siddenky.blogspot.com డా. సిద్దెంకి

సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

కొత్త పొస్ట్



🌐 * L. I. P.     🌐 * 10వ తరగతి 🌐 * 10వ తరగతి తెలుగులో 99% స్కోర్ సాధించాలంటే... 🌐 * తెలుగు వెలుగులీనేల 🌐 | ధ్వని గుర్తింపు / అక్షర గుర్తింపు     🌐 * సరళ పదాలు     🌐 * ఐ సి టి ఉపయోగించడం ఎలా?     🌐 * * DIKSHA WEB         🌐 SCERT         🌐 NCERT         🌐 NBT         🌐 UGC_NET         🌐 CIIL         🌐 * * NDL INDIA         🌐 SAHITHYA ACADEMY         🌐 | సిద్దెంకి కథలు     🌐 | సిద్దెంకి పుస్తకాలు     🌐 | సిద్దెంకి కవిత్వం 🌐 *"నీలి నేల ఎతలు - తెలంగాణ దళిత కథ పరిణామం కాలమ్ - కోలిమి"     🌐 | తెలుగులో అత్యుత్తమ పుస్తకాలు     🌐* | వ్యాసాలు / Articles     🌐* | దాశరథి పాటలు     🌐* | తెలంగాణ రాష్ట్రంలో దళిత కథ (2014:-07-2025)     🌐 * "సంస్కృతంతో తెలుగు కాలరాయొద్దు"     🌐 * పగిడి తెలంగాణ కథ 2024 "     🌐 * "ఆలోచనవాదుల పుష్పక విమానం దాశరథి ‘కవితా పుష్పకం’"     🌐 * Articles on Dr. Siddenky    

13, మే 2026, బుధవారం

neeli nela ethalu - 1, తెలంగాణ దళిత కథా పరిణామం



తెలంగాణ దళిత కథా పరిణామం 


"వివక్షను రూపుమాపి సమాజంలో సామరస్యాన్ని స్థాపించాలి." — డా. బి. ఆర్. అంబేడ్కర్.

"నిన్నటి వరకు తమ జీవితాలను తాము శాసించుకునే హక్కులేని దళితులు ఈ రోజు సమూహ జీవితాన్ని శాసిస్తామని ముందుకొస్తున్నారు. ఇది భారతదేశ చరిత్రలో ఒక మహత్తర ఘట్టం. అపూర్వ సందర్భం" అని బాలగోపాల్ తన 'దళిత' వ్యాససంపుటిలో అభిప్రాయపడ్డాడు.

మనిషిని మనిషిగా కాక కులదృక్పథంతో చూసే నిచ్చెనమెట్ల కులవ్యవస్థ ఏర్పడడంతో భారతీయ సమాజం అంతరాలతో, అభ్యంతరాలతో నిండిపోయింది. వైరుధ్యాలతో కులగర్వం పెరిగింది. ఏ రెండు కులాలు ఒకటిగా లేకపోవడం, ఏ కులానికి ఆ కులపు ప్రత్యేకత ఉండడం ఒక ముఖ్య కారణమయ్యాయి. ఛాందసవాద ఆచారాలు, కఠిన సంప్రదాయాలు, మూఢత్వంతో నిండిన కట్టుబాట్లు, నియమాలు రూపొందించుకోవడం వల్ల కులాల మధ్య, మనుషుల మధ్య తారతమ్యాలు సృష్టించబడి అధికమయ్యాయి. కొంచెం తీవ్రత తగ్గినా చాపకింద నీరులా కొనసాగుతున్నాయి. తత్ఫలితంగా మనుషుల మధ్య స్పష్టమైన విభజనరేఖ గీయబడింది. ప్రాచీన సాహిత్యంలో అధికభాగం వర్ణవ్యవస్థను సమర్థించింది.

వర్ణవ్యవస్థను రూపుమాపాలని కలలుకన్న సాహిత్యం మనుషులంతా ఒక్కటే అని చాటింది. అందరూ ఒక్కటే అనే సిద్ధాంతం ద్వారా పాల్కురికి సోమన్న, అన్నమయ్య, వీరబ్రహ్మేంద్రస్వామి, వేమన, దున్న ఇద్దాసు మొదలైనవారు తమ పద్యాలు, గేయాలు, తత్త్వగీతాల ద్వారా తెలుగు సమాజంలో మార్పును ఆకాంక్షించారు. సాహిత్యంతో బలమైన ముద్రవేశారు. అయినప్పటికీ కుల ఛాందసవాదం ఊగి ఆగిన ఊయల తీరే ఉంది.

ఫూలే దంపతుల నిస్వార్థ సేవ, అంబేడ్కర్ పోరాటం వల్ల కాంగ్రెస్ పార్టీ కూడా హరిజనోద్ధరణకు పిలుపునిచ్చింది. నిరసనల నడుమ దళితుల ఆలయ ప్రవేశాల కోసం కృషిచేసింది. స్వాతంత్ర్య కాలంలో ఆధునిక భావాలు ఆహ్వానించబడినప్పటికీ అవి వ్యవస్థలో సంపూర్ణమైన మార్పు తేలేకపోయాయి. కూటికి పేదనే అయినా కులానికి తక్కువనా? అనే కులాహంకారం నిండిపోయింది.

కులాలకు మూలం వర్ణవ్యవస్థ. కులనిర్మూలన జరగాలంటే వర్ణనిర్మూలన జరగాలని 'వర్ణనిర్మూలన' సిద్ధాంతాన్ని గ్రంథరూపంలో డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ రచించారు. కులవ్యవస్థ మనుషుల్ని కలవనివ్వలేదు. "కులవ్యవస్థ శ్రామికుల్ని సైతం విభజించింది" అని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ పేర్కొన్నారు. కులం మనుషులను విభజించడానికి మాత్రమే ఉపయోగపడిందని అర్థమవుతుంది. ఒక కులం మీద ఒక కులం నిచ్చెనమెట్ల తీరుగా తారతమ్యాలు సృష్టించబడ్డాయి.

డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ తన Who Were the Shudras (1946) అనే పుస్తకంలో, శూద్రులు అనాదిగా హిందూ సమాజంలో చతుర్వర్ణ వ్యవస్థలో నాల్గవ వర్ణంగా, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు సేవకులుగా పరిగణించబడ్డారని పేర్కొన్నారు. వీరు ఆర్యుల తెగలకు చెందినవారని, బ్రాహ్మణులతో జరిగిన సంఘర్షణ కారణంగా హోదా కోల్పోయి తక్కువ కులంగా మారిన రాజవంశీకులని ఆయన వాదించారు. ఇదే అంశాన్ని — బింబిసారుని (క్రీ.పూ. 542) కాలంలో చాతుర్వర్ణ వ్యవస్థలో భాగమైన శూద్రులకన్నా హీనంగా మరొక వర్ణం, పంచమవర్ణాన్ని సృష్టించినట్లు — రొమిల్లా థాపర్ (తరతరాల భారత చరిత్ర) పేర్కొన్నారు. కాలక్రమేణ కులాల మధ్య అంతరాలు ఆర్థిక, ఆధ్యాత్మిక, వృత్తిపర, సామాజిక వివక్షకు దారితీశాయి. నీచవృత్తులు చేసే మనుషులను నీచంగా చూడడంతో అంటరానితనం వేళ్లూనుకుపోయింది. ఒకప్పుడు వెలుగువెలిగిన ఈ దేశ మూలవాసులు శూద్రులుగా మార్చబడ్డారని అవగతమవుతుంది. శూద్రులు పంచములుగా పిలువబడుతున్నారు. పంచములు అంటే హిందూ సాంప్రదాయ చాతుర్వర్ణ వ్యవస్థ (బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర) పరిధిలోకి రాని, ఆ వ్యవస్థకు వెలుపల ఉన్న అణగారిన వర్గాల వారు (దళితులు/అస్పృశ్యులు) అని అర్థం. వీరు సాంప్రదాయ కులనిచ్చెనమెట్లలో ఐదవ వర్ణంగా లేదా అంతకంటే తక్కువగా పరిగణించబడేవారు. స్వాతంత్ర్యోద్యమ కాలంలో హరిజనులు (దేవుని బిడ్డలు) గా సంబోధించబడినవారే ఇప్పుడు దళితులుగా పిలువబడుతున్నారు. స్వాతంత్ర్యానంతర కాలంలో దళితుల జీవితం తెలుసుకోవాలంటే సాహిత్యం అధ్యయనం చేయాల్సిందే. సాహితీ ప్రక్రియలు చాలా ఉన్నాయి. కథకు మానవ జీవితంలో విశేషమైన పాత్ర కలదు. పండిత పామర జనరంజకంగా ఆదరించబడుతుంది.


దళిత పదం వివరణ: 'దళిత' అను శబ్దానికి ఖండించబడిన, చీల్చబడిన, వెలివేయబడిన అను అర్థాలున్నాయి. (ఇంగులం — దళిత అస్తిత్వ వ్యాసాలు, శ్రీనివాస్, సంగిశెట్టి). 1972లో మహారాష్ట్రలో దళిత పాంథర్స్ మ్యానిఫెస్టో ప్రకటించిన ప్రకారం — "దళితులంటే... షెడ్యూల్డ్ ట్రైబ్స్, నయా బౌద్ధులు, శ్రామికులు, భూమిలేని పేదలు, రైతులు, మహిళలు, ఆర్థికంగా, రాజకీయంగా, మతం పేరిట దోపిడీకి గురయినవారందరూ దళితులే!" అయితే ప్రస్తుతానికి 'దళిత' అనే పదం షెడ్యూల్డ్ కాస్ట్స్‌కు పరిమితమైంది. సామాజికంగా అంటరానివారిగా పరిగణింపబడుతున్న కులాలకు మాత్రమే ఈ పదం వర్తించబడుతోంది.


తెలుగులో దళిత సాహిత్య భూమిక: 9వ శతాబ్దంలో శాసనభాషగా, 11వ శతాబ్దం నుండి అనువాదంతో ప్రారంభమైన తెలుగుకు వెయ్యేళ్ల లిఖిత చరిత్ర ఉంది. ఆధునిక తెలుగు దళిత సాహిత్యం పేరులేని రచయిత రాసిన 'మాలవాండ్ర' పాటతో (1919) ప్రారంభమైందని చెప్పాలి. మంగిపూడి వేంకటశర్మ 'నిరుద్ధ భారతం' (1933), కథాప్రక్రియలో శ్రీపాద సుబ్రమణ్య శాస్త్రి ప్రబుద్ధాంధ్ర (1925) పత్రికలో 'పుల్లంరాజు', 'ఇలాంటి తవ్వాయి వస్తే' కథలతో దళిత దృక్కోణం వెలువడింది. అడివి బాపిరాజు 'నరసన్న పాపాయి', కరుణకుమార 'పోలయ్య', చలం 'హరిజన సమస్య', గోపిచంద్ 'చెప్పులు కుట్టేవాడు' మొదలైన కథలు వెలువడ్డాయి. ఈ కథలను సహానుభూతి సాహిత్యమే తప్ప అనుభూతి సాహిత్యం కాదని విమర్శకులు తేల్చారు.

తొలి తెలుగు దళితకథ, తొలి తెలంగాణ దళిత కథకుడు భాగ్యరెడ్డి వర్మ 1931లో 'వెట్టిమాదిగ' కథను అజ్ఞాతవాసి పేరిట రాశాడు. ఈ మధ్యకాలంలో సంగిశెట్టి శ్రీనివాస్ వివరిస్తున్న కథ 'నేరేడు పండ్ల కంటు' (గోలకొండ పత్రిక 1926–1935) 1930లో శ్రీనివాస్ అనే యానాం దళితుడు రాసిన తొలి దళిత కథగా ప్రకటిస్తున్నాడు. తొలి తెలుగు దళిత కథా రచయిత్రి తాడి నాగమ్మ 'ఇంకెక్కడి విజయం' (1934) గృహలక్ష్మి పత్రికలో అచ్చయింది. తెలంగాణ తొలి దళిత కథా రచయిత్రి జనగామకు చెందిన మామిడి సత్యవతి 'తెరతొలగింది', 'హితువు', 'సుశీల', 'స్వేచ్ఛ' మొదలైన కథలు రాసింది. ఉమ్మడి రాష్ట్రంలో దళిత కథాసంకలనం డా. ఆర్. చంద్రశేఖరరెడ్డి మరియు కె. లక్ష్మీనరసయ్య సంపాదకత్వంలో 'దళిత కథలు' (1996) విశాలాంధ్ర ప్రచురించింది.

కంచికచెర్ల కోటేశు హత్య (1968, ఫిబ్రవరి 24) తో దళిత స్పృహ రచయితలలో కలిగినా, మహారాష్ట్రలో దళిత పాంథర్స్ వల్ల దళిత సాహిత్యం సామాజికోద్యమంగా వికాసం చెంది తెలుగు నేలకు వ్యాపించింది. కారంచేడు సంఘటన (1985, జూలై 17) దళిత సృజనకారులలో మరింత దళిత దృక్పథాన్ని మేల్కొల్పింది. తెలుగు సృజనకారులు వివిధ ప్రక్రియలను ఆశ్రయించి ప్రజలను జాగృతం చేశారు. ప్రధానంగా పాట సుడిగాలిలా చుట్టేసింది. కథా ప్రక్రియ అందరికీ చేరింది.


దళిత కథ పుట్టుక: మనిషి పుట్టినప్పుడే కథ పుట్టిందంటారు కదా! మరి దళితకథ? జీవితంలోంచి, అణచివేతలోంచి, పీడనలోంచి ఉద్భవించింది. దళితకథలో శిల్పం, శైలీ లేదు, నైపుణ్యం లేదనే వారున్నారు. రాజ్యాంగం ప్రసాదించిన వివక్షలేని జీవితం దళితులకు ఇప్పటికీ అందని ద్రాక్షగానే ఉందనే విషయం గ్రహించాలి. అందమైన అల్లిక గురించి ఆలోచించకుండా అణచబడుతున్న జీవితాల గురించి ఆలోచించినప్పుడు ఇలాంటి విమర్శ రాదు. దళితులకు విశేషమైన జీవితముంది. విషయ విస్తృతి ఉంది. లెక్కకు మించి వివక్షలు (అకాడెమిక్ అన్‌టచ్‌బిలిటీస్) ఉన్నాయి. ఇప్పటికీ ఉన్నత చదువులు చదివి, ఉన్నత ఉద్యోగాలు చేస్తున్న వారికి కిరాయి ఇల్లు దొరకని వ్యవస్థలోనే ఉన్నామనేది ఎవరూ ఆలోచించరు. దళిత కథ దినదిన ప్రవర్థమానమవుతూనే ఉంది.

దళిత దృక్పథంతో తొలి కథాసంపుటి బోయ జంగయ్య 'లోకం' (1997). తొలి దళిత కథాసంకలనం ప్రచురించారు. భార్గవీరావు సంపాదకత్వంలో 'ఇంకానా? ఇకపై సాగవు' (1994), గుండెడప్పు కనకయ్య సంపాదకత్వంలో వెలువడిన కథాసంకలనం 'ఎదురుచూపులు' (1998), వారిదే దళిత చైతన్యంతో రాసిన తొలి కథాసంపుటి 'మేమిట్లుండం' (1998) వెలువడ్డాయి. గోగు శ్యామల సంపాదకత్వంలో 'నల్లపొద్దు' (2002) — యాభై రెండు మంది దళిత స్త్రీల సాహిత్య సంకలనం; జూపాక సుభద్ర, గోగు శ్యామల సంపాదకత్వంలో 'నల్లరేగడి సాళ్లు' (2006) — మాదిగ ఉపకులాల మహిళా కథలు; జాజుల గౌరి 'మన్ను బువ్వ' (1999) మొదలైన కథాసంపుటాలు వచ్చాయి. డా. సిద్దెంకి యాదగిరి, గుడిపల్లి నిరంజన్, తప్పెట ఓదయ్య సంపాదకులుగా జంబూ సాహితీ సంపాదకత్వంలో దళిత కథావార్షికలు రూపుదిద్దుకున్నాయి — 'తొండం బొక్కెన' (2020, దేశంలోనే తొలి దళిత కథావార్షిక), 'చిందూనేల' (2021), 'సాక' (2022), 'కొమ్ము' (2023), 'గండదీపం' (2024).


తెలంగాణ కృషి: తెలంగాణ రాష్ట్ర సాహిత్య అకాడమీ ఏర్పాటయ్యాక కథాసాహిత్యంపై వెలువరించిన సంకలనం 'మూడు తరాల తెలంగాణ కథ'లో తెలంగాణ తొలి దళిత కథకుడు భాగ్యరెడ్డి వర్మ 'వెట్టిమాదిగ' కథకు, యువ దళిత కథా రచయితలకు చాలామందికి స్థానం దక్కలేదు. తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ మామిడి హరికృష్ణ, దామోదరరావుల సంపాదకత్వంలో ఆంగ్లంలో Telangana Harvest: Telugu Short Fiction (1912–2011) — తొలితరం కథకులతో పాటు జాజుల గౌరి, జాతశ్రీ, పసునూరి రవీందర్‌ల కథలున్నాయి. తెలంగాణ తొలి కేంద్ర సాహిత్య యువపురస్కారం డా. పసునూరి రవీందర్ 'అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా' (2015) కథలకు వరించడం దళిత కథకు దక్కిన ఆత్మగౌరవమే. సిద్దెంకి యాదగిరి 'తప్ష' కథల సంపుటికి 2019 సంవత్సరానికి ఉత్తమ గ్రంథ పురస్కారం వరించడం కూడా దళిత కథకు దక్కిన గౌరవంగా భావించాల్సిందే. తెలంగాణ దళిత కథను సుసంపన్నం చేస్తూ కథలు రాస్తూ అస్తిత్వ పతాక ఎగురవేస్తూ దళిత జీవితాలను ఆవిష్కరిస్తున్నారు.


తెలంగాణ కథాసాహిత్య చరిత్ర: తెలంగాణలో పురుడు పోసుకున్న దళితోద్యమం భారతదేశానికే దిక్సూచిగా నిలిచింది. హైదరాబాద్‌లో 1917లో స్థాపించిన ఆది హిందూ ఉద్యమం ప్రోద్బలంతో 1936లో డా. బి.ఆర్. అంబేడ్కర్ అఖిల భారత షెడ్యూల్డ్ కులాల సమాఖ్యను స్థాపించారు. ఈ ఉద్యమానికి ఎం.వి. భాగ్యరెడ్డి వర్మ, బి.ఎన్. వెంకటరావు, అరిగె రామస్వామి త్రిముఖ ద్వారాలుగా పనిచేశారు.

తెలంగాణ ఉద్యమాల ఖిల్ల. నిరంతరం చైతన్యం పుణికిపుచ్చుకున్న నేల. ఈ నేలలో కథాసాహిత్యం కూడా పోరుగాథలను, ఉద్యమాలను చిత్రించింది. దళిత కథల్లో అస్తిత్వంతో పాటు దళిత దృక్పథాన్ని, చైతన్యాన్ని ప్రతిబింబించాయి. 'వెట్టిమాదిగ' కథతో ప్రారంభమైన తెలంగాణ అనేక కథలకు జీవంపోసింది. కథాసంపుటాలు, సంకలనాలు వచ్చాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం సంగిశెట్టి శ్రీనివాస్, గుడిపల్లి నిరంజన్ సంపాదకత్వంలో ఎనభై ఆరుగురు దళిత కథకుల కథలతో 'తెలంగాణ దళిత కథలు' పుస్తకానికి రాసిన ముందుమాటలో సంగిశెట్టి శ్రీనివాస్ తెలంగాణ దళిత కథలను ఐదు దశలుగా విభజించారు — తొలిదశ భాగ్యరెడ్డి వర్మ కాలం (1931–1956), రెండో దశ బోయ జంగయ్య కాలం (1956–1970), మూడో దశ జాతశ్రీ–కనకయ్యల కాలం (1970–2000), నాల్గో దశ స్త్రీ త్రయ కాలం (2000–2014), ఐదో దశ యువకాలం (2014– ...). ఆయా కాలాల్లో ప్రభావితం చేసిన రచయితల వల్ల ఆ కాలాలుగా విభజించారు. వారు సూచించిన కాలానంతరం కూడా కథలు రాశారు — ఉదా. బోయ జంగయ్య కాలం 1956–1970 అనుకుంటే వారు 'మూలాలు' కథ 2005లో రాశారు. దళితకథను వివిధ విభాగాలు చేసుకొని అధ్యయనం చేస్తే పొడిచిన పొద్దును, నడిచిన కాలాన్ని, గడిచిన బతుకు వేదనలను అధ్యయనం చేస్తే దళితుల జీవితం అర్థమవుతుంది. కాలాలు సరే కాని కథకులను కాలకర్తలుగా కాకుండా కాలాన్నే ప్రమాణికంగా తీసుకుందాం. దళితకథను వివిధ విభాగాలు చేసుకొని అధ్యయనం చేద్దాం.

7, మే 2026, గురువారం

నడిమింటి బోడెక్క బసివిరాలయ్యేద -నాగప్పగారి సుందర్రాజు.

* నడిమింటి బోడెక్క బసివిరాలయ్యేద *

ఈపొద్దు బడి తప్పొయ్యేదని సానా సొంతోసుము పడుతుంటాను. నిన్న సంకరప్ప అయివారు సెప్పిన సక్రొడ్డి ల్యక్కులు సెయ్యి లేదు. కర్నుము అయివారికి ఇదే సొందు నన్ని తొన్నేకి. యట్లరా దేవుడా! గుండుము గడిసేదని అపలాసన సేసుకంట వుంటే నడిమింటి పెద్దమ్మొచ్చి కార్యుము లోక పిలిసేద. మా యమ్మ యేమో, “ఏవరే! బడికి పోదురా,” అని సెప్ప్య. “వొ ప్లే సరసక్కా! నీకింతు గూడ బుద్ధి లేదు సూడుప్లే. నీవేమన్నా అనుకో ఇంట్లో కార్యుము పెట్టుకొని ఈ పొద్దన్న ఇంత పొద్దుగాలుగ వొచ్చి ఆ పనీ ఈ పనీ సూసుకోకుపోతే యట్ల ప్లే. వొక్కొడుకు కొడుక్కాదు వొగు బిడ్డ బిడ్డగాదు అనేర. నాకి సేసే వొళ్ళు యెవురుండారు నువ్వే సెప్పు? ఈ పొద్దన్న నువ్వింత ఆ పిల్ల దగ్గరుండి పూజార్లు అడిగినివి అందిస్తే బాగు లేదా. అది అసులే తిక్క పిల్లల్లాది. బసివిరాలుని ఇడిస్తాము అనిన పొద్దుట్నుంచి వొగిటే యేడుపు యేడుస్తుండాది. యంత సెప్పినా వూరుకోదు. నన్ని బసివురాలు ఇడద్దండో... యెవుడు కన్న కూలి సేసుకొని తినేవోనికి ఇచ్చి పెండ్లి సెయ్యండి. రెక్కలు కష్టము సేసుకొని బతుకుతామని వొగిటే తరాగా యేడుస్తుండాది. మాకేమొ వుండేది వొగితే కదా యాడన్నా బసివిరాల్ని ఇడుసుకుంటే కొండ్లు ముందు వుంటాదని ఆస. నీడ పాట్న సుకంగ వుంటాది. ముసులు ముప్పుతనానికి మమ్ముల్ని మడసనంగా సూసుకుంటాదని మా ఆపలాసన” అంటాని వొగిటే యాతర సేసుకుంట మా యమ్మకి సుపుతుండాది నడిమింటి బెలిగింటి పెద్దమ్మ.

పదక్కే! వొస్తాను పదా. పొయ్యి మింద బూవుడుకుతాది గెంజి వొంచి వొస్తాను పదా” అనే మాయమ్మ. “ ఏం ప్లే! ఇంట్లో కార్యుము పెట్టుకుని బూ వొండుకుంట కుసునేవ్నా. సానా యక్కడ దప్పిం దానువు వున్నట్లుండావే, ” అనిడిస నడిమింటి పెద్దమ్మ. “పిల్లోల్లుండే పని గదిక్కే. కార్యమన్నంక యాలా తప్పుతాది కదా. పిల్లోల్లుకి ఆకిలయినప్పుడు ఇంట్లో వుంటే యేసుకొని తింటారు. ల్యాకపోతే పని సేయనీకుండ గుద్దెనుక యేడుసుకుంట తిరుగుతారు,” అంటాని మా యమ్మ పడసాల కట్ట మింద నుంచి పొయ్యిగడ్డ తాకి పాయ. 

“వొప్పో.. సాలాప్పో.. యల్లల్లు బీలు యల్ల సదివేవగాని. ఈ పొద్దు వొగిటి బడికి పోకుంటే ఆడేమి దేసుము కుంటుపడేది లేదు. బోడెక్కని బసివురాలు ఇడుస్తుండాము కదా. సుట్టాలంతా వొచ్చేర. వాల్లికి యేమన్న నీళ్ళు గీళ్ళు అందిచ్చుకుంట వుండుకుండ బడికి పోతానని పలకా బుక్కులు తీసుకునేవునే, ” అంటాని బెలిగింటి పెద్దమ్మ మా ఇంట్లో నుంచి బయటికి పొయ్యిడిస. 

గాలి కాలుము. బయట ఈదురుగాలి ఈస్తుండాది. గవాసులెంట గాలి లోపులికి వొస్తుంటే పొగ బయటికి పొయ్యేకిల్యాక ఇంటి నిండ ముసురుకునేద. పొగదెబ్బికి కండ్లు మండుతుండాయి. కండ్లో నుంచి ముక్కులో నుంచి నీళ్ళు కారుతుంటే మాయమ్మ వొగు సేత్తో సీమిడి సీది పొయ్యిలో యేసి కొంగుతో సమట తూడుసుకుంట గంజి వొంచుతుండాది. ఇదే సొందురా నాయినా బడి తప్పిచ్చుకునేకని సేతిలో పలకా బుక్కాలు గూట్లో సప్పిడి కాకుండ పెట్టిడిసి బయటికి జారుకునేన. 

పెండ్లికి యేసినట్లు పందిరి యేసిడి సేర. బోడెక్కొళ్ళు ఇంటికాట్నించి మాదిగ్గేరి నిండ యేసిడి సేర. కల్డెన్నాళ్ళు ఇంటి కాన్నుంచి మా ఇంటి వరుకు వొగిటే పందిరి యేసిడి మేర. బుంగులు నాటి తడుకులు యేసి బసిరాకుతో పందిరి యేసింటే గేరంతా యంత బాగుండాదని. పందిరి కింద కుండ్రంగన్నోళ్ళు ఇల్లు, వులిగెమ్మవ్వొళ్ళు ఇల్లు, కలెన్నోళ్ళు ఇల్లు, గుంతుకంటి ఆయమ్మళ్ళు ఇల్లు, మా పెద్దిల్లు, మా సిన్నిల్లు, నట్టనడుమ బోడెక్కొళ్ళు ఇల్లు యంత కళకళలాడుతాదని. 

బోడెక్కొళ్ళు ఇంటి ముందు నాలుగు బసిరికట్లు నాలుగు దిక్కులు తుక్క నాటి ఆటికి జమ్మాకు కట్టేర. యరుమొన్ను సున్నుము పట్లు పెట్టేర. మద్దిలో కుంకుము బుక్కు పిండితో బొట్లు పెట్టేర. నాలుగు గుంజులు నడిమద్దిలో కమ్మిడి పొరిసి సాసుకుము యేసేర. ముందురు పక్క రెండు దిక్కులు రెండు రాసులు జొండ్లు పోసి మూడు ఆకులు రెండు వక్కులు పెట్టేర. వొగపక్కి కలుసుము పెట్టేర. కలుసుము మద్దిలో ఆకులు పెట్టిన గిన్నిలో ఈబీతి పొండు తీసుకుని కల్డెన్న కొడుకు మల్లన్న మామ అందరికి అడ్డుబొట్లు పెడుతుండాడు. బోడెక్కొళ్ళు వలన్న వులిగెన్న, మల్లన్న మామ పణమింద పెట్టిన ఈబీతి పొండు అడ్డుబొట్లు మింద మద్దిలో కుంకుము బొట్లు పెడుతుండాడు. ఇంతులోకి తలారి నాగన్న మల్లన్న మామని ఆరిసిడిస. 

“వొసస్! మల్లగా! పిల్లోల్లుకి ఆడోళ్ళుకి రెండు రెండు బొట్లు పెట్టు. మొగోళ్ళుకి మూడు మూడు బొట్లు పెట్టు. శ్యాస్త్రుము తప్పుకూడదు. తెలిసేద్నా. అదేమరి. మరిసిపోకుండ సెయ్యి. లేదంటే నాకిట్లే,” అనిడిస.  “ఓ తలారాతినీ! నాకి తెలుసులా సామ. అవుతుల గేర్లో వుసేనక్కని బసివిరాలుని ఇడిసినపుడు నేను కార్యుము సేసేది సూస్తిని. అనమక్కని బసివిరాలుని ఇడిసినపుడు నేను దెగ్గిరుండి సూస్తిని. పులి గెమ్మవ్వని బసివిరాలు ఇడిసినపుడు కూడ సేసేనకాని సరింగ గురుతులేదు. అపుడు నాను సిన్ని పిల్లోన్ని. ఇదేమన్న పెద్ద ఇసిత్రుమా. నాకి ఇడిసి పెట్టండి మరి. ఈ పొద్దు బోడెక్కని బసివిరాలు ఇడిసే పనంతా నేనే చేస్తాను. యేమనుకునేర మడి నన్ని. మిమ్ముల్ని వొగిటి గూడ అడిగితే అపుడు అనండి. అవుర్రా మల్లగాడు పెద్ద ముసులోని లక్క యంత బాగ సేసేడ కార్యుము అన్న" అనిడిస మల్లన్న మామ. “యే మండమ్మా! ఇంగా అయ్యేద్నా లేదా. యాలా తప్పుతాది. పిల్లని తీసుకురాండమ్మా, కర్నుము సామి సెప్పిన మూర్తానికి కరెట్టుగా ద్యావుర్లు గట్టల్ల. రాండి రాండి. ఇంగా యేటికి పొయ్యి సానుము సేస్కోని రావల్ల. ఇంగా యాడ పొద్దు వుండాదని అట్లా తాసికారుము సేస్తూండా,”రని లాలప్ప తాత కూతేసిడిస. 

“జుమ్ చుకనక్ - జుమ్ జుమ్ చుక్ నక్- జుమ్ జుమ్ చుక్ నక్,” అంటాని బ్యాల్డాని బైనే అయ్యప్ప జమిడికి అనిపిచ్చే తలకాల అందరి సెవులు నిగిరి బొడిసిడి సేవ. “ఇంగేమి సూస్తారు తీసుకొండలేయ్. ఇంగా యంతో సేపని కాస్తారు ఆ తప్పిట్లుని,” అని కందారప్ప పెద్దప్ప అనే తలకాల- “జగ్గణకణకణ, జగ్గణ కణకణ, జగ్గణకాన్ - జగ్గణ కణకణ, జగ్గణ కణకణ, జగ్గణకాన్,” అంటాని తప్పిట్లు, తాసాలు వర్రర్రర్రాని మోగుతుండాయి.

యక్కక్కట్నుంచో వొచ్చిన బసివురాళ్ళంతా ముందు గుంపుగా నిలబడి పాట్లు పాడుతుండారు. మద్దిలో వొగ పెద్ద బసివిరాలు వొడి నిండ గింజులు పోసుకుని రెండు సేతుల్లో రెండు యాపమండ్లు పట్టుకోని యెంటుకులు ఇరుబోసుకుని ముకుము నిండ బండారు బూసుకోని పణిమింద కుంకుము బొట్టు పెద్దది పెట్టుకుని, కండ్లు మూసుకొని మెల్లి మెల్లిగ నడుస్తుండాది. ఇంగా పులిగెమ్మవ్వ పెయ్యిలోకి వొచ్చినట్లు లేదు. అంద్కనేమొ ఆయమ్మ యేమేమి వూగుకోకుండ మట్టసనంగా కదులుతుండ నొడుస్తుండాది. 

మొగోళ్ళంతా తపిట్లు సుట్టూర సేరేర . తప్పిట్లోళ్ళు యెగిరెగిరి కొడుతుండారు. బైనే అయప్ప జమిడికి సుట్టు బసివురాళ్ళు ముసురుకునేర. జమిడికి శబుదుము, తప్పిట్లు తాసీలు అన్ని కలిపి వొగిటే రొవుసుమింద వాగుతుంటే సుట్టుముట్టు వూరుకి ఇనిపిచ్చేతట్లుండాది. యనకాల బోడెక్క యేడుసుకుంటా ముసుగేసుకోని తలకాయి వొంచుకోని మెల్లిమెల్లిగ నడుస్తుంటే ఆయమ్మ సుట్టు అవుతులు గేర్లో ఆడొళ్ళు ఇవుతులు గే ఆడొళ్ళు, వూర్లు నుంచి వొచ్చిన సుట్టాలు సానామందికి ముగుబడిడిసింటే తిర్నాలు నాడు తేరుసుట్టూరుగ వూరంతమంది కదిలి పొయ్యినట్లుండాది.

సిన్నసిన్న పిల్లకాయలంతా క్యాకులేసుకుంట యెగురుకంట ముందు ముందు పారిపోతుండారు. జాతర యల్లబారినట్లు మాదిగోర్లో నుంచి వూరేగింపు బయలుదేరిడిస. సవురమ్మ గుడి తాకి వొచ్చి, వొగకాయి కొట్టుకొని గోంది రొడ్డాళ్ళు ఇంటి ముందెళ్ళి ఈడిగి రంగయ్యెళ్ళు ఇంటికాట్నించి సింత మాకుల్లోని బాయితాకి వొచ్చేతలకాల రెండుగంట్లు సేపు అయ్యింటాది.

వక్కుపొడి కొరికే తలకాల పారిపొయ్యి పారొచ్చేంత దూరుము లేదు ఇది. అట్లా దానికి ఇదింత వూరేగింపు వొచ్చేదానికి రెండు గంటల టెయిము బట్టేద్నంటే ఇంగ సూస్కో జనుము యెంత యెగురుడుము యంత కుసీ సేస్కుంట వొచ్చేర్నో. ఇంగ తప్పిట్లు ఆపండప్పా. తప్పిట్లు ఆపి తావేవొళ్ళు యెవురో బిలీన కొల్లూ సరాయి తాగండి. బీడీలు గీడీలు తాగి తప్పిట్టు కాపుకోని రెడీగుండల్ల సూడీ. తానికార్యుము సెయ్యికుండ పిలిసే తలకాల యెత్తుకోవళ్ళ- అంటాని సెప్పి దుబ్బీరన్న బాయిగడ్డ తాకి పాయ. 

తప్పిట్లు కొట్టేవొళ్ళు తప్పిట్లు యండికి పెట్టి ఈడిగి రంగయ్యొళ్ళు ఇంటి ముందు దుమ్ములోనే కుసినిడిసిరి. ఈడిగి రంగయ్యళ్ళు కుసునేర. దుమ్ములో కుసునేకి ఇస్టుము లేనోళ్ళు నిలబడుకొనే వుండారు. బాయిగడ్డ మింద ఆడొళ్ళు గుంపులు గుంపులు నిలబడేర. మొగోళ్ళంతా అట్లా దూరుము నిలబడేర. అది సూసేకి అగాదుము లోతు బాయి. నాకి బుద్ధి వొచ్చినప్పట్నించి ఆ బాయిలో సుక్కు నీళ్ళు వూరింది లేదు. వాండ్లు కాలుము పడిన్నీళ్ళు మూడు దినాలకి, రెట్లు గాలే పెంచుమింది కేసిన నీళ్ళు లక్క పీరుసుకు పోతాయి. యండ కాలుము అయితే ఆవుర్గావుర్లు వొస్తాయి బాయిలో నుంచి . ఇంత నీళ్ళు కి కరువు వుండే వూరు ఈ దేసుములో యా వూరు వుండుదేమో. 

మాదిగో యే కార్యుము అయినా గంగకంటాని పొయ్యిరావల్లని సెంబు నిండో కడుపు నిండో నీళ్ళు తీసుకోనొచ్చి, వొట్టి బాయిలోకి దిగి బొట్లు బెట్టిన రాయి మిందే తెచ్చిన నీళ్ళు గుమ్మురిచ్చి శ్యాస్త్రుము అయ్యిపొయ్యిడి సేదని అనిపిస్తారు.
ఇపొద్దు బోడెక్కని బసివిరాల్ని ఇడిసే కార్యుము అంటే సానా పెద్ద కార్యుము. సుట్టుముట్టు పండెండూర్లు మంది సూసేకొచ్చేర. దూరాబారుము నుంచి సుట్టాలు గిట్టాలు వొచ్చింటే వూరంతుటికి పండుగున్నట్లు వుండాది . కర్జెగొట్టు పూజార్లు, గట్టు మల్లయ్య, గొరువయ్యిలు, వులిగి పెద్దమ్మ, ఇంగా రానేరాలేదు. వాళ్ళందరికి బొస్సు అబ్బినట్లు లేదు. వొస్తారు వొస్తార్లే ద్యావుర్లు కట్టే తలకాల అనుకొంటుండారు.

బాయిగడ్డ పెయ్యి మెటికలు మింద మ్యాకు పోతుమ్యడికి యాపాకు మండ్లు కట్టి కుంకుము బుక్కు పిండి పెట్టి దాన్ని దువ్వుతుండారు పెద్ద మనసులు. బంగారప్పొళ్ళు ఇంటి ముందుర బసిరి మానుకాడ అయిదేండ్లు నుంచి వులిగెమ్మవ్వకి ఇడిసిన బోడెక్కొళ్ళు దున్నుపోతుని కట్టేసి పెట్టేర. 

అయిదేండ్లు కింద ఇన్నూర్రూపాయిలికి పెదరొడ్డాళ్ళు యను గొడ్డుకి పుట్టిన దున్నుపోతు పిల్లని బోడెక్కొళ్ళు నాయిన నడిమింటి కందారప్ప కొని వులిగెమ్మకని ఇడిసిడిసేడ. అది సముచ్చురము తలకాల నేమికంటొళ్ళు ద్యావురు పోతని సుట్టుముట్టు వూర్లోళ్ళు అందరికి తెలిసేతట్ల తిరిగి మేసి బలిసిడి సేద. వున్నట్లుండి వొగు సొమ్ముచ్చురము కనబడుకుండ పొయ్యిడి సేద. బోడెక్కొళ్ళు తిరిగిన వూర్లే కుండ తిరిగితే, అక్కడ యక్కడో పడుముటుదిక్కు కనుడు దేసుములో వుండాదని తెలిసి మాదిగొళ్ళుందురు ఇంటికో మనిషి పొయ్యి అదిలిచ్చుకొచ్చేర. అయిదేండ్లు అయ్యే తలకాల దాన్ని సూసేకి బయిమయ్యేతట్ల వుండాది. బోడెక్కిని యప్పుడు బసివిరాల్ని ఇడుస్తారో ఈ దున్నుపోతు బాధ యప్పుడు తప్పుతాదో అంటాని రెయితులు అపలాసన సేసుకుంట వుండి. 

వొగునాడు బోడెక్కొళ్ళ నాయిన్ని బజార్లోకి పిలిసుకొని వూర్లో వొళ్ళంతా పంచాద పెట్టిడి సేర, “ఏం కందారప్పా! ద్యవురుపోతు వూరందురు సెండ్లో పడి పయిర్లు పాడు చేస్తుండాదని వూర్లో రెయితులందురు బాదపడుతాండారు. మడి నువ్వు ఏమంటావో సెప్పు,” అంటాని కాలుమింద కాలేసుకుని యడుము సేత్తో మీసుము దువ్వుకుంట పెదరెడ్డి అడిగిడిస. 

రేడీ రూము ముందు పందులు పొర్లాడే దుమ్మలో మాకాళ్ళు మద్దిలోకి మాసేతులు పెట్టుకుని కుసినిన నడిమింటి కందారప్ప, నెత్తిమింద రుమాలు తీసి సంకులో పెట్టుకొని రెండు సేతులు యెత్తి మొక్కి మాట్లాడేది మొదులు పెట్టిడిస. “నిజిమే రొడ్డీ! పయిర్లు కాపుకొచ్చిన మాట నిజిమే. నా ద్యావురుపోతు యాటకొచ్చిన మాట నిజిమే. రవుసు మింద వున్నింది రైయ్యిమని పొయ్యి పయిర్లు మింద పడి మేసింది నిజిమే. మడి నొన్నొమి సెయ్యిమంటావు రొడ్డీ. వూరు కట్టిడి పళారుము మా కులాచారుము పకారుము, మా యింటి దేవితి వులిగెమ్మ మొక్క బడి పకారుము సాతనయిన పని చేస్తిని. అప్పుడు సెయ్యి తిరుగుతుండా రెండు నూర్లు పెట్టి నీ మాట పకారుము నీ యెనుగొడ్డుకి పుట్టిన దున్నపోతునే కొని ద్యావరుకి ఇడిస్తిని. ఇప్పుడు కార్యుము సెయ్యల్లంటే సిన్నపనా . మా యట్లో సన్నాళ్ళుకి అయ్యే పని కాదు. పసిపిల్లిని పట్టుకుని బసివిరాలిని ఇడసల్లంటే మనుసు యెగుదుసూడి రోడ్డీ,” అంటాని నడిమింటి కందారప్ప అంటాండగానే ....

“యేమలే కందరగా... యేమంటివి. నీ బిడ్డ పసిపిల్లా, నోట్లో యేలు బెడితే కొరుకుదే మతినీ, యదమింద కొంగు తీసేస్తే సారుట్లావు వుండావి సాండ్లు. వూర్లో మొగోళ్ళంత ఆ మాదిగి బోడెక్కిని యప్పుడు బసివిరాల్ని ఇడుస్తారా, యప్పుడు బొట్టు కట్టి పెట్టుకుందామని యెదురు సూస్తుంటే, యేమి వగులు మింద మాట్లాడుతుండావు మాదిగతినీ ... దానికేల్యా అంటారు పెద్దాళ్ళు మాలోన్ని సెప్పుకుండ తన్నల్ల- మాదిగోన్ని సెప్పి తన్నల్లని. " సానా రవుసు మింద మాట్లాడిడిస బాయిగడ్డు అనుమంతు. పెద్దిరెడ్డి అతిని మాట్లుకి అడ్డుము తగిలి, “నువ్వుండప్పా అనుమంతూ. నేనుండాను గదా, మాట్లాడేకి... ఏం కందారప్పా ఇప్పుడు సెయ్యి. నీ బిడ్డికి వొయి సెంత." 

“పదేండ్లు రొడ్డీ", "అవ్వు మొగోడా ! నీ బిడ్డికి పదేండ్లని నువ్వు సెప్పితే నమ్మేకి మేమేమన్నా తిక్కనా కొడుకులు అనుకునేవునా. ఆ పిల్లని సూస్తే పదయిదేండ్లన్నా దాటుంటాయనిపిస్తాది. ఆ పిల్లికి పెండ్లి సేసింటే ఈ పాటికి నలుగురు పిల్లులన్న పుడుతుండ్రి. అయినా పదేండ్లు అయితేనే మతినీ. పొయ్యి నేడు నాను వులిగి జాతికి పొయ్యింట్నీ. ఆడ సూస్తే నాకే అచ్చర్యుము యేసేద. సిమింత సిమింత పసిపిల్లుల్ని బసివురాళ్ళుని ఇడుస్తుంటారు. మీరు నిజుము సెప్పితే ఇంటారు. అపద్దుము సెప్పితే ఇంటారు. మాయమ్మ తోడు సెప్పుతుండాను... వొగూరోళ్ళు సంకలో పిల్లనే బసివిరాళ్ళు నిడిసిడిసిరి. మగా అంటే మూడేండ్లు వుండునప్పా. దీనికేమంటారు సెప్పండప్పా,” అంటాని బాయిగడ్డ అనుమంతు లా పాయింటు తీసి కట్టమంద కుసినిన పెద్ద మనుసులు, వూర్లో వొళ్ళుని కట్టకింద దుమ్ములో కుసినీన మాలోళ్ళు మాదిగొళ్ళు అందరిని నిక్కినిక్కి సూసిడిస. “నిజమే గద కందారప్పా! అన్ని వూర్లులోన పదేండ్లు గాని లేని పియోల్ని బసివిరాలుని ఇడుస్తుంటే మసూర్లో మాత్రుము యేంటికి ఇడుసుగూడుదు సెప్పు. మీ మాదిగొళ్ళుకి యంత సెప్పినా అర్హుము గాదు. కొమ్ము నరసప్ప బిడ్డ పులిగమ్ముని బసివిరాలుని ఇడిసినప్పుడు ఇదే రంకు. మస్తానమ్మ బిడ్డ అనుమక్కని బసివిరాల్నుని ఇడిసినప్పుడు ఇదే రంకు. యాటకవి మిమ్ముల్ని వొరుసుకునేది సెప్పండప్పా," అనిడిస రెడ్డి . 

“అదిగాదు రొడ్డీ, బూము బుట్రు లేనోళ్ళుము. యాదో మీకింద కూలీనాలీ సేసుకోని బతికే వొళ్ళుము. మామింద అట్లా కోప్ము అయితే యట్టద్యావురా. మీరే యట్లన్నా దయదలసండ,"ని కీసన్న తాత మట్టసనంగా మాట్లాడిడిస. “నువ్వు సెప్పు కందారప్పా. అస్సులు నీ బాదేందో అందురు ముందు ఇప్పి సెప్పిడి,” అని పెదిరెడ్డి ఆడ్రెసిడిస. “సరే రొడ్డీ, మీరు సెప్పితే కాదంటానా. కాదని మేము ఈ వూర్లో బూడిదేసేమ్నా. పెట్నా మీరే కొట్నా మీరే. మీ మాట పకారమే నా బిడ్ని బసివిరాల్ని ఇడిస్తాను,” అంటాని వొప్పేసుకునిడిస నడిమింటి కందారప్ప.

“అది సరేప్పా, మడి ద్యావుర్ని సేసేకి ఇబ్బందులు గిబ్బందులు వుండావంటివి. కీసన్నగూడ అదే మాట్ని సెప్పిడిస. ఆ సంగతి కూడ ఇపిడే కడా తెంపులు సేసుకుంటే కార్యుము సేసేకి కర్నుము సామి మూర్తుము కడుతాడు మడి. కర్నుముసామి గూడ యాయాల్నుంచి కదులుకుండ యేంటికి కుసునేద అనుకునేర. " “కార్యుము అంటే మీకి తెలీంది యేముంది రొడ్డీ. కర్చుకందాయిము వుంటాది కదా,” అని కందారప్ప. 

“మడి అదేనప్పా, నిన్ని సెప్మనింది. యంత కొర్చు అయితాది సెప్పితే వూర్లో వొళ్ళు అంతా కలిసి తాలకింత ఇచ్చిడిస్తారు," 'వొండుకొని తినిందానికి వొగిటే రకుమంట. అడుక్కోని తినిందానికి అరవయ్యి ఆరు వంటకాలంట, ' అంటాని వూరికే అనేర్నా పెద్దాళ్ళు ... అడుగడుగు నీ కర్చు యంతో,” అంటాని వొగ శ్యాస్త్రుము యేసి సెప్పిడిన పెదిరెడ్డి. “అదిగాదు రొడ్డీ. వూరంత మంది ఇచ్చేది వొగెత్తు. మనూరి పెదరొద్దీళ్ళు ఇచ్చేది వొగెత్తు అంటాని మాప్యద్దొళ్ళు యప్పట్నుంచో కతలు సెప్పుతుంటే ఇంటుండాము. మా ఆసంతా మీ మిందే కద రోడ్డీ, మడి మీ మాటేంటో సెప్పునే లేదు,” అంటాని అడ్డుము తగిలి మాట్లాడిడిస గుంపులో నుంచి లాలప్ప తాత.  

“మీ పెద్దాళ్ళు సెప్పితే ఇనేమంటావే. నువ్వు సూల్లేద. ఈ వూర్లోనే కాదు ఈ ఆలూరు తాలూకాలోనే నేమికంటి పెదరొడొళ్ళంటే సానా మంచోళ్ళని పేరు తెచ్చుకునేమ కదా. మేము ఇనాము ఈకుండా ఈ వూర్లో యేవుడన్నా కార్యుము సేసుకునేడ్నా యేమి. సెప్పు లాలప్పా.. సెప్పు. అంద్కనే కదా కందారప్పని కర్చుంతో సెప్మని పదిమంది ముందే అడుగుతుండాను," అనిడిస పెదిరొడ్డి.

"వొలేయ్ కందారుగా.. నీకేమన్నా మతి పొయ్యేద్నేమిలేయ్. పెదిరొడ్డి పెద్ద నోట్కేసుకోని అడుగులే ఇస్తానంటుంటే, అక్కడా ఇక్కడా సూసుకుంటా నెంగిసిల్లిలక్క నెత్తి గీక్కుంటుండావే. అందికే అంటారు మడి ' మాదిగోనికి మల్లిపువ్వు ఇస్తే మడిసి గుద్దలో పెట్టుకునేన్నంట' అంటారు పెద్దాళ్ళు. వొలేయ్ ... రా ... రార్రా ... ఇట్లుర్రా ...” అంటానీ నడిమింటాయప్పని గుంపులోకి పిలిసి గుసుగుసుమని సానా సానా ఇసయాలు సెప్పుతుండారు. మాదిగోళ్ళుకి రొపుంత ముందు మాలొళ్ళు గుంపు కుసునేది. వాళ్ళు కేమి పట్టినట్లు లేదు. వూరికే సూసుకుంట కూసునేర. అవుతులు పక్క బాయొళ్ళు గుంపు వుండాది. నబీసా వొళ్ళు వోటుపక్క తురుకొళ్ళు గుంపు కుసునేర. వాళ్ళకి యడమ పక్క కటికెవొళ్ళు , దూదేకులొళ్ళు కుసునేర . రేడీ రూము కాంపౌండుని ఆనుకొని వున్నిన మంగుళ్ళు సాపులు యనకపక్క మంగులోళ్ళు అంతా కుసునేర. మంగులొళ్ళుకి యెనికి పక్క సాకులొళ్ళు కుసునేర. రొటొళ్ళు సరిగ్గ పింజిరోళ్ళు, బలిజే వొళ్ళు, బైనేవాళ్ళు, ఈడిగొళ్ళు, క్యామిటోళ్ళు, కమ్మొళ్ళు పెద్ద మనుసులు కట్టమింద వుండారు . మిగిలిన కులాలొళ్ళు అంతా రేడీ రూము సుట్టూరుగ కుసునేర. అన్ని కులపోళ్ళందురు వున్నీన పండ్లన్నీ ఇడిసి పెట్టుకొని మునిమాపునే రేడీరూముతాకి వొచ్చి కూసునేర. నడిమింటాయప్ప మా పెద్ద మనుసులు సెప్పినవన్నీ ఇని పైకి లేసి రొడ్డికి సెపుతుండాడు. 

“జొన్ను బూకోసుము రెండు మూట్లు జొండ్లు, సామికి యడేసేకి. పెద్ద మనుసులికి సాబూ పెట్టేకి వొగు మూట వొరిబీము. ద్యావురు నంజిరిలోకి యచ్చుము, ఆకులు పూజికి, దీపారాజినికి, పెద్ద మనుసులు ఇనాము. తప్పిడి గొట్టేవాళ్ళు కర్సు- వాళ్ళు తాగే సారాయి కొల్లుకి, పూజార్లు, బసివిరాళ్ళుకి ఇచ్చేకి, అదీ ఇదీ కలిసి రెండు వెయ్యిలు అయ్యితాదేమో సూడి రొడ్డీ,” అనె . "దుడ్డేమన్నా సెట్లుకు కాస్తాండా యనుకునేవునా యేమిరా కందారుగా! నీ బిడ్డని బసివిరాలుని ఇడిసికి రెండు వెయ్యిలు అయితాదా? ఇదే రెండు వెయ్యిలికి కర్నాటుకుములో అయితే పదిమందిని బసివిరాల్లునిడచ్చు. నీ బిడ్డేమన్నా బూలోకుము రంబనుకునేవునా. అతి లోకుము సుందరమ్మ అనుకునే వునా. ల్యాకుపోతే పూర్లో యెవ్వురు సూన్నట్లు సూపరమ్మ అనుకునేవునా, నువ్వు రెండు వెయ్యిలు రూపాయిలు అనేతలకాలా ఇచ్చేకి. ఇంతుకు ముందు మీ మాదిగొళ్ళు పిల్లుల్ని యంతమందిని బసివిరాల్ను ఇల్లేదు. మేము దుడ్లు ఈలేదు. యంతిచ్చే వొళ్ళుము? మాకి బుద్ధిచ్చినపుట్నుంచి బసివిరాలు కర్సు కింద అయిదారు నూర్లు, యెయ్యి రూపాయిలంటే మగా కస్టిము అప్పా! అట్లా దానికి వొగేసారి రొండు యెయ్యిలంటే మమ్మిల్ని యేమన్నా తిక్కనా కొడుకులు అనుకునేవునా, ” అంటాని లేసి అడిగిడిస కమ్మ నారానప్ప.

“మీరు వూరుకోండప్పా. నేనుండాను కదా మాట్లాడేకి. అది కందారప్ప వొగిని మాట కాదు గదప్పా. వాళ్ళ మంది గోళ్ళంత కలిసి మాట్లాడుకునిందే మనికి సెప్పేడ. అయినా వాళ్ళనని యేమి లాబ్ము సెప్పం డప్పా. మిండ్లుకు బుట్టిన గోర్మెంటు అనల్లగాని. అమ్ముబోతే అడివయ్యేద కొనుబోతే కొరివయ్యేద. సంచినిండా దుడ్లు కండానిపోతే సంతులోకి, సారుట్లోకి గూడ రావు సొరుకులు. బసివిరాలు కర్సు కిందికిచ్చే రెండు యెయ్యిలికి లేనిపోని మాట్లన్నీ అనీ యేం లాబ్ము. సూడండప్పా మన వూరి కట్టిడి పకారుము మాదిగి కందారప్ప తన బిడ్ని బసివిరాలు ఇడిసేకి సొంతోసంగ వొప్పుకునేడ. ఈ కార్యుముకు అయ్యే కర్సులో సాగు బాగుము నేనొకున్నే బరించుకుంటాను. మిగిలింది వూరందురు కలిసి ఇయ్యిండి . ఇంటికి రూపాయి యేసుకున్నా ఇట్లా కార్యలు పడి సెయ్యుచ్చప్పా. దీనికింత రాద్ధాంతుము యేంటికిగాని... కందారప్పా ఇంగ పొయ్యి కర్నుముసామి సెప్పినట్లు మలుకులు పున్నుముకు నీ బిడ్డ పెద్దమనిషి అయితాది కదా . అందుకని ఆరెద్దులు కార్తి అయిన మూడు దినాలుకి నీ బిడ్ని బసివిరాల్ని ఇడిసిడి. యేమండప్పా వూరందరికి ఇది సమ్ముతమే కదా,” అని పెదిరొడ్డి పంచాద తెంపే తలకాల యెవురింటికి వాళ్ళు యెగురుకుంట పొయ్యిడిసిరి. 

ఆ పొద్దు రేడీ రూము కాడ జరిగిన పంచాద పొద్దు నుంచి ఈ పొద్దు బోడెక్కిని బసివిరాల్ని ఇడిసే వొరుకు నెలదినాలు వూరువూరంతటికి పండుగున్నట్లే వుండాది. కాకుపోతే సద్దుసంగిట్లోకి జారిపొయ్యిన జొన్నగింజిలక్క బోడెక్క వొగితి ఆ పొద్దుట్నుంచి ఈ పొద్దువొరుకు వొగిటే తరాగా యేడుస్తుండాది. నీళ్ళు లేని బాయిలో బోడెక్కకి గంగుసానుమని ఇంటి వాటి నుంచి కడుపులో యెత్తుకొచ్చిన నీళ్ళు నెత్తి మింద పోసిడిసిరి. పాత బసివిరాళ్ళంత కలిసి బోడెక్కికి ఇంటికాట్నించి కట్టిచ్చుకొచ్చిన తెల్లిసీర తెల్లిరెయికి ఇప్పిదీసి, ముందుగాలుగునే కట్టి పెట్టిన యాపాకు మండులతో పయ్యంత సుట్టిడిసిరి. వొంటి మింద బట్టల్యాకుండ యాపాకు మండుతోనే కాళ్ళు కాడ్నుంచి గొంతు కాటి వొరుకు యాపాకుతో పెయ్యి కనపడకుండ మట్టిడి సేర. ఇదేదో అదిముకాలుములో మనుసులు ఇట్లుండే వొళ్ళంటాని బాయిగడ్డ మింద వుండే ముసులొల్లు అనుకుంటుండారు.

బోడెక్క వొగిటే తరాగా యెక్కుళ్ళు బట్టేతట్ల యేడస్తుండాది. “వూరుకోమ్మే ... వూరుకుండు. 'అమ్మ' కార్యుమప్పుడు యేడుకూడుదు. పులిగమ్మవ్వకి క్వాప్మొస్తే జీవితాంతుము ఇట్లే యేడుసుకుంట బతుకు మని సాపు పెడతాదంట. మట్టససంగా బసివిరాలు అయినోళ్ళుని పచ్చనాకులక్క సల్లుగ బతుకుమని వరుము ఇస్తాదంట. యేడద్దులేమ్మే , యేడొద్దు. ఇంగ అయిపొయ్యిడిసేద కదా,” అంటాని వొగ ముసిలి బసివిరాలు సముదాయిస్తుండాది. పయినిండ యాపాకులుతో కట్టింటే సేతుల్నీ కాళ్ళు కదిలిచ్చేకి కస్టంగా వున్నట్లుండాది బోడెక్కికి. ఇపుడు బసివిరాళ్ళు యేమి సేసినా సేతులు అడ్డుము పెట్టేకిల్యాక పాయ. బసివిరాలు అనుమక్క డ్యాగురులోని బుక్కు పిండి తీసుకొని బోడెక్క ముకుము నిండ బూసిడి సేద. బసివిరాలు వుసేనక్క కుంకుము బొట్టు పెట్టేద. ఇంగోగాయమ్మ యగ్గట్టిన కొప్పుని ఇప్పిదీసి యెంటుకులు ఇరుబోసేద. యడముకాలు అరికాలికి అరి సేతికి మసిబొట్టు పెట్టిడి సేర. కాళుకి సేతులుకి పొసుపు పూసింటే పూలు పూసిన గూర్నూలు సేనక్క పుండాది బోడెక్క. జిట్ట తగులుతాదని మసిబొట్టు పెట్టేర. 

“అక్కుల్ జోన్ ....జోక్కుల్ జోస్... జోగో జోగో,” అంటాని మూడుసార్లు 'జోగులు తట్ట' పట్టుకుని బసివిరాళ్ళు అందురు జోగేసిడిసిరి. బోడెక్క తుక్కు తిరిగి మూడుసార్లు , పడుముటు తిక్కు మూడుసార్లు , తూర్పు తిక్కు మూడుసార్లు తిరిగి మొత్తుము తొమ్మిదిసార్లు జోగేసి ... “ఉదోవ్ ఉదో ... ఉదోప్ ఉదో ...." అంటాని జోగులుతట్లు యడమ బుజుమింద పెట్టుకుని కుడి సేత్తో యాపాకు మండ్లు పట్టుకుని బసివిరాళ్ళు అందురు క్యాకులేసిడిసే తలకాల బయినే ఆయప్ప జమిడికి బుజానికి తగిలిచ్చుకుని, “జుమ్ చుక నక్ ... జుమ్ జుమ్ చుకక్ ... జుమ్ జుముచుకనక్,” అంటాని వాయించ. బుడ్డుమారప్ప టంకాయి తీసుకుని పైకెత్తి బాయిగడ్డ మెటికులు మింద యేసి కొట్టే తలకాల పిచ్చులు పిచ్చులు అయ్యిడి సేద. ఆ కొబ్బరి ముక్కులు యేరుకునేకి పిల్లోళ్ళు తండ్లాడుతుంటే తప్పిట్లోళ్ళు, “కణకణ జగ్గణ కణకణ ... జగ్గణ కణకణ ... జగ్గణ కణకణ,” అంటాని వూపు అందుకునిడిసిరి. యాడదంటాడే కుసినీనవాళ్ళూ, నిలబడివోళ్ళు, బాయితాకి పురికొచ్చిడిసిరి. బాయిలో నుంచి ఆడొళ్ళందురు గుంపుగా నిలబడి బోడెక్కిని మద్దిలోకి యేసుకోని మెల్లి మెల్లిగ మెటికులు యెక్కిచ్చుకుంట పెయికి తీసుకొని వొచ్చేర. 

బంగారప్పొళ్ళు ఇంటి ముందు బసిరి మానుకింద కట్టేసిన ద్యావురుపోతుని తాళ్ళు ఇప్పి సుమారు నూరుమంది బలుమయిన మొగొళ్ళు ఇగ్గి పట్టుకునేర. దున్నుపోతువి యక్కడ కదులునీకుండ ముక్కలో నులుక్కి రెండు తాళ్ళు కట్టేర. కొమ్ములికి రెండు తాళ్ళు కట్టేర. నాలుగు కాళ్ళుకి నాలుగు తాళ్ళు కట్టేర. గొంతుకి రెండు తాళ్ళు కట్టేర. మ్యల్లో నుంచి ముందురు కాళ్ళు మద్దిలోకి గుదిగి కట్టి కట్టేర. నూరుమంది మొగొళ్ళు పెయినే ఇగ్గి పట్టుకుంటుంటే దున్నుపోతు బుసులు కొట్టుకుంట అక్కడా ఇక్కడా సిమ్ముట్లాడుతాండాది. 

ద్యావురుకి మూడు దినాలు ముందు పోతుని పట్టుకుని కట్టేసి ముక్కు కుట్టి ముగుతాడు యేసేర . రేవు ద్యావురనంగా తిరిగి ద్యావరుపోతును కాళ్ళు గట్టి కిందికేసి బండిగుటాలు, బానేకట్లు, అనుసుకట్లు తీసుకుని తిరిగిన తుక్కల్లా కొట్టి కడువులుతో సన్నీళ్ళు యెత్తేర. అయిదేండ్లు అడ్డుముల్యాకుండ రాజ్జమేలే వొళ్ళు మేసినట్లు మేసి బూంమింద కాలు పొందుబెట్టుకోకుండ సిమ్ముట్లాడు కంట తిరిగిన పోతును కట్టేసి కొట్టిండే కొట్టుడానికి వెయ్యి లోపల యముకులు నంజిరి. ముద్దు ముద్దు అయ్యిపొయ్యింటాది. దాని నంజిరిని కురాకు వొండుకొని తినినా రుసి వుండుదు. అట్ల అణగొట్టింటే అది ఇంగా యక్కడబడితే అక్కడ సిమ్ముకొని పొయ్యేకి సూస్తుండాది. పొయిము మొగోళ్ళంతా తాళ్ళు ఇగ్గిపట్టి నిలేస్తుండారు. 

ద్యావురు పోతు నంజిరి కాపుదను మొళ్ళు తిండ్రు గదా. వూర్లో నంజిరి తినే వొళ్ళందరికి కలిసి రెండు మ్యాకుపోతుల్ని ద్యావురికీ ఇడిసేర. ఇంగా రొంతుమంది కోళ్ళుని ద్యావురికి ఇడి సేర. ద్యావురికి ఇడిసిన మ్యాకుపోతుల్ని నాకారు పిల్లోల్లు తాళ్ళుతో పట్టుకుని అవిటికి యాపాకు తిని పిచ్చకంట యెగురుకుంట వొస్తుంటారు. మ్యాకుపోతులు యనక తప్పిట్లోళ్ళు గూడ ఆడేవొళ్ళు సరింగ యెగురుకంట తప్పిడి కొడుతుండారు. తప్పిడి రంగన్న అయితే రూపాయి బిల్లులు తప్పిట్లోకి యేపిచ్చుకుని కింది నుంచి సిటుకులు కొడితే తప్పిట్లో దుడ్లన్ని పెయికెగిరి కింద పడుతుండాయి. కింద పడిన దుడ్డుని యేరుకొని యేరుక్కొని జోబులోకి యేసుకుంటుండాడు. అది సూసి తత్తారి గుడ్డా యప్ప రెచ్చిపొయ్యి రూపాయి నోటుని మొంట్లో పడే పిచ్చి తాసే కొట్టకంట, ఆపుకోకుండ కంటిరెప్పులుతో రూపాయి నోటుని పట్టుకుని పెయ్యికి లేసిడి సేడ. తప్పిటి రంగన్నకి రోసుమొచ్చి పావులా బిల్లులు న్యాలుమిందేసి తప్పిడి కొట్టుకంట, ఆపుకోకుండ తలకాయి బార్లేని పొండుకొని ముగుముని మొంట్లో అట్లా ఇట్లా పొర్లాడిచ్చి పావులా బిళ్ళని పణమింద అంటిచ్చుకుని పెయ్యికి లేసి తప్పిట్ని యెగిరెగిరి కొడుతుంటే సుట్టుముట్టు సూసేకి ముసురుకునిన జనుము ఈలులు యేసి క్యాకులు యేసి అరుసుకంట యెగురుతుండారు.

తప్పిట్లోళ్ళుకి యెనకాలే దాసిరి లసమక్క గలుస్తంబుము పట్టుకుని గంట కొట్టుకంట, దీపా రాజైము వొత్తిని యెగేసుకంట వొస్తుండాది. ఆయమ్మ యనుకునే బైనే ఆయప్ప జమిడికి వాయిస్తుండారు. ఆయప్ప యనకాల్నే జోగులుతట్లు పట్టుకొని జోగేసుకుంట 'ఉదో ఉదో' అంటాని బసివిరాళ్ళు యనక దుబ్బీరక్క కలుసుము పట్టేద. కడాకి ఆడోళ్ళంత గుంపు గుంపు నడుసుకుంట మద్దిలో బోడెక్కిని నడిపిచ్చు కుంట వొస్తుండారు. 

బోడెక్కని సూసేకి యక్కుడక్కుడోళ్ళు యగుబడుతాండారు. గుంపులో వుండే బోడెక్క సరింగ కనబడుదు. దూరుము నుంచి సూసేవాళ్ళుకి బోడెక్క ఇరుబోసుకునిన నెత్తి, బండారు పూసుకునిన మగుము రోంతురోంత కనబడతాండాది. మద్దిలో మద్దిలో ఆడోళ్ళు అట్లా ఇట్లా కదిలినపుడు పయ్యంత బట్లు ల్యాకుండ సుట్టిన యాపాకు కనబడతాంది. తేరు పరిసట్లా జనుము కండ్లు కొట్టుకోకుండ బోడెక్కిని సూసేకి తండ్లాడుతాండారు. వొగిటేతరాగ బోడెక్క యేడిసీ యేడిసీ కండ్లు యర్రగ సింతుపిచ్చుకలు అయ్యేవ. కన్నీళ్ళు తూడుసుకునేకి బోడెక్క తలకాయి వొంచుకున్నపుడు ఆ గుంపులో నుంచి యేమేమి కనుపడుదు. వూరేగింపు బాయిగడ్డతా నుంచి ఈడిగిరంగయ్యెళ్ళు కల్లుప్యంటుతాకి వొచ్చే తలకల్ల, గోయిందు రొడ్డాళ్ళు మిద్దిమింద వూర్లో జనుము సేరేర. బోడెక్కిని సూసేకి వొచ్చిన వూర్లో ఆడోళ్ళంతా గోయిందు రొడ్డాళ్ళు ఇంటి మింద, బడేసావొళ్ళు మిద్దిమింద, ఇంగా తురుకొళ్ళు బాయెళ్ళు, వొడ్డేవాళ్ళు మిద్దులు మింద నగ్గా జనుము నిలబడిడి సేర. 

యేమి సిపారస్తమయిన జనుము కలిసేర్రా! ఇట్లా జనుము పెద్దరొడ్డాళ్ళు పెండ్లికి కూడ కలిసండ్రు సూడండప్పా! సూసేనుగాని, యంతు మందునో బసివిరాళ్ళుని ఇడిసేది. బోడెక్క అద్రుస్టుమే అద్రుసుము అంటాని మంది అంతా అనుకుంటుండారు. వూరేగింపు సవురమ్మ గుడి తాకి సేరేద. మా వూర్లో వులిగెమ్మవ్వ గుడి లేదు.అంద్కనే సవురమ్మవ్వ గుడిలోనే బిగుమూలుకి బౌండ్లు పోసి, జొండ్లు మింద మరువు పెట్టి మరువు మింద ముంత పెట్టి, ముంతు మీద పీసుతీసి ట్యంకాయి పెట్టి దానికి మూడు బండారుతో అడ్డుబొట్లు పెట్టి, దానిమింద పూలుదండ యేసి దేవుతిని సేస్తారు. దానికే కొత్తబట్లు సుట్టి, బట్లు కట్టిచ్చేమ అంటార. సాతనైనోళ్ళు యెండితో మీసాలు, కండ్లు సేపిస్తే ఇంగా కలిగినోళ్ళు ముగుమే సేపిచ్చికొచ్చి కార్యుము సేస్తారు. ఈ పొద్దు బోడెక్కిని బసివిరాలుని ఇడి సేకి అట్లే సేస్తూండారు.

సల్లునీళ్ళు కడుపు తీసుకోనొచ్చి పాదాల కట్ట కడిగిడిసిరి. బండారు పూసి కుంకుము సల్లి నిమ్ము కాయిలు పుల్లిగడ్లు కోసి గండ్రాగొడ్లి, యాటకొడివెండ్లుకి పూజేసి ట్యంకాయి కొట్టిడిసిరి. పోతుని, బోడెక్కిని గుడి సుట్టు మూడుసార్లు తిప్పుకోని వొచ్చి గుడికి ముందుగాల పాదాలు కట్ట కాడ నిలిబెట్టిడిసిరి. ఆడొళ్ళుని పిల్లోల్లుని దూరుము జరిపిడిసిరి. “కొత్త వూర్లోళ్ళుని ఈడ్యాడ వుండొద్దండప్పా. మడసనంగా సెపుతుండాము దూరుము పొండి. యేమండప్పా ఇది పెద్ద మనుసులు మాట. యేరే వూరోళ్ళు పొలి కండాని పొయ్యేకి వొచ్చింటారు. వుండూరోళ్ళంతా పెయినిండ కండ్లు బెట్టుకొని ఆయుదాలు పట్టుకొని వుండండ,"ని లాలప్ప తాత క్యారేసిడిస. 

పదేండ్లు దాటిన పిల్లోల్లు నుంచి ముసిలిముసిలొల్లు పరుకు మొగోళ్ళంతా, కట్లు, కటార్లు, బల్యాలు, బాకులు, పిడికత్తులు, యాటకొడివెండ్లు, గండ్రాగొడ్డెండ్లు, అనుసుకట్లు, పురిబల్యాలు, బానే కట్లు, బండిగూటాలు పాదాలు కట్టకాడ పెట్టి పూజేసినవన్నీ తలాకొకిటి మా మాదిగోళ్ళంతా తీసుకు నిడిసే. పెండ్లయిన మొగొళ్ళు పెండ్లాల తాలిబొట్టుని కుడి సేతికి కట్టుకునేర. పెండ్లి కానోళ్ళు మలతాడు తీసుకుని కట్టుకునేర. ఇట్లా తప్పుడు యేమన్నా అయ్యి పానుము బోతే మెచ్చుము వొస్తాదని నమ్ముకుము . బాయెళ్ళు గూడ వొగురో ఇద్దరో వొచ్చి నిలబడేర. ద్యావురుపోతుని నరికినపుడు దాని రొగుతుము యంత దూరుము సిట్లుతాదో అంత దూరుములో కొత్తు వూర్లోళ్ళుని వున్నీకుండ దూరుము పొమ్మనేరగదా. ఇంగ మిగిలిన మా వూరొళ్ళంత దున్నుపోతుని ఈ యేడు యెవుడు మూడేట్లుకి నరుకుతాడోనని సూసేకి తొక్కులాడుతుండారు.

అయిదారేండ్లు నుంచి అదేపనికి గండ్రాగొడ్లి సేపిచ్చుకుని కొబ్బిరి బల్లుము, సెలిమిండి ముద్దు లట్లా యచ్చుము తినుకంట అయిదారుమంది వుండారు. వూరుము కాలుములో అయితే వొగిటే యేటికి దున్నపోతుని నరికేవాళ్ళు అని మా తాతొళ్ళు సెపుతుండారు. డోను మొద్దు అట్లా దున్నుపోతు మ్యడిని వొగిటేయేటికి తుంట్లు బడేతట్ల యట్ల నుకుతారప్పా అంటాని అచ్చర్యుము పొయ్యేవొళ్ళుము. ఇప్పుడు నానాకు మొందులు కూడు తినే ఈ నాయండ్లు సాతనే మయితాది . అట్లాదానికే మూడేట్లుకి కన్నా మూడేట్లుకి నరికినోనికి మూడు తులాలు బంగారుము ఇస్తారు. ఇంత కత వుండాది కనుకే మరి వొగిని మింద పోగుడు పోటీపడి యడీ గండ్రా గొడ్డెండ్లు అదే పనికి పిచ్చుకుని పిక్కమింద కండ పురి తిరిగేతట్లా యచ్చుము తిని బలుస్తారు. పై పందాలు గూడ నగ్గా కాస్తారు. ఈ యేడు ద్యావురుపోతుని నరికే వొంతు తలారి నాగన్న కొడుకు రామగిరికి వొచ్చేద. తోడు పెండ్లి కొడుకు లక్క వొగురు నరుకు ల్యాకపోతే కార్యుము ఆగిపొయ్యి అపుచారుము అయితాడని మిగిలిన అయిదారుమందిని నరికేకి వుండల్లని పెద్ద మనుషులు బొప్పందమంట. అందక్కని రామగిరి సరిగ్గ, దుబ్బిరన్న కొడుకు ముక్కిడి రామాంజిని, రోగాయప్ప కొడుకు ఈరుగాడు, సిన్నాయప్ప కొడుకు మల్లికార్జిని, కీసన్న కొడుకు నరసప్ప, యెదిరింటి కందారప్ప కొడుకు ఇసువురప్ప, గోసులు పోసుకుని అంగీలు వుప్పేసి రెక్కిలికి తాయెత్తులు కట్టుకుని, కుడి సేతి కంకణానికి పెండ్లాలు తాలిబొట్టు కట్టుకుని, మీసాలు పురి పెట్టి తొడగొట్టి ఆయుదాలికి మొక్కి గండ్ర గొడ్డెండ్లు తీసుకొనేర. 

దున్నుపోతు ముందుకాళ్ళు కింది నుంచి కాడేమాను యేసి గొంతుని కాడేమాను మింద పెట్టి యక్కుడొళ్ళు అక్కడ బిగబట్టేర. యెనకిపక్కి కూడ దున్నుపోతుని కదిల్నీకుండ కడుపు కిందికి అవుతులు నించి, ఇవుతులు నించి, తాడేమాండ్లు యేసి ఇరుగు బట్టుకునేర. రామిగిరి వొచ్చి ద్యావురుపోతు మ్యడకాడ నిలబడి రెండు సేతులుతో గండ్రా గొడ్డిని పైకెత్తి ద్యావురు పోతు మ్యడమింద మెల్లిగ ఆనిచ్చి పైకెత్తి, అట్ల రెండుసార్లు సామిని మొక్కినట్లు సాంపులు సూసినట్లు సేసి వొగుసారి నిక్కినీలిగి గండ్రా గొడ్డుని బలుముకొద్ది రెండు సేతులుతో పైకెత్తి వాటుము సూసి అడ్డుము బెట్టి వొగిటే యేటు నరికితే సరి, దెబ్బకి దున్నుపోతు తలకాయి తెగి తుండు బడిడిస. దున్నుపోతు తలకాయి కాడిమాను మిందు నుంచి యాలడపడే తలకాల గొంతు కింద యేలంత కరుసుకునీన తోలుగూడ తెగిపొయ్యిడి సేద. తప్పిట్లు జమిడికులు, బసివిరాళ్ళ 'ఉదో ఉదో' అరుపులు మద్దిలో వొగిటే క్యాకులు ఈలులు యేసుకుంట రామిగిరిని పెయికెత్తి పూలుదండ్లు యేసి యెగురేస్తుండారు అరుసుకుంట

మూర్తుము దాటిపోతాది పదండప్పా పదండని బోడెక్కిని గుళ్ళోకి తీసుకుని పొయ్యి పూజేసి జోగుళ్ళు యేసి 'ఉదో ఉదో' అనిడిసిరి. పయ్యంత సుట్టిన యాపాకుమండ్లు ఇప్పి అదరాబాదరా పసుపుపచ్చ సీర, రెయికి తొడిగిచ్చి, ద్యావరుకట్ట ముందు నిలిబెట్టిచ్చి కర్నుము సామితో కాలు తొక్కిచ్చి బయినే రామన్నతో దావర్లు కట్టిపిచ్చిడిసిరి. అయిపాయ నడిమింటి బోడెక్క బసివిరాలు అయ్యేద, ఈ పొద్దుట్నుంచి నడిమింటి బోడెక్కిని యెవుని సాతనైతే వాడు పెట్టుకోవొచ్చు. సిత్తకార్తిలో అడుకుక్కుసుట్టు అరువయ్యి ఆరు మొగుకుక్కులు సేరినట్ల, యట్లాగో వొగట్ల యేసుకో వళ్ళని సూస్తాయో ఇంగట్లో, బోడెక్కికి కన్నిరికుము పెట్టి సాతనైన న్నాల్లు పెట్టుకునేకి వూర్లో వొళ్ళంత కాపులు కాస్తుంటారు. సిత్తకార్తిలో అరవయ్యి ఆరు మొగుకుక్కులు సొంగు కారుసుకుంట ఆడుకుక్క తాకి వొచ్చేకి సూసినా సాతనైన వొగిటే వొగు మొగుకుక్క యెక్కి పెట్టేసుకున్నట్ల వొయిసు అయిపొయ్యే వొరుకు ఇంగోర్ని దరికి రానీకుండ బసివిరాలుని వొలుసుకుని తినేకి యక్కడ దప్నిన్నాయాండ్లు అందురు యెదురు సూస్తుండారని మాయమ్మ ఇంగా యేమేమొ సెప్పుతుంటే ... “బోడెక్క ఇంగా పెద్దమనిషి కూడా అయిలేదు కదమ్మా. ఈ పొద్దు బసివిరాలుని ఇడిసేర కదా. ఆ ద్యావుర్లు గట్టిన పూజారాయప్ప, కాలు దొక్కిన కర్నుము సామి, కుంకునుము గట్టిన గొరువయ్య ముగ్గురు ముసలి నాబట్లు కలిసి, సామి కార్యుమని ఆ పిల్లని ఈ రాతిరికే వొగుడయినంక వొగుడు పక్కులో పొండు బెట్టుకుంటారంట. అన్నిము పున్నిము యెరుగుని నడిమింటి బోడెక్కిని బసివిరాల్ని సేసి బజారికి యేసిడిసిరి. పెద్దమనిషి అయ్యే తలకాలే యంతమంది ముట్టుకుంటారో, పాయిము అయిపొయ్యే తలకాల యంతమంది పిల్లల్ని పుట్టిస్తారో, ముసిలిముప్పుతనానికి ఆ బగుమంతునికే తెలల్ల తల్లోయ్.... తలుసుకుంటేనే బయమయితాది,” అంటానీ దీర్గాలు తీసిడిస గుంతకంటి మస్తానమ్మ పెద్దమ్మ. 

ద్యావురపోతుని పగులుగోసి తోలు ఇడిపిచ్చి నంజిరి కుప్పులు యేస్తుంటారు. ఇంటికొకటి లక్క కుప్పులేసేర. మేము పెద్దింటి మాదిగోళ్ళుము. మాకి మేలేటు ఇయ్యల్ల. మా నాయిన సానా పగులు మొగోడు కదా. అట్లా తాకిరాడు. మా పెద్దప్పుకేమొ యంతు సేపు సేన్లు సేన్లు అంటారని సేన్లోపడి సేన్లోనే సచ్చిపోతుండాడు. మా ఇంటికి నేనే పెద్ద కొడుకుని. సిమింతున్నా ఈడు సిట్లు పడతాడని మాయమ్మ నాకి బిరుదు ఇచ్చేద. త్యామ్మే త్యారాదా ! గుడి కట్టకాడ ద్యాపురనంజిరి కుప్పులేసేది అయిపాయ. నీకి డ్యాగురు కడిగేదే కాలేదు. యట్లాగో అట్లాగ వుంటే వున్నీ త్యామ్మే అంటని డ్యాగురు తీసుకుని గుడితాకి పొయ్యి ద్యావురు పోతు నంజిరిలో మా పెద్దింటి కుప్ప యెత్తిచ్చుకుని నెత్తిమింద పెట్టుకుని ఇంటికి వొస్తుంటే పెయిన కాకులు, గద్దులు, నడిమింటి బోడెక్కిని వూర్లో వొళ్ళు తన్నుకుపొయ్యినట్లు నంజిరి కండ్లుని తన్నుకు పొయ్యేకి గంగురాటుము తిరిగినట్లు తిరుగుతుండాయి. నేనేమన్నా సిన్న మొగోన్ని అనుకునేర్నా. నెత్తిమింద నంజిరిడ్యాగిరి పెట్టుకుని యడమసేత్తో డ్యాగురు పట్టుకుని కుడి సేతులోని సిల్లాకట్టితో సాము కట్టి తిప్పుకంట కాకులు గద్దల్ని నంజిరికండ్లుని తన్నుకు పోనీకుండా ఇల్లు సేరిడి సేన.

('మాదిగోడు' కథల సంకలనం నుండి)
('కథ 1997'లో ప్రచురితం)

Vi. మన జాతర జన జాతర సమ్మక్క సారక్క

ఉపవాచకం

ఆజానుబాహుడు... అరివీరభయంకరుడు... రణరంగంలో ఎదురులేని ధీరుడు... దుర్గనిర్మాణదురంధరుడు... కళాపోషణలో సాటిలేని రసజ్ఞుడు... అతడొక చారిత్రక పురుషుడు...

໑໖໖...

1. సోమనాద్రి

(చారిత్రక వీరగాథ)

అనేక శతాబ్దాలకు పూర్వం రెడ్డి, వెలమ వీరులు తమ భుజబలంతో రాజ్యాలు సంపాదించుకున్నారు. ఆ స్వతంత్రరాజ్యాలు కొంత కాలానికి ఓరుగల్లు, విజయనగర సామ్రాజ్యాలకు వశమైపోయాయి. ఆ రాజుల పతనం తరువాత అవి నిజాం నవాబుకు సామంత సంస్థానాలుగా మారిపోయాయి. అటువంటి సంస్థానాల్లో ప్రసిద్ధి కెక్కింది గద్వాల సంస్థానం.

గద్వాల కోట ప్రవేశ ద్వారం (ప్రస్తుతం)

శతాబ్దాల చరిత్ర గల ఈ సంస్థానపు రాజులలో మొదటివాడు, ప్రసిద్ధి వహించినవాడు సోమనాద్రి. సోమనాద్రికి సోమభూపాలుడు' అనే ప్రసిద్ధ నామం కూడ ఉన్నది. ఇతడు క్రీ.శ. 1750 ప్రాంతంవాడు. బక్కమ్మ పెద్దారెడ్డిలు మన తల్లిదండ్రులు. భార్య లింగమ్మ. గద్వాల కోటను నిర్మించింది ఇతడే. అనేక యుద్ధాలలో విజయాలను దినవాడు. దైవసహాయంచేత ఈయనకు గొప్ప నిధి దొరికింది. ఆ ధనంతో నగరాన్ని, దేవాలయాలను వృద్ధి చేసి, కంచి, శ్రీరంగం, తిరుపతి వంటి చోట్లనుంచి వచ్చిన అనేకమంది కళాకారులకు బహుమానాలను శ్రీ కళాభిమాని, గద్వాల సంస్థానంలోని కాణాదం పెద్దన మొదలైన కవులు రామాయణాది గ్రంథాలు రచించారు. సరంగా గద్వాలసంస్థానం తెలుగు సాహిత్యాభివృద్ధికి చేయూతనిచ్చింది. సోమనాద్రి ఆరడుగుల ఎత్తుగల వర విగ్రహం, దృఢమైన నల్లనిశరీరం, సాముచేత కండలు తిరిగిన పొడవైన చేతులు కలిగినవాడు. మిత్రులకు సంగ, శత్రువులకు ప్రళయకాల రుద్రునివలె కనిపించేవాడు. అతడు తెల్లని గొప్ప జాతిగుర్రంమీద స్వారిచేస్తూ, రంగంలో కలయతిరుగుతూ అజేయుడై ఉండేవాడు.

131
సోమనాద్రి 'పూడూరు' ను రాజధానిగ చేసుకొని ఆ ప్రాంతాన్ని కొంతకాలం పాలించాడు. నేడు గద్వాల పట్టణంగ ప్రసిద్దికెక్కిన ప్రదేశమంతా ఆ రోజుల్లో దట్టమైన అరణ్యప్రాంతంగ ఉండేది. ఒకసారి వేటాడడానికి వెళ్ళిన సోమనాద్రి ఆ ప్రాంతాన్ని చూసి, అది తన రాజధానికి అన్ని విధాలా అనుకూలమైనదిగా ఉంటుందని భావించాడు. వెంటనే అక్కడ కోట నిర్మాణం చేపట్టాడు. అయితే ఆ ప్రదేశానికి సమీపంలోనే ఉన్న 'ఉప్పేడు'' కోటను సయ్యద్ దావూద్ మియా పాలిస్తున్నాడు. అతడు గోల్కొండ కోట పాలకుడు, నిజాం నవాబూ అయిన నాసిరుదౌలాకు ఆప్తుడు. దావూద్ మియా, సోమనాద్రి కోట నిర్మిస్తున్న స్థలం తన ఏలుబడిలో ఉన్నదని అందువల్ల కోట కట్టడానికి వీలులేదని అడ్డు చెప్పాడు.

సోమనాద్రి బాగా ఆలోచించాడు. కార్యసాధకుడైన సోమనాద్రి కోట నిర్మాణం అడ్డుకోవద్దని, నిర్మాణం పూర్తికాగానే తగినంత కప్పం చెల్లిస్తానని చెప్పి, సయ్యద్ మియాను అంగీకరింపజేశాడు. వేగంగా కోట నిర్మాణం పూర్తి చేశాడు. అనుకున్నట్లుగా సోమనాద్రి కప్పం చెల్లించలేదు. పైగా గొప్ప సైన్యాన్ని సిద్ధపరచుకొని, దావూద్ మీదికి దండయాత్రకు సిద్ధపడ్డాడు. విషయం తెలుసుకొన్న దావూడ్మియా మండిపడ్డాడు. ముందువెనకలు ఆలోచించకుండ సోమనాద్రి మీద యుద్ధం ప్రకటించాడు. రాయచూరు నవాబయిన బసరు జంగు, ప్రాగటూరు కోటకు అధిపతి అయిన ఇదురుసాబు తమ తమ సేనలతో వచ్చి యుద్ధరంగంలో సయ్యద్కు బాసటగా నిలిచారు. ఇరుపక్షాల సైన్యాలు గద్వాలకు, రాయచూరుకు మధ్య ప్రాంతమైన 'ఆరగిద్ద' దగ్గర మోహరించాయి. సంకుల సమరం జరిగింది. కొంత సైన్యాన్ని వెంటపెట్టుకొని, సోమనాద్రి స్వయంగా రాయచూరు నవాబును ఢీకొన్నాడు. సోమనాద్రి ధాటికి తట్టుకోలేని బసరుజంగు యుద్ధంనుంచి తప్పుకొని, తన సైన్యంతో ఇంటిముఖం పట్టాడు. సోమనాద్రి పరాక్రమాన్ని గమనించిన ప్రాగటూరు నవాబు కూడ బుద్దితెచ్చుకొని మెల్లగ జారుకున్నాడు. ఉప్పేడు నవాబు సయ్యద్ దావూద్ మియా మాత్రం మిగిలి, ఏకాకి అయిపోయాడు. ఇక చేసేదిలేక, తాను కూడ ఉప్పేడు దారిపట్టి ఏనుగుపై పారిపోతున్నాడు. సోమనాద్రి తన గుర్రాన్ని ఏనుగుమీదికి ఉసికొల్పాడు. దావూద్ మియా భయపడి ప్రాణాలు దక్కించుకోవడం తప్ప వేరే మార్గం లేదని భావించాడు. వెంటనే తన అపజయాన్ని అంగీకరిస్తూ సోమనాద్రిని శరణు కోరుకున్నాడు. ఇక ముందెన్నడు సోమనాద్రి జోలికి రానని మాట ఇచ్చాడు. యుద్ధ పరిహారంగా తన యుద్ధచిహ్నాలైన నగారా, పచ్చజెండా, ఏనుగులను, సోమనాద్రికి సమర్పించుకొని, తలదించుకొని ఉప్పేడు చేరుకున్నాడు.

ఎట్లానో ఆరాత్రి గడిపాడు సయ్యద్ దావూద్్మయా. మర్నాడు ఉదయాన్నే తన కోటమీదకి ఎక్కి, గద్వాల కోటకేసి చూశాడు. గద్వాల కోట పై ఏ రెపరెపలాడుతున్న తన పచ్చజెండా కనిపించేసరికి కడుపులో మండింది. ఎట్లాగైన

132
తాను కోల్పోయిన వాటిని వెనక్కి తెచ్చుకోవాలనుకున్నాడు. వెంటనే పల్లకిలో హైదరాబాద్ పోయి గోల్కొండ నవాబుతో తన దీనస్థితిని చెప్పుకున్నాడు. సోమనాద్రిని దండించి తనకు మనశ్శాంతిని చేరూర్చుమని కోరాడు. నిజాం నవాబు నాసిరుదౌలా, సోమనాద్రి మీదకు దండయాత్ర మంచిది కాదని, ఆ ఆలోచన మానుకోమని రకరకాలుగా నచ్చజెప్పాడు. కాని సయ్యద్ మియా తాను పట్టిన పట్టు విడవలేదు. చేసేది లేక, నిజాం నవాబు గొప్ప సైన్యంతో సోమనాద్రిమీద యుద్ధానికి బయలుదేరాడు.

5 పూర్వం సోమనాద్రి చేతిలో ఓడిపోయి, పరాభవంతో కుంగిపోతున్న రాయచూరు, ప్రాగటూరు నవాబులు తమ కక్ష తీర్చుకోవాలనే కోరికతో నిజాం సైన్యంలోకి వచ్చి చేరారు. ఈలోగా గుత్తి దుర్గాధిపతి టీకు సుల్తాను, కర్నూలు నవాబు దావూద్ ఖాన్, బళ్ళారి నవాబు తమ పరాక్రమాన్ని ప్రదర్శించ దీనికి మంచి ఉత్సాహంతో వచ్చి కొత్తగా నిజాం సైన్యంలో చేరారు.

0.

తుంగభద్రానదికి దక్షిణాన ఉన్న 'నిడుదూరుకు చేరుకున్నది నిజాం సైన్యం. తుంగభద్రకు ఉత్తర తీరంలో పిన్న్ 'కలుగోట్ల' గ్రామంలో సోమనాద్రి సైన్యం విడిది చేసింది. ఈ రెండు గ్రామాల్లో ఇప్పటికీ ఆ నాటి యుద్ధపు నవాళ్ళుగా తాత్కాలిక బురుజులు, మిట్టలు దర్శనమిస్తాయి. ఆలస్యం చేయడం ఇష్టంలేని సోమనాద్రే మొదట ం సైన్యంతో తుంగభద్రానదిని దాటి తెల్లవారకముందే నిజాం సైన్యాన్ని ముట్టడించాడు. సాయంకాలం వరకు మంకరంగా యుద్ధంచేస్తూ నిజాంసైన్యాన్ని చీల్చి చెండాడాడు. చీకటి పడడంతో తన సైన్యాన్ని మరల్చి, నదిని దీ 'కలుగోట్ల' ను చేరి విశ్రమించాడు.

3. న సోమనాద్రి పరాక్రమాన్ని చూసిన నిజాం నవాబు కలవరపడ్డాడు. వెంటనే దర్బారు చేసి సోమనాద్రిని _. ంగదీసుకొనే ఉపాయం చెప్పుమన్నాడు. అప్పుడొక సర్దారు, "సోమనాద్రి శక్తి అంతా అతని గుర్రంలోనే మన్నది, దాన్ని వశం చేసుకొంటేగాని అతడు వశం కాడు' అని వివరించాడు. వెంటనే నిజాం ఎట్లాగైనా సోమనాద్రి -నినాన్ని దొంగిలించి, అతణ్ణి వంచాలని ఆలోచించాడు. "తెల్లారేసరికి సోమనాద్రి గుర్రాన్ని తెచ్చేవారికి జాగీరు "న్నిను" అని ప్రకటించాడు. చూస్తూ చూస్తూ మృత్యుముఖంలోకి ఎవరు ప్రవేశిస్తారు? చివరకు ఒక సైసు ఐ. మయ్యాడు. ప్రాణాలకు తెగించి నడుముకు కళ్ళెం బిగించి, ఒంటరిగా కలుగోట్లకు ప్రయాణమయ్యాడు. ద్ద గో కష్టపడి సైసు మెల్లగా చప్పుడు కాకుండా గుర్రాన్ని సమీపించాడు. కళ్ళెం తగిలించి పాగానుంచి తప్పించాడు. యంమీదికి ఎక్కి వేగంగా తిరుగుముఖం పట్టాడు. గుర్రాన్ని చూడగనే నిజాము ఆనందానికి అంతులేకుండ యింది. వెంటనే ఆ సైసుకు జాగీరుతో పాటు ఒక బంగారు కడియాన్ని కూడ బహుమానంగా ఇచ్చాడు.

తెల్లవారింది. గుర్రంలేకపోవడాన్ని గమనించిన సోమనాద్రి సైన్యంలో కలకలం బయలుదేరింది. తన పై వీచెయ్యి పడిపోయిందని భావించాడు సోమనాద్రి. అయినా ధైర్యాన్ని విడువలేదు. నిజాం సైన్యంతో తలపడ్డాడు.

133
ఆరోజు ఎట్లాగో యుద్ధం సాగించాడు. సాయంకాలం ఉభయ సైన్యాలూ యుద్ధాన్ని విరమించాయి. కలుగోట్ల చేరుకున్న సోమనాద్రి ఆ రాత్రి తనవారితో సమాలోచన చేశాడు. "తెలారేసరికి నా గుర్రాన్ని ఎవరు తెసారో వారికి నా గుర్రం ఒక రోజంత ఎంత భూమిలో తిరుగుతుందో అంత భూమిని ఇనాముగ ఇస్తాను" అని ప్రకటించాడు.

గద్వాలకు పదిమైళ్ళ దూరంలో 'జొచ్చెంగన్నపల్లి' అనే గ్రామం ఉన్నది. అక్కడినుంచి వచ్చిన బోయసర్దారు హనుమప్పనాయుడు. ఈ విషయం తెలుసుకొన్నాడు. వెంటనే గుర్రాన్ని తేవడానికి సిద్ధపడ్డాడు. అతడు జొన్నచొప్పను ఒక మోపుగా కట్టి నెత్తిన పెట్టుకొని నిజాం డేరాలను సమీపించాడు. ఆ మోపును అయిదు రూపాయలు ఇస్తేకానీ ఇవ్వను అంటూ బేరం కుదరనివ్వకుండా సోమనాద్రి గుర్రంకోసం ముందు డేరాలకు పోతున్నాడు హనుమప్ప. ఒక ప్రత్యేక స్థలంలో గుర్రం కనపడింది. గుర్రంకూడా హనుమప్పను చూసి సకిలించింది. గుర్రం కళ్ళల్లో కాంతి, నిక్కించిన చెవులు, తల ఆడించడం వంటి చేష్టలను చూసిన సిపాయిలు హనుమప్పనాయుడిని అనుమానంగా చూశారు. అయినా గుర్రం దంటుపుల్లలకోసం ఇట్లా చేసిందనుకొని సమాధానపడ్డారు.

గుర్రాన్ని చూసిన హనుమప్పనాయుడు చొప్పను అతి తక్కువ ధరకు విక్రయించాడు. కొంత సేపటికి ఒకడు వచ్చి క్రయధనం ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇదే తగిన సమయమని భావించిన హనుమప్ప వెంటనే గుర్రపు పాగా (అశ్వశాల)లో ఉన్న గడ్డికుప్ప కిందికి దూరాడు. వెల్లకిలా పడుకున్నాడు. గుర్రం కూడా హనుమప్ప కనిపించకపోవడంతో తన్నుకుంటూ కాళ్ళకు కట్టిన గూటాన్ని ఊడబెరికింది. వెంటనే ఒక సిపాయి వచ్చి గూటాన్ని గడ్డిపై మోపి భూమిలోకి పాతాడు. హనుమప్పనాయుడి అరచేతిని చీల్చుకుని ఆ గూటం భూమిలోకి పాతుకు పోయింది.

నొప్పితో ప్రాణాలు పోయే స్థితి వచ్చినా, స్వామి కార్యం తలుచుకుంటూ, కదలక మెదలక ఆ బాధను ఓర్చుకున్నాడు హనుమప్ప. అర్ధరాత్రి అయింది. సైనికులు అంతా నిద్రిస్తున్నారు. హనుమప్ప తనమీద ఉన్న గడ్డిని పక్కకు నెట్టి కూర్చున్నాడు. కుడి చేయి కదలడం లేదు. గూటం కూడా కదలడం లేదు. ఆలస్యం చేయకుండా ఎడమచేత్తో తన నడుముకు ఉన్న కత్తిని లాగాడు. కుడిచేతిని నరుక్కున్నాడు. రక్తపు మడుగులో ఉన్న మొండి చేతిని తలపాగలో చుట్టి గుర్రాన్ని తీసుకొని డేరాలు దాటాడు.

134

అర్ధగంటలో, ఆనందంతో సోమనాద్రి ఎదుట గుర్రంతో నిలబడ్డాడు హనుమప్ప. ఎడమచేత్తో సలాం డు. రాజు కోపంతో కన్నెర్ర చేశాడు. హనుమప్ప తన మొండిచేతిని చూపించి, జరిగిందంత వివరించాడు. -జు ఆశ్చర్యపోయాడు. నాయుణ్ణి కౌగిలించుకొని సన్మానించాడు. అన్న మాట ప్రకారం అప్పటికప్పుడే ఒక దానశాసనాన్ని రాయించి ఇచ్చాడు. గుర్రాన్ని చూడగానే సోమనాద్రి ఉత్సాహం ఉరకలు వేసింది. ఉదయాన్నే తన మాన్యాన్ని వెంటపెట్టుకొని నిజాం సైన్యంమీద విరుచుకుపడ్డాడు. సోమనాద్రి జయభేరి ధ్వనులు నిజాం సైన్యం - పండెల్ని బద్దలుచేశాయి. సోమనాద్రిసైన్యం నిజాంసైన్యాన్ని దావానలంలా చుట్టుముట్టింది. భయంకరంగ యుద్ధం గింది. ఆనాటి యుద్ధంలో ప్రాగటూరు, బళ్ళారి నవాబులు హతులయ్యారు. సాయంకాలానికి నిజాం సైన్యాన్ని -ర్నూలు కోట వరకు తరమడం జరిగింది. సోమనాద్రి కూడా కొద్దిమంది సైన్యంతో నిజాం సైన్యాన్ని తరుముకుంటూ ర్నూలు కోటలోకి ప్రవేశించాడు. అంతలో అకస్మాత్తుగా కోట తలుపులు మూతపడ్డాయి. కొద్దిమందితో సోమనాద్రి లోపల ఉన్నాడు; మిగిలిన సైన్యం కోట బయట ఉండిపోయింది.

గద్వాల సర్దారులకు భయం ఎక్కువయింది. దిక్కు తోచడం లేదు. కోట తలుపులను చీల్చడానికి ముమ్మరంగా యత్నించారు. కాని ఫలితం లేకుండ పోయింది. కోట లోపల ఏం జరుగుతున్నదో, బయట ఉన్న గద్వాల 2 ద్యానికి తెలియలేదు. కొద్ది మందితోనే కోట లోపల ఉన్న తమ నాయకుడు మరణించి ఉంటాడని భావించారు. ఆం ర్వాలలో ఉన్న లింగమ్మరాణికి పరిస్థితిని తెలియజేస్తు, తాము తిరిగి వస్తామని కబురు పంపారు. ఆ వీరనారి మాధానంగా కొన్ని గాజులు, చీరలు, పసుపు, కుంకుమ పంపింది. గద్వాల సర్దారులకు సిగ్గు, క్రోధం కలిగాయి. టనే రెట్టింపు పట్టుదలతో, ధైర్యంతో రంగంలోకి దిగారు. ఎట్టకేలకు కోట తలుపులను పగలగొట్టి లోపలికి దేశించారు.

కోటలోపల కొద్దిమంది సైన్యంతోనే ఉన్నా సోమనాద్రి వీరోచితంగ పోరాడుతున్నాడు. తన సైన్యం చాలవరకు పృతమైంది. ఈలోగా బయట ఉన్న తన సైన్యం లోపలికి ప్రవేశించి తనకు బాసటగ నిలిచింది. నిజాం సైన్యంలో న్నంజడి హెచ్చింది. పిడికెడుమందితోనే సోమనాద్రి కోటలోపల అల్లకల్లోలం సృష్టించాడు. ఇప్పుడు తెల్లవారితే కేం చేస్తాడో అని భయపడ్డారు. చావగా మిగిలిన గుత్తి, రాయచూరు నవాబులు యుద్ధవిముఖులయ్యారు. స్థితిలో సోమనాద్రితో సంధి చేసుకోవడమే అన్ని విధాల మంచిదని మంత్రులు నిజాం నవాబుకు ముక్తకంఠంతో జెప్పారు. ఈ యుద్ధానికి అసలు కారకుడయిన సయ్యద్ దావూద్ మియా ఏం చేయాలో తెలియక ఊరుకున్నాడు. সু

నిజాం నవాబు మరునాడు ఉదయమే సంధి కోరుతూ సోమనాద్రి దగ్గరకు ఒక రాయబారిని పంపాడు. చేయస్ఫూర్తి గల సోమనాద్రి కూడ సంధికి అంగీకరించాడు. యుద్ధపరిహారంగా కర్నూలులోని కొండారెడ్డి - రుజులో ఉన్న 'ఎల్లమ్మ' ఫిరంగిని, రాయచూరు నవాబు అధీనంలో ఉన్న 'రామ, లక్ష్మణ' అనే పేర్లుగల రెండు సంగులను సోమనాద్రి స్వీకరించాడు. కర్నూలు ఏలుబడిలోని కొంతభాగాన్ని సోమనాద్రికి ఇచ్చారు. ఈ ప్రకారం + మభూపాలుడు సంధి చేసుకొని, యుద్ధపరిహారం పొంది, విజయోత్సాహంతో గద్వాల కోటకు చేరుకున్నాడు.

యుద్ధం ముగిసిన తరువాత సోమనాద్రి తాను అన్నమాట ప్రకారం గుర్రం ఒక దినం తిరిగినంత మిని హనుమప్పనాయుడికి ఇనాముగ ఇచ్చాడు. ఈ నాటికీ బొచ్చెంగన్నపల్లిలో హనుమప్ప సంతతివారు ఆ హములను అనుభవిస్తు, తమకు ఆ భూమి ఎక్కువ కావటంవల్ల అందులో కొంత భూమిని ఇతరులకు ముగ ఇచ్చి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు.

(సురవరం ప్రతాపరెడ్డిగారి 'హైందవ ధర్మవీరులు' అనే గ్రంథం ఈ కథకు ఆధారం)

135