.
ఇ) రంగు వేయడం

ప్రశ్న 3.
బాసర పుణ్యక్షేత్రం గోదావరి గట్టున ఉంది.
అ) కట్ట
ఆ) గోడ
ఇ) తీరం
ఈ) దూరం
జవాబ

2. ఈ కింద గీత గీసిన పదాలకు పర్యాయపదాలు రాయండి.

అ) కంచు మోగునట్లు కనకంబు మోగునా ?
కనకంబు = బంగారం, పుత్తడి, హేమం, సువర్ణం

ఆ) కుందేలు ఉపాయంతో అపాయాన్ని జయించింది.
కుందేలు – శశకము, చెవులపిల్లి, శరభం

ఇ) ఆవు అంబా అని పిలిస్తే దూడ గంతులు వేసుకుంటూ వచ్చింది.
దూడ – పెయ్య, లేగ, క్రేపు

3. ఈ కింద గీత గీసిన ప్రకృతి పదాలకు వికృతి పదాలు, వికృతి పదాలకు ప్రకృతి పదాలు రాయండి.

అ) కుల్యలో కాగితపు పడవలు వేసి పిల్లలు ఆడుకుంటున్నారు.
కుల్య (ప్ర) – కాలువ (వి)

ఆ) ఆకాశంలో పక్షులు స్వేచ్ఛగా ఎగురుతున్నాయి.
ఆకాశం (ప్ర) – ఆకసం (వి)

ఇ) శ్రావ్య మొగము ఎంతో అందంగా ఉంది.
మొగము (వి) – ముఖము (ప్ర)


VI. భాషను గురించి తెలుసుకుందాం:

1. ఈ కింది పదాలను విడదీయండి.

అ) అతడెక్కడ =అతడు + ఎక్కడ

ఆ) బొమ్మనిచ్చెను = బొమ్మను + ఇచ్చెను

ఇ) మనిషన్నవాడు = మనిషి + అన్నవాడు




2. ఈ కింది పదాలను కలపండి.

అ) మేన + అల్లుడు =మేనల్లుడ
ఆ) పుట్టిన + ఇల్లు = పుట్టినిల్లు

ఇ) ఏమి + అంటివి =ఏమంటివి.

ఉత్త్వ సంధి:

ఈ కింది పదాలను గమనించండి.
అ) రాముడు + అతడు = రాముడతడు = ఉ + అ = అ
ఆ) సోముడు + ఇతడు = సోముడితడు = ఉ + ఇ = ఇ
ఇ) మనము + ఉంటిమి = మనముంటిమి = ఉ + ఉ = ఉ
ఈ) అతడు + ఎక్కడ = అతడైక్కడ = ఉ + ఎ = ఎ

మొదటి పదంలోని చివరి అచ్చు ‘ఉ’, రెండవ పదంలోని మొదటి అచ్చుతో కలిసినపుడు మొదటి పదంలోని అచ్చు (ఉ) లోపిస్తుంది. రెండో పదంలోని మొదటి అచ్చు అట్లాగే నిలిచి ఉంటుంది. అనగా ఉకారం మీద ఏదైనా అచ్చు వచ్చి చేరితే సంధి తప్పక జరుగుతుంది. దీనినే ‘ఉత్త్వసంధి’ అంటాం.
‘ఉ’ కారాన్ని ఉత్తు అంటారు.
ఉత్తునకు అచ్చుపరమైతే సంధి తప్పక జరుగుతుంది.

3. ఈ కింది పదాలను కలిపి రాయండి.

అ) చెట్టు + ఎక్కి = చెట్టెక్కి

ఆ) వాడు + ఎక్కడ = వాడెక్కడ

ఇ) ఎదురు + ఏగి =ఎదురేగి

4. ఈ కింది పదాలను విడదీయండి.

అ) నూకలేసుకొని = నూకలు + ఏసుకొని

ఆ) చూరెక్కి = చూరు + ఎక్కి

ఇ) ఎట్లున్నది = ఎట్లు+ ఉన్నది.

......................           


VI. 12. కాపాడుకుందాం

VI. 12. VI. 12. కాపాడుకుందాం

ప్రశ్న 1.
పై బొమ్మలో ఎవరున్నారు ?
జవాబు.
పై బొమ్మలో ఒక కట్టెలు కొట్టేవాడున్నాడు.

ప్రశ్న 2.
బొమ్మలోని వ్యక్తి ఏమి చేసి ఉండవచ్చు ?
జవాబు.
బొమ్మలోని వ్యక్తి కట్టెల కోసం చెట్లన్నింటినీ నరికేసి ఉండవచ్చు.

ప్రశ్న 3.
బొమ్మలోని వ్యక్తి చేసిన పనిని మీరు అంగీకరిస్తారా ? ఎందుకు ?
జవాబు.
బొమ్మలోని వ్యక్తి చేసిన పనిని నేను అంగీకరించను. ఎందుకంటే చెట్లు మనకు ప్రాణాధారం. చెట్లను కొట్టేస్తే వాతావరణంలో సమతౌల్యం లోపిస్తుంది.

ప్రశ్న 4.
ప్రకృతిని కాపాడాలంటే ఏమి చేయాలి ?
జవాబు.
ప్రకృతిని కాపాడాలంటే చెట్లను ఎక్కువగా పెంచాలి.

పాఠం ఉద్దేశం:

మన చుట్టూ ఉన్న చెట్లూ చేమలు, నదులు ఇవన్నీ ప్రకృతిలో భాగమే. అవి మనకు జీవనాధారమై రక్షణ కవచమై నిలుస్తున్నాయి. వాటికి హాని కలిగించకుండా వాటిని కాపాడుకోవడమే మన ధర్మం అని తెల్పడం ఈ పాఠం ఉద్దేశం.

పాఠ్యభాగ వివరాలు:

ఈ పాఠం సంభాషణ అనే ప్రక్రియకు చెందినది. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తుల మధ్య జరిగే మాటల కొనసాగింపు సంభాషణ. సంభాషణలు మన కళ్ళముందు పాత్రలు మాట్లాడినట్లు అనుభూతిని కలిగిస్తాయి.

ప్రవేశిక:

చెట్లు, పక్షులు, జంతువులు, బావులు, నదులు, చెరువులు మొదలైనవన్ని ఈ అందమైన ప్రపంచంలో భాగంగా ఉన్నాయి. వీటిని మనం జాగ్రత్తగా వినియోగించుకుంటూ సుఖంగా జీవించే ప్రయత్నం చేయాలి. కానీ మనిషి తన బాధ్యతను మరచిపోయి ప్రకృతిని రక్షించుకోవడంలో అశ్రద్ధ చేస్తున్నాడు. అందువల్ల ఎన్నో అవస్థలు పడుతున్నాడు. ఆ సంగతులన్నీ తెలుసుకోవాలని ఉందా! అయితే ఈ పాఠం చదవండి.


ఇవి చేయండి

1. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం

ప్రశ్న 1.
ఈ పాఠం ద్వారా మీరు ఏం గ్రహించారో చెప్పండి?
జవాబు.
పెరిగిపోతున్న జనాభా వల్ల, వాళ్ల అవసరాలు తీర్చటానికి, మనుషుల్లో పెరిగిపోతున్న అంతులేని ఆశల వల్ల, స్వార్థంవల్ల అడవులు నాశనమైపోతున్నాయి. వాతావరణం, ప్రకృతి వనరులు దెబ్బతింటున్నాయి. జంతువులకు, పక్షులకు గూడు కరువైపోతోంది అని ఈ పాఠం ద్వారా తెలుస్తుంది.

ప్రశ్న 2.
“పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత” దీన్ని సమర్థిస్తూ మాట్లాడండి ?
జవాబు.
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రకృతి సంపద మనకు దేవుడిచ్చిన వరం. అది ఏ ఒక్కరి సొంతం కాదు. అందరికీ దాని మీద అధికారం ఉంది. అధికారం గురించి మాట్లాడినప్పుడు బాధ్యత గురించి కూడా మాట్లాడాలిగదా! మనం ఇంత సంపద సొంతం చేసుకున్నప్పుడు దాన్ని రక్షించుకోవలసిన బాధ్యత కూడా మనదేనని మర్చిపోకూడదు. మనం దానిని జాగ్రత్తగా వాడుకుంటూ మన తరువాత తరాల వారికోసం జాగ్రత్త చెయ్యాలి. అప్పుడే అందరి జీవితాలు ఆనందమయంగా ఉంటాయి.


II. ధారాళంగా చదవడం – అర్థం చేసుకొని, ప్రతిస్పందించడం


1. పాఠం చదివి కింది మాటలు ఎవరు ఎవరితో అన్నారో రాయండి.


(అ) పెద్ద చెరువు ఎప్పుడు ఎండిపోలేదట గదా! అయితే ఈ సారి ఎందుకు ఎండిపోయింది ?

జవాబు.

ఈ మాటలు ‘కాపాడుకుందాం’ అనే పాఠంలోనివి. గోపాల్ అన్నమ్మతో ఈ మాటలు అన్నాడు.


(ఆ) జనం మధ్యలో సెల్వర్లాయె. ఇక ఎట్లా బతుకుతయ్ ?

జవాబు.

ఈ మాటలు ‘కాపాడుకుందాం’ అనే పాఠలోనివి. అన్నమ్మ లక్ష్మితో అన్న మాటలివి.


(ఇ) బావులు, నదులు ఇవన్నీ నీళ్లతోటి కళకళలాడితే నీళ్లకేం కష్టం.

జవాబు.

ఈ మాటలు ‘కాపాడుకుందాం’ అనే పాఠంలోనివి. లక్ష్మి గోపాల్తో అన్నది.


(ఈ) తేళ్లు, పాములు భయంతోటి అల్లాడవట్టె.

జవాబు.

ఈ మాటలు ‘కాపాడుకుందాం’ అనే పాఠంలోనివి. నరసయ్య అన్నమ్మతో అన్న మాటలివి.


2. కింది పేరాను చదివి పట్టికను పూరించండి.


నేను చెట్టును. మీకు తల్లివంటిదాన్ని. నన్ను నరికి కరువు కోరల్లో చిక్కుకోవద్దు. మానవుల్లారా ! అమ్మలాంటి నన్ను కొట్టకండి. కాసుల కోసం అమ్మకండి. పండ్లను, నీడను, ప్రాణవాయువులను ఇచ్చే త్యాగజాతి మాది. చచ్చిన మీ మనుషులకై బతికిన మమ్ములను నరికే జాతి మీది. చేతనైతే మీ పుట్టిన రోజున పది మొక్కలను నాటి నీరు పోసి కాపాడండి. కానీ దయచేసి తుంచకండి.


చేయకూడనివి చెట్లను నరకకూడదు. కొట్టకూడదు. డబ్బుకోసం అమ్మకూడదు. తుంచకూడదు.

చేయవలసినవి మొక్కలను నాటాలి. నీరు పోసి కాపాడాలి.

త్యాగజీవులు అందించేవి పండ్లు, నీడ, ప్రాణవాయువులు

శీర్షిక చెట్టు తల్లి వంటిది.

III. స్వీయ రచన


1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.


(అ) “చెరపకురా చెరువులను, చెడిపోతావు” దీనిపై మీ అభిప్రాయాన్ని రాయండి?

జవాబు.

చెరువులను చెరపకూడదు. అంటే పాడుచేయకూడదు. స్వార్థం కోసం ఆక్రమించుకోకూడదు. పశువులను కడిగి, చెత్తాచెదారం పడేసి, రసాయనిక వ్యర్థాలను కలిపి అనేక విధాలుగా చెరువులను కలుషితం చేయకూడదు. చుట్టుపక్కల ఉండే నీటిగుంటలను మూసేయటం, నేలంతా గచ్చు చేయటం వల్ల భూమిలోకి నీరు ఇంకక చెరువులు ఎండిపోతాయి. కనుక అలాంటి ప్రమాదం లేకుండా చేయాలి. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే నీటికి కొరత ఏర్పడి మనుషులే గాక పశువులు, పక్షులు,ఇతర జీవాలు కూడా బాధపడవలసి వస్తుంది.


(ఆ) “అడవులను నాశనం చేసుకుంటపోతే ఇంకా భయపడే కాలం వస్తది” అనడంలో గల ఉద్దేశం ఏమై ఉంటుంది?

జవాబు.

అడవులను నాశనం చేస్తుంటే ప్రకృతి సంపద హరించి పోతుంది. వానలు పడవు. ఎండలు పెరిగిపోతాయి. జంతువులకు నివాసాలు లేకుండా పోతాయి. వాతావరణ సమతౌల్యం దెబ్బతింటుంది. అడవుల్లో జంతువులు వచ్చి ఊళ్ళమీదపడి అన్నీ నాశనం చేస్తాయి. కొన్ని జంతువులు ప్రజల ప్రాణాలు తీస్తాయి. ఎండల తీవ్రత వల్ల వాతావరణ కాలుష్యం వల్ల ఓజోన్ పొర దెబ్బతిని భయంకరమైన అతినీలలోహిత కిరణాల ప్రభావానికి లోనై అనేక వ్యాధులపాల పడతారు. అందుకే అడవులను నాశనం చెయ్యకూడదు.                                                                                                                                                                     (ఇ) “మనం సరిగ్గా బతుకుతలేం – జీవరాసులను బతుకనిస్తలేం” దీనితో మీరు ఏకీభవిస్తారా ? విభేదిస్తారా ? ఎందుకు ?

జవాబు.

“మనం సరిగ్గా బతుకుతలేం – జీవరాసులను బతుకనిస్తలేం” ఈ మాటలు చాలా సరైనవి. నేను దీనితో ఏకీభవిస్తాను. ఎందుకంటే మనం ప్రకృతిలో సృష్టిస్తున్న భయంకరమైన మార్పుల వల్ల మన ఆరోగ్యాలూ పాడౌతున్నాయి. జీవరాసులూ అంతరించిపోతున్నాయి. మన అనుకూలం కోసం సెల్ఫోన్లు తయారు చేసుకొని సెట్టవర్లు నిర్మిస్తే ఆ టవర్ల నుంచి వచ్చే తరంగశక్తిని తట్టుకోలేక పక్షి జాతులు చనిపోతున్నాయి. ఇలాగే భూకాలుష్యం, శబ్దకాలుష్యం, జలకాలుష్యం, వాయుకాలుష్యం మనమే సృష్టిస్తున్నాం. మనమే రోగాలపాలిట పడుతున్నాం.


(ఈ) “వాకిళ్ళు కాంక్రీటు గచ్చులాయె” ఇది ఎటువంటి నష్టాలను కలిగిస్తుందో వివరించండి?

జవాబు.

కాళ్ళకు మట్టి అంటకుండా ఇంటిముందు, ఇంటివెనుక అంతా గచ్చు చేస్తున్నాం. ఇంటిమీద ఇల్లు కట్టేసి ఇళ్ళమధ్య కాస్తకూడ జాగా వదలటం లేదు. రోడ్లన్నీ కాంక్రీటు వేస్తున్నాం. ఇలా ఎక్కడా నేల అనేదే కనబడకుండా అంతా కాంక్రీటు గచ్చులే. చివరికి నీళ్ళు పోయే మోరీలు కూడా సిమెంటు చేస్తున్నాం. దీనివల్ల ఎక్కడా భూమిలోకి నీళ్ళు దిగడం లేదు. నేలలో తేమలేకుండా పోతోంది. ఎన్ని అడుగులు తవ్వినా నీళ్ళు పడవు. బావుల్లోకి, చెరువుల్లోకి ఎటునుంచి ఊట దిగదు. ఇలా అనేక విధాలుగా నీటి ఎద్దడి ఏర్పడుతోంది.


(ఉ) మీ ప్రాంతంలో ప్రకృతిని ఎన్ని విధాలుగా నాశనం చేస్తున్నారో రాయండి.

జవాబు.

మా ప్రాంతంలో పూర్వకాలం నుంచి ఇళ్ళలోనూ, ఇళ్ల బయటా కూడా పచ్చనిచెట్లు కనిపించేవి. చల్లని గాలి ఇళ్ళకు అందం, ఎంతో హాయిగా ఉండేది. ఇప్పుడు చెట్లు కొట్టేసి రోడ్లు, కాలువలు వేశారు. ఇంట్లో చెట్లుకూడా పోషణ అందక ఎండిపోతున్నాయ్. ఇళ్ళలో చెత్తంతా వీధుల్లోనూ, కాలువల్లోనూ విసిరేస్తున్నారు. ఇంత బాధ్యత లేకుండా ఉంటే ఆరోగ్యాలు ఎక్కడి నుండి వస్తాయి. నిలబడిపోయిన మురుగు, పేరుకు పోయిన చెత్త వల్ల ఈగలూ, దోమలూ చేరి మనుషులు రోగాలపాలౌతున్నారు.


2. కింది ప్రశ్నలకు పది వాక్యాల్లో జవాబులు రాయండి.


ప్రశ్న 1.

“ప్రకృతిని కాపాడితేనే భావితరాలకు భవిష్యత్తు” దీనిని విశ్లేషిస్తూ రాయండి.

జవాబు.

ప్రకృతిని కాపాడితేనే భావితరాలకు భవిష్యత్తు ఉంటుంది. పూర్వకాలంలో ఈ కొండలు, నదులు, అడవులు, సెలయేళ్ళు, అడవి జంతువులు, అడవులలోని ఉత్పత్తులు సమృద్ధిగా లభించేవి. ప్రకృతి ఆనందకరంగా, హాయిగా ఉండేది. సకాలంలో వర్షాలు కురిసేవి. వాతావరణంలో ఋతువుల మార్పులు మంచి సుఖాన్నిచ్చేవి. రాను రాను జనాభా పెరిగిపోతున్నది. అవసరాలు పెరిగిపోతున్నాయి. అడవులు నరికేస్తున్నారు. అవసరాలు తీర్చుకుంటున్నారు. ప్రకృతి సంపదను కరిగించేస్తున్నారు.


తమ తరువాత వచ్చే వారికి ఏమివ్వాలని ఆలోచించటం లేదు. సాంకేతికంగా అభివృద్ధి సాధించారు. ఆధునిక పరికరాలు వాడుతున్నారు. కర్మాగారాలు, పరిశ్రమలు అధికంగా స్థాపించి వాటి నుంచి వచ్చే వ్యర్థాలను నీళ్ళలోకి వదిలి నీళ్ళను కలుషితం చేస్తున్నారు. పొగతో గాలి కలుషితమైపోతున్నది. ప్రజలు అనారోగ్యం పాలౌతున్నారు. ఇది తప్పు. మానవులు తమ తప్పు తెలుసుకొని పర్యావరణాన్ని పరిరక్షించకపోతే భవిష్యత్తులో కాలుష్యం తప్ప ఏమీ మిగలదు. భావితరాలకు భవిష్యత్తే లేదు.


ప్రశ్న 2.

మానవులు, పక్షులు, పశువులు …………… సుఖంగా జీవించాలంటే ప్రకృతి పట్ల మన ఆచరణ ఎట్లా వుండాలి ?

జవాబు.

మానవులు, పశువులు, పక్షులు, ఇతర జలచరాలు ప్రకృతిలోని జీవులన్నీ సుఖంగా జీవించాలంటే ప్రకృతిని మనం కాపాడుకోవాలి.


నీరు : నీటిని వృథా చేయకూడదు. వర్షపు నీటిని నిలవ చేయడానికి ఇంకుడు నీటి గుంటలు తవ్వాలి. నదులు, చెరువులు మొదలైన వాటిలోని నీటిని కలుషితం చెయ్యకూడదు. పశువులను కడగటం, బట్టలుతకటం వంటి పనులు జలాశయాల్లో చెయ్యకూడదు. మురుగునీరు, ఫ్యాక్టరీల నీరు పోవడానికి వేరే ఏర్పాట్లు చెయ్యాలి. వాడుకునే నీటిలోకి వదలకూడదు.


గాలి : ఫ్యాక్టరీలను ఊరికి దూరంగా నిర్మించుకోవాలి. జనావాసాల మధ్య ఉంటే ఆ పొగ, దుమ్ము, ధూళి వలన కాలుష్యం ఎక్కువైపోయి మనుషుల ఆరోగ్యం పాడౌతుంది. మురికి ఇల్లంతా నిండిపోతుంది.


శబ్దం : ఆ శబ్దాల వల్ల కూడా ఆరోగ్యం దెబ్బతింటుంది. అలాగే ఇంట్లో మనం ఉపయోగించే టి.వి.లు, రేడియోలు వంటివి కూడా తక్కువ శబ్దంతో ఉపయోగించాలి. సెల్ఫోన్ల వాడకం తగ్గించటం వల్ల మనకే కాకుండా ఇతర ప్రాణులకు కూడా ప్రమాదం తప్పుతుంది. వాహనాల వినియోగం నియంత్రించాలి. దానివల్ల గాలి కాలుష్యం, శబ్ద కాలుష్యం తగ్గుతుంది. ప్లాస్టిక్ వాడకం నిలిపివేయాలి. చెట్లను అధికంగా పెంచాలి. ఒక చెట్టునరికే ముందు పది చెట్లను పెంచాలి. ఇలా చేయటం వల్ల ప్రకృతిని కొంతవరకు కాపాడగలుగుతాం.


IV. సృజనాత్మకత/ప్రశంస


ప్రశ్న 1.

“పర్యావరణ పరిరక్షణ”లో అందరూ పాలు పంచుకోవాలని ఒక పోస్టరు తయారుచేయండి.

జవాబు.

ప్రకటన

అక్కా తమ్ముళ్ళు ఆడుకుంటూ ఒక చెట్టు కిందికి చేరారు.


తమ్ముడు : అక్కా! అదిగో నువ్వు పట్టుకోవాలన్న సీతాకోకచిలుక.


అక్క : ఔను. ఉండు ఇప్పుడే పట్టుకుంటా……… దొరకలేదురా.


తమ్ముడు : పోనీలే అక్కా! హాయిగా ఎగరనీ.


చెట్టు : పిల్లలూ ఆడుకుంటున్నారా ?


అక్క : ఎవరది ? చెట్టుతల్లా!


తమ్ముడు : అవునమ్మా! ఆడుకుంటున్నాం.


అక్క : అమ్మా! ఈ దెబ్బలేంటి ?


చెట్టు : ఇందాక కొంతమంది అల్లరి పిల్లలు నామీద రాళ్ళు విసిరారు.


తమ్ముడు : అయ్యో! నొప్పిగా ఉందా ?


చెట్టు : లేదులే. మీరు చాలా మంచివాళ్ళు. మీకు నేనంటే చాలా ఇష్టం. ఇవిగో ఈ పళ్ళు తీసుకోండి.


అక్క : ఇప్పుడెందుకులేమ్మా!


చెట్టు : తీసుకోండమ్మా! ఫరవాలేదు. నేను వీటిని మోసేది మీలాంటి వాళ్ళకోసమే. మీకు కావలసినన్ని తినండి. మిగతావి ఇంటికి తీసుకుపోండి.


అక్క, తమ్ముడు : ధన్యవాదాలు చెట్టుతల్లీ! వస్తాము. టాటా.


V. పదజాల వినియోగం


1. కింది పదాలు చూడండి. వీటికి అదే అర్థం వచ్చే పదాలను పాఠం ఆధారంగా రాయండి.


(అ) తొందరగా – జల్ది

(ఆ) దురాక్రమణ – కబ్జా

(ఇ) శబ్దాలు – చప్పుళ్ళు

(ఈ) సంతోషం – సంబరం

(ఉ) కాలువలు – నదులు

(ఊ) ఇంతకుముందు కాలం – తాతలనాడు, మునుపు

(ఋ) ప్రాణులు – జీవులు

(ౠ) పిల్లవాళ్లు – పోరగాళ్ళు

(ఎ) వాహనాలు – మోటార్లు

(ఏ) వేగంగా పోవడం – బర్రుబర్రున పోవటం


2. కింది పదాలలో భిన్నమైన పదాన్ని గుర్తించి గీతగీయండి.


(అ) పులి, సింహం, ఎలుగుబంటి, కుక్క

(ఆ) బావులు, నదులు, సముద్రాలు, చెరువులు

(ఇ) కారు, స్కూటర్, సైకిలు, లారీ

(ఈ) బీడిపొగ, వాహనాల పొగ, సాంబ్రాణి పొగ, ఫ్యాక్టరీ పొగ


3. కింది పట్టికను చదివి అందులోని ప్రకృతి – వికృతులను

vi. 3. వర్షం

vi. 3. వర్షం 

బొమ్మను చూడండి – ఆలోచించండి – మాట్లాడండి

ప్రశ్నలు

1.బొమ్మలో ఎవరెవరున్నారు? ఏం చేస్తున్నారు ?

జవాబు.బొమ్మలో ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. వాళ్ళు వాన చినుకులతో ఆడుకుంటున్నారు.

2.బాలిక మబ్బును చూస్తూ ఏం పాట పాడుతున్నదో ఊహించండి.

జవాబు.బాలిక మబ్బును చూస్తూ
వానావానా వల్లప్పా వానలు కురిసే వల్లప్పా
బావులు నిండే చెరువులు నిండే
వాగులు పొంగి పరుగులు తీసే ॥ వానావానా వల్లప్పా|| అనే పాట పాడుతున్నది.                     

3.వానపడుతుంటే మీరేం చేస్తారు ? మీకేం చేయాలనిపిస్తుంది ?

జవాబు.వానపడుతుంటే మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది. శరీరానికి ఎంతో చల్లగా ఉంటుంది. అప్పుడు నాకు పాటలు పాడాలనిపిస్తుంది చురుక్కుమంటూ మీదపడే చినుకులతో ఆడుకోవాలని అనిపిస్తుంది.

పాఠం ఉద్దేశం:

 పొగలు సెగలు కక్కే వేసవికాలం వెళ్ళి పోయింది. అంతవరకు వేడెక్కిన భూమిని చల్లబరుస్తూ వర్షాకాలం ప్రవేశించింది. అటువంటి వర్షాకాలపు సొగసును, సామాన్యులపై ఆ వర్ష ప్రభావాన్ని తెలియజేయడం ఈ పాఠ్యభాగ ఉద్దేశం.