సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

కొత్త పొస్ట్



🌐 * L. I. P. తెలుగు ప్రారంభ పరీక్ష - BASELINE TEST 2026-27     🌐 * 10వ తరగతి 🌐 * 10వ తరగతి తెలుగులో 99% స్కోర్ సాధించాలంటే... 🌐 * తెలుగు వెలుగులీనేల 🌐 | ధ్వని గుర్తింపు / అక్షర గుర్తింపు     🌐 * సరళ పదాలు     🌐 * ఐ సి టి ఉపయోగించడం ఎలా?     🌐 * * DIKSHA WEB         🌐 SCERT         🌐 NCERT         🌐 NBT         🌐 UGC_NET         🌐 CIIL         🌐 * * NDL INDIA         🌐 SAHITHYA ACADEMY         🌐 | సిద్దెంకి కథలు     🌐 | సిద్దెంకి పుస్తకాలు     🌐 | సిద్దెంకి కవిత్వం 🌐 *"నీలి నేల ఎతలు - తెలంగాణ దళిత కథ పరిణామం కాలమ్ - కోలిమి"     🌐 | తెలుగులో అత్యుత్తమ పుస్తకాలు     🌐* | వ్యాసాలు / Articles     🌐* | దాశరథి పాటలు     🌐* | తెలంగాణ రాష్ట్రంలో దళిత కథ (2014:-07-2025)     🌐 * "సంస్కృతంతో తెలుగు కాలరాయొద్దు"     🌐 * పగిడి తెలంగాణ కథ 2024 "     🌐 * "ఆలోచనవాదుల పుష్పక విమానం దాశరథి ‘కవితా పుష్పకం’"     🌐 * Articles on Dr. Siddenky    

2, ఆగస్టు 2024, శుక్రవారం

VII. 5. పల్లె అందాలు

VII. 5.   పల్లె అందాలు

 ప్రశ్నలు
1. పై బొమ్మలో ఏమేమి కనిపిస్తున్నాయి?
జవాబు.ఆకాశంలో సూర్యుడు, పక్షులు కనిపిస్తున్నాయి. క్రింది నుండి కొండపైకి దారి వేశారు. ఇళ్ళు, చెట్లు, పశువులుతో పల్లె కనిపిస్తోంది. పల్లె పచ్చని మొక్కలతో అందంగా ఉంది.


2. మీరు చూసిన పల్లెకు, బొమ్మలోని పల్లెకు తేడాలేమిటి?
జవాబు. మేము చూసిన పల్లె పచ్చని పొలాలలతో నిండి ఉంది. చల్లనిగాలి, పక్షుల కిలకిలరావాలు ఎంతో ఆనందాన్నిచ్చేవి. పైబొమ్మలోని పల్లె కూడా అలానే ఉంది.


3. పల్లెలో ఏమేమి ఉంటాయి?
జవాబు. పల్లెలో చిన్న ఇళ్ళు, పాడి ఆవులు, గేదెలు, పచ్చని పొలాలు అందరూ కలసిమెలసి ఉండే వాతావరణం ఉంటుంది. రకరకాల పండ్లు, పూలచెట్లు, చెరువులు, సెలయేళ్ళు ఉంటాయి.

ఆలోచించండి – చెప్పండి

ప్రశ్న 1. కవి చెరువును గంగాళంతో పోల్చాడు కదా! ఇంకా చెరువును వేటితో పోల్చవచ్చు?
జవాబు. ఇంకా పెద్ద పాత్రతో, చిన్న సముద్రంతో పోల్చవచ్చు. బాగా విచ్చిన తామరపువ్వుతో పోల్చవచ్చు. హైదరాబాద్ లోని చెరువులను హుసేన్ సాగర్, నిజాంసాగర్ అని సాగరంతో పోల్చడం జరిగింది. (వనపర్తి సంస్థానంలోని 7 పెద్ద చెరువులను సప్తసముద్రాలుగా పిలిచేవారు. కావున చెరువును సముద్రంగా పోల్చవచ్చు.

ప్రశ్న 2.
పాఠంలో “చెరువును పద్మాలకు నిలయాలు” అని కవి అన్నాడు కదా! ఇప్పుడు చెరువులు వేటికి నిలయాలు ?
జవాబు. మా పాఠంలో కవి చెరువును పద్మాలకు నిలయాలు అని చెప్పాడు. పూర్వం పరిశుభ్రత, స్వచ్ఛత ఉండడం వలన అవి అలా ఉండేవి. నేడు రసాయనాలు, మురికి, చెత్తా, చెదారంతో నిండి చెరువులు కలుషితం అవుతున్నాయి.

ప్రశ్న 3.సూర్యోదయ సమయంలో చెరువు ఎట్లా ఉంటుంది?
జవాబు.
సూర్యోద  సమయంలో చెరువు పరిశుభ్రంగా, నిర్మలంగా ఉంటుంది. సూర్యుని లేత కిరణాలు చెరువులో పడి, అందులోని తామరపూలు వికసించి ఎంతో అందంగా ఉంటాయి. లేత కిరణాలు పడి చెరువు స్వచ్ఛత వలన చూడ ముచ్చటగా ఉంటుంది.

ప్రశ్న 4.పూవులను ఏయే సందర్భాలలో అలంకరణకు వాడుతారు?
జవాబు. పూలను ఆడవారు తమ తలపై పెట్టుకోవడానికి ఉపయోగిస్తారు. ప్రతిరోజు దేవునికి సమర్పించడానికి, పూజలు చేయడానికి వినియోగిస్తారు. పండుగలలోను, పెళ్ళిళ్ళలోను, ఇంకా ఇతర సమయాలలో అలంకరించడానికి వాడతారు. గౌరవనీయులైన వారి మెడలో వేయడానికి పూల మాలలను వాడతారు. పూలు అలంకార సాధనం.

ప్రశ్న 5. ఏఏ ఋతువులో ఏయే పూలు దొరుకుతాయి?
జవాబు. వసంతఋతువు – చైత్ర, వైశాఖం
గ్రీష్మఋతువు – జ్యేష్టం, ఆషాఢం
వర్షఋతువు – శ్రావణం, భాద్రపదం
శరదృతువు – ఆశ్వయుజం, కార్తీకం
హేమంతఋతువు – మార్గళిరం, పుష్యం మాఘం, ఫాల్గుణం
శిరరఋతువు – మాఘం, ఫాల్గుణం – మోదుగ


ఇవి చేయండి

I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం

ప్రశ్న 1.
పాఠంలోని పద్యాల ద్వారా ఊరి గురించి తెలుసుకున్నారు కదా! మీరు చూసిన ఊరుతో దీన్ని పోల్చి మాట్లాడండి.
జవాబు.
పాఠంలోని పద్యాలలో ఊరు చెరువులు, పూలు, పండ్లు, పంటలు, పాడి, చేనేత కార్మికుల గూర్చి చెప్పారు. మేము చూసిన ఊరు హుజూర్ నగర్. కుమ్మరి కుండలు చేస్తాడు. రైతులు పంటలు పండిస్తారు. వడ్రంగివారు చెక్కపని చేస్తారు. ఆయా ఋతువులలో అన్ని రకాల పండ్లు దొరుకుతాయి.

ప్రశ్న 2.పాఠంలోని పద్యాలను రాగంతో చదవండి. వాటి భావాలు చెప్పండి.
జవాబు. ముందిచ్చిన పద్యాల భావాలు చూడండి.

II. ధారాళంగా చదవడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం

1. ఈ కింది పేరా చదవండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.

ప్రకృతి అందచందాలు అమూల్య సంపదలు. గలగలపారే సెలయేరు, ఉదయించే అరుణకిరణాల సూర్యుడు, పక్షుల కిలకిలారావాలు, పచ్చని కొంగేసినట్లున్న వనసీమలు ఒకటేమిటి? ఎన్నెన్నో అందాలతో విలసిల్లే పల్లె ఆనందానికి నెలవు. పల్లె ఆశ్రయమిచ్చి అక్కున చేర్చుకునే తల్లి. ఆప్యాయతకు, అనురాగాలకు పట్టుగొమ్మ. పల్లె అమాయకత్వం, దివ్యత్వంతో ఉన్న అద్భుత శిల్పం.

(అ) అమూల్య సంపదలు అంటే ఏమిటి?
జవాబు.
అమూల్య సంపదలు అనగా చాలా విలువైన సంపదలు అని అర్థం. వాటికి విలువ కట్టలేమని భావం.

(ఆ) ఆనందానికి నెలవు అంటే ఏమిటి?
జవాబు.ఆనందానికి నెలవు అంటే సంతోషానికి నిలయం అని అర్థం.

(ఇ) అక్కున చేర్చుకోవడం అంటే మీకేం అర్థమయింది?
జవాబు. ప్రేమ చూపడం అని అర్థమయింది.

(ఈ) అనురాగాలకు పట్టుగొమ్మ అంటే ఏమిటి?
జవాబు.అనురాగం అంటే ప్రేమ. పట్టుగొమ్మ అంటే స్థానము. పల్లె ప్రేమకు, అనుబంధాలకు స్థానం అని అర్థం.

(ఉ) పై పేరాకు పేరు పెట్టండి.
జవాబు.పల్లె తల్లిప్రేమ.

2. పాఠం ఆధారంగా కింది భావం తెలిపే పద్యపాదాలను వెతికి రాయండి.
(అ) అలుగుల గడుసుదనంతో ఒకే చెరువా అని తెలుపుతున్నట్లున్నాయి.
జవాబు.“ రెండు చెరువు లొక్కటేయని చెప్పుచునుండె నడుమ గలసి యున్నట్టి యలుగుల గడుసుదనము.”

(ఆ) సూర్యునికి అర్ఘ్యమిస్తున్నట్లున్నాయి.
జవాబు. “అరుణ కిరణాల దేవత కర్ష్యమిచ్చు ప్రత్యుషస్సున మయూరి పద్మలతలు.”

(ఇ) దంపతులవలె మా ఊరికి కానుకలు సమర్పిస్తున్నాయి.
జవాబు. ఊరి కుపాయనం బిడుచునుండును దంపతులట్లు నిత్యమున్.

(ఈ) జనం రాకపోకలతో మా అంగళ్ళన్నీ సందడితో ఉంటాయి.
జవాబు. “జనగతాగత కల్లోల సాంద్రమగుచు వెలయు మా యంగడులు నన్ని వేళలందు”

III. స్వీయరచన

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో జవాబులు రాయండి.
 (అ) కవి అంగడిని బహుళ వస్తుప్రధానం అన్నాడు కదా! మీ ఊరి అంగడి కూడా ఇట్లే ఉంటుందా? వివరించండి.
జవాబు. మా ఊరి అంగడికూడా కవి ఊరి అంగడిలా అన్ని వస్తువులతో నిండి ఉంటుంది. మా ఊరి అంగడిలో అన్ని వస్తువులూ లభిస్తాయి. ఆకుకూరలు, కూరగాయలు, పప్పుధాన్యాలు, నూనెలు ఇంటిలో ప్రతినిత్యం మనం ఉపయోగించే అన్ని వస్తువులు మా అంగడిలో లభిస్తాయి. అంగడిలోని సరుకులు తాజాగా ఉంటాయి. చౌకగా లభిస్తాయి.

(ఆ) గ్రామాల్లో కాపులు, పద్మశాలీలు కాకుండా ఇంకా ఎవరెవరు ఉంటారు? వీరివల్ల ఊరివాళ్ళకేం లాభం కలుగుతుంది?
(లేక)
గ్రామాల్లోని కులవృత్తి వారి వలన కలిగే లాభాన్ని వివరించండి.
జవాబు. గ్రామాలలో అనేక కులాల వారు ఉంటారు. వారు వారి కులవృత్తులను చేస్తూ సమాజానికి ఎంతో సేవ చేస్తూ ఉంటారు. కాపులు, పద్మశాలీలే కాకుండా మంగలిపనివారు, కమ్మరి, కుమ్మరి, వడ్రంగం వృత్తులవారు, పశుకాపరులు ఉంటారు. ఆయా కులాల వారు వారి వృత్తులను నిర్వర్తించడం వలన ఊరివాళ్ళ అవసరాలు తీరుతాయి. అందరికీ పని దొరుకుతుంది. అసమానతలు పోతాయి.

(ఇ) ఆదర్శగ్రామం ఎట్లుండాలని నీవనుకుంటున్నావు? (లేక) ఆదర్శగ్రామానికి ఉండాల్సిన లక్షణాలు ఏవి?
జవాబు. ఆదర్శగ్రామంలోని ప్రజలు కులమతాలకు అతీతంగా జీవించాలి. అన్ని మతాల పండుగల్లో అందరూ పాల్గొనాలి. ఎవరికి ఎలాంటి అవసరం లేదా కష్టం వచ్చినా అందరూ సాయం చేయాలి. ఒకరి అవసరాలకు వేరొకరు నిలబడాలి. పేద, ధనిక తేడా చూపకుండా కలసి మెలసి ఉండాలి. గ్రామం అభివృద్ధికి ప్రణాళికలు తయారుచేసుకొని అందరూ కలసి పూర్తి చేయాలి. మనుషులు, మనసులు వేరైనా ఒకే ఆలోచనతో ఉంటే ఆ గ్రామం అభివృద్ధి చెందుతుంది. అదే ఆదర్శగ్రామం.
 
(ఈ) ఊరుకు, చెరువుకు ఉన్న బంధం ఎట్లాంటిది?
(లేక)
సమాజంలో ఊరికి, చెరువుకు దగ్గరి బంధం ఉంది. వివరించండి
(లేక)
ఊరు చెరువుల బంధం విడదీయరానిది. వివరించండి.
జవాబు.
ఊరు అంటే ప్రజలు, వారితోపాటు పశువులు, పక్షులు. వీరందరికీ  నీరు కావాలి.  నీరు ఒక కాలంలో దొరికి ఒక కాలంలో దొరకకపోతే కష్టం. అందుకే నీరు నిల్వ ఉంచే చెరువు ప్రతి ఊరికి అవసరం. నీరు తాగడానికే కాదు, వ్యవసాయానికీ కావాలి. ఇన్ని అవసరాలు తీరాలంటే నీరు అన్ని కాలాలలో నిల్వ ఉంచే చెరువు కావాలి. ఇలా చెరువుకు, ఊరుకు విడదీయలేని సంబంధముంది.

2. కింది ప్రశ్నలకు పది వాక్యాల్లో జవాబులు రాయండి.

ప్రశ్న 1.
ఊరికి అందాన్నిచ్చే అంశాలేవి? ప్రస్తుతం పల్లెటూర్లలో ఇవి ఉంటున్నాయా? మీ అభిప్రాయాలను సొంతమాటల్లో రాయండి.
జవాబు.ఊరికి అందాన్నిచ్చేవి :
తామరపూలతో, కలువపూలతో నిండిన చెరువులు, మంచినీటి బావులు. ఊరిని పండు ముత్తైదువులా చేసే బంతి, చేమంతి వంటి పూల మొక్కలు, పరిమళం వెదజల్లే గులాబీ, మొల్ల, గన్నేరు, దాసన వంటి పూల మొక్కలు. మారేడు, అల్లనేరేడు, మామిడి, రేగు, జామ, నిమ్మ, అంజూర, అరటి, దానిమ్మ మొదలైన చెట్లు. వివిధ వృత్తులవారు, పశువులను పోషిస్తూ పంటలను పండించే కాపు బిడ్డలు. జనం రాకపోకలతో సందడిగా ఉండే అంగళ్ళు. ప్రస్తుతం పల్లెటూళ్ళలో ఇవేవీ ఉండటం లేదు. చెరువులు కనబడటం లేదు. పచ్చని పొలాలు మాయమయి పోతున్నాయి. ట్రాక్టర్ల రాకతో పశువులు కనబడడం లేదు. ఇప్పుడు పల్లెలన్నీ పట్నాలలాగే ఉన్నాయి.

IV. సృజనాత్మకత/ప్రశంస

(అ). పాఠంలోని 3వ, 4వ పద్యాలలో ఊరి అందాలను కవి వర్ణించాడు కదా! మీరు చూసిన / మీకు తెలిసిన ఊరు అందాలను వర్ణిస్తూ రాయండి.
జవాబు.
నేను చూసిన పల్లె ఖమ్మం జిల్లా వైరాకు దగ్గరగా ఉన్న సిరిపురం. ఈ ఊరిలో ప్రకృతి రమణీయంగా ఉంది. ప్రధానంగా పచ్చని పంట పొలాలతో నిండి ఉంది. ఎక్కడ చూచినా మనోహరమైన దృశ్యాలతో చూడముచ్చటగా ఉంది. ఉదయం సూర్యకిరణాలు వెచ్చని స్పర్శతో నిద్ర లేపుతాయి. కొలనుగట్లపై ఏపుగా పెరిగిన గడ్డి, కొలనులోని కలువల అందాలు నా మనసును దోచుకున్నాయి. కొలనులలోని తామరపూల సౌందర్యం చూడగానే నేను ఎంతో పులకించిపోయాను. ఆ అందం వలన కలిగిన మధురానుభూతులు నా హృదయాన్ని పెనవేసుకొని పోయాయి.

(ఆ). మూడవ పద్యం ఆధారంగా చిత్రం గీసి రంగులు వేయండి. దాని గురించి చిన్న కవిత రాయండి.
జవాబు.
అర్ఘ్యం

కొలనులోని జలములలో
కదలాడే చిరుత అలల
తానమాడి సంధ్యవార్చి
ధ్యానములో కొంత మునిగి
మెత్తని తన చేతులెత్తి
దోసిళ్ళుగ వాటి జేర్చి
నిర్మలమౌ జలములతో
దోసిళ్ళను నింపుకొని
తరుణారుణ కిరణ మణికి
తరణికి ఆ తరుణీమణి
మనోహరిణి పద్మలతిక
ప్రత్యుషస్సు సమయమ్మున
అర్ఘ్యమిచ్చి అర్చించెను
కర్మసాక్షి దినకరునికి

(ఇ). నీవు చూసిన పల్లెను వివరిస్తూ స్నేహితునికి లేఖ వ్రాయుము.
లేఖ
జవాబు.

.....,
 : XXXX

ప్రియమైన స్నేహితునికి కుశలములతో నీ మిత్రుడు శంకర్ వ్రాయునది. నేనిక్కడ కుశలం. నీ కుశలములు తెలుపుము. నేను ఈ మధ్య వైరా దగ్గరలోని గోపాలపురం అనే పల్లెను చూశాను. అక్కడి నా స్నేహితులతో కలసి వేసవి సెలవులు గడిపాను.
ఆ వూరి ప్రజలు చాలా మంచివారు. అమాయకులు. అక్కడ చాలా ప్రశాంత వాతావరణం ఉంది. ఎక్కడ చూచినా చెట్లు, పూలమొక్కలు, పాడి ఆవులు, గేదెలు, పొలాలు ఎంతో అందంగా ఉన్నాయి. వారంతా కష్టజీవులు. నేను వారి వృత్తిపనులు చూసి చాలా ఆనందించాను. వడ్రంగి చేసే బొమ్మలు ఎంతో చూడముచ్చటగా ఉన్నాయి. నేత వారు నేసే వస్త్రాలు ఎంతో మన్నికగా ఉన్నాయి. వాటిపై వేసే అందమైన అద్దకాలు తనివితీరా చూడాల్సిందే! ఎలాంటి కాలుష్యం లేదు. నీవు కూడా వీలైతే ఏదైనా పల్లెకు వెళ్ళిరా. నీ అనుభూతులు రాయి.

ఇట్లు
నీ మిత్రుడు,
శంకర్.

చిరునామా :
కె. సురేష్,
7వ తరగతి,
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల

V. పదజాల వినియోగం

1. కింద గీతగీసిన పదాలకు అదే అర్థాన్నిచే పదాలు రాయండి.

ఉదా : సంపద తో గర్వపడకూడదు.
(అ) తటాకంలో రకరకాల చేపలు జీవిస్తాయి.
(ఆ) పుట్టినరోజున కొత్త అంబరాలు ధరిస్తాం.
(ఇ) మా పురంలో చక్కని బడి ఉన్నది.
జవాబు.
ఉదా : సంపద తో గర్వపడకూడదు. – (కలిమి, ధనము)
(అ) తటాకంలో రకరకాల చేపలు జీవిస్తాయి. – (చెరువు)
(ఆ) పుట్టినరోజున కొత్త అంబరాలు ధరిస్తాం. – (వస్త్రాలు, వలువలు)
(ఇ) మా పురంలో చక్కని బడి ఉన్నది. – (పట్టణం, ప్రోలు)

2. కింది వాక్యాలలో గీతగీసిన పదాలకు అర్థాలు రాయండి.

(అ) సముద్రంలో కెరటాలు ఉవ్వెత్తున లేస్తున్నాయి.
(ఆ) చెరువు నిండితే అలుగు పారుతుంది.
(ఇ) కొట్టంలో పశువులు ఉంటాయి.
జవాబు.
(అ) సముద్రంలో కెరటాలు ఉవ్వెత్తున లేస్తున్నాయి. – (అలలు)
(ఆ) చెరువు నిండితే అలుగు పారుతుంది. – (చెరువు తూము)
(ఇ) కొట్టంలో పశువులు ఉంటాయి. – (పశువుల పాక)

3. పాఠం ఆధారంగా కారణాలు పట్టికలో రాయండి.

(అ) ఊరు పసుపు అద్దినట్లుండడానికి కారణం చేమంతి పూలతో నిండి ఉండడం
(ఆ) ఎర్రని పారాణి అద్దినట్లుండడానికి కారణం గోరింటాకు వలన పారాణి అద్దినట్లుంది.
(ఇ) కుంకుమబొట్టు పెట్టినట్లు ఉండడానికి కారణం పట్టుకుచ్చుల పూలు
(ఈ) పండు ముత్తైదువగా ఉండడానికి కారణం పై మూడింటి వలన
4. భావనాచిత్రమంటే ఒక అంశానికి సంబంధించిన భావనలన్నింటినీ వర్గీకరించుకోవడమే! ఒక గ్రామానికి చెందిన భావనాచిత్రం గీయమన్నపుడు గ్రామంలోని ప్రత్యేకతలు, గ్రామంలోని కీలక ప్రదేశాలు, ప్రజలు, వృత్తులు తదితర అంశాలన్నీ పరిగణిస్తాం.

VI. భాషను గురించి తెలుసుకుందాం

1. కింది పదాలను కలిపి రాసి, సంధిని గుర్తించండి.

ఉదా : నీవు + ఎక్కడ = నీవెక్కడ – ఉత్వసంధి
(అ) భీముడు + ఇతడు = భీముడితడు – ఉత్వసంధి
(ఆ) అతడు + ఎక్కడ = అతడెక్కడ – ఉత్వసంధి
(ఇ) ఇతడు + ఒకడు = ఇతడ్కడు – ఉత్వసంధి
(ఈ) ఆటలు + ఆడు = ఆటలాడు – ఉత్వసంధి

2. కింది పదాలను కలిపి రాయండి.

(అ) ఏమి + అది = ఏమది
(ఆ) ఎవరికి + ఎంత = ఎవరికింత
(ఇ) మరి + ఇప్పుడు = మరెప్పుడు
(ఈ) అవి + ఏవి = అవేవి

పై పదాలను విడదీసిన క్రమాన్ని, కలిపిన క్రమాన్ని గమనించండి.
మొదటి పదం చివరి అచ్చు “ఇ” కారం. (ఇత్తు). రెండవ పదాల మొదట్లో అన్నీ అచ్చులే వచ్చినవి. ఈ విధంగా “ఏమి” మొదలైన పదాల ‘ఇ’కారానికి (ఇత్తుకు) అచ్చుపరమైనపుడు సంధి జరుగుతుంది. కొన్నిచోట్ల ఇట్లా సంధికార్యం జరుగదు. ఆ పదాలను చూద్దాం.
ఉదా : ఏమి + అయ్యె = ఏమయ్యె – సంధి జరిగింది
ఏమి + అయ్యె = ఏమియయ్యె – సంధి జరగక యడాగమం వచ్చింది.

ఒకసారి సంధి (నిత్యము) జరిగి, మరొకసారి సంధి జరుగక (నిషేధము) పోవడాన్ని వ్యాకరణ పరిభాషలో ‘వికల్పము’ (వైకల్పికము) అంటారు. “ఏమి” మొదలైన పదాలకు అచ్చుపరమైతే సంధి వైకల్పికము అని తెలుస్తుందికదా! దీనినే ఇత్వసంధి అంటారు. సూత్రం : ఏమి మొదలైన పదాలలో ‘ఇత్తునకు అచ్చుపరమైతే సంధి వైకల్పికంగా జరుగుతుంది.

3. కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి.

ఉదా : రావాలని = రావాలి + అని (ఇత్వసంధి)
(అ) చెప్పాలంటే = చెప్పాలి + అంటే – ఇత్వసంధి
(ఆ) ఒక్కటే = ఒక్కటి + ఏ – ఇత్వ సంధి
(ఇ) రానిదని = రానిది + అని – ఇత్వ సంధి
(ఈ) నీటినిసుమంత = నీటిని + ఇసుమంత – ఇత్వసంధి
(ఉ) చెప్పినదియేమి = చెప్పినది + ఏమి – ఇత్వసంధి
(ఊ) వచ్చినపుడు = వచ్చిరి + అప్పుడు – ఇత్వసంధి
(ఋ) ఎన్నియేని = ఎన్ని + ఎని – ఇత్వ సంధి

VII. 4 అమ్మ జ్ఞాపకాలు

కవి పరిచయం:

కవి : టి. కృష్ణమూర్తి యాదవ్.
కాలం : 1914 – 1985.
జన్మస్థలం : వరంగల్ అర్బన్ జిల్లా, భీమదేవరపల్లి.
రచనలు : ఈయన తన తొలి కవితా సంపుటి “తొక్కుడు బండ”తో సాహితీ క్షేత్రంలో ప్రవేశించాడు. ‘శబ్నం’ వీరి రెండవ కవితాసంపుటి. గ్రామీణ జీవితానుభవాలు, మధ్యతరగతి జీవన చిత్రణ తన కవిత్వంలో ప్రధానంగా కనిపిస్తాయి.
రచనా శైలి : సరళమైన వచనాభివ్యక్తి, నిరాడంబరమైన శైలి ఈయన ప్రత్యేకత.


ప్రవేశి క :

అమ్మంటే ఆత్మీయత అనురాగాల కలబోత. అమ్మ మంకు చేసే పిల్లవాడికి చందమామను చూపిస్తూ గోరుముద్దలు తినిపిస్తుంది. అమ్మ గొప్పతనం మాటలకందనిది. కుటుంబంకోసం అమ్మ పడే తపన, ఆరాటం అనితరసాధ్యం. అమ్మ జ్ఞాపకాలను హృదయానికి హత్తుకునే విధంగా కవి ఎట్లా వర్ణించాడో చూద్దాం.ప్రశ్న 1.
పై బొమ్మలో ఎవరెవరున్నారు?
జవాబు. పై బొమ్మలో తల్లి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆకాశంలో చందమామ ఉన్నాడు.

పాఠ్యభాగ వివరాలు:

ఈ పాఠం వచన కవిత (ప్రక్రియకు చెందినది. తెలుగులోనికి వచన కవిత ఆంగ్ల సాహిత్య (ప్రభావంతో వచ్చింది. ఆంగ్లంలో దీనిని ‘Free Verse’ అంటారు. పద్యగేయాల్లో ఉండే ఛందస్సు, మాత్రాగణాల నియమం లేకుండా స్వేచ్ఛగా భావయుక్తంగా వాక్యాలతో ఉంటుంది. వచనశైలిలో రాసే ఈ విధానాన్ని వచన కవితగా పిలుస్తున్నాం. ఈ పాఠం కృష్ణమూర్తి యాదవ్ రచించిన ‘శబ్నం’ కవితా సంపుటిలోనిది.



ఇవి చేయండి

I. విని, అర్థం చేసుకొని, ఆలోచించి మాట్లాడడం

ప్రశ్న 1.అమ్మ జ్ఞాపకాలను కవి గుర్తుకు తెచ్చుకున్నాడు కదా! మీరు మీ అమ్మ గురించి చెప్పండి.
జవాబు.
మా అమ్మ నా బాల్యంలో నాకు నీళ్ళు పోసేది. పాలిచ్చేది. ఆకలివేస్తే అన్నంకాని ఏదో ఒకటిగాని పెట్టేది. దెబ్బ లేదా బాధ పడి వెళ్ళి ‘అమ్మా!’ అంటే ఓదార్చేది. నొప్పి వెంటనే పోయేది. జ్వరం, జబ్బు చేస్తే నిద్రపోయేదికాదు. రాత్రి, పగలు నావెంటే ఉండేది. అమ్మ పక్కనే ఉంటే ఎంతో హాయిగా ఉండేది. అమ్మ ఉన్నప్పుడు విలువ తెలియదు. అమ్మ లేనపుడే అమ్మ విలువ తెలుస్తుంది. మేమెప్పుడూ మా అమ్మను మరచిపోము.

ప్రశ్న 2.మీరు మీ అమ్ సంతోషపెట్టడానికి ఏమేమి చేస్తారు?
జవాబు.
మేము మా అమ్మను సంతోషపెట్టడానికి మంచి పనులు చేస్తాము. మంచి ప్రవర్తనతో ఉంటాము. బాగా చదువుకొంటాము. ఇతరులతో తగాదాలకు వెళ్ళము. అమ్మ చెప్పిన పనులు చేస్తే అమ్మకు చాలా ఇష్టం కదా! అవే చేస్తాము. మా అమ్మ ఇంటి పనులలో సహాయపడతాము. అమ్మ కోరుకున్నది సాధించడానికి ఏమి చేయడానికైనా సిద్ధపడతాము.

II. ధారాళంగా చదవడం అర్థం చేసుకొని ప్రతిస్పందించడం.

1. పాఠం చదవండి. వివిధ అంశాలను కవి ఎట్లా పోల్చాడో పట్టికలో రాయండి.

అంశం పోలిక
ముగ్గులేసిన ప్రాంగణం అద్దకపు చీర
పండ్లు పాల బలపాలు
ఇల్లు దవాఖానా
దొరలబిడ్డలు తెల్లకుందేళ్ళు
ముక్కుపోగు నెలవంకలా అర్ధచంద్రాకారం
వడ్లు దంచే చప్పుడు మద్దెల మోత
ముక్కు పుల్ల విష్ణువు ముట్టెమీద ఎత్తిన భూగోళం
గంటీలు గడియారంలోని లోలకం
అమ్మ ఒడి గుమ్మి

2. కింది పేరా చదివి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

ధర్మం మూర్తీభవించిన శ్రీరాముణ్ణి తీర్చిదిద్దింది తల్లి కౌసల్యే. లవకుశులు వీరులుగా, శూరులుగా, పరాక్రమశీలురుగా తయారైంది తల్లి సీతమ్మ శిక్షణలోనే. కాలినడకన ఆసేతు హిమాచలం పర్యటించి, అద్వైత సిద్ధాంతాన్ని బోధించి, దేశసమైక్యతను, సమగ్రతను కాపాడిన ఆదిశంకరులు కూడా తల్లి ఆర్యాంబ ఒడిలోనే పెరిగి పెద్దవాడయ్యాడు.



భారతజాతికి గర్వకారణమైన వీరుడుగా, శూరుడుగా, పేరు ప్రఖ్యాతులనందుకొనిన వీరశివాజీ తన తల్లి జిజియాబాయి చేతులలోనే పెరిగి పెద్దవాడయ్యాడు. ఒక సామాన్య బాలునిలో నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, దేశభక్తి భావాలను నాటి, పెంచి, పోషించి గాంధీని మహాత్మునిగా రూపొందించగలిగింది ఆయన మాతృమూర్తి పుతిలీబాయి. ప్రపంచ చరిత్రను సునిశితంగా పరిశీలిస్తే ఒక వాస్తవం తేటతెల్లమౌతుంది. జాతి గర్వించదగిన వీరులను, శూరులను, మహనీయులను, మహాపురుషులను, ప్రవక్తలను, సంఘసంస్కర్తలను, జ్ఞానులను, యోగులను రూపుదిద్దగల్గిన శిల్పులు మాతృమూర్తులేనని స్పష్టమవుతున్నది.

(అ) సీతమ్మ లవకుశులను ఎట్లా తీర్చిదిద్దింది?
జవాబు.
సీతమ్మ లవకుశులను వీరులుగా, శూరులుగా, పరాక్రమశీలురుగా తీర్చిదిద్దింది.

(ఆ) ఆదిశంకరుల తల్లి పేరేమిటి?
జవాబు.
ఆదిశంకరుల తల్లిపేరు ఆర్యాంబ.

(ఇ) శివాజీని జిజియాబాయి ఎట్లా పెంచింది?
జవాబు.
శివాజీని జిజియాబాయి వీరుడిగా, శూరుడిగా పేరు ప్రఖ్యాతులు వచ్చేటట్లు పెంచింది.

(ఈ) గాంధీ మహాత్ముడుగా రూపుదిద్దుకోవడానికి కారణం ఎవరు?
జవాబు.
గాంధీ మహాత్ముడుగా రూపుదిద్దుకోవడానికి కారణం అతని తల్లి పుతిలీబాయి.

(ఉ) జాతి గర్వించదగిన మహనీయులను రూపుదిద్దిన మహాశిల్పులు ఎవరు?
జవాబు.
జాతి గర్వించదగిన మహనీయులను రూపుదిద్దిన మహాశిల్పులు అంతా ఆ మహనీయుల తల్లులే!

III. స్వీయరచన

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ. కవి రచనా శైలిని సొంతమాటల్లో రాయండి.
(లేదా)
ఈ కవితలోని రచయిత రచనాపద్ధతి ఎట్టిది?
జవాబు.
కవి ఈ గేయాన్ని వచనకవితా ప్రక్రియలో రాశాడు. గేయాన్ని ఎలాంటి ఛందో నియమాలను పట్టించుకోకుండా భావానికి ప్రాధాన్యత నిస్తూ రాశాడు. ‘అమ్మ’ను కవితా వస్తువుగా తీసుకొని ప్రతి వాడి మనసులో అమ్మ స్థానాన్ని, విలువను నింపాడు. సరళమైన భాషతో, తేలికైన పదాలతో చెప్పదలచుకొన్న అభిప్రాయాన్ని చక్కగా తెలిపాడు. తెలంగాణ భాషలో, యాసలో వచన కవిత రాసిన వాడుగా గుర్తింపు పొందాడు.


ఆ. కాలుష్య నిర్మూలన కార్యకర్తగా అమ్మ పనిచేసింది’ అని అనడంలో కవి ఉద్దేశం ఏమిటి?
(లేదా)
అమ్మ కుటుంబంలో పరిశుభ్రతను ఎలా పాటిస్తుంది ?
జవాబు.
కవి తన రచనలో అమ్మను స్వచ్ఛభారత్లో కాలుష్య నిర్మూలనా కార్యకర్తగా చూపాడు. ఇంటి ముందరి ముగ్గులో రంగులద్దిన చీరను చూపాడు. అమ్మ పళ్ళను తెల్లని పాలబలపాలుగా చిత్రీకరించాడు. పిల్లలకు జ్వరం వస్తే ఇంటినే దవాఖానాగా మార్చాడు. దొరల కొట్టంలో బర్లను శుభ్రంచేసి, పెండను తీసే కార్యకర్తగా వర్ణించాడు. అమ్మ పిల్లల పెంపకంలో ఆరోగ్య కార్యకర్తగా చూపాడు.

ఇ. మీ అమ్మ ఇష్టాలను గురించి మీ సొంత మాటలో రాయండి.
(లేదా)
మీ అమ్మ ఆలోచనలను, కోరికలను గూర్చి వ్రాయండి.
జవాబు.
మా అమ్మకు తన పిల్లలంటే చాలా ఇష్టం. తన బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలని, బాగా ఎదగాలని కోరేది. తన పిల్లలు అందరికంటే బాగా చదివితే ఇష్టం. తన పిల్లలు తన ముందే ఆటలలోను, పాటలలోను బాగా రాణిస్తే ఇష్టం. తన బిడ్డలు తన కళ్ళముందే ఎదుగుతుంటే లోలోపల ఆనందంతో మురిసిపోవడం తన కిష్టం. అమ్మ ఇష్టాలను తీర్చడం కష్టమైనా మా కిష్టం.

ఈ. అమ్మచేసే పనుల్లో మనం కూడా ఎందుకు సహాయం చేయాలి.
(లేదా)
మీ ఇంట్లో నీ తల్లికి సాయం చేయడంలో నీ పాత్ర ఏమిటి?
జవాబు.
అమ్మ తన బిడ్డలు కష్టపడకూడదని అన్ని పనులు తనే చేసుకుంటుంది. పిల్లలు పెద్దయిన తర్వాత వారే నేర్చుకుంటారని ఏ పనీ మనకు చెప్పదు. మనం ఇంట్లో అన్ని పనుల్లోను ఎంతో కొంత అమ్మకు సాయం చేయాలి. అమ్మకు సాయం చేస్తే అందులో మనకు కూడా పనులు అలవాటవుతాయి. నేర్చుకుంటాము. తృప్తి మిగులుతుంది. అమ్మ శిక్షణలో చేసేపనుల వలన పెద్దయిన తర్వాత మన పనులు మనమే చేసుకోగలుగుతాం. ఒక పని అందరూ చేస్తే ఎవరికీ ఎక్కువ శ్రమ, ఆయాసం ఉండదు. త్వరగా కూడా పూర్తవుతుంది.

2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

ప్రశ్న 1.అమ్మ గొప్పతనాన్ని మీ సొంత మాటల్లో రాయండి.
జవాబు.
అమ్మ పరిశుభ్రత : అమ్మ వాకిట్లో ముగ్గులేస్తే రంగులు అద్దిన చీరలా కనిపించేది. నవ్వితే పళ్ళు బలపాల్లా ఉండేవి. పిల్లలకు జలుబుచేస్తే, జ్వరం వస్తే ఇంటినే దవాఖానా (హాస్పటల్)గా మార్చేది. ఒక నర్సులాగా మందు బిళ్ళలు వేసేది. అమ్మ కష్టం : అయ్య పాలు పిండితే అమ్మ దొర కొట్టంలో పెండ తీసేది. భూస్వాముల ఇళ్ళముందు కుందీలో పోసి వడ్లను దంచేది.

అమ్మ అందం : అమ్మ ముక్కు పోగు ఆకాశానికి హత్తుకొన్న నెలవంకలాగా అందంగా ఉంది. అమ్మ ముక్కుపుల్ల ముట్టె మీద ఎత్తిన భూగోళంలా ఉంది. గంటలు గడియారంలోని లోలకంలాగా ఊగేవి. అమ్మకు కాళ్ళకు కడియాలు వేసుకోవడం, మట్టెలు తొడుక్కోవడం చాలా ఇష్టం.

అమ్మ ప్రేమ : అమ్మ రోజంతా పనిచేసి సోలెడు నూకలను చీరకొంగున మూటగట్టి తెచ్చేది. అమ్మ పిల్లలు ఎదురు చూస్తారని ఒడిలో పల్లికాయలు, పెసరకాయలు తెచ్చి పెట్టేది. అమ్మ ఒడి నుండి ఎన్ని తీసుకొన్నా ఇంకా మిగిలే ఉంటాయి. అమ్మ గొప్పదనాన్ని చెప్పడం ఎవరికీ సాధ్యంకాదు.

IV. సృజనాత్మకత/ప్రశంస

1. మీ అమ్మ బొమ్మ గీయండి. అమ్మ గొప్పతనం తెలిపేటట్లు చిన్న కవిత రాయండి.

అమ్మ ప్రేమ చాలా మధురం
తీయని మాటల సమూహం
చక్కని అందాల సమస్తం
తన పలుకులతో పిల్లలను
ఉత్తమ రత్నాల్లా తీర్చేది అమ్మ
తన శ్రమనంతా కూర్చి
వారి కెలాంటి బాధ, వ్యధ లేకుండా చేసేది అమ్మ
తన శరీరాన్ని స్థానంగా చేసి, అమృత ధారలను పంచి
హాయినీ, ఆనందాన్ని కుటుంబానికిచ్చేది అమ్మ

2. పాఠ్యభాగం ఆధారంగా క్రింది ఖాళీలను పూర్తిచేయండి. (అదనపు ప్రశ్న)

1. అమ్మ ముగ్గులేస్తే ప్రాంగణం అద్దకపు చీర లా కన్పించేది.
2. దూడల నోళ్ళు కట్టి పితికిన పాలు ఆస్థానపు తెల్ల కుందేళ్ళు తాగేవి.
3. గోవుల ప్రక్కన ల్యాగల్లా ఇంటిముందు ఆడుకొనేవాళ్ళు.
4. చెవుల గెంటీలు గడియారంలోని పెండ్యులం లా ఊగేవి.
5. తేనెటీగల్లా అమ్మ జ్ఞాపకాలు నా చుట్టూ ముసురుతాయి.

3. అమ్మ ప్రేమ గొప్పతనాన్ని గూర్చి










V. పదజాల వినియోగం:

1. కింది వాక్యాల్లో గీత గీసిన పదాలకు సరైన అర్థాలు గుర్తించండి.

ప్రశ్న 1.
జెండావందనం రోజు మా పాఠశాల ప్రాంగణాన్ని ముగ్గులతో అలంకరిస్తాం.
జవాబు.ఇ) ముంగిలి

ప్రశ్న 2.
మా ఊరిలో వస్త్రాలపై అద్దకం చేసేవారు ఉన్నారు.
అ) గోడకు వేసే సున్నం
ఆ) బట్టలకు రంగు వేసే విధానం
ఇ) రంగు వేయడం
ఈ) రంగు తీసివేయడం
జవాబు.
ఇ) రంగు వేయడం

ప్రశ్న 3.
బాసర పుణ్యక్షేత్రం గోదావరి గట్టున ఉంది.
అ) కట్ట
ఆ) గోడ
ఇ) తీరం
ఈ) దూరం
జవాబ

2. ఈ కింద గీత గీసిన పదాలకు పర్యాయపదాలు రాయండి.

అ) కంచు మోగునట్లు కనకంబు మోగునా ?
కనకంబు = బంగారం, పుత్తడి, హేమం, సువర్ణం

ఆ) కుందేలు ఉపాయంతో అపాయాన్ని జయించింది.
కుందేలు – శశకము, చెవులపిల్లి, శరభం

ఇ) ఆవు అంబా అని పిలిస్తే దూడ గంతులు వేసుకుంటూ వచ్చింది.
దూడ – పెయ్య, లేగ, క్రేపు

3. ఈ కింద గీత గీసిన ప్రకృతి పదాలకు వికృతి పదాలు, వికృతి పదాలకు ప్రకృతి పదాలు రాయండి.

అ) కుల్యలో కాగితపు పడవలు వేసి పిల్లలు ఆడుకుంటున్నారు.
కుల్య (ప్ర) – కాలువ (వి)

ఆ) ఆకాశంలో పక్షులు స్వేచ్ఛగా ఎగురుతున్నాయి.
ఆకాశం (ప్ర) – ఆకసం (వి)

ఇ) శ్రావ్య మొగము ఎంతో అందంగా ఉంది.
మొగము (వి) – ముఖము (ప్ర)


VI. భాషను గురించి తెలుసుకుందాం:

1. ఈ కింది పదాలను విడదీయండి.

అ) అతడెక్కడ =అతడు + ఎక్కడ

ఆ) బొమ్మనిచ్చెను = బొమ్మను + ఇచ్చెను

ఇ) మనిషన్నవాడు = మనిషి + అన్నవాడు




2. ఈ కింది పదాలను కలపండి.

అ) మేన + అల్లుడు =మేనల్లుడ
ఆ) పుట్టిన + ఇల్లు = పుట్టినిల్లు

ఇ) ఏమి + అంటివి =ఏమంటివి.

ఉత్త్వ సంధి:

ఈ కింది పదాలను గమనించండి.
అ) రాముడు + అతడు = రాముడతడు = ఉ + అ = అ
ఆ) సోముడు + ఇతడు = సోముడితడు = ఉ + ఇ = ఇ
ఇ) మనము + ఉంటిమి = మనముంటిమి = ఉ + ఉ = ఉ
ఈ) అతడు + ఎక్కడ = అతడైక్కడ = ఉ + ఎ = ఎ

మొదటి పదంలోని చివరి అచ్చు ‘ఉ’, రెండవ పదంలోని మొదటి అచ్చుతో కలిసినపుడు మొదటి పదంలోని అచ్చు (ఉ) లోపిస్తుంది. రెండో పదంలోని మొదటి అచ్చు అట్లాగే నిలిచి ఉంటుంది. అనగా ఉకారం మీద ఏదైనా అచ్చు వచ్చి చేరితే సంధి తప్పక జరుగుతుంది. దీనినే ‘ఉత్త్వసంధి’ అంటాం.
‘ఉ’ కారాన్ని ఉత్తు అంటారు.
ఉత్తునకు అచ్చుపరమైతే సంధి తప్పక జరుగుతుంది.

3. ఈ కింది పదాలను కలిపి రాయండి.

అ) చెట్టు + ఎక్కి = చెట్టెక్కి

ఆ) వాడు + ఎక్కడ = వాడెక్కడ

ఇ) ఎదురు + ఏగి =ఎదురేగి

4. ఈ కింది పదాలను విడదీయండి.

అ) నూకలేసుకొని = నూకలు + ఏసుకొని

ఆ) చూరెక్కి = చూరు + ఎక్కి

ఇ) ఎట్లున్నది = ఎట్లు+ ఉన్నది.

......................