సాహిత్యమే శాశ్వతం. సాహిత్యమే జీవితం.

కొత్త పొస్ట్



🌐 * L. I. P. తెలుగు ప్రారంభ పరీక్ష - BASELINE TEST 2026-27     🌐 * 10వ తరగతి 🌐 * 10వ తరగతి తెలుగులో 99% స్కోర్ సాధించాలంటే... 🌐 * తెలుగు వెలుగులీనేల 🌐 | ధ్వని గుర్తింపు / అక్షర గుర్తింపు     🌐 * సరళ పదాలు     🌐 * ఐ సి టి ఉపయోగించడం ఎలా?     🌐 * * DIKSHA WEB         🌐 SCERT         🌐 NCERT         🌐 NBT         🌐 UGC_NET         🌐 CIIL         🌐 * * NDL INDIA         🌐 SAHITHYA ACADEMY         🌐 | సిద్దెంకి కథలు     🌐 | సిద్దెంకి పుస్తకాలు     🌐 | సిద్దెంకి కవిత్వం 🌐 *"నీలి నేల ఎతలు - తెలంగాణ దళిత కథ పరిణామం కాలమ్ - కోలిమి"     🌐 | తెలుగులో అత్యుత్తమ పుస్తకాలు     🌐* | వ్యాసాలు / Articles     🌐* | దాశరథి పాటలు     🌐* | తెలంగాణ రాష్ట్రంలో దళిత కథ (2014:-07-2025)     🌐 * "సంస్కృతంతో తెలుగు కాలరాయొద్దు"     🌐 * పగిడి తెలంగాణ కథ 2024 "     🌐 * "ఆలోచనవాదుల పుష్పక విమానం దాశరథి ‘కవితా పుష్పకం’"     🌐 * Articles on Dr. Siddenky    

22, ఆగస్టు 2023, మంగళవారం

X. 6. భాగ్యోదయం - భాగ్యరెడ్డి వర్మ


  


                                                         6. భాగ్యోదయం  

వీడియో పాఠాలు 

6. భాగ్యోదయం పరీక్ష

   



భాగ్యోదయం 2 


పాఠ్యాంశ వివరణ:

 (భాగ్య+ఉదయం =. భాగ్యోదయం - అ కారానికి ఉ పరమైనపుడు ఓ వచ్చింది. అ కారానికి ఇ,ఉ,ఋ లు పరమైనపుడు వరుసగా ఏ,ఓ,అర్ లు ఏకాదేశ మవుతాయి. ఏ,ఓ,అర్ లు వ్యాకరణ పరిభాషలో గుణములు. గుణములు ఎకాదేశంగా వచ్చే సంధి గుణసంధి.)

   ఉదయం అనగా వృద్ధి, సృష్టి, పుట్టుక, పైకివచ్చుట, ఉన్నతి, పొద్దుపొడుపు అని మొదలైన అర్థాలు గలవు. భాగ్య అనగా అదృష్టము, సుకృతము, శుభకర్మను అనుభవించుట మొదలైన అర్థములు కలవు.
మాదరి భాగయ్య భాగరెడ్డి వర్మ పేరు మార్చుకున్నాడు. 
రెడ్డి అంటే రక్షించేవాడు. వర్మ అనేది ఆర్య సమాజం వారు ఇచ్చిన బిరుదు.

   “ఒక క్రమములో భాగ్యోదయం అనగా అదృష్టము వలన పొందిన ఉన్నతి అని చెప్పవచ్చు.” కానీ వాస్తవానికి ఈ పాఠము భాగ్యరెడ్డి వర్మ తన జీవిత కాలంలో సమాజ ఉన్నతికి చేసిన కృషి గురించి వివరించే జీవిత చరిత్ర ప్రక్రియకు చెందిన వ్యాసము.

6. భాగ్యోదయం పరీక్ష 

ప్రక్రియ పరిచయం

             ఈ పాఠ్యభాగం జీవిత చరిత్ర ప్రక్రియకు చెందింది. జీవిత చరిత్ర అంటే ఒక వ్యక్తి జీవిత విశేషాలను ఇతరులు రాయడం. జీవిత చరిత్ర ప్రక్రియను ఆంగ్లములో బయోగ్రఫీ అంటారు.


కవిపరిచయం:    కృష్ణస్వామి ముదిరాజ్
   ఈ పాఠ్యభాగ రచయిత కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్. 
భాగ్యరెడ్డి వర్మ కుమారుడైన ఎం.బి.గౌతం రచించిన ‘భాగ్యరెడ్డి వర్మ జీవిత చరిత్ర’   గ్రంథంలోనిది ఈ పాఠ్యభాగం.   

 జననం: 25-8-1893        మరణం:15-12-1967

రాజకీయ వేత్త,         స్వాతంత్ర్య సమరయోధుడు,    జర్నలిస్ట్, సమాజ సంస్కర్త.
   1957 లో హైదరాబాద్ నగరమేయర్ గా ఎన్నికై నగరాభివృద్ధికోసం రాబోయే ముప్ఫైఏండ్ల అవసరాలకు అనుగుణంగా ‘మాస్టర్ ప్లాన్’ తయారు చేసిన దార్శనికుడు.
 ‘దక్కన్ స్టార్’ అనే ఆంగ్లవార పత్రికను స్థాపించాడు.
 హైదరాబాద్ నగరాన్ని చాయాచిత్రాల్లో వెయ్యి పేజీల్లో బంధించి ‘పిక్టోరియల్ హైదరాబాద్’ అనే అద్భుతమైన గ్రంథాన్ని చరిత్రకు దృశ్యరూపంగా మనకు అందించాడు.

   1948లో ఉర్దూలో ‘హైదరాబాద్-కి తీస్ సాలా సియాసి జదు జిహిద్’ పేరుతో హైదరాబాద్ లోని రాజకీయ ఉద్యమాలపై గ్రంథాన్ని రాశాడు.

భారత ప్రభుత్వంచే ‘భారత స్వాతంత్రోద్యమ చరిత్ర’ రాసే సంఘంలో ప్యానల్ సభ్యుడిగా నియమితుడయ్యాడు. 

 

“తన మిత్రుడు భ్యాగ్యరెడ్డి వర్మతో కలిసి దళితుల అభ్యున్నతి కోసం కృషి చేసాడు.”

 

నేపథ్యం/ఉద్దేశం:

స్వయంకృషి, ఆత్మ విశ్వాసం ఉంటే ప్రతి ఒక్కరూ ఏమైనా సాధించగలరు. స్వార్థం పెరిగి పోతున్న ప్రస్తుత సమాజంలో ఇతరుల గురించి ఆలోచించి, వాళ్ళ ప్రగతికి తోడ్పడే వ్యక్తులు అరుదు. అటువంటి వ్యక్తిత్వం నుండి స్ఫూర్తి పొందడమే ఈ పాఠం ఉద్దేశం.

పాఠం 

1

తన జాతి జనుల బాగుకోసం చిన్నప్పటి నుండే. అంకితమయిన భాగ్యరెడ్డి వర్మ (మే 22,)1888లో పుట్టినాడు. ఆయన చిన్నప్పుడు చదువుకున్న చదువే ఆయన జీవిత గమనాన్ని నిర్దేశించింది. అంటరాని వర్గాలు అప్పటికి అనుభవిస్తున్న అవస్థల నుంచి గట్టెక్కించడానికి ఆయన అంకిత భావంతో పని చేశాడు. తాను చదివిన చదువు వల్ల కులవ్యవస్థ అంటే ఏమిటో దాని నిజస్వరూపం ఎటువంటిదో అవగతమయింది. ఇందుకు ధర్మశాస్త్రాలను, చరిత్రను బాగా చదివినాడు. వాటి వల్ల అంటరాని వర్గాల కడగండ్లను అర్ధం చేసుకోవడానికి వాటిని నిర్మూలించి వారిలో సామాజిక వికాసం కలిగించడానికి ఆయనకు దారి దొరికినట్టయింది.

అత్యంత ముఖ్యమయిన ఈ పనికి సంబంధించి ఆచరణ, ఆలోచనలో ఆయన పూర్తి స్వేచ్ఛను అనుభవించాడు. స్వతంత్రంగా పని చేశాడు. ప్రభుత్వపక్షం నుంచి సైతం ఆయనకు అండ దొరికింది.

అణగారిన కులాల నాయకులతో కూడా ఈ క్రమంలో పరిచయం పెరిగింది. క్రమ క్రమంగా వారి నుంచి సహకారం, నైతిక మద్దతు కూడగట్టుకున్నాడు. గొప్ప మనుషులలో, సంస్కర్తలలో ఉండే చిత్తశుద్ధిని అలవర్చుకుని ఆయన అంటరాని వర్గాల ఉన్నతి కోసం సంస్కరణ మొదలు పెట్టాడు.

ఒకవేళ హిందూమతం, హిందువులు తమ చరిత్రను లిఖిత బద్ధం చేయాలనుకుంటే సంస్కర్తగా భాగ్యరెడ్డివర్మ పేరు మొదటిస్థానంలో ఉంటుంది. అణగారినవర్గాల వికాసానికి ఆయన తన సమస్తాన్ని అర్పించాడు. తన తెలివితేటలను అందుకోసమే వెచ్చించారు. ఏమీ ఆశించకుండా తమకోసం ఎప్పటికీ పనిచేసే ఆయనను చూసి అంటరాని వర్గాలన్నీ ఆయనను తిరుగులేని నాయకునిగా ఒప్పుకున్నాయి. చిత్తశుద్ధి, నిజాయితీ, పట్టుదలతో పనిచేసే వర్మ అచిరకాలంలోనే వారి నమ్మకాన్ని చూరగొనగలిగాడు. తమ దుస్థితికి కారణం తమ అజ్ఞానం, ఉదాసీనతేనన్న ఎరుకను తన అనుచరులలో కలిగేటట్టు చేయగలిగాడు.

---------------------------------------------------------------------

ఆలోచించండి- చెప్పండి

కుల వ్యవస్థ వలన సమాజంలో ఏం జరుగుతున్నది?


చిత్తశుద్ధి, నిజాయితీ అంటే మీకు ఏమి అర్థమయింది?

అజ్ఞానం, ఉదాసీనత వలన నష్టాలేమిటి?

-------------------------------------------------------------------------------------------------------

6. భాగ్యోదయం పరీక్ష

II

మనుషులంతా పుట్టుకతో సమానమని, ఎవరూ ఎక్కువ, ఎవరూ తక్కువ కాదన్న సత్యాన్ని తెలుసుకునేటట్టు చేశాడు. అయితే లోలోపల జీర్ణించుకుపోయిన మూఢనమ్మకాలు అజ్ఞానాన్ని తొలగించడం అంతగా సులువుకాదన్నది తెలిసిందే. కొద్ది కొద్దిగానే అయినప్పటికీ ఆయన అయితే కొద్దికొద్ది గాని అయినప్పటికీ ఆయన నిరంతర శ్రద్ధ వల్ల అంటరాని వర్గాలు చదువుపై చూపు పెట్టడం సాధ్యమైంది. ఇందువల్ల కొన్ని సాంఘిక దురాచారాలు మటుమాయం కావడం జరిగింది. 

ఆయన అనేక బహిరంగ సభలు నిర్వహించాడు. సామాజిక స్వచ్ఛత గురించి చెప్పి తన జాతి జనులను ఏకతాటిపై నడుపగలిగాడు. ఆయన చేపట్టిన సమలలో కెల్లా మరుపురానిది దేవదాసి, ముర్లీ, వేశ్యా సంప్రదాయాలను అడ్డుకోవడం. పసివాళ్ళయిన ఆడ, మగ పిల్లలను దేవునికి వదిలి వేయడాన్ని తీవ్ర నిరసించాడు. తాగుడు వలన కుటుంబాలు ఎట్లా గుల్లగా మారిపోతాయో కుల పెద్దలకు ఆ మహమ్మారి గురించి చెప్పి వారిని మానిపించగలిగినాడు. నిరంతరం తన కార్యావరణకు దొరికే సహకారం వలన ఆయన కొన్ని కుటుంబాలను ఈ దురాచారాలనుంచి బయటపడేలా చేశాడు.

ప్రతి ఏటా జరిగే మత సాంఘిక సభలలో ఆయన హాజరయ్యేవారు. ప్రజాభిప్రాయాన్ని కూడగట్టే ప్రముఖులపై ఆయన ప్రభావం ఎంతగానో ఉండేది ఆంధ్రమహాసభ, ఆదిహిందూ మహాసభ, అభింభారత అంటరానివర్గాల సభ వంటి సంస్థలు జాతీయ స్థాయిలో నిర్వహించిన అనేక సభలలో ఆయన చురుకుగా పాల్గొన్నాడు. ఆయన పాల్గొన్న ప్రతి సభలో తన జాతి జనులు ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులపై వివరంగా చెప్పేవాడు. ఆయన జన జీవితంలో కాలు పెట్టినదాదిగా మొత్తం 3,348 ఉపన్యాసాలు ఇచ్చినట్టు తేలింది. ఆయన అణగారిన వర్గాలలో చైతన్యాన్ని తేవడానికి కృషి చేసినాడు.


1925లో న్యాయమూర్తి రాయ్ బాల ముకుంద్ అధ్యక్షత వహించిన ఒక సభలో హైదరాబాద్ సంస్థానంలో గల ఆది హిందువుల ప్రతినిధులంతా తమ మార్గదర్శకునిగా ఎన్నుకున్నారు. ఇది ఏ సామాజిక వర్గపు నాయకునికైనా గర్వకారణమవుతుంది. ఆయన 1925లో ఆదిహిందువుల ఆటల ప్రదర్శన నిర్వహించి, అదిహిందూ యువతీయువకులు సవర్ణ యువతీ యువకులతో సమంగా రాణిస్తారని నిరూపించాడు.

---------------------------------------------------------------------

ఆలోచించండి-చెప్పండి.

మూఢ నమ్మకాలు అంటే మీకేం అర్థమయ్యింది?

వర్మ తన జాతి జనుల్లో ఏ విధమైన మార్పును తీసుకురాగలిగాడు?

* మంచివక్త అని ఎవరిని అనవచ్చు?


---------------------------------------------------------------------


6. భాగ్యోదయం పరీక్ష

III

ఆది హిందువుల మేలుకోసం వర్మ నిరంతరం చేపట్టిన కార్యాచరణ ఎంతో మంది ప్రముఖుల మనసులను చూరగాని వారు అదిహిందువులకు దగ్గరయ్యేలా చేసింది. భాగ్యరెడ్డివర్మ నిరంతర కార్యావరణ సభల వలన హిందూ సమాజం జాగరూకమయ్యింది. ఆదిహిందువులు సొంతకాళ్ళ మీద నిలబడాలంటే చదువు ఒక్కటే మార్గమని వర్మ బలమయిన నమ్మకం. ఈ విషయంలో ఆయన ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి తన బాధ్యతను గుర్తించేలా చేశాడు. 

కృషి, పోరాటం ఫలితంగా ప్రభుత్వం ఆదిహిందువుల కోసం ఎన్నో పాఠశాలలు నెలకొల్పింది. 1931 జనాభా లెక్కల సేకరణ సందర్భంగా వర్మ ఎంతగానో శ్రమిపడి అంటరాని వర్గాలను అది హిందువులుగా నమోదు చేయించాడు. ఇది ఆయన నాయకత్వ పటిమకు మచ్చుతునక.  హిందూ సమాజం మొత్తంగా ఆయనకు రుణపడి ఉండాలె. ఆ చర్యతో హిందూ సమాజాన్ని ఆయన చీలికలు కాకుండా రక్షించగలిగాడు.

----------------------------------------------------------------------------------------------------------------------------------------

ఆలోచించండి-చెప్పండి.

చదువుకోవడం వల్ల సమాజం ఏ విధంగా చైతన్యవంతమవుతుంది? 

నాయకత్వ పట్టిమను ఏ విధంగా అంచనా వేయవచ్చు?

--------------------------------------------------------------ఘ-------

6. భాగ్యోదయం పరీక్ష

------------------------------------------------------------------------------------------------------------------------

6. భాగ్యోదయం పరీక్ష

ఇవి చేయండి

I. అవగాహన ప్రతిస్పందన

1. నిన్ను వర్గాలలో భాగ్యరెడ్డి వర్మ తెచ్చిన మార్పులు చెప్పండి.

2. భాగ్యరెడ్డి వర్మ అంబేద్కర్ ల మధ్య పోలికలు తెలపండి.

3. కింది పేరా చదవండి ప్రస్తుత జవాబులు రాయండి.


మహారాష్ట్రలో పుట్టిన జ్యోతిబాపూలె బహుజనుల అభివృద్ధికి విశేషకృషి చేశాడు. దొరల దోపిడీ దౌర్జన్యాలను ధైర్యంతో ఎదుర్కొన్నాడు. పేదలందరికీ విద్య అందుబాటులోకి రావాలని ఉద్యమాలు చేశాడు. సత్యశోధక సమాజం ఏర్పాటు చేశాడు. బి.యస్.వెంకటరావు హైదరాబాద్లోని ఘాస్మండిలో పుట్టాడు. హైదరాబాదు అంబేద్కర్ గా ప్రసిద్ధి చెందాడు. హైదరాబాదులో అంబేద్కరిజానికి పాదులు తీసి, దారులు వేశాడు. సమరోత్సాహంతో దళిత ఉద్యమాలను నడిపిన ధీశాలి. హైదరాబాద్లో దేవదాసీ దురాచార నిర్మూలనకు, దళితులలో విద్యాభివృద్ధికి కృషి చేశాడు. 1926లో ఆదిహిందూ మహాసభను స్థాపించాడు.

సరైన జవాబు గుర్తించి కుండలీకరణం(బ్రాకెట్)లో రాయండి.


అ) జ్యోతిబాపూలె స్థాపించిన సమాజం పేరు ఏమిటి? ( అ )

అ) సత్యశోధక ఆ) సమసమాజo ఇ) నవసమాజం

ఆ) పేదలందరికీ అందుబాటులోనికి రావలిసింది. (ఆ )

అ) డబ్బు ఆ) చదువు ఇ) న్యాయం

ఇ) దేవదాసీ దురాచార నిర్మూలనకు కృషిచేసింది.( ఆ )

అ) జ్యోతిబాపూలే ఆ) అంబేద్కర్

ఈ) ఆదిహిందూ 

ఈ) ఆచిహిందూ మహాసభను స్థాపించిన సంవత్సరం.(ఆ )

ఆ)1936 ఆ)1926 ఇ)1916 

I. అవగాహన ప్రతిస్పందన: 


6. భాగ్యోదయం పరీక్ష 

II. వ్యక్తీకరణ - సృజనాత్మకత 

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాలలో జవాబులు రాయండి 

అ)చదువుకుంటే కలిగే లాభాలను తెలపండి

జ. చదువుకుంటే కలిగే లాభాలు: విద్య వలన వినయ, విధేయతలు, సంపదలు, గౌరవ మర్యాదలు లభిస్తాయి. చదవడం వలన విచక్షణాత్మక నిర్ణయం చేసి మంచి నిర్ణయం తీసుకుంటాం. మంచి చెడులను బేరేజ్ వేస్తాం. ప్రపంచంలో జరిగే ప్రతి విషయం అవగతమవుతుంది. దురలవాట్ల వలన కలిగే నష్టాలు తెలుస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చదువుకున్న వారికి ఉపాధి, ఉద్యోగం దొరుకుతాయి. పనిలో నైపుణ్యత పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం అభివృద్ధి కావడం వలన తనమీద తనకే నమ్మకం పెరుగుతుంది. సమస్యలను పరిష్కరించుకో గల సామర్థ్యం లభిస్తుంది. చదవడం వలన మనిషి పరిపూర్ణవంతుడు అవుతాడు.

ఆ) అసమానతలు తొలగి సమానత్వం రావాలంటే ఏం జరగాలి?

జ. సమానత్వం రావాలంటే...:

సమాజంలో అందరికీ సమాన హక్కులు లభించాలి. అందరూ చదువుకోవాలి. చదువుకోవడానికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వాలి. స్కాలర్షిప్లు మొదలైనవి చేయూతునివ్వాలి. భూమిలేని వారికి భూమిని పంచాలి. నిరుద్యోగులకు, వృద్ధులకు, వితంతువులకు పింఛన్లు అందజేయాలి. అందరి మధ్య చిన్నతనం నుండే సమభావన కలిగించాలి. మూఢ నమ్మకాలను తొలగించాలి. హేతువాద శాస్త్రీయ దృష్టి పెంపొందించాలి. చైతన్యం కలిగించాలి. అందరిలో ఆ సుమానతలు తొలగించి సమానత్వం పెంపొందించాలి. అప్పుడే నవ సమాజం ఏర్పడుతుంది.

 ఇ) అంకితభావంతో పనిచేయడం అంటే ఏమిటి?
 
జ. అంకితం అనగా చేసే పని పట్ల చిత్తశుద్ధి కలిగి ఉండడం. అంకితభావం అంటే పూర్తిగా వశమైనట్లు భావించడం. అంకితభావంతో పనిచేయడం అంటే పూర్తిగా పనిలో మునిగిపోవడమే. ఏమి ఆలోచించకుండా పని గురించి ఆలోచించడం, ఆచరించడం అనుకున్న లక్ష్యాన్ని సాధించడమే అంకితభావం. ఫలితాన్ని లక్ష్యాన్ని నిర్దేశించుకుని సాధించేవరకు శ్రమించడమే అంకితభావం. అలా చేయడాన్ని అంకితభావంతో పనిచేయడం అంటారు.


ఈ) వ్యసనాల వలన ఎలాంటి నష్టాలు కలుగుతాయి?

జ. వ్యసనం విరామం లేని అలవాటు. అలవాటు అంటే అదే పనిగా చేసే పని. విషనాలలో సద్వసనం మంచిది. దుర్వసనం లవాటయితే బతుకు దుర్భరమైపోతుంది. అనారోగ్యం బారిన పడతాము. ఆర్థిక ఖర్చులు పెరిగిపోతాయి. అప్పులు ఎక్కువ అవుతాయి. గొడవలు పెరుగుతాయి బంధువులు స్నేహితులు చుట్టాలు అందరూ దూరమవుతారు ఒక్కొక్కసారి ప్రాణాంతకమైన క్యాన్సర్ ఎయిడ్స్ లాంటి వ్యాధులు కూడా వ్యాపిస్తాయి. మరణం కూడా సంభవించవచ్చు. అందుచేత చెడు వ్యసనాలను, చెడు వ్యసనాలలో చిక్కుకుపోయిన వారిని చైతన్యపరిచి చెడు వ్యసనాలకు దూరంగా ఉంచడమే మన ధర్మం. మన కర్తవ్యం కూడా.

2. కింది ప్రశ్నలకు పది వాక్యాలు జవాబులు రాయండి.

అ) మీ చుట్టూ ఉన్న సమాజంలో నెలకొన్న మూఢనమ్మకాలను పారదలడానికి మీరేం చేయగలరు?

జ. మన చుట్టూ సమాజం ఉంటుంది సమాజంలో అనేక రకాల మనుషులు ఉంటారు అందరూ బాగుండాలి అప్పుడే అది మంచి సమాజం అని పిలవబడుతుంది మూఢనమ్మకాల వల్ల కలిగే అనర్ధాలను వివరించకుంటే ప్రాణాలకే హానికరంగా మారుతాయి చెడు అలవాట్లను మాన్పించడానికి మనం కృషి చేయాలి. భక్తి మంచిదే కానీ శకునాలు చూడడం అతి భక్తి పేరు చెప్పి రోజులకు రోజులు ఉపవాసాలు ఉండి ఆరోగ్యాన్ని కోల్పోవడం మంచిది కాదు అని వివరించాలి. నిమ్మకాయలు కోడి గుడ్లు, కర్రె కోళ్లు మొదలైనవి చెడు చేతబడి లేదని వివరిస్తాము. అనారోగ్యం కలిగినప్పుడు వైద్యం వద్దకు వెళ్లాలి. మంత్ర శక్తులు అనే పేరు చెప్పి భూత వైద్యుల వెంట పోవడం వలన చికిత్స తీసుకోవడం మూలంగా మరింత అనారోగ్యం పాలవుతారని తెలియజేస్తాము.

జన విజ్ఞాన వేదిక ద్వారా ప్రదర్శనలు, ఉపన్యాసాలు ఇప్పిస్తాం. ప్రజల్లో చైతన్యం కలిగిస్తాం. మా గ్రామాన్ని, మా ప్రాంతాన్ని మూఢనమ్మకాల నుండి విముక్తి చేస్తాం. శశాస్త్రీయంగా ఆలోచించడం అలవాటు చేసి మూఢనమ్మకాలు లేని గ్రామంగా మమ్మల్ని మేము ప్రకటించుకుంటాం.


(లేదా)

ఆ) భాగ్యరెడ్డి వర్మ ఆది హిందువుల కోసం చేసిన కృష వివరించండి.

జ. భాగ్యరెడ్డి వర్మ ఆది హిందువుల కోసం చేసిన కృషి: ఆది హిందువులు అనుభవిస్తున్న అనేకమైన దురవస్థల నుండి వారిని దూరపరచడానికి భాగ్యరెడ్డి వర్మ తన జీవిత కాలాన్ని అంకితం చేశాడు. తన అంకితభావం వలన అనేక కుటుంబాలు వాస్తవ స్థితికి వచ్చాయి.  తమ దృష్టికి కారణం తమ అజ్ఞానం అవిద్య, ఉదాసీనత  అనే విషయాన్ని భాగ్యరెడ్డి వర్మ గారు తన ప్రసంగాల ద్వారా వివిధ కార్యక్రమాల ద్వారా వారు అర్థం చేసుకునే విధంగా చేశారు. మానవులలో ఎక్కువ తక్కువలు లేవని అందరూ సమానమేనని తెలుసుకునేలా చేశారు. తన జీవితకాలంలో 3348 ప్రసంగాలు ఇచ్చి ఆది హిందువులను చైతన్య పరచడమే కాకుండా దేవదాసి మురళి వేశ్య సంప్రదాయాలను రూపుమాపాడు.

ఆది హిందువులకు చదువుపై శ్రద్ధ కలిగించాడు. పాఠశాలలు నడిపించాడు. తాగుడు మొదలైన దురలవాట్లను మాన్పించాడు. మూఢాచారాలను తొలగించాడు. ఆటపాటల ప్రదర్శన నిర్వహించి వారిలోని బలమైన ఆకాంక్షలను వెల్లడి చేశాడు. ఆది హిందువులకు ప్రభుత్వం అండగా నిలిచేలా కృషి చేశాడు. 

3. కింది అంశాన్ని గురించి సృజనాత్మకంగా / ప్రశంసిస్తూ రాయండి.

అ) భాగ్యరెడ్డి వర్మ గురించి తెలుసుకున్నారు కదా ఇట్లా ఈ సమాజం కోసం పాటుపడిన వాళ్లలో ఎవరి గురించైనా 'అభినందన' వ్యాసం రాయండి.

జ.  మదర్ థెరిసా పేరు మానవత్వంతో పెనవేసుకుపోయింది. మదర్ థెరిసా, గొప్ప మానవతావాది, ఆగస్టు 27, 1910న భారతదేశంలో జన్మించారు. ఆమెకు పుట్టినప్పుడు ఆగ్నెస్ అనే పేరు పెట్టారు.

పేదలు, నిరుపేదలు మరియు వెనుకబడిన వారికి సహాయం చేయడానికి మరియు సేవ చేయడానికి ఆమె 1వ మిషనరీస్ ఆఫ్ ఛారిటీని స్థాపించారు. ప్రజలకు సహాయం చేయడంలో ఆమె చేసిన సేవ మరియు నిజమైన భక్తి ఫలితంగా ఆమెకు ఇటలీలో పోప్ బిరుదు లభించింది.

పాడుబడిన మరియు అనాథలైన వేలాది మంది పిల్లలు ఆమెలో మోక్షాన్ని పొందారు. నిరుపేదలకు మరియు నిరుపేదలకు సహాయం చేయడం దేవునికి సేవ చేయడం, కరుణ మరియు ఆప్యాయత తన ఉద్దేశ్యానికి మూలస్తంభాలు అని ఆమె పేర్కొన్నారు. నిరుపేదలు మరియు పిల్లల సంక్షేమం కోసం ఆమె పట్టుదల మరియు నిబద్ధత కోసం అంతర్జాతీయ గుర్తింపు పొందింది.

మదర్ థెరిసా తన పనికి అనేక బహుమతులు అందుకుంది మరియు వాటిలో కొన్ని:

  1. 1980: భారతరత్న
  2. 1979: శాంతి నోబెల్ బహుమతి
  3. 1973: టెంపుల్టన్ ఫౌండేషన్ అవార్డు
  4. 1972: శాంతి కోసం జవహర్‌లాల్ నెహ్రూ అంతర్జాతీయ అవార్డు
  5. 1962: రామన్ మెగసెసే అవార్డు
.


లేదా 

నేదురుమల్లి బాలకృష్ణారెడ్డి

ఇతడు వాకాడులోను చుట్టుపక్కల గ్రామాలలోను అనేక సంస్థలు నడిపాడు. వాటిలో కొన్ని

  • నేదురుమల్లి వెంకటరెడ్డి మెమోరియల్ బేసిక్ ఉపాధ్యాయ శిక్షణ పాఠశాల
  • హరిజన విద్యార్థి ఉద్ధారక సంఘము
  • హరిజన విద్యార్థి వసతి గృహము
  • ఎల్లశిరి ఫిర్కా హైస్కూలు
  • ఎస్.ఎ.ఎల్.సి. ఉన్నత పాఠశాల
  • ఆంధ్ర విద్యార్థి శరణాలయము
  • డి.ఇ.ఎల్.మిషన్ స్కూలు
  • సీతమ్మ పారిశ్రామిక పాఠశాల
  • కాళిదాస బాలుర వసతి గృహము

మొదలైనవి. 


లేదా 

రోమ్ చాను షర్మిల కవయిత్రి మరియు మానవ హక్కుల కార్యకర్త. 1972 మార్చి 14న నిరుపేద కుటుంబంలో జన్మించిన ఆమె హైస్కూల్‌ను పూర్తి చేయడానికి చాలా కష్టపడింది. పది మంది మాలోమైట్‌ల హత్యల ద్వారా ఆమె చాలా తీవ్రంగా హత్తుకుంది, ఆమె బలవంతంగా భావించింది. సాయుధ బలగాల (ప్రత్యేక అధికారాలు) చట్టం (AFSPA)ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఆమె 5 నవంబర్ 2000న తన 16 ఏళ్ల నిరాహార దీక్షను ప్రారంభించారు.

AFSPA భారత సాయుధ దళాలను వారెంట్లు లేకుండా శోధించడానికి అనుమతిస్తుంది. ఆమె నిరాహారదీక్ష ప్రపంచవ్యాప్త ట్రెండ్‌గా మారింది మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంకితభావం గల మహిళలను మానవ హక్కుల కోసం పనిచేయడానికి ప్రేరేపించింది.

మణిపూర్ ఉక్కు మహిళగా పేరుగాంచిన ఇరోమ్ షర్మిల 5,757 రోజుల నిరాహార దీక్ష తర్వాత ఎట్టకేలకు తన ఏడాది నిరాహార దీక్షను ముగించారు. చాలా మంది యువ కార్యకర్తలు ఆమె ఉపవాసం నుండి ప్రేరణ పొందారు.

సంబంధిత కథనం: అలాగే, దేశం అభివృద్ధికి సహకరించిన ఇతర మహిళల గురించి కూడా చదవండి. అటువంటి మహిళల గురించి తెలుసుకోవడానికి లింక్ చేసిన కథనాన్ని తనిఖీ చేయండి.

  1. భారతదేశ మహిళా జాతీయ నాయకులు
  2. భారతదేశంలో తెలియని మహిళా స్వాతంత్ర్య సమరయోధులు
  3. మహిళా స్వాతంత్ర్య సమరయోధుల ప్రసిద్ధ నినాదాలు
  4. మొదటి మహిళా స్వాతంత్ర్య సమరయోధురాలు
  5. అరుణా అసఫ్ అలీ స్వాతంత్ర్య సమరయోధురాలు
పై మూడింటిలో ఒకటి మాత్రమే రాయగలరు.

III. భాషాంశాలు

పదజాలం:

1. కింది పదాలకు పర్యాయపదాలు రాయండి. 

          అ) అండ :  ఆధారం, ఆదరువు, అలంబనం, ఆసరా, ఆశ్రయం 

ఆ)ఉన్నతి : గొప్ప, ఘనత, పెంపు, దొడ్డతనం, మేటి

ఇ)స్వేచ్ఛ:  స్వచ్ఛందము, అలవోక, స్వతంత్రత, స్వాతంత్ర్యం.

ఈ) వికాసం : వికసనం, ప్రఫల్లం, వికసించడం, అభివృద్ధి చెందడం.


2. కింది పదాలను ఉపయోగిస్తూ సొంత వాక్యాలు రాయండి. అ)ఏకతాటిపై : మనమంతా ఏకతాటిపై నిలవాలి.

అ) ఏకతాతిపై: మనమంతా దేశం కోసం ఏకతాటిపై నిలవాలి. 

ఆ)మచ్చుతునక : తెలంగాణ వైభవానికి సిద్దిపేట ఒక మచ్చుతునక.

ఇ)మహమ్మారి : నేటికీ వరకట్న మహమ్మారి కలదు.

ఈ) నిరంతరం : విద్యార్థులు నిరంతరం విద్యపై దృష్టించాలి.


3. కింది పదాలను పదబంధాలను వివరించి రాయండి 

అ)అంకితం కావడం : చేయదలచుకున్న పని యందు తప్ప వేరే ఆలోచన లేకపోవడం

ఇ) నైతిక మద్దతు : ధన సహాయం మొదలైన చేయలేకపోయినా కనీస బాధ్యతగా న్యాయమైన మద్దతును ప్రకటించడం.

ఇ) చిత్తశుద్ధి : మనసులోని వ్యతిరేక భావాలను తొలగించుకొని మనస్ఫూర్తిగా ప్రవర్తించడం 

ఈ) సాంఘిక దురాచారాలు: సంఘ పరమైన చెడు ఆచారాలు.

ఉ) సొంత కాళ్లపై నిలబడడం: ఇతరులపై ఆధార పడకుండా జీవించడం.

6. భాగ్యోదయం పరీక్ష

వ్యాకరణాంశాలు:

ప్రత్యక్ష కథనం (Direct Speech)ఒకరు చెప్పిన మాటలను ఉన్నది ఉన్నట్లుగా (మార్పులు లేకుండా), కొటేషన్ మార్కులతో (" ") చెప్పడాన్ని ప్రత్యక్ష కథనం అంటారు.

ఉదాహరణ: రాముడు, "నేను రేపు ఊరికి వెళతాను" అన్నాడు.

పరోక్ష కథనం (Indirect Speech)మరొకరు చెప్పిన విషయాన్ని, వారి మాటల్లో కాకుండా, మన మాటల్లోకి మార్చి చెప్పడాన్ని పరోక్ష కథనం అంటారు. ఇందులో కొటేషన్ మార్కులు ఉండవు మరియు చివరగా "అని" అనే పదాన్ని వాడతారు.

ఉదాహరణ: రాముడు తాను మరుసటి రోజు ఊరికి వెళతానని చెప్పాడు.

ప్రత్యక్ష కథనం

కింది వాక్యాలను పరిశీలించండి

అ) "అక్కా ! ఆ చెరువు చూడు"

ఆ)"నేను రాన్రా తమ్ముడు"

ఇ) "పిల్లలూ ! రేపు బీర్ పూర్ జాతరకు వెళ్తున్నాను"

ఈ) "మేమూ వస్తాము సర్"

పై వాక్యాలను పరిశీలించారు కదా పై వాక్యాలు నేను మేము మొదలైన వారు చెబుతున్నట్లుగా ఉన్నాయి కదా ఇట్లా ఉత్తమ పురుషులను వాక్యాలు సాధారణంగా ప్రత్యక్షంగా చెప్తున్నట్లు ఉంటాయి కాబట్టి ఇవి ప్రత్యక్ష కథనంలో ఉన్న వాక్యాలు ప్రత్యక్ష కథనానికి ఉద్ధరణ చిహ్నాలు (" ") ఉండాలి.

కింది ఉదాహరణలను పరిశీలించండి.

అ)"మనుషులంతా పుట్టుకతో సమానం ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు" అన్నాడు భాగ్యరెడ్డి వర్మ 

ఆ) రుద్రమదేవితో తల్లి నారాంబ "నువ్వు నేను మామూలు స్త్రీలం కాదు. నువ్వు పట్టమహిషివి, నేను భావిచక్రవర్తిని, మనకు కండ్లు మటుకే ఉండాలి కానీ కన్నీళ్లు ఉండకూడదు" అన్నది.

సారాంశం:

భాగ్యరెడ్డి వర్మ 1888లో జన్మించాడు. 

   ధర్మ శాస్త్రాలు చరిత్ర ను బాగా అధ్యయనం చేసి సమాజంలో ఉండే కుల వ్యవస్థ దాని నిజ స్వరూపాన్ని అవగతం చేసుకుని, అంటరాని వర్గాల కడగండ్లను అర్థం చేసుకుని, వాటిని నిర్మూలించి వారిలో సామాజిక వికాసం కలిగించాడు. అంటరాని వర్గాల ఉన్నతి కోసం సంస్కరణలు చేపట్టాడు.


   ఏమీ ఆశించకుండా చిత్తశుద్ధి, నిజాయితీ, పట్టుదల తో పని చేశాడు. మనుషులంతా పుట్టుకతో సమానమని ఎవరూ ఎక్కువ, ఎవరూ తక్కువ కాదన్న సత్యాన్ని తెలుసుకునేటట్టు చేసాడు. నిరంతర శ్రద్ధ వల్ల అంటరాని వర్గాలు చదువుపై చూపు పెట్టడం వలన కొన్ని సాంఘిక దురాచారాలు మటుమాయ మయ్యాయి.

   సామాజిక స్వచ్ఛత గురించి చెప్పి తన జాతి జనులను ఏకతాటిపై నడుపగలిగాడు. దేవదాసి, ముర్లీ, వేశ్యా సంప్రదాయాలను అడ్డుకొని ఆడ మగ పిల్లలను దేవునికి వదిలివేయడాన్ని తీవ్రంగా నిరసించాడు. తాగుడు వల్ల కుటుంబాలు ఎట్లా గుల్లగా మారిపోతాయో వివరించి చెప్పి తాగుడు మాన్పించాడు.

  ప్రతి ఏటా జరిగే మత సాంఘిక సభలకు హాజరయ్యేవాడు. ఆంధ్ర మహాసభ ఆది హిందూ మహాసభ అఖిలభారత అంటరాని వర్గాల సభ వంటి సంస్థలు జాతీయ స్థాయిలో అనేక సభలలో పాల్గొని 3,348 ఉపన్యాసాలు ఇచ్చి, అణగారిన వర్గాలలో చైతన్యానికి కృషి చేసాడు.

 1925లో ఆది హిందువుల ఆటల ప్రదర్శన నిర్వహించి ఆది-హిందూ యువతీ యువకులు సువర్ణ యువతీ యువకుల తో సమంగా రాణిస్తారని నిరూపించాడు. ఆది హిందువులు సొంత కాళ్ళ మీద నిలబడాలంటే చదువు ఒక్కటే మార్గమని బలంగా నమ్మాడు. కృషి పోరాటం ఫలితంగా ప్రభుత్వం ఆది హిందువుల కోసం ఎన్నో పాఠశాలలు నెలకొల్పింది.




-------------------------------------------------------------------------

అదనపు సమాచారం 

భాగ్యరెడ్డి వర్మ జీవితము సాహిత్యము

బహుజన స్పూర్తి ప్రధాతలు జాతీయ సదస్సు november 2022

ప్రభుత్వ డిగ్రీ కళాశాల, గజ్వేల్ సిద్దిపేట.  

          ఒకటి భాషాపరమైన వివక్ష. రెండోది మనుషుల మధ్య వివక్ష. వివక్ష మనుషుల్ని విభజిస్తూ రాజ్యమేలుతున్న కాలంలో ఒక విత్తు మొలకెత్తుతూనే వివక్షలేని సమాజాన్ని వాగ్ధానం చేసింది. ఆ విత్తు నేలలో పడగానే చీమలు, పెరుగుతున్నపడు పశువులు, ధ్వంసం చేయాలనుకున్నా మొక్కయి ఎదిగి, పాదు అయి పూచి, మధుర ఫలాలను అందించింది. ఎదగడమే ఉద్యమంగా బతుకుతూనే భిన్న సంస్కృతులకు ఎదిగి పూచిన పాదైంది. అందరికీ నీడనిచ్చింది. కలగన్న స్వప్నం సాకారం కోసం జీవితాన్ని అంకితం చేసింది. ఆ విత్తనమే మ్యాదరి వెంకయ్య భాగ్యరెడ్డి వర్మ. వారి అసలు పేరు మ్యాదరి భాగయ్య.

          మ్యాదరి వెంకయ్య, రంగమాంబ దంపతులకు 1888 మే, 22న హైదరాబాద్‌లో భాగయ్య జన్మించాడు. అంటరాని కుల పంకిలంలో జన్మించినా చిన్నతనంలోనే వివక్షను అనుభవించాడు. ఏ వివక్షను అవమానంగా అనుభవించాడో ఆ వివక్షను రూపుమాపాలని కంకణం కటుకున్నాడు. కడదాక నిబద్దుడై జీవించాడు. ఫలితం కోసం పరిశ్రమించారు.

          బాల్య దశ: పువ్వు పుట్టగానే పరిమళించినట్లు విద్యా సుగంధాలను అద్దుకున్నాడు. చిన్నతనంలో తండ్రి చనిపోయాడు. అప్పటి వరకున్న బాల్యం కష్టాల కొలిమిలో కూరుకపోయింది. సమస్యలు వెంటబడ్డాయి. కన్నీళ్లు వేధించాయి. కనికరంలేని కాలం అగ్నిలో పడినా బతుకు సువర్ణ భూషితమైంది. వారి అంకితభావం వజ్రానికి మారుపేరైంది. ఆదర్శంగా నిలిచింది. దీపధారిలా తోవ చూపింది.

          భాగయ్య అందరిలాంటి వాడు కాడు. ఆశాజీవి. సంక్షోభంలో సంకల్పం వదులుకోలేనితనం. అంకుఠిత దీక్షా దక్షతలు వారి పుట్టు వన్నె. ఆశయమే పెట్టువన్నెగా బరిలో నిలిచిన సుచరిత వారిది. తల్లి నడిపే చిన్నపాటి కిరాణం మీద పిల్లలందరు చదువుతున్నారు. భాగయ్య ఆలోచనలు కుటుంభం చుట్టూ, సమాజం చుట్టూ తిరిగాయి. పసివయసులోనే కుటుంభానికి భారం కావొద్దనీ టెన్నీసు కోర్టులో బంతి అందించే కుర్రవాడిగా పనిలో చేరాడు. బాల్యదశలో రావిచెట్టు రంగారావుగారనే బ్రాహ్మణుడు వీరి విద్యాభ్యాసానికి చేయూతనిచ్చాడు.

          బాగయ్య చిన్నప్పటి నుంచే చదువుపై ఆసక్తి ఎక్కువ. చరిత్ర, విజ్ఞానం పట్ల ఎంతో శ్రద్ధ కనబర్చేవాడు. తార్కికంగా ఆలోచించేవాడు.  వీరి ఇంటికి శైవమత గురువు తరుచూ వచ్చి బోధనలు చేసేవారు. ఆర్యులు భారతదేశానికి వలస వచ్చినారు. వీరు రాక ముందు ఆయన అంటరానివారుగా చూడబడుతున్న దళితులు పాలకులుగా వుండేవారు. రెడ్డిఅన్న పదం రేడు నుండి వచ్చింది. రేడు అనగా పాలకులు అని అర్థం చెప్పేవాడట. తన కుల గురువు చెప్పిన విషయాలు బాగయ్య మనసులో ఎంతగా నాటుకు పోయిందంటే వాటిని నిజ జీవితంలో ఆచరించే స్థాయికి తీసుకెళ్లింది. మా పూర్వీకులు పాలకులే కదా! నేను పాలకుడిని ఎందుకు కాకూడదు?’ అని ఆయనకు ఆలోచన తట్టింది. ఆ విధంగా పేరుకు వెనుక రెడ్డి పెట్టుకున్నాడు.

          సామాజిక న్యాయం తపించిన మహాత్మ జ్యోతిరావ్‌పూలే వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న భాగయ్య అంబేద్కర్‌ కన్న ముందే దళితుల కోసం పాటుపడ్డారు. సమస్యలకు పరిష్కారం చూపారు. నిమ్న వర్గాలలో ఆత్మగౌరవాన్ని పెంపొందించాడు. మేం పంచములం కాదు. ఈ దేశ మూలవాసులమని ఆదిహిందువులమంటూ ఉద్యమానికి నాంది పలికారు.

          భాగ్యరెడ్డివర్మ హరిజనోద్ధరణకు కంకణబద్ధుడైనాడు. దేవదాసి, జోగిని, ముర్లి మొదలైన దుర్మార్గపు సంప్రదాయాలపై తిరుగుబాటు శంఖం పూరించాడు. అందుకు తగిన కార్యాచరణను ఎంచుకున్నాడు. అందుకోసం తన్ను తాను చెక్కుకున్నాడు. వెలివేయబడిన జీవితాలకు వెలుగునిచ్చాడు. భాగ్యరెడ్డి ఆచరణవాది. కార్యశీలి. మేల్కొల్పడానికి గొంతులేనోల్ల గొంతుకగా మారాడు. బలహీనుల బలమైన బలంగా రక్షణ నిలువాలనుకున్నాడు. తెలుగు, హిందీ, మరాఠి, కన్నడ భాషలలో అనర్గళంగా వాదోపవాదాలు చేశాడు.

          హరిజనవాడలను సందర్శించాడు. వారిలో ఒకడిగా మిళితమయ్యాడు. కలుపుగోలుగా మమేకమయ్యాడు. వారు చైతన్యవంతులుగా చేయటానికి తన జీవితాన్ని అంకితం చేసాడు.  

          వర్మ పదునెనిమిదవ యేట విద్యావంతురాలైన లక్ష్మిదేవితో 1906లో వివాహమైంది. ఆమె రెడ్డి కులస్తురాలు. మొటాటి ఎల్లారెడ్డి కూతురు. కామారెడ్డి పట్టణ వాస్తవ్యరాలు. వీరి ఏకైక పుత్రుడే ఎం. బి. గౌతమ్‌. లక్ష్మిదేవి మార్చి 4వ తేదీ 1987లో మరణించింది1.

ప్రజా జీవితం: భాగ్యరెడ్డి ప్రజాజీవితం పద్దెనిమిదేళ్ల వయస్సు అనగా టీనేజీలోనే ప్రారంభమైందని చెప్పవచ్చు. స్వామి అత్యుతానందతోపాటు కలిసి ఆదిహిందూ ఉద్యమాన్ని జాతీయ స్థాయికి తీసుకుపోసాగాడు భాగ్యరెడ్డివర్మ. విద్య యొక్క ప్రాశాస్త్యాన్ని గుర్తించిన భాగ్యరెడ్డి చదువుకు ప్రాముఖ్యత నిచ్చారు. విద్య వలన మనసు వికాసం చెందుతుందని నమ్మకం కలిగించేవారు. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగులా ఉపయోగపడుతుందని ఉపదేశించేవాడు. దళిత బడుగు బలహీన వర్గాల ప్రజల్లో చైతన్యం నింపడానికి బాగ్యరెడ్డి వర్మ 1906లో షెడ్యూల్డు కులాల బాలబాలికలకు విద్యా బోధన గావించడం కోసం హైదరాబాదులోని ఈసామియా బజారులో జగన్మిత్ర మండలిని స్థాపించాడు.

          జీవితాలు మారాలంటే చదువే ఆయుధమని తలంచాడు. అజ్ఞానంపై సమరం సాగించాడు. అట్టడగు బతుకులలో ఆశలు నింపాడు. ఆశయాలుగా మార్చాడు. విద్యావశ్యకతను అందరికంటే అధికంగా ఆది హిందువులకే అవసరమని 1911వ సంవత్సరంలో మన్య సంఘంగా మార్చాడు.

           1938నాటికి ఆది హిందూ పాఠశాలల సంఖ్య 26కి పెరిగాయి. విద్యార్థుల సంఖ్య 2500గా నమోదై ఉంది. తొలిదశలో దక్కన్‌ హుమనిటేరిన్‌ లీగ్‌(జీవ రక్షక జ్ఞాన్‌ ప్రచార మండలి) పాఠశాలల నిర్వహణకు నిధులు సమకూర్చేది. ఉదార స్వభావం కలిగిన అగ్రకుల హిందువులు, ఇతరులు విరాళాలు సమకూర్చేవారు. అప్పటి హైకోర్టు న్యాయమూర్తి రాయ్‌ బాలముకుంద్‌, ఆయన కుమారుడు బారిస్టర్‌ రాయ్‌ కిషన్‌, ధర్మవీర్‌ వామన్‌ నాయక్‌ జాగీర్ధార్‌, రాజా ప్రతాప్‌ గిరీజీ. న్యాయమూర్తి ఆర్‌. ఎస్‌ నాయక్‌ వెన్నుదన్ను నిలిచి సహాయ సహకారాలు అందించారు.

          భాగ్యరెడ్డి స్మారకంగా 1943లో ఆయన కొడుకు మాదరి భాగ్యరెడ్డి పారంభించిన భాగ్య స్మారక బాలికల పాఠశాలను ఆ తరువాత మనవడు అజయ్‌ గౌతమ్‌ నడిపిస్తున్నాడు.

ధర్మ ప్రచారణీ ప్రచురణ సంస్థ ప్రారంభించారు. ఇది జగన్మిత్ర మండలికి అనుబంధంగా ఏర్పాటు చేసారు. చిన్న చిన్న పుస్తకాలు, కరపత్రాలు ప్రచురించేవారు.

          ఏక కాలంలో అనేక పాఠశాలలు నడపడం తలకు మించిన భారంగా మారింది. తగిన నిధులు, వసతులు సమకూర్చాలనీ ఆనాటి నిజాం ప్రభుత్వానికి డిమాండ్‌ చేసినప్పుడు 1933లో ప్రభుత్వం ముందుకొచ్చింది. ఆది హిందూ విద్యార్థులకు తెలుగులో బోధించాలన్న ప్రభుత్వ ప్రతి పాదనకు వర్మ ఒప్పుకున్నాడు. 1934 నవంబరులో ప్రభుత్వం స్వాధీన పర్చుకున్నది.

          సమాజంలో వేళ్లూనుకపోతున్న దుర్మార్గపు జాఢ్యమగు దేవదాసి పేరిట నాశనం అవుతున్న బాలికల జీవితాలను చూసి భాగ్యరెడ్డి వర్మ చలించిపోయాడు. అప్పటికే విద్యాబోధన కోసం ఏర్పాటైన జగన్మిత్ర మండలి జనవరి1, 1911లో మన్యసంఘంగా మార్చారు.

          మన్య సంఘం లక్ష్యాలు: 1. అంటరాని వర్గాల పిల్లలకు చదువు చెప్పించాలి.  2. బాల్య వివాహాలను రూపుమాపాలి.

          3. పెండ్లిండ్లు, పండుగలు, పబ్బాల వంటి సమయంలో తాగుడువంటి దురాచారాలని మానిపించాలి. మాంసాహారాన్ని తగ్గించాలి.

          4. అంటరాని వర్గాలలో పాతుకుపోయిన దేవదాసి, జోగిని, ముర్లి వంటి సాంఘిక దురాచారాలని నిషేధించాలి2.

          పాఠశాల ప్రారంభ, ముగింపు సమయాల్లో విద్యార్థులను, వివిధ సందర్భాలలో భాగ్యరెడ్డి దళితులనుద్దేశించి ప్రసంగించేవారు. పేదరికం, అవిద్య వలన ఎలా మోసపోతామో అలతి అలతి పదాలతో నిజ జీవితంలో నిత్యం ఎదురయ్యే ఉదాహరణలతో కూలంకషంగా వివరించేవారు. మూఢనమ్మకాల వల్ల జరుగుతున్న అనర్థాలను ప్రజలకు అర్థమయ్యే భాషలో వివరించేవారు.

          అనేక అంశాల పట్ల అవగాహన పెంచడం కోసం ఆనాడున్న వినోద కార్యక్రమాలను వాహకంగా చేసుకున్నది. మన్యసంఘం అంటరాని కులాల ప్రజల్లో సాహిత్యం, హరికథలు, ఉపన్యాసాల ద్వారా చైతన్యం తీసుకురావటానికి ప్రయత్నించింది. కొంతమంది ఉన్నత కులాల హిందువులు కూడా ఈ భజన మండళ్లను ప్రోత్సహించారు.

          మన్యసంఘం ఆధ్వర్యంలో భజన మండళ్లు రీడిరగ్‌ రూములు ఏర్పరచాడు. అందులో ఆంధ్రప్రత్రిక, దీనబంధు మొదలైన పత్రికలను అందుబాటులో ఉంచారు. ఆ పత్రికలు దళిత యువతీ యువకులు సాంఘిక సమకాలీన అంశాల పట్ల అవగాహన కల్పించడానికి తోడ్పడేవి.

 

          దేవదాసి వ్యవస్థ: రజస్వల అయిన బాలికచే జోగుపట్టడం ఊరిపెద్దతో సమాగం(కన్నెరికం)చేయించడమే జోగిని. దేవునికి అర్పించి           బాలికను భూస్వాములుపయోగించుకోవడం, నిరసించాడు. దేవదాసి వ్యవస్థ నిర్మూలించాలనీ కార్యోన్ముఖులయ్యారు. 1922లో జరిగిన(ఆది జన జాతియోన్నతి సభదీనినే ఆది హిందూ జాతియోన్నతి సభఅని కూడా పిలుచుకునేవారు.) ఆది హిందూ సోషల్‌ కాన్ఫరెన్స్‌ సమావేశం యొక్క ప్రధాన తీర్మానం అమ్మాయిలను దేవతలకు అర్పించవద్దనీ చేశారు. ఇంకా జంతు బలులు, బాల్య వివాహాల వ్యతిరేకంగా పోరాటం చేసింది మన్య సంఘం. భాగ్యరెడ్డి అలుపెరగని పోరాటం వలన ఆనాటి నిజాం ప్రభుత్వమగు దేవదాసి వ్యవస్థను నిర్మూలించాడు.

          భూత దయగలిగిన భాగ్యరెడ్డి 1912లో అహింస సమాజం స్థాపించారు. ఈ సంస్థ స్థాపించే నాటికి భాగ్యరెడ్డి వర్మ శాకాహారిగా మారిపోయాడు. ఈ పరంపరలో భాగంగా ఈ సంస్థలు జీవరక్ష జ్ఞాన ప్రచారక మండలిగా 1915వ సంవత్సరంలో మార్చబడ్డది.

          ఆనాటి కాలంలోని అంటు వ్యాధులుగా భావించే కలరా, ప్లేగు చాలా భయంకరమైనవి. బడుగు ప్రజలకు మరియు సమాజంలో ఉన్న అందరి నిమిత్తం ఒక సంస్థను ఏర్పాటు చేయాలని భావించిన భాగ్యరెడ్డి 1912లో స్వస్తదళ్‌ను ఏర్పాటు చేశారు. ఆయన కార్యనిర్వాహకులుగా ఉన్నప్పటికీ తనతో పాటు అరిగె రామస్వామి, వాల్తాటి శేషయ్య, వెంకటరామ్‌, జే.హెచ్‌ సుబ్బయ్య, ముదిగొండ లక్ష్మయ్య, ముత్తయ్య, శివరామ్‌, పులినరింలు లాంటి ప్రముఖులు చురుగ్గా పాల్గొనేవారు. ఈ సంఘాల ఆధ్వర్యంలో వీరు చేపట్టే కార్యక్రమాలు కూడా ఎన్నో విధాలా ఆసక్తి రేకెత్తించేవి. స్వస్థదళ్‌ వాలంటీర్లు అనాథ మృతదేహాలను తొలగించడం, నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం మొదలైన బాధ్యతగా చేసేవారు.  

          స్వస్థదళ్‌ సంస్థను 35 మంది దళిత కార్యకర్తలతో ఏర్పాటు చేసి హైదరాబాద్‌ నగరంలో ప్లేగు కలరా వ్యాధులు ప్రబలినప్పుడు ఈ సంస్థ ఎంతగానో సహాయ సహకారాలు అందించి ఆరోగ్యకర వాతావరణం కోసం పాటు పడ్డాడు. స్వస్థ దళ్‌ చిహ్నము రెడ్‌ క్రాస్‌ మాదిరి ఆరెంజ్‌ రంగులో ఉండేది. 1925లో హైదరాబాదులో ప్లేగు ప్రబలినప్పుడు ఉదారమైన సేవలు అందించింది. అనాధ శవాలకు దహన సంస్కారాలు నిర్వహించారు.

          అంటరాని తనాన్ని అరికట్టడానికి, కులతత్వ భూతాన్ని నిర్మూలం చేయడానికి ప్రార్థనా సమాజం, బ్రహ్మ సమాజం ఎంతగానో మాట్లాడేవి. అనుకున్నది అనుక్నుంత ఏదీ జరిగేది కాదు. మానవులంతా సమానమనీ మానవతా దృష్టితో ఆర్య సమాజం కొంత మేరకు కృషి చేసింది. ఆర్య సమాజం నిమ్న వర్గాలు సమాజంలో గౌరవ ప్రదంగా బతుకడానికి సమాన స్థాయి హోదానిచ్చి అండగా నిలిచారు. ఆర్య సమాజం ఆశించిన విధంగా అప్పటికే హైద్రాబాద్‌ సంస్థానంలో కృషి చేస్తున్నది భాగ్యరెడ్డి.            

          భాగ్యరెడ్డి పని చేసిన పెద్ద సంస్థ ఆర్య సమాజం ఆనాటి నిజాం రాజ్యంలో దళిత కులాల వారిని కార్యకర్తలుగా స్వీకరించే ఏకైక సంస్థ ఆర్య సమాజం 1910 నాటికి మహారాష్ట్ర ప్రాబల్యం ఎక్కువగా ఉంది క్రైస్తవ్యం ఆర్యసమాజం బ్రహ్మసమాజం బౌద్ధం మొదలైన ప్రభావాలన్ని ఉన్నాయి.       

          సామాజిక బాధ్యత వహిస్తున్న హిందూ సమాజానికి భాగ్యరెడ్డికి 1913లో జరిగిన వైదికధర్మ ప్రచార పరిషత్తుకు చెందిన బాజీ కృష్ణారావు పండితుడు ఆర్య సమాజ్‌వార్షిక సదస్సులో ఇతనికి ఆర్య సమాజదీక్షను ఇచ్చి, యజ్ఞోపవీతం ధరింపచేశాడు. ఆయన సమాజానికి చేసిన సేవలకు గుర్తింపుగా వర్మఅన్న బిరుదును ప్రధానం చేశారు. దాంతో ఆయన భాగ్యరెడ్డి వర్మగా గుర్తింపు పొందారు. (బిరుదు రాజు రామరాజు రాసారు.) అంతకు ముందే శర్మ బిరుదును స్వీకరించుమని ఆర్య సమాజం అడిగితే నేను కార్యసాధకుడిని కాబట్టి వర్మ బిరుదమే తీసుకుంటానని చెప్పారట.

          హరిజనులందరూ చదువుకోవాలని, మద్య మాంసాలు త్యజించాలని, దేవదాసి, జోగిని పద్ధతులను మానుకోవాలని, బాల్యవివాహాలను బహిష్కరించాలని, మతసామరస్యం పాటించాలని, ఆర్య సమాజ ధర్మాన్ని పాటిస్తూ మూఢనమ్మకాలు పాటించరాదని విశేషంగా ప్రచారం చేశాడు. ఇతని ఉపన్యాలపై ప్రేరణ పొంది అనేకమంది హరిజనులు హైద్రాబాదు సంస్థానంలో, ఆంధ్రప్రదేశ్‌లో చైతన్యులై, విద్యాధికులై సన్మార్గంలో నడిచారు.

ఆర్య సమాజం, బ్రహ్మ సమాజంలతో విభేదించడం:

          1913 వరకు భాగ్యరెడ్డి వర్మకు ఆర్య సమాజ్‌కు సవ్యంగా సాగిన మితృత్వం సిద్ధాంతాల ఆచరణ వద్ద బెడిసికొట్టింది. భాగ్యరెడ్డి వర్మ పాఠశాలలో చదువుచున్న విద్యార్థికి వేద పఠనంలో ప్రథమ బహుమతి లభించింది. ఆనాటి ప్రముఖ సంస్కర్త ఆ బాలుడిని వేదికమీదికి వెంటబెట్టుకొని వెళుతుండగా ఒక దళిత బాలుడికి వేద పఠనంలో బహుమతి రావడాన్ని జీర్ణించుకోలేని  ఆశ్రమ అధిపతి ఒక దురుసు వ్యాఖ్య చేయడం భాగ్యరెడ్డి వినడం. ఆర్య సమాజంతో తెగదెంపులు చేసుకోవడం జరిగాయి.

          1914లో మన్య సంఘం కార్యాలయంలో ఆంధ్ర ప్రాంతపు బ్రహ్మ సమాజపు శాఖ ఏర్పడిరది. బ్రహ్మ సమాజంలో దీర్ఘకాలం కొనసాగలేక తనదైన స్థితిలో ముందుకు సాగాడు భాగ్యరెడ్డి.

          సామాజిక రుగ్మతలను సాంఘిక దురాచారాలను తీసుకుని నాటకాల ద్వారా చైతన్యం నింపడానికి భాగ్యరెడ్డి వర్మ గారు 1917లో సంఘ సంస్కరణ నాటక మండలిని స్థాపించారు.

          హైద్రబాద్‌, సికింద్రాబాద్‌ పట్టణాలకి వలస వచ్చిన పల్లెటూరి వారు ఇండ్లలో పాచి పనులు చేసి శ్రమ దోపిడికి గురయ్యేవారు. వారి శ్రేయస్సుకై డోమెస్టిక్‌ సర్వేంట్స్‌ యూనియన్‌ను స్థాపించారు. 1916 మార్చి 17వ తేదీన చాధర్‌ఘాట్‌లో ‘‘విశ్వ గృహ పరిచారక సమ్మేళనం’’ జరిపించారు. 

          బెజవాడలో మైలవరం రాజావారి నాటక మందిరంలో ప్రాదేశిక పంచమ సదస్సు 1917లో గూడూరు రామచంద్ర రావు ఆధ్వర్యంలో జరిగింది. ఆ కార్యక్రమానికి భాగ్యరెడ్డి వర్మ అధ్యక్షత వహించారు. తన అధ్యక్ష ఉపన్యాసంలో దళితుల యొక్క దీనస్థితిని వివరించారు. అంటరానివాళ్ళపై పంచమ వర్ణం అనే పదం పురాణాల్లో మరే ఇతర హిందూ ధర్మ శాస్త్రంలో కనిపించదని గట్టిగా వివరించారు. తెల్లారేసరికి పంచమ సదస్సు కాస్త ఆది ఆంధ్ర సదస్సుగా మారిపోయింది.

          హైద్రాబాద్‌ బ్రహ్మ సమాజ అధ్యక్షుడిగా ఉన్న ఎన్‌. జి. వెల్లింకర్‌ అధ్యక్షత వహించి అఖిల భారత ఆస్తికవాద మహాసభ కలకత్తాకు భాగ్యరెడ్డి వెళ్లారు. అదే సమయంలో కలకత్తాలో అఖిల భారత హిందూ సంస్కరణ మహా సభ కూడా జరుగుతుంది. ఆ సభకు  ప్రపుల్ల చంద్ర రాయ్‌ అధ్యక్షత వహిస్తున్నారు. ఆ సభలో ‘‘అంత్యజుల ఉద్దరణ’’ మీద భాగ్యరెడ్డివర్మ ప్రసంగించారు.

          ఆది హిందువుల ప్రస్తుత దుస్థితికి బ్రాహ్మణ వాదమే కారణమని, ఒకప్పుడు ఈ జంబూ ద్వీపంలో దళితులదే పై చేయిగా ఉండేదని అభిప్రాయపడ్డారు. ఆ సభలో ఆయన ప్రసంగాన్ని విన్న గాంధీజి తన ప్రసంగంలో ఊటంకించారు. తరువాత గాంధీ హైదరాబాదు సందర్శించినపుడు భాగ్యరెడ్డి నడుపుతున్న పాఠశాలలను, సంస్థ కార్యకలాపాలను అడిగి తెలుసుకున్నారు. ఇసామియా బజార్‌లో భాగ్యరెడ్డి వర్మ స్థాపించిన తెలుగు మీడియం పాఠశాలలను సందర్శించిన గాంధీ, తెలుగుతో పాటు హిందీని కూడా పాఠ్యాంశంగా పెట్టాలని సూచించారు.

          ఆది ఆంధ్ర ఉద్యమం:  ఈ దేశ మూలవాసులం మనం. ఇతర దేశాలనుంచి వలసొచ్చిన వాళ్లను, మూలవాసులను కలిపి  విదేశీయులు హిందూ దేశం అని పిలుస్తున్నారు కానీ హిందూ ఏ మతస్తులను ఉద్దేశించింది కాదన్నారు. ఆయా ప్రాంతాలలో నివసిస్తున్న మూలవాసులే ఆది జనం కాబట్టి వారి ప్రాంతానికి ముందు ఆది చేర్చడంతో ఆది ఆంధ్ర ఉద్యమమైంది.

          1917 నవంబర్‌ 4,5,6 తేదీలలో ఆది ఆంధ్రమహా జనసభజరిగింది. ఇదే తొలి పంచమ సదస్సు భాగ్యరెడ్డివర్మ అధ్యక్షత వహించారు. పంచమ పదాన్ని ఖండిరచారు. వర్ణ వ్యవస్థలో ఐదవ వర్ణం వేదాలలో, పురాణాలలో లేదని వివరించారు. తెల్లారే సరికి బ్యానర్లు మారిపోయాయి. తొలి పంచమ సదస్సు కాస్త ఆది ఆంధ్రుల సదస్సుగా మార్చారు.

          ఈ సదస్సునందే నిమ్న కులాలలయిన అంటరాని వర్గాలను ఆది ఆంధ్రులుగా పిలువాలని తీర్మానించారు. తమిళులని ఆది ద్రావిడులుగా, ఆది మహా రాష్ట్రీయులుగా, ఆది కర్ణాటకులుగా పిలువాలనీ, అఖిల భారత స్థాయిలో ఆది హిందువులుగా పరిగణించాలని తీర్మానించారు.

          రెండవ రోజు 1917 నవంబర్‌ 5న జరిగిన సమావేశంలో తీర్మానించిన అంశాలు కొన్ని. పాఠశాలలో, సత్రాలలో అందరితో పాటుగా సమాన ప్రవేశాలు ఉండాలన్నారు. బావులలో నీళ్లు తోడుకునే విధంగా, మిగులు భూములను ఆది హిందువులకు ప్రభుత్వమే పంచాలన్నారు. గ్రామస్థాయి, మున్సిపాలిటి, జిల్లా, శాసనమండలి మొదలైన వాటిలో ఆది ఆంధ్రులను సభ్యులుగా నియమించాలని ఆనాటి ప్రభుత్వాలను డిమాండు చేశారు. సభ రెండవ రోజున 18 తీర్మానాలను సదస్సు ఆమోందించింది.

          హిందూ దేశములోని యన్ని భాగముల పంచములలో హైద్రాబాదు పంచములు అన్ని వ్యవస్థలలో ఉన్నతి నొందిన వారని చెప్పుట యతిశయోక్తి కాదు. నాగరికతయందేమి, మే విధముగ నైనా, హిందువులకు తీసిపోవువారు గాక దినదినము వృద్ధి గావించుచున్నారు. ... జాతి బేధములులనేని మహమ్మదీయ నిజాం రాష్ట్రము కావుననే మా యున్నతికి నేయాంటకములు లేవు. .... మేము ప్రత్యేకముగా పాఠశాలలు స్థాపించవలసి వచ్చింది. మాకు వేరు వేరు అంగళ్లు లేవు. అచ్చట అందరికీ సమాన హక్కులు కలవు3

          ఆది ఆంధ్ర తొలి సభ తీర్మానములు: 1. ఇక నుండి గా’, ‘గాడుఉండకూడదు. దాసు’, ‘స్వామి’, ‘అన్నఅని వాడవలయును. 2. ఈ సభను ఆది ఆంధ్ర మహా సభ అని పిలువాలి. 3. మనం ఆది ఆంధ్రులమని పిలిపించుకొవాలి. 4. మాల, మాదిగ గూడెములని కాక ఋషుల గూడెం, మహనీయుల గూడెం అని డిస్ట్రిక్‌ గెజిట్‌లలో మార్చుమని కోరాలి. 5.  మనము చచ్చిన జంతువులను తినగూడదు. 6. శుభా శుభ కార్యములలో కల్లు, సారాయి ఉపయోగించకూడదు. 7. గో మాంసం తినకూడదు. 8. పరిసరాల పరిశుభ్రత ఉంచకోవలయును. 9. పిల్లలకు చదువు చెప్పించవలయును. 10. ప్రతి గ్రామములో పంచాయితీలను ఏర్పాటు చేసుకోవలయును అని తీర్మానించారు.4

          ‘‘విద్య మనకు చాలా ముఖ్యం. ముఖ్యంగా బాలికలకు విద్య నేర్పవలయును. ఒక బాలిక చదివినచో సంసారమునకంతయు మేలు చేయగలదు’’ అన్న భాగ్యరెడ్డి గారి ఉపన్యాసం ఆంధ్ర రాష్ట్ర అణగారిన వర్గాలు మేలుకొల్పాయి. దేవాలయ ప్రవేశం వృధా ప్రయాస అని చెప్పారు. అంటరాని ప్రజలు ఏనాడు హిందూ వర్గాలలో భాగం కాదనీ నొక్కిచెప్పారు. ఈ సదస్సు జరుగుతున్న మూడురోజుల పాటు బెజవాడ కనకదుర్గ మందిరాన్ని మూడురోజుల పాటు మూసివేశారు.

          ‘‘మాంటేగ్యు మద్రాసుకు వచ్చుచున్నందున వారిని పంచముల ప్రతినిధులు కలసికొని శాసన సభలలో పంచములకు ప్రత్యేక ప్రాతినిధ్యము కావలెనని అడుగుటకు,....నిశ్చయించితిమి. వారందరి అభిప్రాయము ప్రకారము హైదరాబాదులోని సుప్రసిద్ధ ఆదియాంధ్ర నాయకులగు భాగ్యరెడ్డి వర్మగారిని, చుండ్రు వెంకటరామయ్యగారిని మేమందరము నడిచి వందలకొలది పంచమ ప్రతినిధులు వెంటరాగా బెజవాడ పురవీధులలో నూరేగించితిమి... రామిగాడు, సుబ్బిగాడు అని నీచమైన విధముగా పిలువకూడదని, రామయ్య, సుబ్బయ్య అని మాత్రమే పిలువవలెనని, అటులనే సర్కారు లెక్కలలో వ్రాయవలెనని తీర్మానించితిమి. భాగ్యరెడ్డి వర్మగారి యుపన్యాసము గంభీరముగనుండెను. ఆదియాంధ్రుల యిక్కట్టుల గురించి వారు వివరించిరి5.

          1917 నుండి 1938 వరకు ఆది ఆంధ్రమహాసభలు దాదాపు ప్రతి సంవత్సరం జరిగాయి. అంటరానివారిని ఆది హిందువులుగా పిలవాలని డిమాండు చేశారు. ఈ ఆది ఆంధ్ర మహాజనసభల ప్రభావంతో 1931 నిజాం దేశ జనాభా గణనలో (మహారాష్ట్ర, కర్నాటక ప్రాంతాలను కలుపుకొని ఉన్న) మహర్‌, చమర్‌, ధేర్‌, మాంగ్‌ మొదలైన దళితులను ఆహిందువులుగా నమోదు చేసింది.

          వర్మ ఆంధ్ర ప్రాంత విస్తృత పర్యటించారు. అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీ భాగంగా ఉన్న ఆంధ్రా ప్రాంతంలో అనేక సదస్సులలో ప్రసంగించారు. తమను ఆది ఆంధ్రులుగా, ఆది ద్రావిడులు(అంటరాని తమిళులు)గా తీర్మానాలు చేసి మద్రాసు ప్రభుత్వ దృష్టికి తీసుకపోవడం వలన అప్పటి మద్రాసు ప్రభుత్వం భాషా ప్రయుక్త  ప్రాంతాలననుసరించి జీవోనెం. 817ను 1922 సంవత్సరం మార్చి 25వ తేదీన విడుదల చేసింది6.

           వీరు పంచమ అను పదానికి వ్యతిరేకంగా చేసిన కృషివలన 1922 జనవరి 20న మద్రాసు శాసనమండలి ‘‘దక్షిణ భారత ప్రాచీన జాతులగు పంచమ’, ‘పరయపదాలకు బదులు ఆది ఆంధ్ర’,‘ఆది ద్రావిడపదాలను ఉపయోగించాలని తీర్మానం చేసింది. అంతకు ముందున్న రికార్డులలోని పంచమ’, ‘పరయపదాలను తొలగించాలని తీర్మానించారు.

          1919లో ఆది హిందూ సమ్మేళనాన్ని ప్రారంభించి, దళితుల మధ్య వివాదాలను పరిష్కరించడానికి మొహల్లా పంచాయితీలను నెలకొల్పారు. దళిత చేతి వృత్తి కళాకారుల నైపుణ్యాన్ని బయటి ప్రపంచానికి తెలియజేయడానికి 1925లో ఆదిహిందూ చేతివృత్తుల వస్తు ప్రదర్శన నిర్వహించారు.

          ఉత్తర భారతంలో అంబేడ్కర్‌ చేసిన ప్రతి ఉద్యమానికి హైదరాబాద్‌లో భాగ్యరెడ్డి వర్మ చేసిన దళిత ఉద్యమమే మూలమైంది. కాగా దేశవ్యాప్తంగా సాగిన మూలవాసి ఉద్యమాలకు మన భాగ్యరెడ్డివర్మ చూపించిన దారే మార్గమైంది.

          హైదరాబాదు సంస్థానంలో దళితోద్యమానికి పునాదులు వేసిన భాగ్యరెడ్డి వర్మ, అరిగే రామస్వామి, బి.ఎస్‌.వెంకట్రావులను ముగ్గురినీ దళితత్రయంగా పరిగణిస్తారు. అయితే వీరిలో భాగ్యరెడ్డి వర్మకు అగ్రస్థానం ఉండేది.

          ఉత్తరదక్షిణ భారతదేశాన్ని ఐక్యం చేస్తూ దళితజాతి చైతన్యానికి కేంద్ర బిందువై నిలిచారు భాగ్యరెడ్డివర్మ. అంతటి మహానీయునికి గుర్తించదగ్గ స్మఅతిచిహ్నాన్ని ప్రభుత్వం నిర్మించకపోవడం విచారకరం.

          1931 లోని నవంబర్‌ 7వ తేదీన నిజాం రాష్ట్ర ఆది-హిందూ రాజకీయ సదస్సుకు భాగ్యరెడ్డి వర్మ గారు అధ్యక్షత వహించారు.

          1931లో ప్రారంభించిన భాగ్య నగర్‌ పత్రిక 1937 డిసెంబర్‌ ఆది హిందూ పత్రికగా మార్చారు7.

          1932లో తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ప్రాంతంలోని తాళ్లరేవు లో ఫిబ్రవరి 27,28లో జిల్లా ఆది ఆంధ్రమహాసభకు భాగ్యరెడ్డివర్మ అధ్యక్షత వహించారు.

          1933లో నాగపూర్‌లో ఆది-హిందూ సదస్సులో మొదటి రోజు భాగ్యరెడ్డి వర్మ అధ్యక్షత వహించారు.

          1919లో కృష్ణాజిల్లా మచిలీపట్నంలోను, 1920లో గుడివాడలోను, 1921 జనవరి 9న బందరు, భీమవరం, 1922ఏలూరులలోనూ, 1924 గుంటూరు కుసుమ ధర్మన్న 1925 అనంతపూర్‌ పనులు 1926 వెంకటగిరి దేవేంద్రుడు 1928 నర్సాపూర్‌ వెస్ట్‌ గోదావరి భాగ్యరెడ్డి వర్మ 1929 విజయవాడ ఆదినారాయణ పనుల 1930 అనంతపూర్‌ దేవేంద్రుడు 1935 రాజమండ్రి వెంకటరమణయ్య 1936 విజయనగరం కురుమయ్య 1938 తల్లనీవు తూర్పు గోదావరి జిల్లా జరిగిన ఆది ఆంధ్రుల సదస్సులకు ఆయన అధ్యక్షుడుగా ఆహ్వానించబడటం దళిత ఉద్యమ నాయకుడుగా ఆయన ఎంతగా గుర్తించబడ్డాడో, గౌరవించబడ్డాడో సూచిస్తాయి. ఆ క్రమంలోనే ఆయన సాహిత్య నాయకుడు కూడా కాగలిగాడు. అందుకు ఉదాహరణలుగా రెండిరటిని పేర్కొనవచ్చు. అవి -ఒకటి కుసుమధర్మన్న రాసిన మాకొద్దీ నల్ల దొరతనము’ (1921) గేయం. రెండు ఉన్నవ లక్ష్మీనారాయణ రాసిన నవల మాలపల్లి’ (1922) వీరి కృషి నేపథ్యంగా రాయబడినవే.

          మత విశ్వాసాలు:  భాగ్యరెడ్డివర్మకు హిందూమతంపై విశ్వాసం లేదు. మొదట్లో అర్య సమాజం, బ్రహ్మసమాజం బోధనలను ఆచరించేవాడు. బ్రహ్మసమాజం వేదాల యొక్క ఆధిక్యతను ప్రశ్నించడం, యజ్ఞోపవితాన్ని త్యజించడం వంటి భావనల వల్ల బ్రహ్మ సమాజం వైపు మొగ్గుచూపాడు.

          అర్య సమాజంలో చేరిన దళితులకు ఇతర అగ్రకులాల నుండి ఆర్యసమాజంలో చేరిన వారితో సమానంగా గౌరవం లభించడంలేదని గమనించాడు. విలువలు లేనిచోట జీవించడం దుర్లభమని భావించాడు. అర్య సమాజం, బ్రహ్మసమాజం ఏవీ దళితులకు గౌరవాన్ని ఇచ్చేవి కావు అని నిర్దారించుకున్నాడు.

          మనుషులందరికీ సమాన హోదా కల్పించిన బౌద్ధం పట్ల, గౌతమ బుద్ధుడు ప్రవచించిన సమానత్వం, సౌభ్రాతృత్వం, స్వేచ్ఛ మొదలైన అంశాలపట్ల ఆకర్షితుడయ్యాడు. బౌద్దమే సరైనదని తీర్మానించుకున్నాడు. 1913 నుండి ప్రతి వైశాఖ పూర్ణిమ రోజున బుద్ధ జయంతిని జరుపుకొనేవాడు. తన ఏకైక కుమారునికి గౌతమ్‌ అని పేరు పెట్టుకున్నాడు

          తెలంగాణ నేలపై గ్రంథాలయోద్యమం సాగుతున్న దశలో బాధ్యతగా 1918లో భాగ్యరెడ్డి ఒక గ్రంథాలయం స్థాపించాడు. దానికి రామ్మోహన్‌ రాయ్‌ గ్రంథాలయంఅని నామకరణం చేసారు.

          వీరశైవం, వీర వైష్ణవం పోటాపోటీగా నడుస్తున్న కాలంలో తీవ్ర వ్యతిరేకత. మతం పేరిట దూషణలు కొనసాగుతున్నాయి. ముందు మనుషులు మనమంతా ఒకటి. ఆ తర్వాతే మతం అనీ ఇద్దరినీ సంతృప్తి పరచాడు. 1919లో ఆది హిందూ వైష్ణవ సమ్మేళన జరిపించి మనమంతా ఒకటే అనే భావన కలిగించారు.

          1919లో కృష్ణ జిల్లా ఆది ఆంధ్ర సదస్సు మచిలీపట్నంలో జరిగింది. 1920లో గుడివాడలో ప్రొవిన్షియల్‌ ఆది ` ఆంధ్ర మహాసభ జరిగింది. మార్చి 25, 1921లో కృష్ణ జిల్లా భీమవరంలో జరిగి ఆది ఆంధ్ర సదస్సులకు భాగ్యరెడ్డిగారు అధ్యక్షత వహించారు. ఆలిండియా ఆది -హిందూ సోషల్‌ కాన్ఫరెన్స్‌ హైదరాబాదులో 1922 మార్చి 29 నుండి 31 వరకు జరిగింది. ఆ కార్యక్రమానికి చీఫ్‌ ఆర్గనైజర్‌గా భాగ్యరెడ్డి పని చేశారు. అక్టోబర్‌ 17,18, 1925లో జరిగిన అనంతపూర్‌ ఆది ఆంధ్ర మహాసభకు రెడ్డిగారి అధ్యక్షత వహించారు. అనంతపురం నందలి సమావేశంలోనే ‘‘చండాలురు ఎవరు?’’ అను అంశంపై సవివరమైన ప్రసంగం చేసాడు. 1929లో పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో జరిగిన ఆది ఆంధ్ర కాన్ఫరెన్స్‌కి భాగ్య రెడ్డి గారే అధ్యక్షత వహించారు. 1930 డిసెంబర్‌ 18న విజయవాడలో జరిగిన ఆది ఆంధ్ర మహాసభకు భాగ్యరెడ్డి అధ్యక్షుడిగా వ్యవహరించారు.

          1931 సెప్టెంబర్‌ 27,28 తేదీలలో ఉత్తర ప్రదేశ్‌లో లక్నోలో ఆల్‌ ఇండియా ఆది ` హిందూ డిప్రెస్డ్‌ క్లాస్‌లో ఒక ప్రత్యేక రాజకీయ సమావేశం రెండవ రౌండ్‌ టేబిల్‌ నిమిత్తం ఏర్పాటు చేసిన సమావేశానికి అధ్యక్షత వహించినది భాగ్యరెడ్డి. దేశంలోని 7కోట్లమంది దళితుల సమస్యలు బ్రిటిష్‌ ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడానికి లండన్‌లో జరిగే రెండవ రౌండ్‌టేబుల్‌ సమావేశానికి అంబేద్కర్‌ని ప్రతినిóగా పంపాలని ప్రతిపాంచి ఆ తీర్మాణాన్ని ఆమోదింపచేశారు. అంబేద్కర్‌ని బ్రిటిష్‌ ప్రభుత్వానికి ‘‘దళితుల ఎకైక ప్రతినిధి’’గా చేయగలిగాడు.

          1933లో నాగ్‌పూర్‌ ఆది హిందూ సదస్సు అధ్యక్షత వహించారు. 1936 విజయనగరంలో ఇండిపెండెంట్‌ ఆది జన సదస్సును ప్రారంభించారు. (సమాంతర మాస పత్రిక, మే, 2007)

          ఎదుటి వాళ్ల మనసును ఎంతగా గౌరవిస్తాడో తెలుపడానికి జరిగిన సమావేశం ఉదాహారణగా నిలుస్తుంది. ఆది హిందువులకు తగిన ప్రాతినిధ్యం వహించేందుకు ఒక ప్రత్యేక ఎలక్ట్రో రేటు ఏర్పాటు చేయాలంటూ మరో తీర్మానాన్ని ఆమోదిస్తుండగా ఉత్తర భారత దేశానికి చెందిన కొంత మంది ప్రతినిధులు వర్మ అనే పదం ఆర్య హోదాను సూచిస్తుంది కాబట్టి తొలగించుకుంటే బాగుంటుంది అని సూచించారు. వెంటనే భాగ్యరెడ్డి వర్మ గారు తన పేరులోని ఇస్తున్నట్లు ప్రకటించి ఆ తీర్మానంపై భాగ్యరెడ్డి అని సంతకం చేశారు8. 

          సభలు సమావేశాలు నిర్వహించకూడదని నిజాం ప్రభుత్వం విడుదల చేసిన షరతులు అమలులో ఉన్నప్పటికి 1931లో వంబర్‌ 7వ తేదీన బొల్లారంలో జరిగిన ఆది `హిందూ రాజకీయ సభకు భాగ్యరెడ్డి అధ్యక్షత వహించారు.

          పాత్రికేయుడిగా.. అంటరాని వర్గాలకు అభ్యున్నతికి అంకితమైన భాగ్యరెడ్డి వర్మ పత్రిక ఒకటి పెట్టాలన్న ఆలోచన కలిగింది. తన ప్రజలను మేల్కల్పడానికి సాంఘిక సమకాలీన అంశాల పట్ల అవగాహన కలిగించాలని తలిచాడు. మాన్య సంఘంసెక్రటరీగా ఉన్న ఎస్‌. ముత్తయ్య సంపాదకుడుగా ఆంగ్లంలో వచ్చిన పత్రిక ది పంచమమార్చి 31,1918 నాడు వెలువడినది. అంబేద్కర్‌ మూక్‌ నాయక్‌ పత్రిక కంటే ముందుగా ఈ పత్రిక ప్రారంభమైందన్నమాట. పక్ష పత్రికగా భాగ్య నగర్‌ పత్రికను డిసెంబర్‌ మాసం 1931వ సంవత్సరాన వర్మ ప్రారంభించారు. ఈ పత్రిక సహాయ సంపాదకునిగా సమర్థుడు, యువకుడు, కాకినాడకు చెందిన గోవాడ నిరీక్షణరావు పనిచేసేవారు. (నిరీక్షణ రావును పద్మశ్రీ ఎం. బి. గౌతమ్‌ కలిసినట్లుగా రాసుకున్నాడు.)

          భాగ్యరెడ్డి వర్మ స్థాపించిన భాగ్యనగర్‌ అనే పత్రికలో సాహిత్యంలో తొలిసారిగా తాను రాసిన నవల వెట్టి మాదిగ సాహిత్యాన్ని తానే తొలిసారి ప్రచురించాడు. వర్మ రాసిన ఆ నవల గురించి ప్రజలకు అంతగా అవగాహన లేదు, కానీ ఆయనే స్వయంగా నవల రాశాడని, ఆ నవల పేరు కూడా ప్రజలకు అంతగా తెలియదు.

          పంచములు, అవర్ణులు, మాలా, మావంటి పేర్లతో కాకుండా వారిని ఆ హిందువులుగా పిలవాలని భాగ్యరెడ్డి చేసిన డిమాండ్‌ను నిజాం ప్రభుత్వం అంగీకరించింది.

          కథా రచయితగా.... దీపం మరో దీపాన్ని వెలిగించినట్లు ఆర్య సమాజం తన ప్రభావాన్ని చూపింది. అట్లా ఆర్య సమాజ బోధనలకు ప్రభావితుడైన భాగ్యరెడ్డి తొలి తెలుగు(తెలంగాణ) దళిత కథ వెట్టి మాదిగ’ (1932) అజ్ఞాత వాసి పేరిట రాసాడు. తన భాగ్య నగర్‌ పత్రికలో ప్రచురించాడు. ఈ సంస్కరణ భావాలున్న కథగా నిలిచింది9.

          వెట్టి మాదిగకథలో ఏమీ ఆశించకుండా చేసే అన్ని రకాల కుల వృత్తుల చేసే ఉచిత పని వెట్టి. వెట్టిలో సొంత పనులు వదులుకొని కడుపు మాడుతున్న చావు బతుకుల నడమ బతుకీడుస్తున్న చేసే విధంగా నిరంకుశంగా ఉంది.     

          ‘‘రామిరెడ్డి రెండు వందల భూస్వామి. నిరంకుశుడు. కలహభోజనుడు. రామిరెడ్డి బంధువుకు ఉత్తరము పంపవలసినందున తలారి ఊరివంతు మాదిగను తీసుకురమ్మని పంపాడు. వంతు మాదిగకు ఆ రోజునే వేరే భూస్వామి ఇవ్వవలసిన గింజలు అదే రోజున ఇవ్వనున్నందన అవశ్య కారణమని మాదిగ మల్లడు తెలిపెను. పిలుచుక రాలేదని కాలుకున్న చెప్పు ఊడదీసి కోపముడుగు వరకు కొట్టెను. వెంటనే తలారి వెళ్లి మాదిగ మల్లన్ని కొట్టుకుంటూ తోలుకొని వచ్చెను. రామిరెడ్డి మల్లన్ని చూడగానే కట్టె సవరించుకొని పటేలు చేతులు నొప్పి మర్దించె వరకు కొట్టెను. మల్లడు ఎదిరించడాయెను. తుదకు మల్లడు స్పృహ తప్పిపోయెను. నెత్తురు వరదలై ప్రవహింప దొడగెను. నెత్తురు కనుల చూసిన వెంటనే పటేలు శాంతించెను. 

          వెంటనే తలారిని పిలిపించి ఇంటి వద్ద విడిచిపెట్టి రమ్మనెను. మల్లడు వ్యాధి పీడుతుడై సుమారు ఐదారు నెలల వరకు శవాకారముగా పడివుండెను. రామిరెడ్డి ఎంతటి కఠినాత్ముడో పాఠకులే గ్రహించవలెను10.’’

          తొలి ఆంధ్ర మహాసభ జోగిపేట కేంద్రంగా 1930లో జరిగింది ఆది ఆంధ్రుల తరపున భాగ్యరెడ్డి వర్మ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు ఆ సమయంలో మహా సభలో కలకలం చెలరేగింది భాగ్యరెడ్డివర్మ వేదిక మీదికి రావడం పై ఆగ్రహంతో కొందరు సభ నుంచి వెళ్లిపోవడం తర్వాత పెద్దలు సర్ది చెప్పడం వివాదం సర్దుకోవడం తెలంగాణ ఉద్యమ చరిత్రలో ప్రసిద్ధి ఒక అపశ్రుతి11 కె. శ్రీనివాస్‌ పేర్కొన్నారు.

          భాగ్యరెడ్డి వర్మ జన జీవితంలో పెట్టినదాదిగ ఆయన 3348 ప్రసంగాలు ఇచ్చినట్లు తేలింది. ఆయన కృషి పోరాట ఫలితంగా ఆది హిందువుల కోసం ఎన్నో పాఠశాలలు నెలకొల్పింది. 1931 జనాభా లెక్కల సేకరణ సందర్భంగా వర్మ ఎంతగానో శ్రమ పడి అంటరాని వర్గాల వారిని ఆది హిందువులుగా నమోదు చేయించాడు. ఇది ఆయన నాయకత్వ పటిమకు మచ్చుతునక. హిందూ సమాజం మొత్తంగా ఆయనకు రుణపడి వుండాలె12.

          భాగ్యరెడ్డి వర్మ కార్యాచరణ బహుముఖీనమైనది. బహు విస్తృతమైనది. వారు వేసిన ప్రతి అడుగు నిమ్నకులాల అభ్యున్నతికి తోడ్పడిరది. అంటరానితనాన్ని నిర్మూలించడంలో సహకరించింది. వేరు వేరు సందర్భాల్లో గాంధీలాంటి జాతీయ స్థాయి నాయకులతో జాతీయ సదస్సులలో వేదికలు పంచుకున్నారు. భారత జాతి అభ్యున్నతి కోసం పాటు పడ్డాడు. సంఘంలోని దురాచారాలను తిడుతూ కూర్చోక తన వంతు బాధ్యతను సమర్ధవంతంగా చేసాడు. తెలంగాణతో పాటు మద్రాసు, దేశంలోని వివిధ ప్రాంతాలను కలియ తిరిగాడు. అంబేడ్కర్‌ను రౌండ్‌ టేబిల్‌ సమావేశానికి పంపడంలో శక్తి వంచనలేకుండా కృషిచేసాడు.

           నేటి యువతకు భాగ్యరెడ్డి వర్మ జీవితం ఎంతో ఆదర్శం. అవమానాలను సన్మానాలు మలుచుకున్నాడు. కుర్రవానిగా ఉన్నప్పుడే టెన్నీసు అందించే బాలుని జీవితం ప్రారంభించాడు. కుటుంభానికి ఆసరా అయ్యాడు. నేటి యువత టీనేజి పిల్లలు ఎంజాయి పేరిట ఎయిమ్‌ వదులుకుంటున్నారు. వారికి భాగ్యరెడ్డి గారి జీవితం పెద్ద గుణపాఠం. పద్దెనిమిదేళ్ల వయస్సులోనే సమాజం గురించి ఆలోచించాడు. అనుకున్నది సాధించడం కోసం ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగాడు. కార్య రంగంలోకి దిగాడు. తను చదువుకున్నాడు. చదువు చెప్పించడానికి పాఠశాలలు ప్రారంభించాడు. సామాజిక బాధ్యతగా సంఘంలోని దురాచారాలను నిర్మూలించడానికి కృషి చేసాడు. నాయకునిగా ఎదిగాడు.

          డా. బి. ఆర్‌. అంబేడ్కర్‌ అన్నట్లు నీ కోసం జీవిస్తే నీలో మిగిలిపోతావు. జనం కోసం జీవిస్తే జనంలో మిగిలిపోతావు అన్నట్లు భాగ్యరెడ్డి వర్మ గారు ఒక్కడిగా ఈ నేల మీదికొచ్చినా సమాజాన్ని సంస్కరించాడు. వందేళ్లు దాటినా జీవిస్తున్నాడు. జీవిస్తాడు. మనిషిగా మన మధ్య వారు లేరు. వారి ఆలోచనలున్నాయి. వారి ఆశయాలూ ఉన్నాయి. ఆచరించిన దిశా నిర్దేశనమూ ఉంది.

పాద సూచికలు:

1. మూల భారతీయుల ఉద్యమ ప్రస్థానం, సమాంతర పబ్లికేషన్స్‌, హై. 2017. పుట 119.

2. భాగ్యోదయం, గౌతమ్‌, ఎం.బి. సమాంతర పబ్లికేషన్స్‌, హై. 12`2009. పుట.7

3. ఆది ఆంధ్ర ఉద్యమెం` భాగ్యరెడ్డి వర్మ పాత్ర. సం॥ జగన్‌ రెడ్డి, సామిడి. సమాంతర పబ్లికేషన్స్‌, హై. పుట. కవర్‌ పేజి

4. ఆది ఆంధ్ర ఉద్యమెం` భాగ్యరెడ్డి వర్మ పాత్ర. సం॥ జగన్‌ రెడ్డి, సామిడి.                             

5. నా జీవిత కథ, నవ్యాంధ్రము, కాళేశ్వర రావు, అయ్యదేవర, 1950: 240`241.

6. ఆది ఆంధ్ర ఉద్యమమం ` భాగ్యరెడ్డి వర్మ పాత్ర. సం॥ జగన్‌ రెడ్డి, సామిడి. సమాంతర పబ్లికేషన్స్‌, హైదరాబాద్‌`2005. పుట 15.

7. డాక్టర్‌ చిన్నారావు సమాంతర మాస పత్రిక మే 2007

8. సమాంతర మాస పత్రిక, మే 2009) ఆనాటి తీర్మానాలపై భాగ్యరెడ్డిగా మాత్రమే సంతకం చేసారు.

9. తొలినాటి కతలు (తెలంగాణా తొలితరం కథలు ` రెండో భాగం) సం॥ సుజాత రెడి, ముదిగంటి., శ్రీనివాస్‌, సంగిశెట్టి. 2005. ముందు మాట`10.

10. తొలినాటి కతలు (తెలంగాణా తొలితరం కథలు ` రెండో భాగం) సం॥ సుజాత రెడి, ముదిగంటి., శ్రీనివాస్‌, సంగిశెట్టి. 2005. ముందు మాట`50.

11. తెలంగాణ సాహిత్య వికాసం. శ్రీనివాస్‌, కె. తెలంగాణ ప్రచురణలు. 2015, పుట 188

12. భాగ్యోదయం’ ` కృష్ణ స్వామి, ముదిరాజ్‌. 10వ తరగతి, తెలుగు. తెలంగాణ పాఠ్యపుస్తకం `2015. (నేటికి కూడా పాఠ్య భాగమే.)

ఆధార గ్రంథాలు:

మూల భారతీయుల ఉద్యమ ప్రస్థానం,

భాగ్యోదయం,

నా జీవిత కథ, నవ్యాంధ్రము,

ఆది ఆంధ్ర ఉద్యమమం ` భాగ్యరెడ్డి వర్మ పాత్ర.

సమాంతర మాస పత్రిక, మే 2009

తొలినాటి కతలు (తెలంగాణా తొలితరం కథలు ` రెండో భాగం)

తెలంగాణ సాహిత్య వికాసం.

బహుజన స్పూర్తి ప్రధాతలు జాతీయ సదస్సు నవోమ్బర్ 2022

ప్రభుత్వ డిగ్రీ కళాశాల, గజ్వేల్ సిద్దిపేట్ 








7

10, ఆగస్టు 2023, గురువారం

IX. 3. వలసకూలీ!

ix  వలసకూలీ

చదువండి – ఆలోచించి చెప్పండి 


ఊరిలో నీకిల్లు లేదు – ఊరి వెలుపల పొలము లేదు
కూలి నిర్ణయ మింతని లేదు – కూలి పని స్థిరమైనది కాదు
ఆలుపిల్లల నేలేదెట్లా – అనే చింత నిన్నిడదోయి వ్యవసాయకూలి.
బతుకు దెరువు లేక నీవు – భార్యపిల్లల నొదిలి పెట్టి
బస్తి చేరి రిక్షలాగి – బలముగ జ్వరమొచ్చి పంటే
కాస్త నీకు గంజినీళ్ళు – కాసి పోసే దిక్కెవరోయి వ్యవసాయ కూలి.
– సుద్దాల హనుమంతు




1.ఈ పంక్తులు ఎవరి గురించి తెలుపుతున్నాయి ? రాసింది ఎవరు ?
జ:ఈ పంక్తులు వ్యవసాయ కూలీలను గూర్చి తెలుపుతున్నాయి. ఈ గేయాన్ని “సుద్దాల హనుమంతు” రాశాడు.

2. కూలిపని స్థిరమైనది కాదు అనడంలో అంతరార్థమేమిటి ?
జ:'కూలిపని' అంటే ఏ రోజుకు ఆ రోజు, ఎవరికైనా ఏదో పని చేసిపెట్టి, ఆ పనికి కూలి తీసుకోవడం. ఈ పని ఉద్యోగంలా స్థిరమైనది కాదు. ప్రతిరోజూ కూలిపని ఎక్కడ దొరకుతుందో. అని వెతుక్కోవాలి. ఒక్కొక్క రోజు ఏ పని దొరకదు. వర్షం రోజు వచ్చిన ఎవరూ కూలిపని చెప్పారు. కూలిపని కోసం నిత్యం వేటాడాలి.

ఒకరోజు పని ఉంటుంది. మరొకరోజు ఏ పని ఉండదు. లేదా ఏ రిక్షాయో అద్దెకు తీసుకుని దాన్ని తొక్కుతూ జీవనం సాగించాలి. అందుకే కూలిపని స్థిరమైనది కాదు.

3. కుటుంబ పోషణ ఎట్లా జరుగుతుంది ?
జ:కూలిపని దొరికితే, వచ్చిన కొద్ది డబ్బుతో ఏదోరకంగా సంసారం నడుపుకుంటారు. డబ్బు లేనప్పుడు అప్పులు చేస్తారు. ఋణాలు తీసుకుంటారు. ఏమీ దొరకకపోతే, కాసిని మంచినీళ్ళు తాగి, కడుపులో కాళ్ళు పెట్టుకొని ముడుచుకొని పడుకుంటారు. లేదా, ఏ రిక్షాయో తొక్కి దానితో వచ్చిన కొద్దిపాటి డబ్బుల్లో రిక్షా అద్దె కట్టి, మిగిలినది ఉంటే దానితో బతకాలి.

 4.ఊళ్ళు వదిలిపోయేటందుకు కారణమయ్యే పరిస్థితులేవి ?
జతాము ఉంటున్న ఊళ్ళలో సరైన వ్యవసాయపనులు, తమ వృత్తిపనులు లేకపోవడం వల్ల, నగరాల్లో కూలి బ్రతకడానికి గ్రామీణ జనం, తమ ఊర్లు వదలి నగరాలకు పోతారు.

వర్షాలు లేకపోతే వ్యవసాయపనులు గ్రామాల్లో దొరకవు. వ్యవసాయ ఆదాయం లేకపోతే, పెద్ద రైతులు చేతివృత్తులవారికి తగిన పనులు చూపించలేరు. అలాగే కొందరు చిన్న చిన్న పరిశ్రమలు పెట్టడానికి నగరాలకు వలసపోతారు. పిల్లల చదువుల కోసం కొందరు గ్రామాలు వదలి నగరాలకు వెడతారు. గ్రామాల్లో ఉపాధి సౌకర్యాలు బొత్తిగా లేకపోవడం వల్లనే ప్రజలు ఊళ్ళు వదలిపోతున్నారు.

పాఠ్యభాగ వివరాలు

ఈ పాఠం గేయ ప్రక్రియకు సంబంధించినది. “లయాత్మకంగా ఉండి, ఆలపించేందుకు వీలుగా ఉండేది గేయం”. ఈ గేయం, పల్లవి, చరణాలతో కూడి ఉంటుంది. పల్లవి మాత్రం పునరావృతమవుతుంది. సంగీత సాహిత్యాల మేళవింపే ‘గేయం’.
ప్రస్తుత పాఠ్యభాగం, డా॥ ముకురాల రామారెడ్డిగారి ‘హృదయశైలి’ అనే గేయ సంకలనంలోనిది.

కవి పరిచయం

01.01.1929
24.02.2003

పాఠ్యభాగము : ‘వలసకూలీ !’

కవి : డా॥ ముకురాల రామారెడ్డి

దేని నుండి గ్రహింపబడింది : కవి రాసిన ‘హృదయశైలి’ గేయ సంకలనం నుండి గ్రహింపబడింది.

జననము : వీరు 01.01.1929న జన్మించారు.

జన్మస్థలము : నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం ‘ముకురాల’ గ్రామంలో వీరు జన్మించారు.

రచనలు :

మేఘదూత (అనువాద కవిత్వం),
దేవరకొండ దుర్గం,
నవ్వేకత్తులు (దీర్ఘకవిత),
హృదయశైలి (గేయ సంపుటి),
రాక్షసజాతర (దీర్ఘకవిత),
ఉపరిశోధన (పరిశోధనా పత్రాల సంకలనం),
తెలుగు సాహిత్య నిఘంటువు మొదలగునవి రచించారు.
పరిశోధనా గ్రంథం : “ప్రాచీన తెలుగు కవిత్వంలో కవితాత్మక భావపరిణామం” అనే అంశంపై పరిశోధనా గ్రంథం వెలువరించారు.

సన్మానాలు:

వీరి ‘విడిజోడు’ కథకు, కృష్ణాపత్రిక వాళ్ళు ద్వితీయ బహుమతిని ఇచ్చారు.
ఆకాశవాణి ఢిల్లీ వారు 1967లో ఆంధ్రప్రదేశ్ నుండి జాతీయ కవిగా వీరిని గుర్తించి, సన్మానం చేశారు.

ప్రవేశిక
మానవ జన్మ ఎంతో ఉదాత్తమైనది. ఇది లభించడం ఒక వరం. లభించిన జీవితం సార్ధకం చేసుకోవాలన్నది ప్రతి ఒక్కరి తపన. ఆశ. కానీ ………….
కాలం కలిసి రాని అభాగ్యజీవులు, తమ జీవితాన్ని నెట్టుకురావడమే ఒక ‘కల’గా భావించవలసి వస్తే …………
అందంగా ఉండవలసిన ‘కల’ కూడా ‘పీడకల’గా పరిణమిస్తే ……………..

బతుకు బండి నడిపేటందుకు తన కలలన్నీ, కల్లలు కాగా పొట్టచేత పట్టుకొని ఒంటరిగా పరాయి దేశం పోయి ….
మనసును పంచుకొనేటందుకు మనుషులు లేక,
బాధను పంచుకొనేటందుకు బంధువులు లేక,
సమాజం నుండి దూరమౌతున్న వ్యథార్థజీవితాలను గురించి,
ముకురాలవారు రాసిన గేయం చదువుదాం.




ఆలోచించండి – చెప్పండి. 

1.'గొడ్ల డొక్కలు గుంజడం' అంటే మీకు ఏమి అర్థమైంది ?
జ. గొడ్లు అంటే పశువులు. 'డొక్కలు గుంజడం' అంటే వాటి పొట్టలు తిండిలేక లోపలకు నొక్కుకుపోవడం. పశువులకు తిండిలేక వాటి శరీరాలు ఏండిపోయి, వాటి డొక్కలు లోపలకు దిగిపోయాయన్నమాట. ఆ పాలమూరు జిల్లాలో వర్షాలు లేనందున, ప్రజలకు తిండి, పశువులకు గ్రాసం లేకపోయిందని నాకు అర్థమయ్యింది.

2.కోస్తా ఏర్పాటు ఎవరు, ఎందుకు వెళ్ళారు ?
జ:కోస్తా ఏర్పాటు పాలమూరు కూలీలతో పాటు, ఒక జాలరి వెళ్ళాడు. పాలమూరు ప్రాంతంలో వర్షాలు లేవు. కృష్ణాష్టమి వెళ్ళిపోయింది. పశువులకు ఆహారం లేదు. వాగుల్లో నీళ్ళులేక వానపాములు సైతం ఎండిపోయాయి. చెరువులు, కుంటలు బీటలు తీశాయి. వానపడుతుందన్న ఆశ లేకపోయింది. ఆ పరిస్థితుల్లో, కోస్తా దేశంలో కూలి ఎక్కువగా దొరుకుతుందని, కూలి పని చేసుకొనేవారు, కోస్తా తరువాత వెళ్ళిపోయారు.

3.పల్లెబతుకుల కష్టానికి కారణం ఏమిటి ?
జ. పల్లెల్లో ప్రజలు పూర్తిగా వ్యవసాయంపై 'జీవిస్తారు. పశువుల పాడిపై ఆధారపడతారు. వర్షాలు పడకపోతే, వ్యవసాయం పనులుండవు.. పశువులకు మేత దొరకదు. కూలివారికి కూలిపనులు దొరకవు. మొత్తంపై వర్షాలు లేక, వ్యవసాయం పనులు లేకపోవడం, వ్యవసాయం వల్ల, పాడిపంటల వల్ల వచ్చే ఆదాయం చాలా తక్కువగా ఉండటం, అనేవే పల్లె బ్రతుకుల కష్టాలకు కారణాలు.


1.కృష్ణా ఆనకట్టను కట్టకపోవటానికి, పాలమూరు జనం కూలీలుగా మారడానికి గల సంబంధం ఏమై ఉంటుంది ?
జ. కృష్ణానదిపై ఎగువన ఆనకట్ట కడితే, ఆ నీళ్ళు మహబూబ్ నగర్ జిల్లా పంటపొలాలకు అందుతాయి. ఆ నీళ్ళు లభ్యమైతే, ఆ పాలమూరు జిల్లా ప్రజలు వర్షాధారంగా జీవించవలసిన పనిలేదు. హాయిగా కృష్ణాజలాలతో తమ పొలాల్లో పంటలు పండించు కోవచ్చు. ప్రస్తుతం ఆనకట్ట నిర్మించనందువల్ల, వర్షాలు లేకపోవడం వల్ల, పాలమూరు జనం కూలీలుగా మారిపోయారు.

2.'చీకు మబ్బుల ముసురులో కార్తీకపున్నం వెళ్ళి పోయిందని' కవి ఎందుకు ఆవేదన చెందాడు ?
జ. సామాన్యంగా వర్షాలు శ్రావణ భాద్రపద మాసాల్లో ఎక్కువగా పడతాయి. కార్తీక పౌర్ణమి వచ్చే నాటికి వర్షాలు పూర్తిగా వెనుకపడతాయి. కార్తీక పౌర్ణమి వెళ్ళిపోయిందంటే, ఇంక ఆ సంవత్సరానికి వర్షాలు లేనట్లే లెక్క

ఇక చీకు మబ్బుల ముసురు సంగతి చూద్దాము. ఆ ప్రాంతంలో మబ్బులు ముసురుకున్నాయి. కానీ అవి- చీకుమబ్బులు. అంటే చితికిపోయిన చిన్న చిన్న మబ్బులు అన్నమాట. దట్టమైన నల్లని మబ్బులు కావు. అందుకే చిన్న చిన్న జల్లులు తప్ప, పెద్ద వర్షం పడలేదన్నమాట.

అంతవరకూ పెద్ద వర్షం లేదు. కార్తీక పౌర్ణమి కూడా వెళ్ళిపోయింది కాబట్టి ఇక ఆ సంవత్సరం వర్షం పడదు. అందుకే సరైన వర్షం రాలేదని కవి ఆవేదన పడ్డాడు.


ఇవి చేయండి

I అవగాహన – ప్రతిస్పందన

 1.ఒక ప్రాంతంలోని జనం ఇతర ప్రాంతాలకు ఎందుకు వలసలు వెళతారు? దీనిని అరికట్టడానికి ఏం చేస్తే బాగుంటుంది? చర్చించండి.
జ. ఒక ప్రాంతంలోని జనం, ఆ ప్రాంతంలో వారు జీవించడానికి అనువైన పరిస్థితులు లేనపుడు, ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వారి జీవనానికి అనువైన మరో వలసవెడుతూ ఉంటారు.

కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురియక, తినడానికి తిండి, త్రాగడానికి నీరు దొరకదు. త్రాగేనీరు సహితం వారు కొనవలసి వస్తుంది. ఆ పరిస్థితుల్లో జనం వలసలు పోతారు.
కొన్ని ప్రాంతాల వ్యవసాయపనులు లేక, జీవనాధారం లేక, మరో ఉద్యోగం సంపాదించే సావకాశం లేక, ఏదైనా పని చేసుకొని బ్రతుకవచ్చనే ఆశతో, నగరాలకు వలసపోతారు.
తాము నివసించే ప్రాంతాలలో విద్యా వైద్య, ప్రయాణ సౌకర్యాలు లేక, ఆ సౌకర్యాల కోసం జనం వలసలు పోతారు. ముఖ్యంగా జనం, జీవనభృతి కోసం, అది సంపాదించగల ప్రాంతాలకు వలసలు పోతుంటారు. వలసలు నిరోధించాలంటే, ప్రజలకు కావలసిన అన్ని సౌకర్యాలు గ్రామ ప్రాంతాలనే దొరికేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. కూలీలకు వ్యవసాయపనులు లేనప్పుడు, పనికి ఆహారపథకం వంటి పథకాల ద్వారా, ప్రజలకు పనులు చూపించాలి. గ్రామాల్లో సాగునీటి, త్రాగునీటి సౌకర్యాలు కల్పించాలి.

 2.పాఠం చదవండి. 'అంత్యానుప్రాస' పదాలు రాయండి.
జ. ఎన్నడొస్తవు లేబ రీ
పాలమూరి జాల రీ !
గొడ్ల డొక్కలు గుంజి నా
వానపాములు ఎండి నా
సరళా సాగరం నిండేది కాదని
కోయిల సాగరం నిండేది కాదని
గుడిసెకు విసిరి పోతివా
నడుం చుట్టుక పోతివా
మరిగి రాకనె పోతివా
చారు మరిచే పోతివా
కర్మ మెం దుకు
వేయ నం దుకు
మొక్కుతు పోతివా
కోస్తదేశం పోతివా

 3.కింది పేరా చదవండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.

తెలంగాణ ప్రాంతంలో చెరువుల నిర్మాణం శాతవాహనుల కాలం కంటే ముందునుంచే కాకుండా కాకతీయుల కాలంలో ఉన్నతదశకు చేరుకుంది. ఆ తర్వాత తెలంగాణను పాలించిన కుతుబ్షాహీలు, అసఫ్జాహీలు, సంస్థానాధీశులు, తెలంగాణలో చెరువుల నిర్మాణాన్ని అభివృద్ధిపరిచి, వ్యవసాయాభివృద్ధికి తోడ్పడ్డారు. తర్వాత కాలంలో ఈ చెరువుల వ్యవస్థ సరైన నోచుకోక విధ్వంసానికి గురి అయ్యింది.

దీనివలన స్వయంపోషక గ్రామాలుగా ఉన్న తెలంగాణ గ్రామాలు కరవు పీడిత గ్రామాలుగా మారాయి. ఈ పరిణామం కూడా వలసలకు కారణమైంది. లక్షలాది మంది తెలంగాణ ప్రజలు పొట్టచేత పట్టుకొని ఇతర రాష్ట్రాలకు, గల్ఫ్ దేశాలకు వలసపోయారు. తెలంగాణలో చెరువుల పునర్నిర్మాణం ద్వారా వ్యవసాయాభివృద్ధి సాధిస్తే, ప్రజలకు దొరికి, వలసలు ఆగిపోతాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెరువులను పునరుద్ధరించడానికి 'మిషన్ కాకతీయ' అనే ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబడింది.

ప్రశ్నలు :

ఎ) పై పేరా దేని గురించి చెప్తున్నది ?
జ:పై పేరా తెలంగాణ రాష్ట్రంలో చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం గురించి చెప్తున్నది.

ఆ) 'మిషన్ కాకతీయ' అంటే ఏమిటి ?
జ:తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో చెరువులను ప్రారంభించింది. దానికి 'మిషన్ కాకతీయ' అని పేరు పెట్టింది.

ఇ) తెలంగాణ ప్రజలు ఎందుకు వలసలు వెళ్తున్నారు?
జ:తెలంగాణలో చెరువుల వ్యవస్థ కాలక్రమంలో సరైన నోచుకోక విధ్వంసానికి గురి అయ్యింది. దానితో తెలంగాణ గ్రామాలు కరువుపీడిత గ్రామాలుగా మారడంతో, తెలంగాణ ప్రజలు వలసలు వెడుతున్నారు.

ఈ) వలసలు ఆగిపోవడానికి చేపట్టవలసిన చర్యలేవి?
జ.తెలంగాణలో చెరువుల పునర్నిర్మాణం ద్వారా, వ్యవసాయాభివృద్ధి సాధిస్తే ప్రజలకు ఉపాధి దొరికి, వలసలు ఆగిపోతాయి.

ఉ) చెరువుల అభివృద్ధి కోసం కృషిచేసిన వారెవరు?
జ. :చెరువుల అభివృద్ధి కోసం కాకతీయులు, కుతుబ్షాహీలు, అసఫ్జాహీలు, సంస్థానాధీశులు కృషి చేశారు.

II. వ్యక్తీకరణ-సృజనాత్మకత

1. కింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి.

అ) ముకురాల రామారెడ్డి పాట విన్నారు కదా! దీని ఆధారంగా పాలమూరు కూలీ జీవితం ఎట్లా ఉంటుందో ఊహించి రాయండి.
జ:పాలమూరులో కూలీలకు పని దొరికేదికాదు. కనీసం వారికి తిండి ఉండేది కాదు. త్రాగడానికి నీరు కూడా దొరికేది కాదు. ఆ ప్రాంతంలోని భూస్వాములకు వ్యవసాయం కోసం సాగునీటి వసతి లేదు. వర్షాలు లేవు. దానితో కూలీలు తిండిలేక, పస్తులు పడుకోవలసి వచ్చింది. వారి పిల్లలకు చదువు సంధ్యలు లేవు. వారికి జబ్బుచేస్తే మందులు వేయడానికి కూడా డబ్బులు వారి వద్ద ఉండేవి కావు. అందుకే వారు కూలీ దొరికే ప్రాంతాలకు వలసలు పోయేవారు.



ఆ) ఒకప్పుడు గ్రామాలు స్వయం సమృద్ధిగా ఉండేవి. అలాంటి గ్రామాల ప్రజలు ఎందుకు వలసలు పోతున్నారు?
జ: గ్రామాల్లో పూర్వము పెద్ద పెద్ద భూస్వాములు ఉండేవారు. పెద్ద పెద్ద వ్యవసాయ చెరువులు, ఆ చెరువుల నుండి పొలాలకు సాగునీరు లభించేది. దానితో గ్రామాల్లో పని కావాలంటే రైతు కూలీలందరికీ పని దొరికేది. ఇప్పుడు పెద్ద భూస్వాములు లేరు. పిల్లలకు భూములు పంచడంతో అవి చిన్న చిన్న భూకమతలుగా మారాయి. ఆ చిన్నరైతులు వ్యవసాయ కూలీలకు 365 రోజులూ చూపించలేరు.

రైతులకే సంవత్సరం పొడుగునా పని ఉండదు. యంత్రాలు అమల్లోకి వచ్చాయి. దానితో కూలీల అవసరం తగ్గింది. గ్రామాల్లో కూలీల పిల్లలకు, విద్యా వైద్య ఉపాధి సౌకర్యాలు అంతగా లేవు.


గ్రామాల్లో ఉన్న యువకులు తమ జీవనభృతిని సంపాదించుకోగల పరిస్థితులు నేడు గ్రామాల్లో లేవు. ఉన్న కొద్దిపాటి వ్యవసాయ భూమితో వారికి కావలసిన వస్తువులు లభించడం లేదు. వ్యవసాయదారులకు ప్రభుత్వ సహాయం లేదు.

అందువల్ల పిల్లలకు ఉద్యోగసంపాదనకు తగిన చదువులు చెప్పించడానికీ, తమ పిల్లలు మంచి ఉద్యోగాలు పొందడానికీ, తాము సుఖంగా జీవితాలు గడపడానికీ, ప్రజలు గ్రామాలు విడిచి, నగరాలకు వలసలు పోతున్నాయి.

గ్రామాల్లో 24 గంటలూ విద్యుచ్ఛక్తి ఉండటం లేదు. గ్రామాల్లోని వృత్తి పనివారలకు నగరాల్లో చక్కని జీవనభృతి లభిస్తోంది. భవన నిర్మాణ కార్మికులకు నగరాల్లో 365 రోజులూ పని దొరుకుతోంది.

పై కారణాల వల్లనే నేడు గ్రామాల నుండి ప్రజలు నగరాలకు వలసలు పోతున్నారు.

ఇ) “ఎప్పుడొస్తవు లేబరీ, పాలమూరి జాలరీ” అని అనడంలో కవి ఉద్దేశాన్ని రాయండి.
జ:'లేబరీ' అంటే పనిచేసుకొని జీవించే కూలివాడు అని అర్థము. ఈ పాటలో కూలి, జాలరివాడు. అంటే చేపలు పట్టుకొని వాటిని అమ్ముకొని జీవించేవాడు. పాలమూరు ప్రాంతాల వాగులు, వంకలూ ఏండిపోయాయి. దానితో ఈ జాలరికి చేపలు పట్టుకునే పనిలేకుండా పోయింది.

కోస్తా ప్రాంతంలో సముద్రం ఉంటుంది. అక్కడి జాలర్లు పడవలపై సముద్రంలోకి నైలాన్ వలలతో చేపల వేటకు వెడతారు. అందుకే ఈ పాలమూరి జాలరి ఇక్కడ తనకు పనిలేక, కోస్తా బెస్తల పడవల్లో లేబరీగా మారాడు. అందుకే కవి జాలరిని, ఎప్పుడొస్తవు లేబరీ అని రాశాడు.

ఈ) గ్రామాల్లో ప్రజలకు ఉపాధి ఎప్పుడు దొరుకుతుంది ?
జ. గ్రామాల్లో పంటచేలకు సాగునీటిని అందిస్తే బీడు భూములన్నీ చక్కని పంటపొలాలుగా మారుతాయి. అప్పుడు గ్రామాల్లో ప్రజలందరికీ చేసుకోడానికి పని దొరుకుతుంది. గ్రామాల్లోని పూర్వం చెరువుల నిర్మాణం పునరుద్ధరించాలి. పంటలు బాగా పండితే, ప్రజలు మంచి గృహాలు నిర్మించుకుంటారు. అప్పుడు వృత్తిపనివారలకు అందరికీ మంచి ఉపాధి దొరుకుతుంది. గ్రామాల్లో విద్యా వైద్య రవాణా సౌకర్యాలు కల్పిస్తే, గ్రామాల్లో ఉపాధి సౌకర్యాలు పెరుగుతాయి. అప్పుడు ఎక్కువమందికి ఉపాధి దొరుకుతుంది.


గ్రామాల్లో వ్యవసాయానికి తోడు అనుబంధ పరిశ్రమలు ప్రారంభించాలి. ముఖ్యంగా పాడి పరిశ్రమను ప్రోత్సహించాలి. కోళ్ళు, మేకలు, గొట్టాలు వంటివాటిని పెంచాలి. సేంద్రియ మందులను తయారుచేసే యూనిట్లు ప్రారంభించాలి. గ్రామాలను స్వయంపోషకంగా తయారుచేయాలి. యువకులకు గ్రామాల్లో లఘు పరిశ్రమల స్థాపన ద్వారా ఉపాధి చూపించాలి. గ్రామాల్లో ఉపాధి పుష్కలంగా లభించేటట్లు ప్రభుత్వం కృషిచేయాలి.

2. కింది ప్రశ్నకు పది వాక్యాల్లో జవాబు రాయండి.

ఎ) “వలసకూలీ” గురించి కవి ఆవేదనను మీ సొంతమాటల్లో రాయండి.
'వలసకూలీ' గేయ సారాంశాన్ని రాయండి.
(లేదా)
జ. 
ఓ పాలమూరి జాలరీ ! కూలి ఎక్కువ ఇస్తారని, కోస్తా దేశం వెళ్ళావా ! ఎప్పుడు తిరిగి వస్తావు ?
గోకులాష్టమి వెళ్ళిపోయింది. పశువులు డొక్కలు ఎండిపోయాయి. వాగులలో, వంకలలో వానపాములు సైతం ఎండిపోయాయి. చెరువులు, కుంటలు బీటలు తీశాయి. అయినా చినుకుపడే ఆశలేదని కోస్తా దేశం వెళ్ళావా ! ఎప్పుడు తిరిగి వస్తావు ?

వానపడదు. సరళా కోయిల సాగరాలు నిండనే నిండవు. చౌట మడుగులు ఎండిపోయాయి. పైరులు వరుగులయ్యాయి. పల్లెల్లో బతకడం ఎలాగా అనీ, కూలి బాగా ఇస్తారనీ, కోస్తాకు వలసపోయావా !
ఓ జాలరీ ! నావ, గాలం గుడిసెలో పడేసి నీలాను వల తీసుకొని, మన్నెంకొండ దేవుడు వేంకటేశ్వరుడికి మొక్కుతూ, కోస్తాకు వెళ్ళావా ! తిరిగి ఎప్పుడొస్తావు ?

మెరిగె, బొచ్చె చేపలకు అలవాటుపడి, చందమామల, పరకపిల్లల చారు మరిచిపోయావా ! కోస్తా బెస్తల పడవల్లో కూలీగా పనిచేసే కర్మ నీకు కృష్ణా పక్కన ఆనకట్ట కట్టకపోడం వల్లనే కదా !

నీవు తిరిగి ఇంటికి వస్తానన్న గడువు దాటి వారాలయ్యింది. కార్తీక పౌర్ణమి వెళ్ళింది. ఇక్కడ నుండి వెళ్ళిన జనం అంతా చచ్చే కాలం వచ్చిందన్నట్లు, జలపిడుగు భద్రాచలం మెట్లు తాకిందట. ఎక్కడున్నావు ? ఎప్పుడొస్తావు ?

(లేదా)

ఆ) వలసకూలీల బతుకుల్లో వెలుగులు నింపడానికి ఎట్లాంటి చర్యలు అవసరమో వివరించండి.
జ: వలసకూలీలు సామాన్యంగా గ్రామీణ ప్రాంతాల నుండి నగరాలకు వస్తూ ఉంటారు.

వలసకూలీలకు గ్రామాల్లో ఉన్న రేషనుకార్డులు, పింఛన్లు వంటి సౌకర్యాలు, వలసలకు వారు వచ్చిన నగరాల్లో కూడా కల్పించాలి.
వలసకూలీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల వారికి ఇళ్ళు కట్టించి ఉచితంగా ఇవ్వాలి.
వలసకూలీలందరికీ నగరాల్లో పట్టణ ఉపాధి పథకాల ద్వారా పనులు చూపించాలి. అధికారులు వలస కూలీలకు రేషన్‌కార్డులు ఇచ్చి, వారికి చౌకగా బియ్యం, పంచదార వంటి వస్తువులు ఇప్పించాలి.
వలసకూలీల పిల్లలకు, విద్యా వైద్య సదుపాయాలు కల్పించాలి.
నగరాల్లో వలసకూలీలు ప్రయాణం చేయడానికి సిటీబస్సుల్లో కన్సెషన్ టిక్కెట్లు ఇవ్వాలి.
ప్రభుత్వం చేసే పనులకు వలసకూలీలకు పనిలో ప్రాధాన్యత ఇవ్వాలి. వలసకూలీల కాలనీల్లో రోడ్లు, మంచినీటి కుళాయిలు వగైరా సౌకర్యాలు కల్పించాలి.
వలసకూలీలు తమ గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళడానికి కనీసం ఏడాదికి రెండుసార్లు ప్రయాణ సౌకర్యాలు ఏర్పాటు చేయాలి.
వలసకూలీల కష్ట సుఖాలను మునిసిపల్ కౌన్సిలర్సు తెలిసికొని, ప్రభుత్వాధికారులకు తెలియజేయాలి. వలస కూలీలు నగరాల్లో స్వేచ్ఛగా జీవించేందుకు కావలసిన ఏర్పాట్లు ప్రభుత్వం కలుగజేయాలి.

3. కింది అంశాల గురించి సృజనాత్మకంగా / ప్రశంసాత్మకంగా రాయండి.

అ) శ్రమజీవులైన కూలీలు పనిదొరకక పొట్టచేత పట్టుకొని వలసపోతున్నారు. వారి జీవనాన్ని ఊహిస్తూ ఒక కవిత/గేయం రాయండి.
జ. :
కూలీ గొప్పగ ముట్టుతుందని
నగర మార్గమై సాధనమ్మని
గ్రామం విడిచి పట్నవాసము
దారి పడితివి అయ్యోపాపము !

ఉన్న ఊరిలో పనులు లేవయా
కన్న తల్లిని విడిచి నావయా.
అమ్మ నాన్నలు దూరమయ్యిరీ
బంధు లందరూ నిన్ను విడిచిరీ

తిండి కోసమీ తిప్పలు తప్పవు
నగరములో మరి పనులు దొరకేనా ?
కడుపు నిండుగా తిండి దొరకెనా ?
ఉండడానికి ఇల్లు దొరకేనా ?

రోడ్డు పక్కనే చోటు దొరకెనా
అమ్మ నాన్నలు గుర్తుకొచ్చిరా
భార్యా బిడ్డలు గుర్తుకొచ్చిరా
అయ్యో కంటను కన్నీరొచ్చేనా

ఎవరైనా నీ పనిని మెచ్చెనా
కడుపు కోసమా ఇంత పరీక్ష
అయ్యా ఎందుకు నీకీ శిక్ష
కండబలమూ ఉన్నవాడవు

మొండితనమూ పట్టినాడవు
కలుగును తప్పక నీకు విజయము
దైవము తోడగు నీకిది నిజము.

(లేదా)

ఆ) వలసలను నిరోధించడానికి ప్రజలకు గ్రామాల్లోనే ఉపాధి లభించేటట్లు ప్రభుత్వం చేపట్టవలసిన చర్యలను గురించి పత్రికలకు లేఖ రాయండి.

సిద్దిపేట,
తేది:--/--/---.

ప్రధాన సంపాదకులు,
ఈనాడు దినపత్రిక,
సోమాజీగూడ,
హైదరాబాదు.


విషయం: వలసలు అరికట్టుటకు తీసుకోవlసిన చర్యల గురించి లేఖ  


ఆర్యా,

నమస్కారాలు. నేను ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్నాను. మా పరిసర ప్రాంతాల పల్లెల ఎందరో. గ్రామీణ జనం, మా నగరాలకు వలస వస్తున్నారు. గ్రామాల్లో ప్రజలకు ప్రభుత్వము కింది సాయం చేస్తే వలసలను అరికట్టవచ్చు.

గ్రామాల్లో ప్రజలకు సాగు, త్రాగునీరు, విద్యా వైద్య సదుపాయాలు కల్పించాలి.
గ్రామాల నుండి రవాణా సౌకర్యాలు కల్పించాలి.
గ్రామాల్లో ప్రజలకు పనికి ఆహారపథకం ద్వారా 365 రోజులూ పనులు చూపించాలి. ప్రతి మండల కేంద్రాల్లో పిల్లల చదువులకు సక్సెస్ పాఠశాలలు ఏర్పాటు చేయాలి.
ప్రతి గ్రామానికి రోజూ 24 గంటలూ విద్యుచ్ఛక్తి సదుపాయం కల్పించాలి. ప్రతి మండల కేంద్రాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటుచేయాలి. ప్రతి గ్రామాలకూ ఆర్.టి.సి బస్సు సౌకర్యంగా ఉండాలి.

వ్యవసాయానికి కావలసిన ఆధునిక పనిముట్లను, చౌకగా ప్రజలకు అందించాలి. వ్యవసాయదారులకు బ్యాంకుల ద్వారా అప్పులు తక్కువ వడ్డీకి ఇప్పించాలి. ఈ విషయాలను మీ పత్రిక ద్వారా ప్రభుత్వం దృష్టికి తేవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. ముందుగానే మీకు నా కృతజ్ఞతలు. తప్పక ఈ విషయాలు ప్రభుత్వం దృష్టికి మీ పత్రిక ద్వారా తీసుకురండి.

ఇట్లు,
భవద్విశ్వసనీయుడు,
పి. రాజా,
తొమ్మిదవ తరగతి,
ప్రభుత్వ పాఠశాల,
సిద్దిపేట.

చిరునామా:

ప్రధాన సంపాదకులు,
ఈనాడు దినపత్రిక,
సోమాజీగూడ,
హైదరాబాదు.


III. భాషాంశాలు

పదజాలం

1. కింది వాక్యాల్లోని గీత గీసిన పదాలను ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.

) పుస్తకాల నిండ మస్తుగ బొమ్మలు ఉన్నవి.
జ:మస్తుగ = అధికంగా
వాక్యప్రయోగం : ప్రభుత్వం దగ్గర మస్తుగ డబ్బు ఉంది.

ఆ) పరీక్ష రుసుం చెల్లించడానికి నేటితో గడువు ముగిసింది.
గడువు = కాలవ్యవధి
వాక్యప్రయోగం : ఈ నెల పదవ తారీకు వరకూ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకొనే గడువు ఉంది.

ఇ) పల్లెదారి పంట పైరు లతో అందంగా ఉన్నది.
జ:పైరు = సస్యము
వాక్యప్రయోగం : ఈ సంవత్సరము మా చేలలో పైరులన్నీ పురుగుపట్టి పాడబడ్డాయి.

2. కింది పదాలు/వాక్యాలు వివరించి రాయండి.

ఎ) గొడ్లడొక్కలు గుంజినా…
జవాబు:
వివరణ : 'గొడ్లు' అంటే పశువులు. 'డొక్కలు' అంటే వాటి పొట్టలు. గుంజడం అంటే 'లాగడం'. పశువులకు కడుపునిండా తిండి లేకపోతే, వాటి డొక్కలు ఎండి లోపలకు దిగిపోతాయి. మొత్తం మీద పశువుల శరీరాలు ఎండి లోపలకు దిగిపోవడాన్ని 'గొడ్లడొక్కలు గుంజడం' అంటారు.

ఆ) చెర్లుకుంటలు పర్రెవడెనని........
జ:వివరణ : చెర్లు అంటే చెరువులు. కుంటలు అంటే నీటి గుంటలు. వర్షాలు లేనందున చెరువులు, గుంటలు ఎండిపోయాయి. చెరువులు, గుంటలలోని నేల 'పర్రెలు పడింది' అంటే నెరలు తీసింది అనగా బీటలు పడిందని భావం.

ఇ) పైరులన్నీ వరుగులయ్యే….
జ:వివరణ : పైరులు పచ్చగా ఉంటాయి. 'వరుగులు' అంటే పచ్చి కూరగాయలు ఎండబెట్టిన ముక్కలు. పచ్చి కాయగూరలు ఎండబెడితే, బాగా ఎండు అవి వరుగులు అవుతాయి. పైరులు నీరులేక పచ్చదనం పోయి అవి వరుగులుగా మారిపోయాయని భావము.


ఈ) జల పిడుగు…….
జ:వివరణ : పిడుగు ఆకాశం మీద నుండి వర్షం వచ్చేటపుడు నేలపై పడుతుంది. పిడుగు పడ్డప్పటికీ ఆ పడ్డ వస్తువు లేక మనిషి మాడిపోతాడు. మరణిస్తాడు.

ఇది 'జలపిడుగు'. పిడుగుపాటులా జలము పొంగి పొర్లిందన్న మాట. వరదలు వస్తే ఆ నీరు ప్రజలపై పిడుగులా వచ్చి పడుతుంది. కాబట్టి 'జలపిడుగు' అంటే పిడుగువలె వచ్చిపడిన 'వరద ఉధృతి' అని భావం. తుపాను వస్తే సముద్రం పొంగి పిడుగులా సముద్రం నీరు మీద పడుతుంది. కాబట్టి తుపాను, నదుల వరద "జల పిడుగులు" అని భావం.

3. కింది వ్యాక్యాలలోని ప్రకృతి, వికృతులను గుర్తించండి.

ఎ) మానవుడు ఆశాజీవి. అతని ప్రయత్నాన్ని బట్టి అసలు నెరవేరుతాయి.
జవాబు:
ఆశ (ప్రకృతి) – ఆస (వికృతి)

ఆ) సింహాలు కొండ గుహల్లో ఉన్నాయి. జడివానకు కుహరాలలోని సింగల గుండెలు పగిలాయి.
జవాబు:
సింహాలు (ప్రకృతి) – సింగలు (వికృతి)

వ్యాకరణాంశాలు

ప్రశ్న 1.
కింది పదాలను పరిశీలించండి. వాటిని విడదీసి సంధిని గుర్తించి, సూత్రం రాయండి.

అ) ఎట్లని
జవాబు:
ఎట్లని = ఎట్లు + అని = ఉత్వసంధి
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమగునప్పుడు సంధియగు.

ఆ) కాలమంటూ
జవాబు:
కాలమంటూ = కాలము + అంటూ = ఉత్వసంధి
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమగునప్పుడు సంధియగు.

ఇ) వరుగులయ్యే = వరుగులు + అయ్యే = ఉత్వసంధి
సూత్రం : ఉత్తునకు అచ్చు పరమగునప్పుడు సంధియగు.

శబ్దాలంకారాలు :

అంత్యానుప్రాస

కింది వాక్యాలను పరిశీలించండి. ప్రత్యేకతను గుర్తించండి.
........ గొడ్లడొక్కలు గుంజినా
........ వానపాములు ఎండినా
........ గుడిసెకు విసిరి పోతివా
………. నడుం చుట్టుక పోతివా
..... ఎన్నడొస్తవు లేబరీ ;
……. పాలమూరి జాలరీ!

గమనిక : పై పాదాలు చివర అక్షరాలు, పునరుక్తమైనాయని గమనించారు కదా ! అక్షరాలు పునరుక్తమవడాన్ని “అంత్యానుప్రాస” అంటారు.

అంత్యానుప్రాస లక్షణం : పదాల, పాదాల, వాక్యాల చరణాల చివరల్లో అక్షరాలు పునరుక్తమైతే అది అంత్యానుప్రాసాలంకారం.

ప్రశ్న 2.
అభ్యాసము : పాఠంలోని అంత్యానుప్రాసాలంకార పంక్తులను గుర్తించి రాయండి.
జవాబు:

ఎన్నడొస్తవు లేబ రీ
పాలమూరి జాల రీ !
గొడ్లడొక్కలు గుంజి నా
వానపాములు ఎండి నా
సరళాసాగరం నిండేది కాదని
కోయిలసాగరం నిండేది కాదని
గుడిసెకు విసరి పోతివా
నడుం చుట్టుక పోతివా
దిక్కు మొక్కుకు పోతివా
కోస్తదేశం పోతివా
మరిగి రాకనె పోతివా
చారు మరిచే పోతివా
........ కర్మ మెందుకు
……. వేయ నందుకు

సంభావన పూర్వపద కర్మధారయ సమాసం

ఈ క్రింది వాక్యాలలో గీత గీసిన సమాస పదాలను పరిశీలించండి.
ఉదా : భద్రాచలం ఒక పుణ్యక్షేత్రం.
గమనిక : పై 'భద్రాచలం' అంటే సమాస పదంలో భద్ర, అచలం అనే రెండు పదాలున్నాయి కదా! 'అచలం' అంటే కొండ అని అర్థం. 'అచలం' అనేది నామవాచకం.
'భద్ర' అనేది పేరు. అనగా “సంజ్ఞ”.
సంజ్ఞనే సంభావన అని అంటారు.
ఈ విధంగా పూర్వపదం (మొదటి పదం)లో సంభావన ఉన్నట్లయితే, ఆ సమాసపదాన్ని “సంభావన పూర్వపద కర్మధారయ సమాసము” అని అంటారు.

ప్రశ్న 3.
ఈ పాఠంలో ఉన్న సంభావన పూర్వపద కర్మధారయ సమాస పదాలను గుర్తించి, విశ్లేషించండి.
రూపక సమాసం
జవాబు:

సరళా సాగరం – విశ్లేషణ : 'సరళా' అనే పేరు గల సాగరం.
కోయిల సాగరం – విశ్లేషణ : 'కోయిల' అనే పేరు గల సాగరం
కోస్త దేశం – విశ్లేషణ : 'కోస్తా' అనే పేరు గల దేశం
మన్నెం కొండ – విశ్లేషణ : 'మన్నెం' అనే పేరు గల కొండ
మెరిగె చాప – విశ్లేషణ : 'మెరిగె' అనే పేరు గల చేప
బొచ్చె చాప – విశ్లేషణ : 'బొచ్చె' అనే పేరు గల చేప
కింద గీత గీసిన సమాస పదాన్ని పరిశీలించండి.

ధనాలన్నింటిలో శ్రేష్ఠమైనది విద్యాధనం.
పై గీత గీసిన పదములో విద్యకు ధనమునకు భేదం లేనట్లు చెప్పబడింది.
“విద్య అనేడు ధనం” అని 'విద్యాధనం' అంటే సమాసానికి అర్థం.
'విద్యాధనం' అనే సమాసపదంలో, 'ధనం' అనేది ఉపమానం.
'విద్యాధనం' అనే సమాసపదంలో, 'విద్య' అనేది 'ఉపమేయము'.

అభ్యాసము : కింద గీత గీసిన సమాసపదాలలోని ఉపమాన, ఉపమేయాలను గుర్తించండి.

1. “దయాభరణము” ను ధరించినవాడు భగవంతుడు.
వివరణ : “దయాభరణము” అనే సమాసపదంలో, 'ఆభరణము' అనే పదం ఉపమానము. 'దయ' అనేది ఉపమేయం.

2. పేదలపై కృపారసము కలిగియుండాలి.
వివరణ : 'కృపారసము' అనే సమాసపదంలో, "రసము" అనే పదం, 'ఉపమానం', 'కృప' అనేది ఉపమేయము.
గమనిక : ఈ విధంగా ఉపమానం యొక్క ధర్మాన్ని, ఉపమేయమందు ఆరోపించడాన్ని, 'రూపక సమాసం' అంటారు. లేదా “అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం” అంటారు.

ప్రశ్న 4.
కింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి ఏ సమాజంలో గుర్తించండి.

సమాస పదం – విగ్రహవాక్యం – సమాస నామం

అ) పాలమూరు జిల్లా – 'పాలమూరు' అను పేరు గల జిల్లా – సంభావన పూర్వపద కర్మధారయ సమాసం
ఆ) ఆ) సాగరం – 'సరళ' అనే పేరు గల సాగరం – సంభావన పూర్వపద కర్మధారయ సమాసం
ఇ) మన్నెంకొండ – 'మన్నెం' అనే పేరు గల కొండ – సంభావన పూర్వపద కర్మధారయ సమాసం
ఈ ) కీర్తికన్యక – కీర్తి అనే కన్య – రూపక సమాసం
ఉ) జ్ఞానజ్యోతి – జ్ఞానము అనే జ్యోతి – రూపక సమాసం

ప్రాజెక్టు పని

మీ గ్రామంలో లేదా వాడలో వలసకూలీల వద్దకు/ వాళ్ల బంధువుల వద్దకు వెళ్లి, వలస ఎందుకు వచ్చారో తెలుసుకుని, వాళ్ళ కష్టసుఖాల గురించి ఇంటర్వ్యూ చేసి నివేదిక రూపొందించండి.
జ:నేను మా గ్రామంలోని వలస కూలీల వద్దకు, వాళ్ళ బంధువుల వద్దకు వెళ్ళి వారు ఏ ప్రాంతం నుండి వచ్చారో, ఎప్పటి నుండి వచ్చారో, ఏ కారణాలతో వచ్చారో ప్రశ్నావళి ద్వారా వివరాలను తెలుసుకున్నాను. కరవుకాటకాల వల్ల, ఉపాధి అవకాశాలు లేనందువల్ల, కూలీ పనులు లేని కారణంగా వలస వచ్చినట్లుగా గ్రహించాను. వారు ప్రతి రోజు దుర్భర జీవితాన్ని గడుపుతున్నట్లుగా అర్థమయ్యింది. అందువల్ల ఇలాంటి వలసకూలీల సంక్షేమానికి ప్రభుత్వం చేయూతను అందివ్వాలి. సంపన్నులు, స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు రావాలి. వారిని మనలో ఒకరిగా గుర్తించాలి. వారికి ఉపాధి అవకాశాలను కల్పించాలి. ఉన్నతంగా జీవించే అవకాశాలను కల్పించాలి.

(లేదా)

కార్మికుల, కూలీల బతుకు జీవనం గురించి వచ్చిన కథ/కవిత/గేయం/ పాటలను సేకరించి, నివేదిక రాయండి. చదివి వినిపించండి.
జవాబు:
విద్యార్థి కృత్యము.


గేయ పంక్తులు – భావం

I

1వ గేయం

కూలి మస్తుగ దొరుకుతాదని!
కోస్తదేశం పోతివా!
ఎన్నడొస్తవు లేబరీ,
పాలమూరి జాలరీ!

భావార్థం :

కూలిమస్తుగ దొరుకుతాదని = కూలి ఎక్కువగా దొరుకుతుందని (కూలి ఎక్కువగా వస్తుందని)
కోస్తదేశం పోతివా = కోస్తా ప్రాంతానికి వెళ్ళావా ?
(ఆంధ్రదేశంలో శ్రీకాకుళం జిల్లా నుండి, నెల్లూరు జిల్లా వరకూ సముద్రతీర ప్రాంతాన్ని కోస్తా దేశం అంటారు. ).
ఎన్నడొస్తవు లేబరీ = ఓ కూలివాడా ! ఎప్పుడు తిరిగి వస్తావు ?
(లేబరర్ = LABORER = కూలివాడు)
పాలమూరి జాలరీ = పాలమూరు జిల్లాలోని
బెస్తవాడా ! (మహబూబ్ నగర్
జిల్లాలో ఉండే బెస్తవాడా !)
(జాలరి = చేపలు పట్టేవాడు)

భావం:కూలి బాగా ముడుతుందని, కోస్తా దేశం వెళ్ళావా ? ఓ పాలమూరి జిల్లా జాలరీ ! ఎప్పుడు తిరిగి వస్తావు ?

2వ గేయం

గోకులాష్టమి దాటిపోయినా, గొడ్లడొక్కలు గుంజివా,
వాగులల్లో, వంకలల్లో వానపాములు ఎండినా,
చినుకురాలే ఆశలేదని, చెర్లుకుంటలు పర్రెవడెవని
కూలి మస్తుగ దొరుకుతాదని కోస్తదేశం పోతివా!

ఎన్నడొస్తవులేబరీ,
పాలమూరి. జాలరీ!

భావార్థం :

గోకులాష్టమి = కృష్ణాష్టమి (గోకులాష్టమి శ్రావణ బహుళ అష్టమినాడు వస్తుంది) (శ్రావణమాసం వెళ్ళిపోతున్నా వర్షాలు రాలేదన్నమాట)
దాటిపోయినా = వెళ్ళిపోయినా
గొడ్లడొక్కలు గుంజినా = పశువుల శరీరాలు, లోపలకు లాగుకుపోయినా; (తిండిలేక వాటి పొట్టలు ఎండి లోతుకు పోయినా)
వాగుల్లో, వంకలల్లో = సెలయేఱులలో, చిన్న ఏఱుల్లో ఉండే
వానపాములు ఎండినా = వానపాములు ఎండిపోయినా (చాలాకాలంగా ఆ వాగులలో, వంకలలో నీరు లేనందున, ఆ మట్టిలోని వానపాములు సైతం ఎండిపోయాయన్న మాట)
చినుకురాలే ఆశలేదని = వానచినుకు పడుతుందని ఆశ ఇంక లేదని ;
చెర్లుకుంటలు = చెరువులూ, గుంటలూ
పర్రెవడెనని = బీటలు తీశాయని ; (నెఱ్ఱలు పడ్డాయని)
కూలి మస్తుగ దొరుకుతాదని = కూలి ఎక్కువగా ఇస్తారని
కోస్తదేశం పోతివా ! = కోస్తాకు వెళ్ళావా !
ఎన్నడొస్తవు లేబరీ = ఓ కూలివాడా! ఎప్పుడు తిరిగి వస్తావు ?
పాలమూరి జాలరీ = పాలమూరులో ఉండే ఓ బెస్తవాడా!

భావం: ఓ పాలమూరు జాలరీ ! కృష్ణాష్టమి వెళ్ళిపోయినా, పశువుల డొక్కలు ఎండిపోయినా, వాగులలో, వంకలలో, వానపాములు ఎండిపోయినా, ఇక్కడ వర్షపు చినుకు నేలపై రాలిపడే ఆశ కనబడటల్లేదని, చెరువులూ, గుంటలూ బీటలు తీశాయనీ, అక్కడ కూలీ బాగా దొరుకుతుందనీ, కోస్తా ప్రాంతానికి వెళ్ళిపోయావా ? ఓ కూలివాడా ! ఎప్పుడు తిరిగి వస్తావో చెప్పు.

3వ గేయం

చాలు వానే పడదు సరళాసాగరం నిండేది కాదని,
చౌట మడుగులె యెండె, కోయిలసాగరం నిండేది కాదని,
పైరు లన్నీ వరుగులయ్యే పల్లెలో బతికేది ఎట్లని,
కూలి మస్తుగ దొరుకుతాదని కోస్తదేశం పోతివా
ఎన్నడొస్తవు లేబరీ,
పాలమూరి జాలరీ!

భావార్థం :

పాలమూరి జాలరీ = ఓ పాలమూరు జిల్లాలో ఉండే జాలరివాడా !
చాలు = ఇంక ఆశలు చాలు
వానే పడదు = ఈ సంవత్సరం ఇంక వాన పడదు
సరళాసాగరం = ‘సరళాసాగరం’ అనే నీటిమడుగు
నిండేది కాదని = ఈ సంవత్సరానికి ఇంక నిండదని;
చౌట మడుగులె = చౌడు నేలల్లో ఉన్న నీటిమడుగులే;
ఎండె = ఎండిపోయాయని;
‘కోయిల సాగరం’
నిండేది కాదని = ‘కోయిల సాగరం’ మడుగు ఇక ఈ సంవత్సరం నిండదని
పైరులన్నీ = పంటచేలన్నీ
పరుగులయ్యే
(వరుగులు + అయ్యే) = వరుగులవలె ఎండిపోతే,
పల్లెలో = గ్రామంలో
బతికేది ఎట్లని = జీవించడం ఎలా అని,
కూలి మస్తుగ దొరుకుతాదని = కూలి బాగా దొరుకుతుందని
కోస్తదేశం పోతివా = కోస్తాకు వెళ్ళావా (సముద్రతీర ప్రాంతం)
ఎన్నడొస్తవు లేబరీ = ఓ కూలివాడా ! ఎప్పుడు వస్తావు ?

భావం: ఓ పాలమూరి జాలరీ ! ఇంక వానపడదని, సరళా సాగరం ఇంక నిండదని, చౌడు నేలల్లో నీటిగుంటలు ఎండిపోయాయనీ, కోయిల సాగర్ ఇంక నిండదని, పైరులన్నీ వరుగుల్లా ఎండిపోయాయనీ, ఇంక పల్లెల్లో బ్రతకడం కష్టమనీ, కూలి ఎక్కువగా దొరకుతుందనీ, కోస్తా దేశానికి వెళ్ళిపోయావా ? ఓ కూలివాడా ! తిరిగి ఎప్పుడు వస్తావు ?

II

4వ గేయం

కొడిమెలూ, గాలాల గడెలూ గుడిసెకు విసిరిపోతివా!
నజాకతు నైలాను వలనే నడుం చుట్టుక పోతివా,
తిరిగి మన్నెంకొండ దేవుని దిక్కు మొక్కుతు పోతివా,
కూలి మస్తుగ దొరుకుతాదని కోస్తదేశం పోతివా
ఎన్నడొస్తవు లేబరీ,
పాలమూరి జాలరీ !

భావార్థం:

పాలమూరి జాలరీ = ఓ పాలమూరు జిల్లా బెస్తవాడా!
కొడిమెల = నావలూ (చేపల బుట్టలు)
గాలాల గడెలు = చేపలను పట్టే గాలముల, కఱ్ఱులూ
(గడె = చేపలు పట్టేసాధనం).
గుడిసెకు విసిరిపోతివా = నీవు ఉండే తాటియాకుల ఇంటిలోకి విసరిపడేసి వెళ్ళిపోయావా ?
నజాకతు, నైలాను వలనే = సున్నితమైన నైలాను దారంతో అల్లిన వలను మాత్రం.
నడుం చుట్టుక పోతివా = నీ నడుముకు చుట్టుకొని వెళ్ళావా ? (కూడా తీసుకువెళ్ళావా అని భావం)
తిరిగి = వెళ్ళిపోతూ వెనుకకు తిరిగి
మన్నెంకొండ దేవుని = మన్నెంకొండలో వేలిసిన వేంకటేశ్వరుడి
దిక్కు మొక్కుతు పోతివా = ధిక్కు చూస్తూ దండం పెడుతూ వెళ్ళావా ?
కూలి మస్తుగ దొరుకుతాదని = కూలి ఎక్కువగా దొరుకుతుందని
కోస్తదేశం పోతివా = కోస్తా దేశానికి వెళ్ళావా ?
ఎన్నడొస్తవు లేబరీ = కూలివాడా ! ఎప్పుడు వస్తావు ?

భావం : ఓ పాలమూరి జాలరీ ! పడవలు, గాలాల కఱ్ఱులు →గుడిసెలోకి విసరిపోయావా ? సున్నితమైన నైలాను వలను నీ నడుముకు చుట్టుకొని వెళ్ళిపోయావా ? వెళ్ళిపోతూ వెనక్కు తిరిగి మన్నెంకొండ వేంకటేశ్వరుడి వైపు చూసి నమస్కారం చేస్తూ వెళ్ళిపోయావా ? కూలి బాగా వస్తుందని, కోస్తా దేశానికి వెళ్ళిపోయావా ? కూలివాడా ! ఎప్పుడు తిరిగివస్తావు ?

5వ గేయం

మెరిగె చాపకు బొచ్చె చాపకు మరిగి రాకనె పోతివా,
చందమానుల, పరక పిల్లల చారు మరిచే పోతినా,
ఎన్నడోస్తవు లేబరీ,
పాలమూరి జాలరీ !

భావార్థం:

మెరిగే చాపకు = మెరిగె అనే చేపలకూ
బొచ్చె చాపకు = ‘బొచ్చెలు’ అనే చేపలకూ (మెరిగెలు, బొచ్చెలు కోస్తాలో దొరికే చేపలు).
మరిగి = అలవాటుపడి (కోస్తా ప్రాంతంలో దొరికే మెరిగె, బొచ్చెలు అనే చేపలు తినడానికి అలవాటుపడి)
రాకనె పోతివా = తిరిగి పాలమూరు. రాకుండా పోయావా ?
చందమామల, పరక పిల్లల= చందమామలు, పరకలు అనే చేపపిల్లలతో పెట్టే;
చారు మరిచే పోతివా = చారు రుచి మరచిపోయావా!
పాలమూరి జాలరీ = ఓ పాలమూరి జాలరీ !
ఎన్నడొస్తవు లేబరీ = ఓ కూలివాడా ! ఎప్పుడు వస్తావు ?

భావం: ఓ పాలమూరి జాలరీ ! కోస్తా ప్రాంతంలో దొరికే మెరిగెలు, బొచ్చెలు అనే చేపలకు అలవాటుపడి, తిరిగి ఇక్కడకు రాకుండా పోయావా ? ఇక్కడ దొరికే చందమామల, పరక పిల్లల చారు రుచిని మరచిపోయావా ? ఓ కూలివాడా ! ఎప్పుడు వస్తావు ?

TS 9వ తరగతి తెలుగు గైడ్ 3వ పాఠం వలసకూలీ

6వ గేయం

కోస్తబెస్తల పడవలల్లో కూలివయ్యిన కర్మమెందుకు ?
ఎగువ కృష్ణా ఆనకట్టను ఇంత వరకూ వేయవందుకు
ఏడ ఉంటివొ లేబరీ,
ఎన్నడొస్తవు జాలరీ !

భావార్థం:

కోస్తబెస్తల = కోస్తా తీరంలోని చేపలు పట్టే బెవాండ్ర
పడవలల్లో = పడవలలో
కూలివయ్యిన కర్మమెందుకు = కూలిగా పడి ఉండవలసిన కర్మము నీకు ఎందుకు ?
ఎగువ కృష్ణా ఆనకట్టను = కృష్ణా నదిపై ఎగువ భాగాన (పై భాగాన) ఆనకట్టను
ఇంతవరకూ వేయనందుకు = ఇంతవరకూ కట్టనందువల్లనే కదా !
ఏడ ఉంటివొ లేబరీ = ఓ కూలివాడా ! ఎక్కడ ఉన్నావు ?
ఎన్నడొస్తవు జాలరీ = ఓ జాలరీ ! ఎప్పుడు తిరిగి పాలమూరు వస్తావు ?

భావం : కృష్ణా నదిపై ఎగువన ఆనకట్ట కడితే, పాలమూరు జిల్లాకు నీరు వచ్చేది. అప్పుడు ఆ ప్రాంత ప్రజలు వలసలు వెళ్ళవలసిన అవసరం ఉండేది కాదని గేయకర్త అభిప్రాయం.

7వ గేయం

ఇంటికొస్తానన్న గడువుకు ఇప్పటికి వారాలు దాటె,
చీకు మబ్బుల ముసురులో కార్తీకపున్నం వెళ్ళిపాయె,
ఇటే పోయిన జనం – అంతా అటే చచ్చే కాలమంటు,
జలపిడుగు పొర్లాడి భద్రాచలం మెట్లకు తాకెవంటా
ఎక్కడుంటివి లేబరీ,
ఎన్నడొస్తవు జాలరీ !

భావార్థం :

ఇంటికొస్తానన్న గడువుకు = నీవు ఇంటికి తిరిగి వస్తానన్న కాలవ్యవధికి;
ఇప్పటికి వారాలు దాటే = ఇప్పటికే వారాలు దాటిపోయాయి
చీకు మబ్బుల = చితికిపోయిన చిన్న చిన్న మబ్బుల
ముసురులో = ఎడతెగని చిరు వానలో
కార్తీకపున్నం = కార్తీక పౌర్ణమి
వెళ్ళి పాయె = వెళ్ళిపోయింది
ఇటే పోయిన జనం = ఇక్కడి నుండి కోస్తా వెళ్ళిన జనము
అంతా అటే చచ్చే కాలమంటు = అంతా అక్కడే చచ్చే కాలము వచ్చిందన్నట్లు;
జలపిడుగు పొర్లాడి = ‘నీటి ఉధృతి’ అనగా గోదావరి నది వరద పొంగి
భద్రాచలం మెట్లకు తాకెనంటా = భద్రాచలంలోని శ్రీరామ పాదాలను తాకిందట కదా !
ఎక్కడుంటివి లేబరీ = ఓ కూలివాడా! ఎక్కడ ఉన్నావు?
ఎన్నడొస్తవు జాలరీ = ఓ జాలరివాడా ! ఎప్పుడు వస్తావు ?

భావం : ఓ కూలివాడా ! నీవు ఇంటికి తిరిగివస్తానన్న కాలవ్యవధి, ఇప్పటికే వారాలు దాటిపోయింది. చిన్నమబ్బుల ముసురువానలో కార్తీక పౌర్ణమి కూడా వెళ్ళిపోయింది. ఇక్కడి నుండి కోస్తా ప్రాంతానికి వెళ్ళిన జనం, అంతా అక్కడే చచ్చే కాలం వచ్చినట్లు, గోదావరి వరద భద్రాచలంలోని రామ పాదాలను తాకిందట. నీవు ఎక్కడ ఉన్నావు ? ఓ జాలరీ! ఎప్పుడు తిరిగి వస్తావు ?

పాఠం నేపథ్యం

తెలంగాణ రాష్ట్రంలో నీటివసతికి నోచుకోక, పంటలు పండక, నిరంతరం కరువురక్కసి కోరల్లో చిక్కుకున్న ప్రాంతం పాలమూరు, నాటి పాలమూరు జిల్లానే నేటి మహబూబ్నగర్ జిల్లా. బతుకుభారాన్ని మోస్తూ కాలాన్ని వెళ్ళదీయలేక బతుకటానికి వలసపోవడం అక్కడి కూలీలకు పరిపాటి.

1977లో తూర్పు తీరప్రాంతానికి వలస వెళ్ళిన, కొందరు పాలమూరు కూలీలు అక్కడ వచ్చిన తుపానుకు గురై తిరిగిరాలేదని, వాళ్ళెక్కడున్నరో జాడతెలియనప్పుడు కవి హృదయంలో కలిగిన ఆవేదన ఇది.