siddenky.blogspot.com డా. సిద్దెంకి

సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

20, జులై 2025, ఆదివారం

తెలంగాణ పోరు - సెప్టెంబర్ 17 ప్రత్యేకత

హైదరాబాద్ ఒకప్పుడు స్వతంత్ర రాజ్యం. ఆ రాజ్యం నిజాం నిరంకుశ కబంధహస్తాల్లో చిక్కుకొని ఉంది. 1946- 51 మధ్యకాలంలో కమ్యూనిస్టు నాయకత్వంలో ఏడవనిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ ఆలీ ఖాన్ వ్యతిరేకంగా జరిగింది. ఈ పోరాటంలో నాలుగున్నర వేల మంది తెలంగాణ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.

నిజాం రాజు ప్రైవేటు సైన్యము రజాకార్ వ్యవస్థకు ఇక్కడి భూస్వాములకు తోడయ్యారు. దుర్మార్గమైన రకరకాల పన్నులతో ప్రజలను కనికరం లేకుండా పీడించసాగారు. రజా కార్లు గ్రామాల మీద పడి ఊళ్ళకు ఊళ్లే లూటి చేసేవారు. ఆస్తినష్టం, ప్రాణ నష్టం చేసేవారు.

దుర్మార్గమైన పన్ను వసూళ్లను ఎదిరించడానికి ఎందరో తెలంగాణ రైతులు నిజాం రాజు పై, నిజాం రాజుకు తొత్తులుగా మారిన భూస్వాములపై తిరుగుబాటు చేశారు.
ఫలితంగా ఆడవాళ్ళ పై అఘాయిత్యాలు జరిగాయి. 
మొండ్రాయి గ్రామంలో చెట్టు కట్టేసి రైతులను తుపాకీ తూటాలతో కాల్చి చంపారు.
సామూహిక సజీవ దహనాలకు తెగబడ్డారు.
తెలంగాణ పల్లెలు వల్లకాడులు అయ్యాయి.

1. తొలి అమరుడు దొడ్డి కొమురయ్య 

విసునూర్ దేశముఖ్ రామచంద్రారెడ్డి తల్లి దొరసాని కడివెండి గ్రామం లో ఉండేది.(ప్రస్తుతం జనగాం జిల్లా దేవరుప్పుల మండలం లోని కడవెండి గ్రామం) పన్నులు వసూలు చేయడంలో రకరకాల శిక్షలు, జరిమానాలు విధించడం ఆమె నిత్యకృత్యం.  ఆమె ప్రజల పట్ల అతి క్రూరంగా వ్యవహరించేది. ఆమెకు వ్యతిరేకంగా ఆ గ్రామంలో ఆరుట్ల రామచంద్రారెడ్డి మొదలైన వారు ఆంధ్ర మహా సందేశాన్ని వినిపించి గ్రామంలో సంఘం ఏర్పాటు చేశారు.
రోజురోజుకు పెరుగుతున్న ప్రజాదరణను గమనించిన విసునూరు దేశ్ ముఖ్ అల్లరి మూకలు రౌడీలతో 40 మంది వచ్చి ప్రజలతో తలపడినప్పుడు 1946 జూలై 4 దొడ్డి కొమురయ్య అమరుడయ్యాడు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అమరుడైన తొలి పోరాటయోధుడుగా మిగిలిపోయాడు. 
ఆంధ్ర మహాసభ కార్యకర్తలు అందరూ వేలాదిగా వచ్చి అంతిమయాత్రలో పాల్గొన్నారు. దొడ్డి కొమురయ్య వీర మరణంతో సాయుధ పోరాటం మరింత ఉదృత రూపం దాల్చింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుతున్న పానుగంటి సీతారామారావు, అనిరెడ్డి, రామిరెడ్డి, జలసాని శ్రీనివాసరావు, గాలి మదన్ రెడ్డి, గంగసాని చేరి తిరుమలరెడ్డి సాయుధ పోరాటంలో చేరి ఆయుధాలు ధరించారు. శత్రు దాడులు ఎదుర్కునేందుకు ప్రజలు ఎప్పుడూ తమ చేతుల్లో కారంపొడి రోకలిబండలు కర్రలు పట్టుకుని సిద్ధంగా ఉండేవారు

బాలెంల ఘటన:
1946 అక్టోబర్ 18న నిజాం పోలీసులు, రెవెన్యూ అధికారులు సూర్యాపేట తాలూకా బాలెంల గ్రామం పై లేవీ గల్లవసూల్ పేరుతో దౌర్జన్యకాండకు దిగారు. ప్రజలు ఎదురు తిరగడంతో జరిగిన పోలీస్ కాల్పుల్లో గార్లపాటి అనంతరెడ్డి పటేల్, మట్టారెడ్డి మరణించారు.

మల్లారెడ్డి గూడెం ఘటన: 1946 డిసెంబర్ 1న హుజూర్నగర్  తాలూకాలో మల్లారెడ్డిగూడెంలోకి వచ్చిన నిజాం సైన్యం దాడి చేయడంతో ప్రజలు ఎదురు తిరిగారు. బింద్రాల గురువమ్మ, బొండమ్మ, అంకాలమ్మలు మరణించారు. వీరు తెలంగాణ పోరాటంలో అమరులైన తొలి దళిత మహిళలు.

ఆకునూరు మాచిరెడ్డిపల్లి ఘటన: యావత్ దేశాన్ని ఆకర్షించిన ఆనాటి సంఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. లేవి పన్నులు వసూలు చేయడానికి వచ్చిన నిజాం రిసర్వ్ పోలీసులు ప్రజల ధనాన్ని దోచుకున్నారు. స్త్రీలపై అఘాయిత్యం చేశారు. అనేకమందిని చంపారు. పద్మజా నాయుడు గారు  నివేదిక రూపొందించి మహాత్మా గాంధీ గారికి పంపారు. ఇట్టి విషయంపై గాంధీజీ గారు నిజాం తో ప్రత్యుత్తరాలు జరిపారు అయినా ఫలితం లేదు. 1946 డిసెంబర్ నాటికి ఆనాటి తెలంగాణ ప్రాంతంలో దాదాపు 500 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. 

1947 లో భారతదేశానికి స్వతంత్రం లభించింది నిజాం రాజు స్వతంత్ర రాజ్యాంగ ప్రకటించు కున్నాడు. 
ఖాసీం రజ్వీ నాయకత్వంలోని రజాకారులు ఒకవైపు నిజాం పోలీసులు మరొకవైపు దారుణ హింసాకాండకు పాల్పడ్డారు. 
అంతకుముందే కమ్యూనిస్టు పార్టీని నిజాం ప్రభుత్వం రద్దు చేసింది. 

బైరాన్ పల్లి మారణ హోమం: కమ్యూనిస్టుల నిర్మూలనే ధ్యేయంగా రజాకార్లు నిజాం పోలీసులు ప్రస్తుత సిద్దిపేట జిల్లా బైరాన్ పల్లి గ్రామం పై 1947 మార్చి నుంచి ఆగస్టు 27 వరకు ఆరు సార్లు దాడి చేశారు. మొదటి ఐదు సార్లు ప్రజల వారిని తరిమికొట్టారు. 1948 ఆగస్టు 27న భువనగిరి తాలూకా డిప్యూటీ కలెక్టర్ ఇక్బాల్  నాయకత్వంలో భారీ బలగాల రాత్రిపూట గ్రామం పై దాడి చేసి మారణ హోమం సృష్టించారు. అధికారిక లెక్కల ప్రకారం 84 మంది చనిపోయారు. చికిత్స పొందుతూ మరో 30 మంది చనిపోయారు.  పక్కనే ఉన్న కూటిగల్ గ్రామం పైన దాడి చేసి 31 మందిని రజాకారులు పొట్టనట్టుకున్నారు.
అప్పటికే అరెస్టై జైల్లో ఉన్న కాళోజి వార్తను చదివి 

మనకొంపలార్చిన మనస్త్రీల చెరిచినా
మానవాధములను మండలాధీశులను 
కసియారిపోకుండా గుర్తించుకోవాలి 
కాలంబు రాగానే కాటేసి తీరాలి అని పిలుపునిచ్చాడు.

విసునూరు దేశముఖ్ దురాగతాల్లో ఎదురు తిరిగి న్యాయంగా కోర్టులో గెలిచిన న్యాయాన్ని వీరి కిరాయి గుండాలే షేక్ బందగిని చంపేశాయి.
పాలకుర్తిలో
చాకలి ఐలమ్మ కాస్తు చేసిన పంటను కాజేయాలని చూస్తే ఆంధ్ర మహాసభ నాయకత్వంలో ఎర్రజెండా పార్టీ గుత్పల సంఘం సభ్యులతో కలసి పోరాడింది.
 
ఇతర కారణాలు:
వెట్టి చాకిరీ సమస్య: దొరలు మోసంలో ఇళ్ల లో వేడుకలకు శుభకార్యాలకు గ్రామ బహుజన కులాల వారందరూ ఉచితంగా పనిచేయాల్సి రావడమే వెట్టిచాకిరి. 

భావవ్యక్తీకరణ పై ఆంక్షలు: ఉర్దూ భాష కి పెద్ద పీట వేస్తూ ఇతర భాషలను పట్టించుకోకపోవడం. 
1959 లో తీసిన గస్తీ నిషాన్- 53జీవో ప్రకారం రాజకీయ సభలు సమావేశాలు నిర్వహించకూడదు ఒకవేళ నిర్వహిస్తే శిక్షార్హులు.

ఆర్థిక కారణాలు: తెలంగాణ ప్రజలను ఇక్కడికి భూస్వాములు అధిక వడ్డీలతో రైతులను ఇబ్బందులకు గురి చేయడం. పుచ్చలపల్లి సుందరయ్య వంటి కమ్యూనిస్టు నేతలు మరియు చరిత్రకారు లు ఆర్థికపరమైన విషయాలే సాయుధ పోరాటం ముఖ్యమైన కారణాలని పేర్కొన్నారు.

భారతదేశ స్వాతంత్రానికి పూర్వం హైదరాబాద్ రాజ్యం నాటి బ్రిటిష్ ప్రభుత్వంతో ఏ విధమైన సంబంధాలు కలిగి వుందో అలాంటి సంబంధాలను భారతదేశంతో హైదరాబాద్ కొనసాగించడమే యధాతధ ఒప్పందం. హైదరాబాద్ ఏజెంట్గా నవాబ్ జైన్ యార్ జాంగ్ ను ఢిల్లీలో భారత ఏజెంట్గా కె ఎం మున్షిని హైదరాబాద్లో నియమించారు. లార్డ్ అమౌంట్ బాటన్ హైదరాబాద్ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ లు ఈ యధాతధ ఒప్పందంపై 1947 నవంబర్ 29న సంతకాలు చేశారు.

యధాతధ ఒప్పందాన్ని ఉల్లంఘించిన కారణంగా ఖాసీం రజిని హైదరాబాదు రాజ్యంలో విస్తరింపజేశారు. రజాకార్లు ప్రజలను వితావాహులు చేశారు అరాచకాలు ఆకృత్యాలు హత్యలు మానభంగాలు నియంత్రణ లేకుండా కొన సాగాయి. భారతదేశం శాంతి భద్రతలను కాపాడడానికి పోలీస్ చర్యగా పేర్కొన్నారు. ఆపరేషన్ పోలో అనే రహస్య కోడ్ బహిర్గతమవ్వడం వల్ల దీన్ని ఆ తర్వాత ఆపరేషన్ క్యాట్ పిల్లర్ అని పిలిచారు. ఈ ఆపరేషన్ 1948 సెప్టెంబర్ 13న తెల్లవారుజామున 3:30 గంటలకు పోలీస్ చర్య మొదలు అయింది. భారత సైన్యం జనరల్ చౌదరి నేతృత్వంలో హైదరాబాద్ ను ముట్టడించింది. సెప్టెంబర్ 17న నిజాం సైన్యం భారత్ కు లొంగిపోయింది. అదే రోజు నిజాం నవాబు లొంగిపోతున్నట్టు రేడియోలో ప్రకటన చేశారు. అధికారిక లొంగుబాటు పత్రం పై సెప్టెంబర్ 18న సాయంత్రం నాలుగున్నర గంటలకు చేశారు. "భారతదేశ కడుపులో ఏర్పడిన పుండు తొలగిపోయింది. దేశానికి సంపూర్ణ స్వాతంత్రం 1948 సెప్టెంబర్ 17న వచ్చిందని" సర్దార్ వల్లభాయ్ పటేల్ వ్యాఖ్యానించారు.

----------

సెప్టెంబర్ 17న 
కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత ప్రభుత్వం ప్రజా పాలన రోజుగా జరుగుతుంది 

భారతీయ జనతా పార్టీ తెలంగాణ విలీన దినముగా నిర్వహిస్తుంది. 

తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ విమోచన దినంగా జరుపుతుంది.

తెలంగాణ వీరత్వం ప్రదర్శించినా వీరుల వారసత్వాన్ని పునికి పుచ్చుకున్న తెలంగాణ సమాజానికి జై భీమ్